కంటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి | - | Sakshi
Sakshi News home page

కంటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

Published Fri, Oct 11 2024 2:04 AM | Last Updated on Fri, Oct 11 2024 2:04 AM

కంటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ కంటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ సురేష్‌ అన్నారు. ప్రపంచ దృష్టి దినోత్సవా న్ని పురస్కరించుకుని గురువారం ట్యాంక్‌బండ్‌పై గల అంబేద్కర్‌ విగ్రహం వద్ద ముధోల్‌ ఎల్వీ ప్రసా ద్‌, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ నిర్మల్‌శాఖ, నిర్మల్‌ లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహ న కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సర్వేంద్రియానం నయనం ప్రధానం’ అని నేటి కాలంలో చిన్నారుల నుంచి యువత వరకు సెల్‌ఫోన్‌ వ్యసనానికి లోనై దృష్టిలో పం బారిన పడుతున్నారన్నారు. ఫలితంగా కంటి చూపును కోల్పోతున్నారన్నారు. చిన్నారులకు సమతులమైన పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ కృష్ణంరాజు, డాక్టర్‌ శతి వాస, ఎల్‌వీప్రసాద్‌ కోఆర్డినేటర్‌ సాయన్న , నేత్ర వైద్య సహాయ నిపుణులు ఓం ప్రకాష్‌, లక్ష్మీనారా యణ, నేరెళ్ల హన్మంతు, లయన్‌ చంద్రమోహన్‌రెడ్డి, రవికుమార్‌రెడ్డి, నవీద్‌ అహ్మద్‌ నురాని, జ్యోతి, సురేష్‌, ప్రవళిక, లహరి, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement