నిర్మల్టౌన్: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా కేంద్రంలోని ప్రధాన కోర్టులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మానసిక వైద్య నిపుణులు సురేష్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మానసిక ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయన్నారు. ప్రతి ఒక్కరు మానసిక వ్యాధుల గురించి సరైన అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రాధిక, డీఎంహెచ్వో రాజేందర్, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాస్, చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ రాజలింగం, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment