పాఠశాలలు తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ
లబ్బీపేట(విజయవాడతూర్పు): నగరంలోని పలు ప్రాంతాల్లోని పాఠశాలలను గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలతో పాటు, విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. విజయవాడ గవర్నర్పేటలోని సీవీఆర్ హైస్కూల్, పటమట లంకలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, గిరిపురం రెడ్సర్కిల్ వద్ద ఉన్న బిషప్ అజరయ్య పాఠశాలలను ఆమె సందర్శించి పరిసరాలు, వంట గదులు ఎలా ఉన్నాయి, భోజనం ఎలా ఉంటుంది అనే అంశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులకు, వంట ఏజెన్సీల వారికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. పాఠశాల ప్రాంగణం పరిశుభ్రంగా ఉండాలని, విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం పెట్టాలని ఆదేశించారు. ఆమె వెంట ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ మాధవీ నాయుడు, ఎన్హెచ్ఎం డీపీఎంఓ డాక్టర్ నవీన్, డాక్టర్ దత్త చరణ్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment