పెండింగ్ బీమా క్లెయిమ్లను త్వరితగతిన పరిష్కరించండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వరద ప్రభావిత ప్రాంత ప్రజల వాహనాలు, వివిధ ఆస్తి నష్టాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న క్లెయిమ్లను త్వరితగతిన పరిష్కరించాలని బీమా సంస్థలకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా సూచించారు. శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా.. రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హాతో కలిసి బీమా సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. బీమా సంస్థల వారీగా నమోదైన క్లెయిమ్లు, పరిష్కరించిన క్లెయిమ్లు, పెండింగ్లో ఉన్న క్లెయిమ్లపై చర్చించారు. సిసోడియా మాట్లాడుతూ క్లెయిమ్ల పరిష్కారంలో బీమా కంపెనీలు మెరుగైన పనితీరు కనపరిచాయన్నారు. ఇదే స్ఫూర్తితో పెండింగ్ అంశాలను పరిష్కరించాలన్నారు. సమావేశంలో డీఆర్వో వి.శ్రీనివాసరావు, విజయవాడ డీటీసీ సీహెచ్ మోహన్, డీటీసీ (ఐటీ) ఎం.పురేంధ్ర, బీమా కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment