పార్వతీపురం: పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమని కలెక్టర్ శ్యామ్ప్రసాద్ అన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో స్వచ్ఛతా హి సే వా కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛభారత్ దివస్ను పురస్కరించుకొని పలు పంచాయతీల గ్రీన్ అంబాసిడర్లను బుధవారం సత్కరించి, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ ప్రజలు తమ ఇంటితో పాటు పరిసరాలను పరి శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గతనెల 17 నుంచి నిర్వహిస్తున్న స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాల నిర్వహణలో జిల్లాకు రాష్ట్రంలో నాలుగో స్థానం లభించిందని తెలిపారు. ఎస్డబ్ల్యూపీసీ కేంద్రాల ను నిర్వహించి వర్మీకంపోస్టు ఎరువును తయారు చేయాలన్నారు. సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ మాట్లాడుతూ ప్రతి గ్రామానికి ఒక సంపద సృష్టించే కేంద్రాన్ని ఏర్పాటుచేయాలన్నారు. అందరి సహకారంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు విజయవంతమవుతాయని తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి, డ్వామా పీడీ కె.రామచంద్రరావు మాట్లాడుతూ జిల్లాలోని 451 పంచాయతీల్లో 3,900లకు పైగా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. చక్కని పనితీరు చూపిన 15 పంచాయతీల కార్యదర్శులు, 30 మంది గ్రీన్ అంబాసిడర్స్ను గుర్తించి సన్మానించినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్వో జి.కేశవనాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment