సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: టీడీపీ నేతల అరాచకాలకు అంతులేకుండా పోతోంది. తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దుశ్చర్యకు తెరతీశారు. ఏ.కొండూరు మండలం కంభంపాడులో వైఎస్సార్సీపీ ఎంపీపీకి చెందిన భవనాన్ని కూలగొట్టించారు. వందల మంది టీడీపీ కార్యకర్తలతో వెళ్లి జేసీబీతో కూల్చేయించారు. తిరువూరు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఎమ్మెల్యే కొలికపూడి దిగారు. కారు ఎక్కి, హడావుడి చేస్తూ జేసీబీతో భవనాన్ని కూల్చివేయించారు.
చెన్నారావు బిల్డింగ్ను కూల్చేసేందుకు బుల్డోజర్తో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సహా రోడ్డెక్కారు. బుల్డోజర్ను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, టీడీపీ శ్రేణులు.. పోలీసులను పక్కకు నెట్టేశారు. కొలికపూడి శ్రీనివాస్.. దగ్గరుండి నిర్మాణంలో ఉన్న బిల్డింగ్లోని కొంత భాగాన్ని కూల్చివేయించారు. అధికారులు నోటీసులు కూడా ఇవ్వని భవనాన్ని టీడీపీ ఎమ్మెల్యే ధ్వంసం చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment