పొగాకు కేజీ గరిష్ట ధర రూ.358 | - | Sakshi
Sakshi News home page

పొగాకు కేజీ గరిష్ట ధర రూ.358

Published Sat, Sep 21 2024 3:00 AM | Last Updated on Sat, Sep 21 2024 3:00 AM

-

ఒంగోలు సెంట్రల్‌: ఒంగోలు రీజియన్‌ పరిధిలోని వేలం కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన వేలంలో కేజీ పొగాకు గరిష్ట ధర రూ.358 పలికింది. ఆర్‌ఎం లక్ష్మణరావు తెలిపిన వివరాల ప్రకారం.. రీజియన్‌ పరిధిలోని 11 వేలం కేంద్రాలకుగానూ 8 కేంద్రాల్లో వేలం జరిగింది. ఆయా కేంద్రాల్లో వేలానికి మొత్తం 11,237 బేళ్లు రాగా, 9,074 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. 2,163 బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. ఒంగోలులోని రెండు కేంద్రాలు, వెల్లంపల్లి, కొండపి, టంగుటూరు కేంద్రాల్లో శుక్రవారం 154వ రోజు నిర్వహించిన వేలానికి 5,078 బేళ్లు రాగా, 4,118 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. 960 బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. కేజీ గరిష్ట ధర రూ.358, కనిష్ట ధర రూ.48, సరాసరి ధర రూ.209.81 పలికింది. కందుకూరు–1, 2, పొదిలి, తదితర వేలం కేంద్రాల్లో 160వ రోజు నిర్వహించిన వేలానికి 6,159 బేళ్లు రాగా, 4,956 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. 1,203 బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. గరిష్ట ధర రూ.358, కనిష్ట ధర రూ.150, సరాసరి ధర రూ.293.67 పలికింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement