జీజీహెచ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా అద్దయ్య | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా అద్దయ్య

Published Wed, Jan 22 2025 12:36 AM | Last Updated on Wed, Jan 22 2025 12:36 AM

జీజీహెచ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా అద్దయ్య

జీజీహెచ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా అద్దయ్య

ఒంగోలు టౌన్‌: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్‌గా డిప్యూటీ కలెక్టర్‌ కె. అద్దయ్య మంగళవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్‌ ఎ.తమీమ్‌ అన్సారియాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చూస్తానని చెప్పారు. హెచ్‌ఓడీలతో సమావేశమై సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. రోగుల ఆరోగ్యంపై వైద్యులు, సిబ్బంది దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో ఆర్‌ఎంఓ మాధవీలత , డిప్యూటీ డైరెక్టర్‌ మంజుల, అడిషనల్‌ డైరక్టర్‌ లక్ష్మీ కుమారి, ఏఓ రమణమ్మ పాల్గొన్నారు. నూతన అడ్మినిస్ట్రేటర్‌ను జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జమున, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఏడుకొండలు కలిసి అభినందనలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement