నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చర్యలు | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చర్యలు

Published Tue, May 7 2024 6:50 PM

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చర్యలు

గజ్వేల్‌రూరల్‌: రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవని గజ్వేల్‌ ఏడీఏ బాబునాయక్‌ హెచ్చరించారు. పట్టణంలోని విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో సోమవారం గజ్వేల్‌ మండల వ్యవసాయాధికారి నాగరాజుతో కలిసి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. విత్తనాల నిల్వలు, స్టాక్‌ రికార్డులను పరిశీలించారు. అనంతరం బాబునాయక్‌ మాట్లాడుతూ.. డీలర్లు నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మిన, అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను కొనుగోలు చేసేప్పుడు తప్పక రశీదులు తీసుకోవాలని సూచించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement