జేఎన్‌వీ ప్రవేశపరీక్షకు 76.69 శాతం హాజరు | - | Sakshi
Sakshi News home page

జేఎన్‌వీ ప్రవేశపరీక్షకు 76.69 శాతం హాజరు

Published Sun, Jan 19 2025 1:24 AM | Last Updated on Sun, Jan 19 2025 1:24 AM

జేఎన్‌వీ ప్రవేశపరీక్షకు 76.69 శాతం హాజరు

జేఎన్‌వీ ప్రవేశపరీక్షకు 76.69 శాతం హాజరు

పెద్దవూర : చలకుర్తి క్యాంపులోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2025–26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పరీక్షకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 76.69 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రిన్సిపాల్‌ ఆర్‌.నాగభూషణం తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 5, సూర్యాపేటలో 9, నల్లగొండ జిల్లాలో 13 కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో 2,329 మందికి గాను 1,803 మంది(77.42శాతం), సూర్యాపేట జిల్లాలో 1,525 మందికి గాను 1,199 మంది(78.62శాతం), యాదాద్రి భువనగిరి జిల్లాలో 693 మందికి గాను 485 మంది(69.99శాతం) విద్యార్థులు హాజరైనట్లు వెల్లడించారు. మొత్తం 80 సీట్లకు నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 4,547 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,487 మంది హాజరయ్యారని.. 1,060 మంది గైర్హాజరయ్యారని వివరించారు. దీంతో ఒక్క సీటుకు 44 మంది విద్యార్థులు పోటీ పడినట్లు తేలింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement