ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలి
చివ్వెంల(సూర్యాపేట) : ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూర్యాపేట జల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణి సూచించారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సబ్ జైలును సందర్శించారు. ఈ సందర్భంగా జైలుకు వచ్చిన నూతన ఖైదీలతో మాట్లాడారు. న్యాయవాదులను పెట్టుకోలేని స్థితిలో ఉన్న ఖైదీలు జిల్లా న్యాయసేవాధికార కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నట్లయితే ఉచితంగా న్యాయవాదులను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ సుధాకర్ రెడ్డి, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పెండెం వాణి, న్యాయవాదులు సందీప్, లింగయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment