రథసప్తమికి
తిరుమల: తిరుమలలో ఈ నెల 4వ తేదీ నిర్వహించనున్న రథసప్తమి వేడుకలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఏటా మాఘ మాసంలో సప్తమినాడు మలయప్పస్వామివారు ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు. వాహనసేవలు తిలకించేందుకు వచ్చే భక్తులు చలికి, ఎండకు, వర్షానికి ఇబ్బందులు పడకుండా నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశారు. శ్రీవారి భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు అందించేందుకు గ్యాలరీల్లో ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ భక్తులకు టీ, కాఫీ, పాలు, మజ్జిగ, మంచినీరు, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర, పొంగలి అందించనున్నారు. వాహనసేవలను తిలకించేందుకు వీలుగా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయ మాడ వీధులను రంగవల్లులతో అందంగా తీర్చిదిద్దారు. ఎండలో నడిచేందుకు ఇబ్బంది పడకుండా తెల్ల రంగు వేశారు. భక్తులకు భద్రతకు టీటీడీ నిఘా, భద్రతా సిబ్బంది, పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్లు సేవలందించనున్నారు. మాడ వీధుల్లోని గ్యాలరీల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులకు విధులు కేటాయించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీలో వాహనసేవలను ప్రత్యక్షప్రసారం చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment