● 2009 నుంచి జీవీఎంసీ ప్రతీ ఏటా ఇచ్చే బెస్ట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అవార్డును దక్కించుకుంటోంది. కరోనా వచ్చిన 2020 మినహా అన్ని సంవత్సరాలు నిరాటంకంగా అసోసియేషన్ అవార్డును అందుకుంటుంది.
● 2018లో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ రెసిడెంట్స్ కాలనీగా అవార్డు అందించింది. అదే ఏడాది ఎన్సీఆర్డబ్ల్యూఏ బెస్ట్ ఆర్డబ్ల్యూఏ, మేనేజర్ అవార్డులను బహూకరించింది.
● 2019లో ఆనంద్ సిటిజన్, జీవీఎంసీ సంయుక్తంగా 25వేల నగదు అవార్డు అందించింది.
● 2021లో బెస్ట్ వాటర్ హీరో అవార్డు అసోసియేషన్తో పాటు కాలనీ అసోసియేషన్ ప్రతినిధి పరంధామయ్య కూడా అందుకున్నారు. అలాగే 2021, 22, 23ల్లో ఎన్సీఆర్డబ్ల్యూకే కాలనీకి అవార్డులు అందించడంతో పాటు మేనేజర్ అవార్డును పరంధామయ్యకు అందించారు.
● 2022లో నీటి గుంతల నిర్వహణ, నీటి సంరక్షణ చర్యలకు మెరిట్ అవార్డులను అసోసియేషన్కు అందించారు.
● 2023వ సంవత్సరానికి గాను కేంద్ర జల్శక్తి శాఖ ప్రకటించిన 5వ జాతీయ జల అవార్డుల్లో తిరుమల నగర్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ 3వ ర్యాంక్ దక్కించుకుంది.
● ఈ నెల 22న ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనున్నట్లు కాలనీ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.నాగభూషణం, ఎం.పరంధామయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment