నూతన పరిశ్రమల పాలసీలతో పురోగతి | - | Sakshi
Sakshi News home page

నూతన పరిశ్రమల పాలసీలతో పురోగతి

Published Sun, Oct 20 2024 2:06 AM | Last Updated on Sun, Oct 20 2024 2:06 AM

నూతన పరిశ్రమల పాలసీలతో పురోగతి

ఏపీ సీఐఐ చైర్మన్‌ డాక్టర్‌ మురళీకృష్ణ

బీచ్‌రోడ్డు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పరిశ్రమల పాలసీతో పెద్ద సంఖ్యలో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, దీంతో రాష్ట్రం పురోగతి సాధిస్తుందని ఏపీ సీఐఐ చైర్మన్‌ డాక్టర్‌ మురళీ కృష్ణ అభిప్రాయపడ్డారు. నగరంలోని ఒక హోటల్‌లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరు పాలసీలను ప్రకటించగా.. అందులో రెండు పరిశ్రమల పురోగతికి సంబంధించినవని తెలిపారు. వీటిని సీఐఐ స్వాగతిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతన పాలసీలను పటిష్టంగా అమలు చేస్తే.. ఏపీ దేశంలో టాప్‌–3లో ఉండటం ఖాయమన్నారు. ఈ పాలసీల ద్వారా ఉత్పత్తి రంగంలో రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. పరిశ్రమల స్థాపన బట్టి ప్రోత్సాహకాలు కాకుండా.. ఎంత మందికి ఉపాధి కల్పిస్తున్నారనే దానిపై కూడా ప్రోత్సాహకాలు అందించడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో క్లస్టర్‌ హబ్‌ల ఏర్పాటు నిర్ణయం అభినందనీయమన్నారు. నవంబర్‌ 13న సీఐఐ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఒక సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఐఐ ప్రతినిధులు శివ కుమార్‌, సాంబశివరావు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement