ఆదర్శ ప్రాయులు | - | Sakshi
Sakshi News home page

ఆదర్శ ప్రాయులు

Published Sat, Aug 24 2024 12:42 PM | Last Updated on Sat, Aug 24 2024 12:42 PM

ఆదర్శ ప్రాయులు

విజయనగరం అర్బన్‌: టంగుటూరి ప్రకాశం పంతులు భవిష్యత్‌ తరాలవారికి ఆదర్శ ప్రాయులని కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలిపారు. ప్రకాశం పంతులు జయంతిని కలెక్టరేట్‌ ఆడిటోరియంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. టంగుటూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టంగుటూరి 1952లో ఎస్‌. కోట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారని, మన జిల్లాతో ఆయనకు అనుబంధం ఉండడం విశేషమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేసీ సేతుమాధవన్‌, డీఆర్వో ఎస్‌.డి.అనినత, డీబీసీ కిడారి సందీప్‌, కలెక్టరేట్‌ పరిపాలన అధికారి దేవ్‌ప్రసాద్‌, జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement