తప్పు జరిగితే ఉద్యోగాలు వదులుకోవాల్సిందే! | - | Sakshi
Sakshi News home page

తప్పు జరిగితే ఉద్యోగాలు వదులుకోవాల్సిందే!

Published Sat, Aug 24 2024 12:42 PM | Last Updated on Sat, Aug 24 2024 12:42 PM

తప్పు

బొబ్బిలి: ఇసుక తరలింపు ప్రక్రియలో ఏ చిన్న తప్పు జరిగినా ఉద్యోగులు, సిబ్బంది తమ ఉద్యోగాలను వదులుకోవాల్సిందేనని జేసీ సేతుమాధవన్‌ హెచ్చరించారు. గ్రోత్‌ సెంటర్‌ సమీపంలోని ఇసుక స్టాక్‌ పాయింట్‌ను ఆయన శుక్రవారం పరిశీలించారు. రోజుకు ఎన్ని టన్నుల ఇసుక సరఫరా జరుగుతుందన్నది సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద బుక్‌చేసుకుంటున్న ఇసుక పరిమాణం, వాహనాలకు ట్రాన్స్‌పోర్టు పర్మిషన్లు ఉన్నాయా లేదా అన్న అంశాలపై ఆరా తీశారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుకను లోడ్‌చేయాలని, వరుస క్రమంలో ఇసుకు తరలింపునకు వాహనాలను అనుమతించాలని ఆదేశించారు. రహదారిపై వాహనాలు నిలపకుండా చూడాలని సీఐ సతీష్‌కు సూచించారు. జిల్లాలో జరుగుతున్న నిర్మాణాలకు మాత్రమే ఇసుక సరఫరా చేయాలని, స్లాట్‌ బుక్‌చేసుకున్న వారి పేరు, ఆధార్‌, వాహనం డ్రైవర్‌ పేర్లు వేబిల్లులపై తప్పనిసరిగా ఉండాలన్నారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఇసుక స్లాట్‌ బుక్‌చేసుకునే తీరును పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్‌ ఎం.శ్రీను, సీఐ సతీష్‌కుమార్‌, సిబ్బంది ఉన్నారు.

జేసీ సేతుమాధవన్‌ హెచ్చరిక

No comments yet. Be the first to comment!
Add a comment
తప్పు జరిగితే ఉద్యోగాలు వదులుకోవాల్సిందే! 1
1/1

తప్పు జరిగితే ఉద్యోగాలు వదులుకోవాల్సిందే!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement