చీపురుపల్లి: పట్టణంలోని కనకమహాలక్ష్మి అమ్మవారిని 108 చీరలతో అర్చకులు అలంకరించారు. శ్రావణమాసం మూడవ శుక్రవారం అమ్మవారిని అధికమంది భక్తులు దర్శించారు. ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
మడ్డువలస ప్రాజెక్టు
ఆరు గేట్లు ఎత్తివేత
వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయు డు ప్రాజెక్టు వద్ద ఆరు గేట్లు ఎత్తి వరద నీటిని అధికారులు కిందకు విడిచిపెడుతున్నారు. వేగావతి, సువర్ణముఖి నదుల నుంచి 9 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులో చేరుతుండడంతో ప్రాజెక్టు వద్ద 64.45 మీటర్ల లెవెల్ నీటి మట్టం నమోదైంది. దీంతో ఆరు గేట్లు ఎత్తి 14వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడిచి పెడుతున్నామని ఏఈ నితిన్ తెలిపారు.
సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
● అక్రమ రిజిస్ట్రేషన్ ఆరోపణలే కారణం
● శిశోడియా పరిశీలనలో వెల్లడి
శృంగవరపుకోట: ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలపై ఎస్.కోట సబ్ రిజిస్ట్రార్ శ్యామలను సస్పెండ్ చేసిన విషయం ఆలస్యంగా తెలిసింది. 22ఏలో ఉన్న నిఽషేధిత ప్రభుత్వ భూములను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పార్టీలకు రిజిస్ట్రేషన్ చేసినట్టు ఆమైపె ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.శిసోడియా ఎస్.కోట, భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని రికార్డులను పరిశీలించారు. నిషేధిత భూములు రిజిస్ట్రేషన్ చేసినట్టు నిర్ధారించి చర్యలకు ప్రతిపాదించడంతో శ్యామలను సస్పెండ్ చేస్తూ జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ విజయలక్ష్మి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
పోలీసుల సమస్యలు పరిష్కరిస్తా
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పోలీస్ వెల్ఫేర్డేలో సిబ్బంది నుంచి వినతులు స్వీకరించారు. కొన్నింటిని అప్పటికప్పుడే పరిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment