విజయనగరం టౌన్: జొన్నాడ వద్ద ఏర్పాటు చేసిన టోల్గేట్ను తక్షణమే ఎత్తి వేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని కోరారు. ఈ మేరకు జిల్లాకు వచ్చిన కేంద్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజును ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, విజయనగరం–విశాఖపట్నం రహదారిలో జొన్నాడ వద్ద టోల్గేట్ ఏర్పాటు చేయడంపై ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోందన్నారు. ప్రతిరోజూ ఈ మార్గంలో వేలాది మంది ప్రయాణాలు చేస్తుంటారని, టోల్గేట్ వల్ల వీరందరిపై ఆర్థిక భారం పడుతుందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment