బీఎస్పీ గూటికి మందా | Sakshi
Sakshi News home page

బీఎస్పీ గూటికి మందా

Published Thu, Apr 18 2024 9:30 AM

బీఎస్పీ అధినేత్రి మాయవతితో మాజీ ఎంపీ మందా జగన్నాథం   - Sakshi

అలంపూర్‌: లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. పోటీయే ప్రధానం అన్నట్టుగా కొందరు ఉన్న పార్టీని వదిలి.. మరో పార్టీ కండువా కప్పుకొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘కారు’ దిగిన మాజీ ఎంపీ మందా జగన్నాథం.. ఆ తర్వాత ‘చెయ్యి’ అందుకున్నారు. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ స్థానానికి పోటీచేసే అవకాశం కల్పిస్తారని ఆశించగా, పార్టీ అధిష్టానం మరొకరికి టికెట్‌ కేటాయించింది. ఈనేపథ్యంలో మందా జగన్నాథం కాంగ్రెస్‌ పార్టీని వీడుతారనే ప్రచారం జోరుగా సాగింది. ఎట్టకేలకు ఆయన కాంగ్రెస్‌ను వీడి ఏనుగెక్కారు. బుధవారం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్‌ ఆధ్వర్యంలో పార్టీ అధినేత్రి మాయావతిని రాజస్థాన్‌లో కలిసి, పార్టీ కండువా కప్పుకొన్నారు.

మాయవతి సమక్షంలో ఏనుగు పార్టీలో చేరిన మాజీ ఎంపీ జగన్నాథం

నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ బరిలో నిలిచే అవకాశం

Advertisement
Advertisement