భీమవరం (ప్రకాశంచౌక్): బాల్య వివాహాలు రూపుమాపేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా సీ్త్ర, సంక్షేమ శాఖ అధికారి బి.సుజాతరాణి అన్నారు. శుక్రవారం భీమవరం ఐఎంఏ హాలులో బాల్య వివాహాలు, హైరిస్క్ ప్రెగ్నెన్సీ, ఎనీమియా తదితర అంశాలపై మెడికల్ అధికారులు, సడీపీఓలు, సూపర్వైజర్లతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారి సుజాత రాణి మాట్లాడుతూ విద్యార్థినులకు బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలన్నారు. డీఎంహెచ్ఓ డి.మహేశ్వరరావు మాట్లాడుతూ హై రిస్క్ ప్రెగ్నెన్సీ, రక్తహీనత ఉన్న గర్భవతులను గుర్తించి సరైన పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాదీ కేంద్రాల ద్వారా గర్భవతులకు అందించే పౌష్టిక ఆహారం వారు మాత్రమే తీసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో జిల్లా ఇమ్యూనికేషన్ అధికారి డాక్టర్ సుధా లక్ష్మి, బాలల సంరక్షణ అధికారి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment