గురువులకు ప్రత్యేక శిక్షణ
జాతీయ విద్యావిధానం – 2020కి అనుగుణంగా ఉపాధ్యాయులకు ప్రత్యేక రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ ఇచ్చేందుకు విద్యా శాఖ ఏర్పాట్లు చేసింది. 8లో u
వైభవంగా రథోత్సవం
నేడు చక్రస్నానం, ధ్వజావరోహణం
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
నరసాపురం పట్టణంలోని ఈనెల 1న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. రూ 1.43 లక్షలు విలువ చేసే 70.47 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. 8లో u
శనివారం శ్రీ 19 శ్రీ అక్టోబర్ శ్రీ 2024
ద్వారకాతిరుమల: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిని కనులారా వీక్షించిన వారిదే కదా పుణ్యము.. దివ్య రథంపై విహరించిన శ్రీవారిని దర్శించిన వారి జన్మ ధన్యము. ద్వారకాతిరుమల క్షేత్రంలో శ్రీవారి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. శుక్రవారం రాత్రి స్వామివారు ఉభయ దేవేరులతో కలసి దివ్య రథంపై క్షేత్ర పురవీదుల్లో అట్టహాసంగా ఊరేగారు. ఆలయ ముఖ మండపంలో శ్రీవారు రాజమన్నార్ అలంకారంలో భక్తులకు దర్శనభాగ్యాన్ని కల్పించారు.
రథోత్సవ వేడుక : ముందుగా ఆలయంలో అర్చకులు స్వామి, అమ్మవార్లను తొళక్క వాహనంపై ఉంచి, పూజాదికాలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట భజనలు, అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్ఛరణల నడువు వాహనాన్ని రథం వద్దకు తీసుకొచ్చారు. రథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై కల్యాణ మూర్తులను వేంచేపు చేసి, పుష్పాలంకారాలు చేసి హారతులిచ్చారు. ఆలయ చైర్మన్, ఈఓ తదితరులు పూజలు నిర్వహించి బలిహరణ సమర్పించారు.
సాంకేతికతను
అందిపుచ్చుకోవాలి
న్యూస్రీల్
Comments
Please login to add a commentAdd a comment