పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి

Published Thu, Oct 3 2024 1:32 AM | Last Updated on Thu, Oct 3 2024 1:32 AM

పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి

భువనగిరిటౌన్‌ : పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ గంగాధర్‌ అన్నారు. స్వచ్ఛత హీ సేవలో భాగంగా గాంధీ జయంతిని పురస్కరించుకుని బుధవారం భువనగిరి మున్సిపాలిటీలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను సంత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. సమాజం నిద్రలేవకపోముందే గ్రామాలు, పట్టణాలను శుభ్రం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారని పేర్కొన్నారు. పారిశుద్ధ కార్మికుల కోసం ప్రత్యేకంగా వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మున్సిపల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కమిషనర్‌ రామాంజులరెడ్డి పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడారు.కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మాయ దశరథ, కౌన్సిలర్లు, శానిటరీ ఇన్స్‌పెక్టర్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ పాల్గొన్నారు.

ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ గంగాధర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement