సాక్షి,యాదాద్రి : జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా బుధవారం కలెక్టరేట్లో మహాత్మాగాంధీ చిత్రపటానికి కలెక్టర్ హనుమంతు కే.జెండగే, అదనపు కలెక్టర్లు గంగాధర్, బెన్షాలోమ్, అధికారులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ.. సత్యం, అహింస, స్వచ్ఛత అనే విలువలకు కట్టుబడిన మహనీయుడు మహాత్మాగాంధీ అని పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్ర కోసం శాంతియుత పోరాటం చేశారని, ఆయన కలలను సాకారం చేయటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చా రు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి యాదయ్య, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, డీఈఓ సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ పార్థసింహారెడ్డి, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment