నిధులొస్తేనే పనులు కదిలేది.. | - | Sakshi
Sakshi News home page

నిధులొస్తేనే పనులు కదిలేది..

Published Thu, Oct 3 2024 1:32 AM | Last Updated on Thu, Oct 3 2024 1:32 AM

నిధులొస్తేనే పనులు కదిలేది..

మోత్కూరు : మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న మోడ్రన్‌ ధోబీ ఘాట్‌ను నిధుల కొరత వెంటాడుతోంది. ఏడాదిన్నర కావస్తున్నా నిధుల కొరత వల్ల పనులు పూర్తికావడం లేదు. మోత్కూరు పట్టణంలోని బిక్కేరు చెంతన రూ.2కోట్ల వ్యయంతో ధోబీ ఘాట్‌ పనులను ప్రారంభించారు. 2023 ఏప్రిల్‌లో అప్పటి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు కోటి రూపాయలు విలువ చేసే పనులు పూర్తి చేశారు. సుమారు రూ.50 లక్షలు యంత్రాలకు వినియోగించనున్నారు. నిధుల లేమితో యంత్రాలను సమకూర్చలేకపోతున్నారు. బిల్లులు రాకపోవడంతో దోభీఘాట్‌ పనులను కాంట్రాక్టర్‌ అర్ధాంతరంగా నిలిపివేశాడు. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే తప్పా.. పనులు కదిలే పరిస్థితి లేదు.

ఫ మోడ్రన్‌ ధోబీ ఘాట్‌కు నిధుల కొరత

ఫ ఏడాది క్రితం నిలిచిపోయిన పనులు

ఫ రూ.2కోట్ల వ్యయంతో నిర్మాణం

యంత్రాలు కొనుగోలు చేయాలి

నిధులు రాకపోవడంతో ధోబీఘాట్‌ పనులు నిలిచిపోయాయి. భవన నిర్మాణం 75 శాతం పూర్తయ్యింది. యంత్రాలు కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.

–శ్రీకాంత్‌, మోత్కూరు మున్సిపల్‌ కమిషనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement