కడప అర్బన్ : రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ నర్సింగ్ వ్యవస్థను ఇబ్బంది పెట్టేలా ఉన్న 115 జీవోను రద్దు చేయాలని ఎన్.ఎస్.సి జిల్లా అధ్యక్షురాలు బి.విజయశ్రీ, వైస్ ప్రెసిడెంట్ ఎన్.హేమలత, ప్రధాన కార్యదర్శి కమాల్బీ, నారాయణ, సునీతలు డిమాండ్ చేశారు. కడప రిమ్స్ ఆవరణలో ఈ నెల 10న ‘నర్సెస్ స్ట్రగుల్ కమిటీ’(ఎన్.ఎస్.సి) ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే దీక్షలు గురువారం మూడో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా రెగ్యులర్ నోటిఫికేషన్ ప్రకటించలేదన్నారు. జీఓ 115 ప్రకారం రెగ్యులర్ ఏఎన్ఎంలను రెగ్యులర్ స్టాఫ్ నర్సులుగా, కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులుగా పదోన్నతి కల్పిస్తూ ఖాళీ స్టాఫ్ నర్సుల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలన్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అత్యవసర విధులు మినహాయించి ఓపీ, సాధారణ వార్డు విధులు బహిష్కరిస్తామని తెలిపారు. ఈ నెల 17న రెండు గంటల పాటు అత్యవసర విధులను బహిష్కరిస్తామన్నారు. 18న రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక దీక్షలలో పాల్గొంటామన్నారు.
రిమ్స్లో మూడో రోజుకు చేరిన రిలే దీక్షలు
Comments
Please login to add a commentAdd a comment