ముస్లింల ఆస్తులను అన్యాక్రాంతం కానివ్వం | - | Sakshi
Sakshi News home page

ముస్లింల ఆస్తులను అన్యాక్రాంతం కానివ్వం

Published Fri, Sep 13 2024 1:18 AM | Last Updated on Fri, Sep 13 2024 1:18 AM

ముస్లింల ఆస్తులను అన్యాక్రాంతం కానివ్వం

రాయచోటి అర్బన్‌ : ముస్లింలకు చెందిన వక్ఫ్‌ బోర్డు ఆస్తులను పరాధీనం చేస్తే సహించబోమని సహారా వెల్ఫేర్‌ సొసైటీ ప్రధాన కార్యదర్శి ఆప్తాబ్‌ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్‌ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సహారా వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం నాలుగు రోడ్ల కూడలిలోని జామియా మసీదు ఎదుట సంతకాల సేకరణ చేశారు. శిబిరంలో క్యూఆర్‌ కోడ్‌ను ఏర్పాటు చేసి వక్ఫ్‌ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ జాయింట్‌ పార్లమెంటరీ కమిటీకి ఫిర్యాదులను పంపారు. ఈ సందర్బంగా విలేకరులతో ఆప్తాబ్‌ మాట్లాడుతూ వక్ఫ్‌ చట్టానికి ఎలాంటి సవరణలు అవసరం లేదని, ఉన్న చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. రానున్న రోజుల్లో మూడు రాష్ట్రాలలో జరుగనున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ పెద్దలు ఇలాంటి నల్ల చట్టాలను తెస్తున్నారంటూ మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement