plane
-
విమానంలో సీటు సరిపోలే...దెబ్బకి 82 కిలోల బరువు తగ్గాడు
అధికబరువు బాధపడేవారికి కష్టాలు మామూలుగా ఉండవు. ఒక్కొక్కరి ఇష్టాలు ఒక్కోలా ఉంటాయి. పదిమంది చూపులు, కొంటెచూపులు వారిని తొలిచేస్తే ఉంటాయి. కొంతమంది అవమానకరమైన మాటలు కూడా వారిలో మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. మరికొన్ని ఘటనలు వారిలో పంతాన్ని పట్టుదలను పెంచుతాయి. అలా విమానంలో సీటు చాలకపోవడంతో అవమానంగా భావించిన యువకుడు దృఢ సంకల్పంతో బరువు తగ్గాడు. ఇంతకీ ఆ యువకుడు ఎంత బరువు ఉండేవాడు? బరువును ఎలా తగ్గించుకున్నాడు? తెలుసుకుందామా!గతంలో విమానంలో సీటు చాలట్లేదని ఏకంగా విమానాన్నే కొనేసింది ఒక మహిళ. కానీ అర్రాన్ యువకుడిది మరో గాథ. విమానం కొనే స్థోమత లేదుగనుక, తన బాడీని మార్చుకునేందుకు సిద్ధపడ్డాడు. స్కాట్లాండ్లోని తూర్పు ఐర్షైర్లోని ఆచిన్లెక్లోఎయిర్క్రాఫ్ట్ ఫిట్టర్గా పనిచేస్తున్నాడు అర్రాన్ చిడ్విక్. నిండా 30 ఏళ్లు కూడా లేకుండానే వందకు దాటి బరువుండేవాడు. 24 ఏళ్ల వయసులో అతని బరువు 175 కిలోలు అంటే అతని పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. View this post on Instagram A post shared by Arran Chidwick (@arranchidwick)కబాబ్లు, బర్గర్లు, చైనీస్ ఫుడ్ , చిప్స్ బ్యాగులు వంటి పెద్ద మొత్తంలో జంక్ ఫుడ్ తినేవాడు. వారాంతంలో అయితే అతని తిండికి హద్దే ఉండేది కాదు. దీంతో షూలేస్లు కట్టుకోవడం , బట్టలు వేసుకోవడం లాంటి రోజువారీ పనులకు చాలా ఇబ్బందులు పడేవాడు. ఒకసారి విమానంలో సీటు సరిపోకపోవడంతో చాలా అవమాన పడ్డాడు. అప్పుడు నిర్ణయించుకున్నాడు. కఠినమైన మార్పులు చేయకపోతే తన మనుగడే కష్టమని గుర్తించాడు. బరువు తగ్గకపోతే ఇక నెక్ట్స్ పుట్టిన రోజు ఉండదని ఫిక్సై పోయాడు. అందుకే పట్టుబట్టి మరీ, ఆరోగ్యకరమైన ఎంపికల ద్వారా ఒక ఏడాదిలో 80 రెండున్నర కిలోలు తగ్గాడు. బరువు తగ్గించే ఇంజెక్షన్లు లేదా ఫ్యాషన్ డైట్లను ఇలాంటి వాటి జోలికి పోకుండా, హెల్దీగా తన బరువును నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. తనని చూసి ఒకరు జాలిపడేవారు. మరొకరు అవమానించేవారు. దీంతో బాగా ఆందోళన చెందేవాడు. నిరాశకు గురయ్యేవాడు. ఈ బాధతో మరింత ఎక్కువగా తినడం, తాగడం చేసేవాడినని స్వయంగా చెప్పాడు అర్రాన్. కానీ ఇంత లావుగా ఉంటే తనకిక వేరే ఉద్యోగాలు రావడం కూడా కష్టమని గ్రహించాడు. అంతేకాదు 30 పుట్టిన రోజు చూడటం అనుమానమే అని భావించాడు. అంతే బరువు తగ్గించే ప్రయాణాన్ని ప్రారంభించాడు. జీవనశైలి మార్పులు, ఆహార మార్పులు, వ్యాయామంతో గణనీయంగా బరువు తగ్గాడు. ఎవ్వరూ ఊహించని విధంగా స్మార్ట్ అండ్ స్లిమ్గా మారిపోయాడు. అంతేకాదు హాఫ్ మారథాన్ రన్నింగ్కి సిద్ధంగా ఉన్నాడు. బరువు తగ్గిన తరువాత చాలా ఆనందంగాఉందని చెబుతున్నాడు. అంకితభావం,నిబద్ధతతో నలుగురికీ స్ఫూర్తినిస్తూన్నాడు.ఇదీ చదవండి: MahaKumbh Mela : సింపుల్గా, హుందాగా రాధిక-అనంత్ అంబానీ జంటజంక్ ఫుడ్ పూర్తిగా మానేశాడు.పండ్లు, కూరగాయలు , ప్రోటీన్ ఆధారిత ఆహారాన్ని మాత్రమే తీసుకునేవాడు. జిమ్లో గంటల కొద్దీ వ్యాయామం చేశాడు. అయితే మొదట్లో తన ఆకారంతో జిమ్కెళ్లడానికి సిగ్గుపడేవాడట. అందుకే ఎవ్వరూ ఉండరని సమయంలో ఎక్కువగా జిమ్ చేసేవాడు. దీంతో మూడు నెలల్లోనే మంచి మార్పుకనిపించింది. మంచి ఫలితం కనిపించడంతో మరింత ఉత్సాహంగా తన వెయిట్ లాస్ జర్నీని కొనసాగించాడు. ‘‘మీ పట్ల జాలిపడకుండా ,అందరూ మిమ్మల్ని చూసి నవ్వుతున్నారని అనుకోకుండా ఉండటం ముఖ్యం - మిమ్మల్ని మీరు మార్చుకోగలిగే ఏకైక వ్యక్తి మీరే" అంటాడు ఉత్సాహంగా. -
PM Modi : మోదీ విమానానికి బాంబు బెదిరింపు
-
California: కూలిన విమానం
-
బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం.. పది మంది దుర్మరణం
రియో డిజనీరో: బ్రెజిల్లో క్రిస్మస్ వేళ విషాద ఘటన జరిగింది. ఓ వ్యాపారవేత్త తానే నడుపుతూ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వెళుతున్న విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలింది. విమానం ఇళ్లను ఢీకొట్టి కూలిపోవడంతో అందులో ఉన్న 10 మంది మృతి చెందారు. విమానం పడిన చోట భవనాల్లో ఉన్న మరో పదిహేను మందికి గాయాలయ్యాయి. టూరిస్టు పట్టణం గ్రామడోలో ఈ ఘటన చోటు చేసుకుంది.బ్రెజిలియన్ సివిల్ డిఫెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం విమానం తొలుత ఓ బిల్డింగ్ను ఢీకొట్టి తర్వాత అందులో కింది ఫ్లోర్లో ఉన్న మొబైల్ ఫోన్లు అమ్మే షాపులోకి దూసుకెళ్లింది. దీంతో విమానంలో ఉన్నవారంతా మృతిచెందారు. గ్రామడో పర్వత ప్రాంతంలోని పాపులర్ టూరిస్టు డెస్టినేషన్. ఇది పర్యాటకులకు చాలా ఇష్టమైన ప్రదేశం.మరికొన్ని రోజుల్లో క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో ఇక్కడికి టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉంది. -
ఎయిర్ఇండియా విమానానికి బాంబు బెదిరింపు
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి అమెరికాలోని షికాగో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఏఐ-127 విమానానికి ముప్పు ఉందని మంగళవారం(అక్టోబర్ 15) బెదిరింపు మెయిల్ అందింది.దీంతో అప్రమత్తమైన ఎయిర్ ఇండియా సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని కెనడాలోని ఇకాల్యూట్ ఎయిర్పోర్టుకు మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ఎక్స్(ట్విటర్)లో తెలిపింది. ఇకాల్యూట్ ఎయిర్పోర్టులో ప్రోాటోకాల్ ప్రకారం విమానంలోని ప్రయాణికులను,సిబ్బందిని తనిఖీ చేసిన తర్వాత విమానం తిరిగి బయలుదేరేందుకు అనుమతిస్తారని ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఇటీవలి కాలంలో తమ విమానాలకు తరచుగా బాంబు బెదిరింపులు వస్తున్నాయని పేర్కొంది. -
Kolkata: విమానం ప్రయాణంలో విషాదం
ఇరాక్ నుంచి చైనా వెళ్తున్న విమానంలో విషాదం చోటు చేసుకుంది. ఓ టీనేజీ ప్రయాణికురాలు అస్వస్థతకు గురై సీటులోనే కుప్పకూలిపోగా.. విమానాన్ని కోల్కతాలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే.. ఆస్పత్రికి తరలించేలోపు ఆ బాలిక కన్నుమూసింది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధి వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతురాలు బాగ్దాద్ సర్ చినార్ ప్రాంతానికి చెందిన డెరన్ సమీర్ అహ్మద్(16). మరో ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఏఐ 473 విమానంలో చైనా గువాంగ్జౌకు వెళ్తోంది. అయితే బుధవారం అర్ధరాత్రి దాటాక.. హఠాత్తుగా ఆమె అస్వస్థతకు గురైంది.దీంతో విమానాన్ని దారి మళ్లించి అరగంటకు కోల్కతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్లో దించారు. ఎయిర్పోర్ట్ నుంచి ఆమెను ఏఏఐ ఆంబులెన్స్లో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన తర్వాత గురువారం అర్ధరాత్రి మిగతా ప్రయాణికులతో విమానం తిరిగి బయల్దేరింది. ఈ ఘటనపై అసహజ మరణంగా కోల్కతా బాగౌతి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం పూర్తి అయ్యాక.. మృతదేహాన్ని ఆమె బంధువులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. -
Rajasthan: కూలిన మిగ్ 29 యుద్ధ విమానం.. పైలట్లకు తప్పిన ప్రమాదం
బార్మర్: రాజస్థాన్లోని బార్మర్లో ఓ యుద్ధ విమానం కూలిపోయింది. ఓలానియోక్లోని ధాని సమీపంలో యుద్ధ విమానం మిగ్ 29కు ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న నాగనా పోలీస్స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలంలో పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం నుంచి పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.మిగ్ 29 యుద్ధ విమానం భారతదేశంలోని ముఖ్యమైన విమానాలలో ఒకటి. ఈ జెట్ విమానం బార్మర్లో రాత్రిపూట సాధారణ శిక్షణ మిషన్లో సాంకేతిక లోపానికి గురైందని వైమానిక దళం తెలిపింది. ప్రమాదంపై ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది. మిగ్ 29 విమానంలో మంటలు చెలరేగిన వీడియోను డిఫెన్స్ కోర్ అనే ఖాతా నుంచి షేర్ చేశారు. During a routine night training mission in Barmer sector, an IAF MiG-29 encountered a critical technical snag, forcing the pilot to eject. The pilot is safe and no loss of life or property was reported. A Court of Inquiry has been ordered.— Indian Air Force (@IAF_MCC) September 2, 2024మిగ్ 29 విమానం 1987 నుండి అంటే దాదాపు 36 సంవత్సరాలుగా భారత వైమానిక దళం సేవలో ఉంది. సోవియట్ యూనియన్ నుంచి భారత్ ఈ విమానాన్ని కొనుగోలు చేసింది. ఈ విమానాన్ని పలుమార్లు నవీకరించారు. విమానంలోని ప్రాథమిక నిర్మాణం మినహా దాదాపు ప్రతిదీ మార్చారు. ఇందులో కొత్త కాక్పిట్, నూతన రాడార్, కొత్త ఇంధన ట్యాంక్ ఉన్నాయి. కొత్త ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ కూడా అమర్చారు. కొత్త క్షిపణులను అమర్చడం ద్వారా దీనికి పూర్తిగా ఆధునిక రూపాన్నిచ్చారు.మిగ్ 29 వేగంగా దాడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది కేవలం ఆరు నిమిషాల్లో లక్ష్యన్ని ఛేదించగలదు. కార్గిల్ యుద్ధ సమయంలో ఈ విమానం కీలక పాత్ర పోషించింది. బాలాకోట్ ఘటన సమయంలో కూడా తీవ్రవాద శిబిరంపై వైమానిక దాడిలో మిగ్ 29 పాల్గొంది. ఈ విమానంలో రెండు ఇంజన్లు ఉంటాయి. పరిమాణంలో చిన్నదిగా ఉన్నా చాలా చురుకైనది. ఇది నాల్గవ తరం యుద్ధ విమానం. గంటకు దాదాపు 2,500 కిలోమీటర్ల వేగంతో ఎగిరే సామర్థ్యం దీని సొంతం.Another crash this time IAF's MIG-29 in Barmer, Rajasthan. Pilot is safe, and no damage reported on the ground. More details to follow. pic.twitter.com/5hkXpUt9lY— Defence Core (@Defencecore) September 2, 2024 -
ఆ రోజుల్లో ఈ డిజైన్ చూసి ఉంటే?: ఆనంద్ మహీంద్రా
దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా ఇప్పుడు ఓ పేపర్ ప్లేన్కు సంబంధించిన వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో పేపర్ ప్లేన్ రూపొందించడం చూడవచ్చు. బహుశా ఇలాంటివి చిన్నప్పుడు అందరూ చేసి ఉంటారు. ఈ వీడియో షేర్ చేస్తూ.. ''పిల్లలకు ఇంకా ఇలాంటి వాటిమీద ఆసక్తి ఉందో లేదో తెలియదు, కానీ నా స్కూల్ రోజుల్లో చాలా దూరం ప్రయాణించే పేపర్ ప్లేన్ని డిజైన్ చేయాలనే ఆసక్తి ఉండేది. ఆ రోజుల్లో నేను ఈ డిజైన్ని చూసి ఉంటే... పోటీలో తేలికగా గెలిచి ఉండేవాడిని'' అని వెల్లడించారు.నిజానికి పేపర్ ప్లేన్స్ అనేవి వివిధ రకాలుగా తయారు చేయవచ్చు. అయితే ఎక్కువ దూరం ప్రయాణించే పేపర్ ప్లేన్ తయారు చేయడానికి కొన్ని టిప్స్ అవసరం. అలాంటివి ఈ వీడియోలో చూడవచ్చు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన అతి తక్కువ సమయంలోనే ఈ వీడియో వేల లైక్స్ పొందింది.Don’t know if kids are still interested but in my school days designing the farthest travelling paper plane was a preoccupationWish I had seen this design in those days… would have handily won the competition. #Sunday is perfect for paper planes…pic.twitter.com/jifbSuwtxy— anand mahindra (@anandmahindra) August 25, 2024 -
సీప్లేన్ ఏరోడ్రోమ్ నిబంధనల సడలింపు
కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సీప్లేన్ కార్యకలాపాల కోసం నిబంధనలను సరళీకృతం చేసింది. నాన్-షెడ్యూల్డ్ సంస్థలు సీప్లేన్ సేవలు నిర్వహించేలా అనుమతులను సవరించింది. ఏరోడ్రోన్ సర్టిఫికేట్ ప్రక్రియను సులభతరం చేసింది. ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ పథకం ఉడాన్ పథకం కింద సీప్లేన్ కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ..‘సీప్లేన్ కార్యకలాపాలు పర్యాటకం అభివృద్ధికి దోహదం చేస్తాయి. గతంలో వీటి నిర్వహణకు ఉన్న నిబంధనలను సవరిస్తున్నాం. సాధారణంగా సీప్లేన్లు సముద్రంలో టేకాఫ్, ల్యాండ్ అవ్వాలంటే ఇప్పటివరకు ఉన్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిబంధనల ప్రకారం వాటర్డ్రోమ్ లైసెన్స్ తప్పనిసరి. కానీ ఇకపై ఈ లైసెన్స్ అవసరం లేకపోయినా టేకాఫ్, ల్యాండ్ అవ్వొచ్చు. కమర్షియల్ పైలట్ లైసెన్స్ (సీపీఎల్) కలిగినవారు నేరుగా సీప్లేన్ రేటింగ్లను పొందవచ్చు. దాంతో పైలట్ల కొరత తీరుతుంది. నాన్-షెడ్యూల్డ్ ఆపరేటర్లు సీప్లేన్ కార్యకలాపాలను నిర్వహించవచ్చు’ అన్నారు.ఇదీ చదవండి: ‘లెజెండ్స్’ సర్వీసు నిలిపేత‘గతంలో అండమాన్ & నికోబార్ దీవులతో పాటు గుజరాత్లో సీప్లేన్ కార్యకలాపాలు జరిగేవి. కానీ అవి ఎక్కువ కాలం కొనసాగలేదు. తిరిగి వీటిని ప్రారంభించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 100 మార్గాల్లో ఈ సీప్లేన్లు ఎగరనున్నాయి. ఇప్పటికే వీటికి అనువైన మార్గాలను కనుగొనాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరాం. అండమాన్ & నికోబార్, గుజరాత్, లక్షద్వీప్, గోవా, అస్సాం, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ల్లో విస్తరించి ఉన్న 18 ప్రదేశాల్లో వాటర్ సీప్లేన్ ఏరోడ్రోమ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది’ అని మంత్రి పేర్కొన్నారు. -
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు
-
విమానంలో సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై మహిళ దాడి
ముంబై: విమానంలో ఓ మహిళ.. తోటి ఇద్దరు ప్రయాణికులు, సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై దాడికి తెగపడ్డారు. ఈ ఘటన శనివారం పుణెలోని లోహెగావ్ ఎయిర్పోర్టులో చోటు చేసుకుంది. ఉదయం 7. 45 గంటలకు పుణె నుంచి ఢిల్లీకి బయలుదేరే.. ఓ ప్రైవేటు విమానంలో బోర్డింగ్ ప్రాసెస్ సమయంలో ఓ మహిళ దాడికి తెడపడ్డారు. మొదట ఆ మహిళ ముందు సీట్లో ఉన్న ఇద్దరు ప్రయాణికులపై దాడి చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి విమాన సిబ్బంది, సీఐఎస్ఎఫ్ కానిస్టెబుల్స్ ఆమె వద్దకు వచ్చారు. దీంతో ఆమె మరింత రెచ్చిపోయి.. సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై దాడి చేసింది. అనంతరం ఆ మహిళను, ఆమె భర్తను విమానం నుంచి దింపేశారు. ఆ మహిళను ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించగా.. కేసు నమోదు చేశారు.సీనియర్ ఇన్స్పెక్టర్ అజయ్ సంకేశ్వరి మాట్లాడుతూ.. విచారణ కోసం సదరు మహిళకు నోటీసు ఇచ్చి విడిచిపెట్టాం. ఎయిర్లైన్ సిబ్బంది, సీఐఎస్ఎఫ్ సిబ్బంది,సహ ప్రయాణీకులు వాంగ్మూలాలను రికార్డు చేశాం’ అని చెప్పారు. వ్యక్తిగత అత్యవసర పరిస్థితి కారణంగా ఆమె తీవ్రమైన బాధలో ఉన్నట్లు గమనించామని, అందుకే ఆమె తోటి ప్రయాణికులతో వాగ్వాదానికి దిగారని ఓ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ తెలిపారు. -
హైదరాబాద్ నుంచి ఇండిగో కొత్త సర్వీసులు
హైదరాబాద్-అహ్మదాబాద్ మధ్య విమానయాన సంస్థ ఇండిగో కొత్త, అదనపు సర్వీసులు నడుపుతామని ప్రకటించింది. హైదరాబాద్-హిరాసర్ మధ్య నూతన డెయిలీ సర్వీసును సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పింది.సెప్టెంబర్ ఒకటి నుంచి హైదరాబాద్-ఉదయ్పూర్ మధ్య వారంలో నాలుగు ఫ్లైట్స్, సెప్టెంబర్ మూడు నుంచి హైదరాబాద్-జోద్పూర్ మధ్య వారంలో మూడు సర్వీసులు తిరిగి మొదలు అవుతాయని చెప్పింది. కొత్త రూట్ల చేరికతో భాగ్యనగరి నుంచి 69 నగరాలకు ప్రతివారం డైరెక్ట్ ఫ్లైట్స్ సంఖ్య 1,220కి చేరనుంది. ఇక అహ్మదాబాద్ నుంచి అమృత్సర్, భువనేశ్వర్కు అదనపు ఫ్లైట్స్ను నడుపుతామని ఇండిగో పేర్కొంది.ఇదీ చదవండి: ధరలు తగ్గించిన ఏకైన దేశం ఇండియాప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణీకుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరుతుందని కొన్ని నివేదికలు అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో విమాన సంస్థల ఆదాయాలు 15-17 శాతం పెరుగుతాయని చెబుతున్నాయి. దాంతో కంపెనీలు తమ సర్వీసులు పెంచుతున్నాయి. మెట్రో నగరాలతోపాటు టైర్1, 2 సిటీలకు కూడా తమ సర్వీసులను పొడిగిస్తున్నాయి. దేశీయంగా నడిపే విమానాల సంఖ్యను పెంచుతున్నాయి. -
ధీరేంద్రశాస్త్రిని ఆస్ట్రేలియా నుంచి రప్పించిన అంబానీ
ప్రపంచంలోని ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని అత్యంత ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా జరిగిన వివిధ వేడుకలకు హాజరైన అతిథుల సంఖ్య కూడా భారీగానే ఉంది.బాలీవుడ్ సెలబ్రిటీలు మొదలుకొని ప్రపంచంలోని ప్రముఖ గాయకులు, నేతలు ఈ పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి అనంతరం అనంత్ అంబానీ, రాధికలను ఆశీర్వదించేందుకు ప్రముఖ సాధువులు కూడా తరలివచ్చారు. ఈ వివాహానికి తాను ఎలా హాజరైనదీ మధ్యప్రదేశ్లోని బాగేశ్వర్ ధామ్కు చెందిన స్వామీజీ ధీరేంద్ర శాస్త్రి ఒక ప్రసంగంలో తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన బాబా బాగేశ్వర్ ధామ్ ఫేస్బుక్ హ్యాండిల్లో షేర్ చేశారు.అనంత్ అంబానీ వివాహానికి సంబంధించి తనకు ఆహ్వానం అందిందని, అయితే తాను అప్పుడు ఆస్ట్రేలియాలో ఉండటంతో తొలుత నిరాకరించానని ధీరేంద్ర శాస్త్రి తెలిపారు. అయితే అంబానీ తన కోసం ఆస్ట్రేలియాకు విమానాన్ని పంపారని, సకల సదుపాయాలు ఏర్పాటు చేశారని, దీంతో తాను అనంత్ అంబానీ వివాహానికి హాజరయ్యానన్నారు. తనతో పాటు కొందరు శిష్యులు కూడా విమానంలో ముంబై చేరుకున్నామని తెలిపారు. అనంతరం అనంత్, రాధికలను ఆశీర్వదించి, తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయామన్నారు. -
పాతకాలం విమానం కుప్పకూలి ఇద్దరి మృతి
కాలిఫోర్నియా: ఫాదర్స్ డే సందర్భంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో నిర్వహించిన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సదరన్ కాలిఫోర్నియా ఎయిర్ఫీల్డ్కు చెందిన ఎయిర్ మ్యూజియం నిర్వహించిన వేడుకల్లో పాత కాలపు విమానం కుప్పకూలటంతో ఇద్దరు మృతి చెందారు.CALIFORNIAVintage plane crashes after takeoff from Chino Airport; 2 deadJun 16, 2024The Federal Aviation Administration is investigating after a vintage plane crashed shortly after taking off in Chino early Saturday afternoon, killing two people.#Chino #Planecrash #Airport… pic.twitter.com/sg6KSnp4GQ— Abhay (@AstuteGaba) June 16, 2024 ఈ విషయాన్ని ఎయిర్ మ్యూజియం అధికారులు వెల్లడించారు. శాన్ బెర్నార్డినో కౌంటీలోని చినో ఎయిర్ పోర్టుకు పశ్చిమాన శనివారం మధ్యాహ్నం 12:30 గంటల ట్విన్-ఇంజిన్ లాక్హీడ్ 12A విమానం కూలిపోయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు.చాలా పురాతనమైన ఈ విమానం యాంక్స్ ఎయిర్ మ్యూజియానికి చెందినదిగా అధికారులు తెలిపారు. యాంక్స్ మ్యూజియం అనేక పురాతన విమానాలకు కలిగి ఉందని తెలిపారు. ఈ ఘటనపై నేషనల్ ట్రాన్స్పోర్టు సేఫ్టీ బోర్డు దర్యాప్తు చేపట్టింది. అయితే మృతి చెందిన వారి వివరాలును అధికారులు వెల్లడించింది. -
ఖతర్ ఎయిర్వేస్ విమానంలో కుదుపులు.. 12 మందికి గాయాలు
డబ్లిన్: ఖతర్ రాజధాని దోహా నుంచి ఐర్లాండ్ వెళ్లిన ఖతర్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ 787 విమానం గగనతలంలో భారీ కుదుపులకు గురైంది. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న 12 మందికి గాయాలయ్యాయి.ఈ విమానం ఆదివారం(మే26) ఒంటిగంటకు డబ్లిన్లో ల్యాండ్ అయింది. ఖతర్ ఎయిర్వేస్ విమానం ల్యాండ్ అవగానే అత్యవసర సర్వీసులు, ఫైర్, రెస్క్యూ, ఎయిర్పోర్టు పోలీసు విభాగాల సిబ్బంది విమానాన్ని పరిశీలించారు. విమానం టర్కీ మీదుగా ప్రయాణిస్తున్నపుడు గాలిలో కుదుపులకు గురైంది. కుదుపుల కారణంగా విమానంలో ఉన్న ఆరుగురు ప్యాసింజర్లు, ఆరుగురు సిబ్బందికి గాయాలయ్యాయి’అని డబ్లిన్ ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. ఇటీవలే సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం గాలిలో భారీ కుదుపులకు గురై ఒక ప్యాసింజర్ మరణించిన విషయం తెలిసిందే. -
Hyderabad: విమానం గాల్లో ఉండగా డోర్ తెరిచే ప్రయత్నం..
శంషాబాద్: ప్రయాణంలో ఉన్న విమానం డోరు తెరిచే ప్రయత్నం చేసి కలకలం రేపిన ఓ ప్రయాణికుడి ఘటనలో పలు వివరాలు వెల్లడయ్యాయి. స్నేహితులతో ఉజ్జయిని వెళ్లిన ఓ ప్రయాణికుడు ఈ నెల 21 ఇండోర్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో కొందరు ప్రయాణికులతో గొడవ పడడంతో అతడిని ముందు సీటులో కూర్చోబెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అతడు గాల్లో ప్రయాణిస్తున్న విమానం డోరు తెరిచేందుకు యతి్నంచడంతో అందులోని ఉద్యోగులు నివారించారు.ఈ విషయమై ఆర్జీఐఏ పీఎస్లో కేసు నమోదు అయినప్పటికి వివిధ మెడికల్ రిపోర్టుల ఆధారంగా అతడు స్టేషన్ బెయిల్ పొందాడు. అసలు సదరు ప్రయాణికుడు అలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటని స్నేహితులను ప్రశి్నంచిన పోలీసులకు అతడు బంగు (మూలికలతో చేసిన మత్తుపదార్థం) సేవించడమే కారణమని తెలిపారు. బంగు మత్తులో ఉన్నందునే సదరు ప్రయాణికుడు అలా ప్రవర్తించినట్లు తెలిపారు. -
ఒక్కొక్కరూ, రెండు సీట్లు కొనుక్కోండి : ఎయిర్లైన్ సిబ్బంది అమానుషం
బరువుఎక్కువగా ఉన్నారనే కారణంతో ఇద్దరు మహిళల్ని విమానం నుంచి దించేసిన అమానుష ఘటన న్యూజిలాండ్లో చోటుచేసుకుంది. మార్చి 8వ తేదీ అంతర్జీతీయ మహిళా దినోత్సవం రోజు ఈ పరిణామం జరగడం గమనార్హం. అయితే ఈ వివాదంపై స్పందించిన ఎయిర్ న్యూజిలాండ్ ఇద్దరు మహిళలకు క్షమాపణలు చెప్పింది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి: ఏంజెల్ హార్డింగ్ మరో ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి నేపియర్ నుండి ఆక్లాండ్ ఇంటికి ప్రయాణిస్తుండగా ఈ షాకింగ్ పరిణామం ఎదురైంది. విమానం ఎక్కి, విమానం రన్వేపైకి చేరుకుందో లేదో అటెండెంట్ వచ్చి సీట్ ఆర్మ్రెస్ట్ను కిందకు దించేందుకు ప్రయత్నించింది. దీనిపై ఎందుకని ప్రశ్నిస్తే అది సరిగ్గా ఫిట్ అయ్యేంతవరకు విమానం టేకాఫ్ చేయబోనని పైలట్ చెప్పినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో తన పట్ల అటెండెంట్ చాలా దురుసుగా వ్యవహరించిందని ఏంజెల్ హార్డింగ్ ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాదు సిబ్బంది తమను కిందకు దించేస్తామని బెదిరించారట. దీంతో ఈ వివాదం మరింత ముదిరి విమానాన్ని బోర్డింగ్ ప్రదేశానికి తీసుకొచ్చారు. మరోవైపు తమకు ఇబ్బంది కలుగుతోంది అంటూ మిగిలిన ప్రయాణీకులు ఒత్తిడి తేవడంతో బాధిత మహిళల్ని దిగిపోవాలని సిబ్బంది కోరారు. అయితే ఇలా ఎందుకు బాధిత మహిళలు గట్టిగా నిలదీశారు. ఇక్కడ సిబ్బంది సమాధానంతో వారు షాకయ్యారు. ఒక్కొక్కరు రెండు సీట్లు బుక్ చేసుకోవాలంటూ వ్యంగ్యంగా మాట్లాడటంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇలాంటి అవమానకర పరిస్థితి మనమందరం మనుషులం,మరెవ్వరికీ తన లాంటి అవమానం ఎదురుకాకూడదంటూ విమానయాన సంస్థకు ఫిర్యాదు చేశారు. దీన్ని విచారించిన సంస్థ బాధితులకు క్షమాపణలు చెప్పింది. వారి విమాన ప్రయాణ బిల్లును చెల్లించి, వారి ఖర్చు లన్నింటినీ భరించింది. అలాగే ప్రయాణికులతో హుందాగా నడుచుకునేలా చూస్తామని ఎయిర్లైన్ ప్రతినిధి హామీ ఇచ్చారు. అయితే ఈ అవమానానికి తగిన పరిహారం చెల్లించాల్సిందే అంటూ హార్డింగ్ స్నేహితుడు పట్టుపడుతున్నాడు. -
ప్రధానితో ముందుగానే వెళ్లిన విమానం.. 31 మంది ప్రయాణికులు విలవిల
నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ యూఏఈలో జరిగే కాప్- 28 వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ సమయంలో ఒక విచిత్రం చోటుచేసుకుంది. ప్రధాని ప్రచండను తీసుకుని దుబాయ్కు బయలుదేరిన విమానం షెడ్యూల్ కంటే ముందే బయలుదేరింది. నిర్ణీత సమయానికి ముందుగానే విమానం టేకాఫ్ కావడంతో 31 మంది ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోయి, పలు అవస్థలు పడ్డారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం నేపాల్ ప్రధాని ప్రచండతో దుబాయ్కి బయలుదేరిన నేపాల్ ఎయిర్లైన్స్ విమానం నిర్ణీత షెడ్యూల్కు రెండు గంటల ముందుగానే బయలుదేరింది. దీంతో ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 31 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. దుబాయ్ వెళ్లే విమానం ఆర్ఏ- 299 బుధవారం రాత్రి 11.30 గంటలకు టేకాఫ్ కావాల్సి ఉండగా, వీవీఐపీ హోదా కారణంగా విమానం 9.30 గంటలకు బయలుదేరిందని విమానయాన సంస్థ తెలిపింది. ‘ప్రధాని ప్రచండ అదే విమానంలో ఉన్నారు. కాప్-28 సమ్మిట్ కోసం ఆయన ప్రతినిధి బృందంతో కలిసి దుబాయ్కి బయలుదేరారని, అందుకే విమానం ముందుగానే బయలుదేరాల్సి వచ్చింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు’ అంటూ విమానయాన సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ విమాన ప్రయాణికుల జాబితాలో 274 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 31 మంది విమానం ఎక్కలేకపోయారు. విమానం రెండు గంటలు రీషెడ్యూల్ చేశాం. ఇమెయిల్ ద్వారా విమానం బయలుదేరే సమయం గురించి ప్రయాణికులకు ముందుగానే తెలియపరిచాం. అయితే 31 మంది ప్రయాణికులు స్పందించలేదని ఎయిర్లైన్ వివరించింది. యూఏఈలో జరిగే వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని ప్రచండ.. నేపాల్ నుంచి దుబాయ్ చేరుకున్నారు. అక్కడ ఆయన పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు. మరోవైపు కాప్- 28 వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు. అక్కడ ప్రవాస భారతీయులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇది కూడా చదవండి: ఎయిమ్స్ నుంచి కార్మికులు డిశార్జ్ -
విమానం రెక్కలపై సిబ్బంది డ్యాన్సులు..
విమానం రెక్కపై డ్యాన్స్ చేస్తూ స్విస్ ఎయిర్పోర్టు లైన్స్ సిబ్బంది బుక్కయ్యారు. బోయింగ్ 777 విమానం రెక్కపై సిబ్బంది డ్యాన్సులు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో విమానయాన సంస్థ చర్యలకు సిద్ధపడింది. విమానాల్లో ఇలాంటి ఘటనలు ఎంత మాత్రం సహించరానివని స్పష్టం చేసింది. బోయింగ్ 777 విమానం ఎయిర్పోర్టులో ఆగింది. ఈ క్రమంలో ఓ మహిళా సిబ్బంది విమానం రెక్కపై డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత అధికారిగా కనిపించే మరో వ్యక్తి కూడా బాడీ బిల్డింగ్ పోజులు ఇచ్చారు. ఈ దృశ్యాలను విమానం కోసం టెర్మినల్ వద్ద వేచి చూస్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇది కాస్త వైరల్గా మారి స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు యాజమాన్యానికి చేరింది. Moment air hostesses for #Swiss International Air Lines are caught on camera posing for selfies as they dance on wing of Boeing 777 in #BuenosAires, #Argentina pic.twitter.com/9lCwCrjVRA — Hans Solo (@thandojo) August 27, 2023 బోయింగ్ విమానం రెక్క ఐదు మీటర్ల వెడల్పు, 16.4 మీటర్ల ఎత్తు ఉంటుంది. అంత ఎత్తు నుంచి కిందపడితే తీవ్ర ప్రమాదానికి దారి తీస్తుందని ఎయిర్ పోర్టు యాజమాన్యం తెలిపింది. సిబ్బంది ఇలాంటి చర్యలకు పాల్పడితే క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. చూడటానికి సరదాగా అనిపించినా.. ఇలాంటి ఘటనలు ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: ప్రభుత్వాఫీస్లో అధికారి మద్యం సేవిస్తూ.. వీడియో వైరల్.. -
వాగ్నర్ చీఫ్ విమానం పేలుడు.. వీడియో వైరల్
పుతిన్ ఒకప్పటి సన్నిహితుడు, రష్యాలో తిరుగుబాటు ఎగరేసిన కిరాయి సైన్యం గ్రూప్ వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించారు. అయితే.. రష్యా అధ్యక్షుడు పుతిన్పై తిరుగుబాటు చేసిన రెండు నెలల్లోనే ఆయన మృతి చెందడం అనుమానాలకు తావిస్తోంది. ప్రిగోజిన్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని అమెరికా నిఘా సంస్థ నుంచి గతంలోనే హెచ్చరికలు వచ్చాయి. పుతిన్ ప్రత్యర్థులందరూ తెరిచి ఉన్న కిటికీల నుంచి జారిపడ్డారని, ఈ క్రమంలో కిటికీలకు దూరంగా ఉండాలనే స్థాయిలో సూచనలు వచ్చాయి. అయినప్పటికీ ధైర్యంగా రష్యాలోనే తిరుగుతున్న ప్రిగోజిన్.. ఇంతలోనే విమాన ప్రమాదంలో మరణించారు. 🚨#BREAKING: Wagner chief Prigozhin has died along with 10 other passengers on the jet that just crashed in Russia's Tver region pic.twitter.com/4kPLrsGANb — R A W S A L E R T S (@rawsalerts) August 23, 2023 30 సెకన్లలోనే.. ప్రిగోజిన్ ప్రాణాలు కోల్పోయిన విమాన ప్రమాదం మాస్కోకు మాస్కోకు 100 కిలోమీటర్ల దూరంలో త్వెర్ ప్రాంతంలో జరిగింది. సవ్యంగా సాగుతున్న విమాన ప్రయాణం అప్పటివరకు బాగానే ఉన్నా.. కేవలం 30 సెకన్ల వ్యవదిలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆకాశం నుంచి విమానం పొగలు వెదజల్లుతూ కిందకు పడుతున్న దృశ్యాలు తాజాగా వైరల్గా మారాయి. ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశాలు లేవని అధికారులు తెలిపారు. అందులో ప్రిగోజిన్ కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు. పుతిన్పై తిరుగుబాటు.. ఉక్రెయిన్పై.. సైనిక చర్యలో భాగంగా కొన్నాళ్లు రష్యా సైనిక బలగాలకు అండగా ఉన్న ప్రిగోజిన్.. జూన్లో రష్యా అధ్యక్షుడు పుతిన్, ఆయన ప్రభుత్వంపై ఎదురుతిరిగారు. పుతిన్ సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు.. అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా.. రష్యా ఉలిక్కిపడింది. బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో మధ్యవర్తిత్వంతో వాగ్నర్ బృందాల తిరుగుబాటుకు తెరపడింది. ఎవరీ ప్రిగోజిన్..? రష్యా అధ్యక్షుడు పుతిన్కు అత్యంత సన్నిహితంగా ఉండే ప్రిగోజిన్ను.. పుతిన్ షెఫ్గా వ్యవహరిస్తుంటారు. 1980ల్లో దొంగతనం, దోపిడీ కేసుల్లో ప్రిగోజిన్ దాదాపు 9 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చారు. 1990ల్లో పుతిన్కు-ప్రిగోజిన్కు పరిచయం ఏర్పడింది. 2000లో పుతిన్ రష్యా అధ్యక్షుడు అయ్యారు. మరోవైపు.. ప్రిగోజిన్ రెస్టారెంట్లు ఇతర వ్యాపారాలను విస్తరించారు. 2001 నుంచి పుతిన్ సన్నిహిత వర్గాల్లో ప్రిగోజిన్ కనిపిస్తూనే ఉన్నాడు. రష్యా ప్రభుత్వానికి చెందిన సైనిక, పాఠశాల ఫుడ్ కాంట్రాక్టులు ఇతనికే దక్కాయి. ఆ తర్వాత 2014లో వాగ్నర్ పీఎంసీ నిర్వహణలో ప్రిగోజిన్ పాత్ర కూడా బయటకు వచ్చింది. ఇదీ చదవండి: ‘వాగ్నర్’ చీఫ్ ప్రిగోజిన్ ప్రాణాలకు ముప్పు -
విమానంలో భయానక అనుభవం ..
వాషింగ్టన్: సాంకేతిక లోపం కారణంగా విమానంలో ఒక్కసారిగా తక్కువ ఎత్తుకు దిగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పీడన సమస్యను అధిగమించేందుకు విమానాన్ని మూడు నిమిషాల్లోనే 15 వేల అడుగుల మేర దించాల్సి వచ్చినట్లు పిడ్మాంట్ ఎయిర్లైన్స్ సంస్థ ఫాక్స్ న్యూస్కు తెలిపింది. నార్త్ కరొలినాలోని చార్లొట్టె నుంచి ఫ్లోరిడాలోని గైన్స్విల్లెకు వెళ్తున్న పిడ్మాంట్ ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో ఈ నెల 10వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. చివరికి గమ్యస్థానానికి చేరుకుని సురక్షితంగా ల్యాండయింది. ‘టేకాఫ్ తీసుకున్న 43 నిమిషాల తర్వాత 29 వేల అడుగుల ఎత్తులో ఉండగా విమానంలో సమస్య మొదలైంది. క్యాబిన్లో పీడనం అకస్మాత్తుగా తగ్గిపోవడంతో ప్రయాణికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ఆరు నిమిషాల వ్యవధిలోనే మొత్తం 18,600 అడుగులు కిందికి దిగింది’అని ఫ్లైట్అవేర్ డేటా విడుదల చేసింది. ఘటనపై హారిసన్ హోవ్ అనే ప్రయాణికుడు సోషల్ మీడియా ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ‘కాలుతున్న వాసన, పెద్ద శబ్దం, చెవుల్లో హోరు’తో గగుర్పాటు కలిగించిందని పేర్కొన్నారు. కేబిన్లో కాలుతున్న వాసన, పెద్ద శబ్దాలు రావడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఊపిరాడక కొందరు ప్రయాణికులు ఆక్సిజన్ మాసు్కలతో గాలి పీల్చుకుంటున్న ఫొటోను హారిసన్ షేర్ చేశారు. -
చెన్నై విమానాశ్రయంలో శ్రీలంక మహిళ మృతి
అన్నానగర్: చైన్నె నుంచి శ్రీలంకలోని జాఫ్నాకు అలయనన్స్ ఎయిర్లైన్స్ ప్యాసింజర్ విమానం శనివారం ఉదయం 10.05 గంటలకు బయలుదేరేందుకు సిద్ధమైంది. ఆ విమానంలో ప్రయాణించాల్సిన వారు భద్రతా తనిఖీలు ముగించుకుని బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. శ్రీలంకకు చెందిన శివకజన్ లిట్టి(43) తమిళనాడులో ఆధ్యాత్మిక పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లడానికి వచ్చారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఆమె స్పృహతప్పి పడిపోయారు. వైద్యులు పరీక్షించి ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు వెల్లడించారు. ఎయిర్పోర్టు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చైన్నె ఎయిర్పోర్ట్ పోలీసులు సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం చైన్నెలోని శ్రీలంక రాయబార కార్యాలయానికి కూడా సమాచారం అందించారు. దీంతో విమానం గంట ఆలస్యంగా బయలుదేరింది. -
శ్రీవారి ఆలయంపై విమానం
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి విమానం వెళ్లిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. విమానం రేణిగుంట విమానాశ్రయం నుంచి వచ్చిందా.. లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిందో తెలియడం లేదు. ఆగమశాస్త్ర నియమం ప్రకారం తిరుమల ఆలయంపై ఎటువంటి విమానాలు వెళ్లరాదు. అయితే తరచూ ఆలయ పైభాగంలో విమానాలు వెళుతున్నాయి. తాజాగా ఘటన నేపథ్యంలో టీటీడీ భద్రతాధికారులు పరిశీలిస్తున్నారు. వైభవంగా అమావాస్య ఉత్సవం శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం అమావాస్య ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అలంకార మండపంలో స్వామి, అమ్మవార్లకు విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ స్వామి, అమ్మవార్లను చప్పరాలపై అధిష్టించారు. పురవీధుల్లో ఊరేగుతున్న స్వామి,అమ్మవార్లను భక్తులు దర్శించి పరవశించారు. ఆలయ పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. -
విమానంలో ధూమపానం!
సాక్షి, చైన్నె: కువైట్ నుంచి చైన్నెకు వచ్చిన విమానంలో ఓ యువకుడు పొగతాగి అడ్డంగా బుక్కయ్యాడు. అతడిని చైన్నెలో పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కువైట్ నుంచి ఆదివారం రాత్రి ఓ విమానం చైన్నెకు బయలు దేరింది. 184మంది ప్రయాణికులు ఇందులో ఉన్నారు. 38 వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తుండగా, ఇందులో ప్రయాణించిన ఓ యువకుడు సిగిరెట్ వెలిగించాడు.. దీనిని పక్కనే ఉన్న మరో ప్రయాణికుడు వ్యతిరేకించాడు. అతడు పట్టించుకోక పోవడంతో విమాన సిబ్బందికి తెలియజేశాడు. విమాన సిబ్బంది, ఫైలట్, ఇతర ప్రయాణికులు వారించినా అతడు ఖాతరు చేయలేదు. దీంతో అతడి చర్యలపై చైన్నె విమానాశ్రయ కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు. అర్ధరాత్రి వేళ విమానం చైన్నెలో ల్యాండ్ కాగానే భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. విమానంలో తనకు సిగరేట్ తాగాలనిపించింది తాగాను..అంటూ అతడు ఇచ్చిన సమాచారం భద్రతా సిబ్బందిని విస్మయానికి గురి చేసింది. దీంతో ఆయువకుడ్ని చైన్నె విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. విచారణలో ఆ యువకుడు మహారాష్ట్ర రాజధాని నగరం ముంబై లోని థానే ప్రాంతానికి చెందిన మహ్మద్ సదాం(32)గా గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
డ్యూటీ టైమైపోయిందని విమానాన్ని మధ్యలోనే వదిలేసిన పైలెట్లు
జైపూర్: లండన్ నుండి ఢిల్లీ వెళ్ళవలసిన ఎయిరిండియా ఫ్లైట్ పైలెట్లు తమ డ్యూటీ సమయం అయిపోయిందన్న కారణంతో ప్రయాణం మధ్యలోనే ప్రయాణికులను విమానాన్ని వదిలేసి వెళ్లిపోయిన సంఘటన ప్రయాణికులను విస్మయానికి గురిచేసింది. లండన్ నుండి బయలుదేరిన AI-112 ఎయిరిండియా విమానం ఆదివారం 4 గంటలకు ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది. కానీ ఢిల్లీలోని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా అత్యవసర పరిస్థితుల్లో విమానాన్ని జైపూర్లో ల్యాండ్ చేశారు. తర్వాత కొద్దిసేపటికి విమానానికి క్లియరెన్స్ లభించినప్పటికీ ఎయిరిండియా పైలెట్లు తమ డ్యూటీ సమయం ముగిసిందని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. దీంతో ఆ ఫ్లైట్లో ప్రయాణిస్తున్న సుమారు 350 మంది ప్రయాణికులను చాలాసేపు నిరీక్షణ తర్వాత ప్రత్యామ్నాయ మార్గాల్లో ఢిల్లీకి తరలించారు. పైలెట్ల చర్యపైనా, ఎయిర్ పోర్టు సిబ్బంది వ్యవహరించిన తీరుపైనా చిర్రెత్తిపోయిన ప్రయాణికులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఒక ప్రయాణికుడు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, బీజేపీ నేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లకు విజ్ఞప్తి చేస్తూ.. జైపూర్ ఎయిర్ పోర్టు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణానికి ఇంతవరకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని తమను ఎదో ఒక విధంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. Passengers of @airindia AI112 flying from London to Delhi have been diverted to Jaipur due to bad weather but passengers have not been assisted with any recourse to reaching their final destinations. @JM_Scindia please assist us urgently. We did manage to speak with @Ra_THORe… pic.twitter.com/DjLOD8dXLK — Adit (@ABritishIndian) June 25, 2023 -
ధోనితో అట్లుంటది మరి..
-
అండమాన్ వెళ్లిన విమానం తిరిగి చైన్నెకి..
తిరువొత్తియూరు: అండమాన్లో సుడిగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుండడంతో చైన్నె నుంచి 156 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం తిరిగి చైన్నెకి చేరుకుంది. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు విమానాశ్రయ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. చైన్నె మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అండమాన్కు 150 మంది ప్రయాణికులు, ఆరుగురు వి మానాశ్రమాల ఉద్యోగులతో ఇండిగో విమాన ము బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరింది. అండమాన్ సరిహద్దుకు వెళ్లిన సమయంలో అక్కడ తీవ్రమైన సుడిగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో విమానం అండమాన్ వద్ద ఆకాశంలో చక్కెర్లు కొట్టింది. దీంతో వాతావరణ పరిస్థితి అనుకూలించకపోవడంతో పైలట్ చైన్నె విమానాశ్రయ కంట్రోల్ రూంను సంప్రదించారు. చైన్నె విమానా శ్రయ అధికారులు విమానాన్ని తిరిగి చైన్నెకి తీసుకురావాలని ఆదేశించారు. దీంతో పైలట్ విమానా న్నిసాయంత్రం 5.10లకు చైన్నె ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. అండమాన్లో ప్రతికూల వాతావరణంతో విమానాన్ని రద్దు చేశారు. గురువారము ఉదయం చైన్నె నుంచి అండమాన్కు బయలుదేరు తుందని ప్రకటించారు. ప్రయాణికులు అందరూ అదే టికెట్తో విమానంలో ప్రయాణించవచ్చని తెలిపారు. ప్రయాణికులు విమానాశ్రయ ఉద్యోగులతో వాగ్వివాదానికి దిగారు. 150 మంది ప్రయాణికులు తమ టికెట్లు రద్దు చేసుకొని వెళ్లినట్లు తెలిసింది. అదే సమయంలో అండమాన్ నుంచి విమానంలో చైన్నెకి రావడానికి 162 మంది ప్ర యాణికులు అండమాన్ విమానాశ్రయంలో వేచి ఉన్నట్లు తెలిసింది. -
అనూహ్యంగా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..నలుగురు ప్రయాణికులు అరెస్టు
ఇటీవల విమానంలో ప్రయాణికుల వికృత ప్రవర్తనకు సంబంధించిన ఘటనలను చూశాం. వాటిని తలదన్నేలా విమానంలో మరో దారుణ ఘటన జరిగింది. ముగ్గురు ప్రయాణికుల కారణంగా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన కెయిర్న్స్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్తున్న విమానంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఏప్రిల్ 20న కెయిర్న్స్ నుంచి నార్తర్న్ టెరిటరీ ఆఫ్ ఆస్ట్రేలియాకు వెళ్తున్న విమానంలో ముగ్గురు ప్రయాణికులు ఘోరంగా ప్రవర్తించారు. ఆ విమానంలో ఆ ముగ్గురు ప్రయాణికుల మద్య వివాదం తలెత్తింది. దీంతో వారంతా దారుణంగా కొట్టుకున్నారు. వారు ప్రయాణిస్తున్నది విమానం అన్న స్ప్రుహ లేకుండా అత్యంత హేయంగా ప్రవర్తించారు. ఆ బృందంలోని 23 ఏళ్ల మహిళ, మరో 22 ఏళ్ల ప్రయాణికుడు చాలా దారుణంగా కొట్లాడుకున్నారు. ఇతర ప్రయాణికులకు భయం కలిగించేలా.. విమానంలోని ఫర్నిచర్ డ్యామేజ్ అయ్యేలా పోట్లాడుకున్నారు. విమాన సిబ్బంది సైతం వారిని నియంత్రించడంలో విఫలం కావడంతో విమానాన్ని క్వీన్ల్యాండ్స్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు దారి మళ్లించాల్సి వచ్చింది. చివరికి విమానం టేకాఫ్ అయినప్పుడూ కూడా ఆ గుంపు ఏ మాత్ర తగ్గలేదు. మరోసారి గొడవపడ్డారు. వారి రగడ కారణంగా విమానం కిటికి అద్దం కూడా పగిలిపోయింది. దీంతో విమానం దిగిన వెంటనే ఆ సముహన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కాగా, ప్రయాణికుడి వద్ద మాదక ద్రవ్యాలను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు సదరు విమానంలో నలుగురు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Departing Cairns today.. Just someone trying to glass someone. More fighting amongst themselves. Complete disregard for other passengers and the plane. I wonder if there were any consequences. #VoteNO 🇦🇺 #VoiceToParliament pic.twitter.com/v5iKWbWRtM — Jet Ski Bandit (@fulovitboss) April 20, 2023 (చదవండి: పియానో వాయించిన చిన్నారికి ప్రధాని మోదీ ఫిదా.. వైరలవుతున్న వీడియో) -
షాకింగ్ ఘటన.. ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం
జార్ఖండ్: ధన్బాద్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గ్లైడర్ విమానం ఇంట్లోకి దూసుకెళ్లింది. బార్వాడా ఎయిర్స్ట్రిప్ నుంచి టేకాప్ అయిన కాసేపటికే ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పైలట్ సహా పద్నాలుగేళ్ల బాలుడు గాయపడ్డారు. ధన్బాద్లోని బర్వాడ్డ ఏర్స్ట్రిప్ నుంచి చిన్న విమానం బయలుదేరింది. టేక్ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఎయిర్పోర్టుకు ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్న ఓ ఇంటిని ఢీకొట్టగా, అందులో ఉన్న పైలట్, బాలుడు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఇంటి యజమాని తెలిపారు. చదవండి: అమృత్పాల్ కేసులో ఊహించని ట్విస్ట్.. ఆమె అరెస్ట్ -
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా సరికొత్త ప్రాజెక్ట్
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల విమానాలను ఫ్రైటర్లుగా మార్చే సరికొత్త ప్రాజెక్టు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా ప్రారంభమైంది. ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్న బోయింగ్–737 విమానాన్ని ఫ్రైటర్గా మార్చనున్నారు. ఈ మేరకు విమానాశ్రయంలో మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాలింగ్ (ఎంఆర్ఓ) సేవలు అందజేసే జీఎమ్మార్ ఎయిరో టెక్నిక్ (జీఏటీ)కి, బోయింగ్ సంస్థకు మధ్య తాజాగా ఒప్పందం కుదిరింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తరువాత అతిపెద్ద ఎయిర్పోర్టుగా సేవలందిస్తున్న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే మొట్టమొదటిసారి విమానాల మార్పు రంగంలోకి అడుగుపెట్టినట్లయింది. ఈ తరహా కన్వర్షన్ సాంకేతిక పరిజ్ఞానం అమలులో చైనా, బ్రిటన్, కోస్టారికా తరువాత నాలుగో స్థానంలో హైదరాబాద్ నిలిచినట్లు ఎయిర్పోర్టు అధికారవర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందం మేరకు బోయింగ్ –737 నుంచి బోయింగ్ –800 వరకు ప్రయాణికుల విమానాలను బోయింగ్ కన్వర్టెడ్ ఫ్రైటర్స్ (బీసీఎఫ్)గా మార్పు చేయనున్నారు. ఈ ఏడాది నుంచి రానున్న ఐదేళ్లలో 30 విమానాలను ఫ్రైటర్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఒప్పందం ప్రతిష్టాత్మకం విమానాల కన్వర్షన్ కోసం బోయింగ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాలింగ్ కేంద్రాల నుంచి బిడ్లను ఆహా్వనించగా చివరకు హైదరాబాద్ ఎయిర్పోర్టులోని ఎంఆర్ఓకు ఈ కాంట్రాక్ట్ లభించడం విశేషం. రానున్న రోజుల్లో బోయింగ్ సరుకు రవాణా రంగంలో తన సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 75 ఫ్రైటర్లను బోయింగ్ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. దీంతో ఎయిర్ కార్గోలో ఇది 6.3 శాతం వరకు విస్తరించనుందని పేర్కొన్నారు. మరోవైపు ఈ–కామర్స్ రంగం పెద్దఎత్తున అభివృద్ధి చెందిన దృష్ట్యా హైదరాబాద్ నుంచి అమెరికాతోపాటు వివిధ దేశాలు, మన దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు మధ్య ఫ్రైటర్స్ డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. కోవిడ్ దృష్ట్యా అంతర్జాతీయంగా రాకపోకలు తగ్గుముఖం పట్టడంతో పలు ఎయిర్లైన్స్ సరుకు రవాణా రంగంలోకి తమ సేవలను మార్పు చేశాయి. ఈ క్రమంలోనే బోయింగ్ సైతం ఈ రంగంలో విస్తరణకు చర్యలు చేపట్టింది. బోయింగ్ సంస్థ గత 40 ఏళ్లుగా ప్రయాణికుల సేవలో ఉంది. ఎంఆర్ఓలదే భవితవ్యం ప్రపంచవ్యాప్తంగా విమానాల మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాలింగ్(ఎంఆర్ఓ) సేవలకు గొప్ప భవిష్యత్తు ఉందని జీఎమ్మార్ ఎయిరో టెక్నిక్ సంస్థ సీఈవో అశోక్ గోపీనాథ్ వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తాము ఎంఆర్ఓ సేవలను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి అన్ని ప్రధాన అంతర్జాతీయ నగరాలకు కార్గో సేవలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. -
విమానం ల్యాండింగ్ అవుతుందనంగా.. ఎమర్జెన్సీ డోర్ తెరిచే యత్నం..
మసాచుసెట్స్లోని లియోమిన్స్టర్కు చెందిన 33 ఏళ్ల వ్యక్తి లాస్ ఏంజిల్స్ నుచి బోస్టన్కు యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానంలో ప్రయాణిస్తుండగా.. ఎమర్జెన్సీ డోర్ తీసేందుకు యత్నించాడు. దీంతో ఆ వ్యక్తిని బోస్టన్లో విమానం ల్యాండ్ అయిన వెంటనే అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు యూఎస్ ఎయిర్లైన్స్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి టోర్రెస్ అనే వ్యక్తిగా గుర్తించారు. టోర్రెస్ లాస్ఏంజిల్స్ నుంచి బోస్టన్కు వెళ్తుండగా..విమానం ల్యాండింగ్ అవ్వడానికి దాదాపు 45 నిమిషాల ముందు ఎమర్జెన్సీ డోర్ అన్లాక్ చేసి కొంచెం దూరం వరకు ఓపెన్ చేశాడు. దీంతో సరిగ్గా అదే సమయంలో విమాన సిబ్బందికి కాక్పిట్లో అలారం వచ్చింది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన సిబ్బంది విమానం తనిఖీ చేయడం ప్రారంభించారు. వారంతా విచారిస్తుండగా..ఫస్ట్ క్లాస్ కోచ్ విభాగాల మధ్య ఉన్న స్టార్బోర్డ్ సైడ్ డోర్ అన్లాక్ అయ్యి కొద్ది దూరం జరిగినట్లు ఉంది. దీంతో వారు ఆ డోర్ని లాక్చేసి వచ్చి ఈ విషయాన్ని పైలెట్కి తెలిపారు. ఫ్లైట్ సిబ్బంది మేము ఆ డోర్ వద్ద టోర్రెస్ అనే వ్యక్తి ఉండటం గమనించామని చెప్పారు. అతను తాను చేసిన విషయాన్ని మరోకరికి చెప్పడం కూడా చూశామని చెప్పడంతో వారు టెర్రెస్ని ఈ విషయమై కొంచెం గట్టిగా అడిగారు. అంతే అతను కోపంతో విమానా సహాయకురాలిని మెటల్ చెంచాతో మెడపై మూడు సార్లు పొడిచాడు. దీంతో ప్రయాణికులు టోర్రెస్ని విమాన సిబ్బంది సాయంతో అడ్డుకుని అదుపుచేసి.. బోస్టన్లో విమానం దిగిన వెంటనే భద్రతా బలగాలు అతన్ని అప్పగించారు. ప్రమాదకరమైన ఆయుధంతో సిబ్బంది, ఫ్లైట్ అటెండెంట్పై దాడి చేసేందుకు యత్నించినందుకు అతనికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష తోపాటు సుమారు రూ. 2 లక్షలు పైనే జరిమాన విధించే అవకాశం ఉందని సదరు ఎయిర్లైన్ డిపార్ట్మెంట్ పేర్కొంది. (చదవండి: సెల్ఫోన్లకు ఫ్రీ బీర్లు ఆఫర్.. ఎగబడ్డ జనం.. వ్యాపారి అరెస్ట్) -
వైరల్ వీడియో: విమానం ఎక్కుతూ కిందపడబోయిన అమెరికా అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్లోకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతూ కింద పడబోయారు. ఉక్రెయిన్, పోలాండ్లను సందర్శించేందుకు వెళ్లిన బైడెన్ తన పర్యటనను ముగించుకుని అమెరికాకు తిరుగపయనమైన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. విమానం మెట్లు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ బైడెన్ జారిపడడం ఇది మూడోసారి. రష్యా మిలిటరీ ఆపరేషన్ కారణంగా గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్లో ఉద్రిక్త వాతావారణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమై తన మద్దతును తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో బైడెన్ కీవ్లో ఆకస్మికంగా పర్యటించి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. యుద్ధం మొదలైన తర్వాత ఆయన ఉక్రెయిన్లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ముందస్తు సమాచారం ప్రకారం బైడెన్ పోలాండ్లో పర్యటిస్తారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆయన ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ప్రత్యక్షమై అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. బైడెన్ పర్యటన ముందు జనవరిలో యూఎస్ సెనేటర్ల బృందం ఒకటి కీవ్లో పర్యటించిన సంగతి తెలిసిందే. Biden, once again, falls up the stairs on AF1…after the White House Doctor stated that, “Joe Biden remains a healthy, vigorous, 80-year-old male…who’s fit…” pic.twitter.com/IaVq64QF4k — Liz Churchill (@liz_churchill8) February 22, 2023 చదవండి India Buying Russian Oil: భారత్ని నిందించలేం! అది మా పని కాదు! -
ఆ విమానం నేరుగా మావైపే వచ్చింది... వెలుగులోకి కీలక విషయాలు
నేపాల్ విమానం కూలిన విషాద ఘటన గురించి ప్రత్యక్ష సాక్షులు కొన్ని ఆసక్తికర విషయాలు మీడియాకి వివరించారు. ఈ మేరకు ఒక స్థానిక నివాసి కల్పనా సునార్ ఆ విమానం బాంబు లాంటి పేలుడుతో తమ వైపుకు దూసుకురావడాన్ని చూసినట్లు పేర్కొంది. ఆ సమయంలో తాను బట్టలు ఉతుకుతున్నానని చెప్పింది. ఆ విమానం పాత విమానాశ్రయానికి, కొత్త విమానాశ్రయానికి మధ్య ఉన్న సేతి నది వద్ద కుప్పకూలిందని, ఆ నది లోయ చుట్టు నల్లటి దట్టమైన పొగ కమ్మేయడం చూశానని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో విమానం అసాధారణ రీతిలో వంగి ఉండటం చూశానని చెప్పుకొచ్చింది. మరో ప్రత్యక్ష సాక్షి గీతా సునార్ తమ ఇంటికి 12 మీటర్ల దూరంలో విమానం రెక్క పడిందని తెలిపారు. అది మా నివాసాలకు కాస్త దూరంలో పడిందని లేదంటే మా నివాసాలు దగ్ధమయ్యేవని, చాలా నష్టం వాటిల్లేదని చెప్పింది. సేతి నదికి రెండువైపులా మంటలు చెలరేగాయని, మృతదేహాలు చెల్లచెదురుగా పడి ఉన్నాయని చెప్పింది. అలాగే 11 ఏళ్ల పిల్లలు సమీర్, ప్రజ్వల్ తాము ఆసమయంలో ఆడుకుంటుండగా ఏదో బొమ్మ విమానం పడుతున్నట్లుగా కనిపించిందని, ప్రయాణికులు అరుపులు కూడా వినిపించాయని చెప్పారు. కాసేపటికి మా వైపుకి దూసుకురావడంతో భయంతో పారిపోయామని చెప్పారు. ఏదో టైర్ క్రాష్ అయినంత సౌండ్ వినిపించిందని అది మమ్మల్ని తాకినట్లు అనిపించిందని చెప్పుకొచ్చారు. క్రాష్ అయిన కాసేపటికి దగ్గరకు వెళ్దామంటే దట్టమైన పొగ వ్యాపించి ఏమి కనిపించలేదని స్థానికుల చెప్పారు. అయితే విమానంలోని సుమారు ఏడు నుంచి ఎనిమిది విండోలు చెక్కు చెదరకుండా ఉంటే ఎవరైనా సజీవంగా బతికి ఉంటారని భావించామని అన్నారు. మరికొంతమంది ఈ ఘటన జరగుతుండగా భయాందోళనతో ఉన్నామని, తాము చూస్తుండగానే విమానం మిగతా సగం వైపుకి కూడా మంటలు వ్యాపించాయని చెప్పుకొచ్చారు. కాగా, ఈ ఘటనలో సుమారు 68 మంది ప్రయాణికులు చనిపోగా..ఇంకా నలుగురు మృతదేహాల ఆచూకి లభించలేదు. సోమవారం కూడా వారి కోసం నేపాల్ భద్రతా సిబ్బంది గాలించడం పునః ప్రారంభించారు. అలాగే ప్రమాద స్థలం నుంచి బ్లాక్బాక్స్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. (చదవండి: నేపాల్ విమాన ఘటన: కోపైలట్ విషాద గాథ..నాడు భర్తలాగే భార్య కూడా..) -
షాకింగ్.. విమానంలోకి పామును తీసుకెళ్లబోయిన మహిళ.. ఫొటో వైరల్..
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ మహిళ పామును విమానంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఎలాగోలా ఎంట్రెన్స్ గేటు వద్ద తప్పించుకుని విమానాశ్రయంలోకి వెళ్లినప్పటికీ ఎక్స్-రే మెచీన్ వద్ద దొరికిపోయింది. బ్యాగును స్కాన్ చేసిన సెక్యూరిటీ సిబ్బంది లోపల పామును చూసి షాక్ అయ్యారు. ఫ్లోరిడాలోని టాంపా ఎయిర్పోర్టులో ఈ ఘటన జరిగింది. ఈ మహిళ తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది 'బోవా కన్స్ట్రిక్టర్' పామును. ఇది పిల్ల పాము. 4 అడుగులుంది. దీనికి ఎమోషనల్గా దగ్గరయ్యానని, అందుకే పెంచుకునేందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్లు మహిళ చెప్పింది. ఈ పాముకు 'బార్తోలోమ్యూ' అని ముద్దుపేరు కూడా పెట్టుకుంది. బోవా కన్స్ట్రిక్టర్ పాములు చూడటానికి కొండచిలువలా కన్పిస్తాయి. ఇవి 13 అడుగుల వరకు పెరుగుతాయి. ఈ పాము విషపూరితం కానందు వల్ల అమెరికాలో చాలా మంది వీటిని సరదాగా ఇళ్లలోనే పెంపుడు జంతువుల్లా చూసుకుంటారు. చదవండి: విమానంలో మరో ప్రయాణికుడి వీరంగం.. -
విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. అర్థాంతరంగా నిలిపివేత..
పాట్నా: బెంగళూరు నుంచి బిహార్ మీదుగా వెళ్తున్న గోఎయిర్ విమానాన్ని పాట్నా ఎయిర్పోర్టులో పక్షి ఢీకొట్టింది. దీంతో ఫ్లయిట్ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఒక ఇంజిన్ రెక్కలు విరిగిపోవడంతో ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం అర్థాంతరంగా రద్దయింది. ఘటన జరిగినప్పుడు విమానంలో 142 మంది ప్రయాణికులు, ఆరుగరు సిబ్బంది ఉన్నారు. విమానం రద్దు అయినందున ప్యాసెంజర్లు ఢిల్లీకి చేరుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు గోఎయిర్ తెలిపింది. ప్రయాణాన్ని రద్ధు చేసుకున్న వారికి టికెట్ డబ్బులు తిరిగి చెల్లించినట్లు పేర్కొంది. పాట్నా ఎయిర్ పోర్టులో పక్షులు విమానాలను ఢీకొట్టిన ఘటనలు ఇప్పటికే పలుమార్లు జరిగాయి. విమానాశ్రయానికి అతి సమీపంలో మాంసం దుకాణాలు ఉండటంతో పెద్ద పెద్ద పక్షులు ఇక్కడ సంచరిస్తున్నాయి. మాంసం దుకాణాలను వేరే చోటకు తరలించాలని ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. చదవండి: 'అంబానీ, అదానీ రాహుల్ను కొనలేరు.. నా అన్న వారియర్..' -
Viral Video: విమానంని ఆకాశంలోకి లాకెళ్లిన గుర్రాలు
-
Viral Video: బీచ్ లో ల్యాండ్ అయిన విమానం
-
గాల్లో ఎగిరిన కొద్దిసేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్..దెబ్బకు తలకిందులుగా..
ఇద్దరు వ్యక్తులతో వెళ్తున్న సింగిల్ ఇంజిన్ విమానం క్రాష్ అయ్యి కెమెరాకు చిక్కింది. ఈ ఘటన న్యయార్క్లోని లాస్ ఏంజింల్స్లోని శాంటా మోనికా బీచ్లో చోటు చేసుకుంది. ఆ విమానం మోనికా విమానాశ్రయం నుంచి బయలు దేరిన తొమ్మిది నిమిషాలకే అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. అయితే విమానం ఎయర్ పోర్టఖి కొద్ది దూరంలో ఉండటంతో.. బీచ్లోని ఇసుక మీద తలకిందులుగా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వాస్తవానికి పైలెట్ మాలిబుకు వెళ్లాలనుకున్నాడు. ఐతే విమానం పసిఫిక్ పాలిసేడ్స్ సమీపంలో ఇంజన్లో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో పైలెట్ శాంటా మోనికా ఎయిర్పోర్ట్కి తిరిగి రావడానికి ప్రయత్నించాడు. కానీ పీర్ సమీపంలోని బీచ్ వద్ద అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ బీచ్లో ల్యాండ్ చేయడమనేది మీ స్వంత అవగాహనతో చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో పైలెట్కి బీచ్ తీరంలోవిమానాన్ని ల్యాండ్ చేయడం కష్టమై ఒక్కసారిగా తలకిందులైపోయింది. ఈ అనుహ్య ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అధికారులు వారిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి గురించి ఇంకా తెలియాల్సి ఉంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. View this post on Instagram A post shared by Frank Deville (@fthemagician) -
విమానం మోత: న్యూఢిల్లీ టు హైదరాబాద్ రూ.27,302
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ మధ్య విమాన చార్జీలు మోత మోగుతున్నాయి. కొద్ది రోజులుగా పెరిగిన ప్రయాణికుల రద్దీ, భారత రాష్ట్రసమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ వేడుకల కోసం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితర శ్రేణులు పెద్ద ఎత్తున న్యూఢిల్లీకి తరలి వెళ్లడం వంటి పరిణామాల దృష్ట్యా ఒక్కసారిగా చార్జీలు పెరిగాయి. గురువారం న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్కు విస్తారా విమానంలో చార్జీ రూ.26,373 వరకు ఉంది. ఎయిర్ ఏసియాలో రూ.28,841 వరకు పెరిగింది. పైగా చెన్నై, బెంగళూర్ కనెక్టింగ్ ఫ్లైట్లు కావడంతో ప్రయాణ సమయం కూడా ఎక్కువే కావడం గమనార్హం. వారణాసి మీదుగా నగరానికి చేరుకొనే ఇండిగో కనెక్టింగ్ ఫ్లైట్ చార్జీ రూ.22,177 కావడం గమనార్హం. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి భారత రాష్ట్ర సమితి ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివెళ్లినట్లు ఎయిర్పోర్టు వర్గాలు పేర్కొన్నాయి. అనూహ్యంగా డిమాండ్ పెరగడంతో చార్జీలకు రెక్కలొచ్చేశాయి. -
టేకాఫ్ అయిన కొద్ది క్షణంలోనే కుప్పకూలిన విమానం ఆ తర్వాత...
మరణం అంచులదాక వెళ్లి అనూహ్యంగా బయటపెడితే ఎవరికైనా ఏడుపూ ఆనందం ఒకేసారి తన్నుకుంటూ వచ్చేస్తాయి. ఔను! జీవితం మనకు మరో అవకాశం ఇచ్చిందనుకుంటాం. మళ్లీ సమర్ధవంతంగా జీవితాన్ని ఎలా పునర్నిర్మించాలో ఆలోచించుకుంటాం కదా. అచ్చం అలానే ఇక్కడొక జంట చచ్చపోతాం అనుకునేంత భయానక ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. వివరాల్లోకెళ్తే....పెరూ రాజధాని లిమాలోని విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లో రన్వేపై కుప్పకూలిపోయింది. అక్కడే ఉన్న అగ్నిమాపక వాహనాన్ని ఢీకొని మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో సిబ్బంది తోపాటు, దాదాపు 120 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఐతే ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ ఒక జంట వెంటనే సెల్ఫీ తీసుకున్నారు. ఇలాంటి ప్రమాదం తర్వాత కాసేపు భయాందోళనలకు లోనవ్వడం సహజం. కానీ జీవితం మరో అవకాశం ఇచ్చిందన్న ఆనందంతో తాము ఇలా సెల్ఫీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని ఆనందంగా చెబుతున్నారు ఆ దంపతులు. ఈ సెల్ఫీ ఫోటోను ఏ 320 సిస్టమ్స అనే ఫేస్బుక్లో 'సెల్ఫీ ఆఫ్ ద ఇయర్' అనే క్యాప్షన్తో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: లాటరీ తగలడమే శాపమైంది...లవర్తో భార్య జంప్) -
ఛీ! విమానంలో అదేం పని...ఏడాది జైలు శిక్ష
విమానంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్కి చెందిన 72 ఏళ్ల జేమ్స్ హ్యూస్ అనే వ్యక్తి బాలి నుంచి బ్రిస్బేన్కి విమానంలో ప్రయాణిస్తున్నాడు. ఏమైందో ఏమో తెలియదు విమానం బ్రిస్బేన్ ఎయిర్పోర్ట్కి సమీపిస్తున్న సమయంలో సదరు వ్యక్తి సీటులో బహిరంగంగా మూత్ర విసర్జన చేశాడు. దీంతో విమానానికి సుమారు ఆరుగంటల పాటు అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు(ఏఎఫ్పీ) అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడ అతను తన నేరాన్ని అంగీకరించాడు. విచారణలో అతను కొద్దిమొత్తంలో వైన్ సేవించినట్లు తేలిందని బ్రిస్బన్ ఎయిర్పోర్ట్ పోలీస్ కమాండర్ మార్క్ కోల్బ్రాన్ కోర్టుకి తెలిపారు. అంతేగాక అతను ఉద్దేశపూర్వకంగానే అసభ్యంగా ప్రవర్తించాడని, ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఎయిర్పోర్ట్ ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో సహించదని అన్నారు. దీంతో బ్రిస్బేన్ మెజిస్ట్రేట్ కోర్టు అతనిపై క్రమశిక్షణా చర్యలు నిమిత్తం సుమారు 12 నెలలు జైలు శిక్ష విధించింది. అంతగాదు పలువురు ప్రయాణికులు విమానంలో సురక్షితంగా ప్రయాణించాల్సి ఉంది కాబట్టి మద్యం సేవించినప్పుడూ కాస్త బాధ్యతగా వ్యవహరించమని ప్రయాణికులకు ఎయిర్పోర్ట్ బ్రిస్బేన్ ఎయిర్పోర్ట్ విజ్ఞప్తి చేసింది. (చదవండి: గిన్నిస్ రికార్డు...ఒక్క నిమిషంలో 1,140!) -
విమానంలో ఆరు సీట్లను బెడ్గా మార్చారు ఎందుకో తెలుసా!
ప్రపంచంలో అత్యంత పొడుగైనా మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్న రుమేసా గెల్గి తొలిసారిగా ఫ్లైట్ జర్నీ చేసింది. ఆమె పొడుగే శాపంగా మారి ఎక్కడికి ప్రయాణించలేక ఇబ్బంది పడుతుండేది. ఐతే ఆమె బాధను టర్కిష్ ఎయిర్లైన్స్ దూరం చేసింది. ఆమె పొడగు కారణంగా విమానంలో కూర్చొని ప్రయాణించడం అసాధ్యం. అందుకని ఆమె కోసం ఆరు సీట్లను బెడ్గా మార్చి విమానంలో ప్రయాణించే ఏర్పాటు చేసింది. దీంతో ఆమె ఆనందానికి అవధులే లేకుండా పోయింది. గెల్గి ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో ఈ విషయాన్ని పంచుకుంది. ఈ మేరకు గెల్గి విమానంలో టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి యునైటెడ్ స్టేట్స్లోని శాన్ప్రావిన్స్కోకు 13 గంటలు ప్రయాణించింది. ఇది తన చివరి ఫ్లైట్ జర్నీ మాత్రం కాదని నమ్మకంగా చెబుతోంది. తాను సాంకేతిక రంగంలో పనిచేస్తున్నానని, తనలాంటి వారికోసం మరిన్ని అవకాశాలను అన్వేషించేందుకు ఆరు నెలల పాటు యూఎస్లో ఉంటానని చెబుతోంది. విమానంలో ప్రయాణించే అవకాశం ఇచ్చినందుకు టర్కీష్ ఎయిర్ లైన్స్కి ధన్యావాదాలు చెప్పింది. భవిష్యత్తులో ఆమెకు మరింత సహాయ సహకారాలను అందజేస్తామని టర్కీ ఎయిర్లైన్స్ హామి ఇచ్చింది. View this post on Instagram A post shared by RUMEYSA GELGI (@rumeysagelgi) (చదవండి: ట్రెండింగ్లో దూసుకెళ్తున్న వెర్బల్ ఫాస్ట్! అసలు ఈ ఉపవాసం ఎందుకంటే..) -
ఇండిగో విమానంలో మంటలు
-
80 ఏళ్ల వృద్ధులు స్కై డైవింగ్తో... గిన్నిస్ రికార్డు
80 ఏళ్ల వయసులో ఉండే బామ్మ లేదా తాతలు ఎలా ఉంటారో మనందరకీ తెలుసు. పాపం ఆ వయసులో నడవడానకి, తినడానికి కూడా ఇబ్బంది పడతారు. కనీసం ఎక్కడికైనా పంపించాలన్న భయపడతాం. పైగా వారు కూడా కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపేందుకే ఇష్టపడతారు. తాము గడిపని ప్రదేశాల నుంచి వచ్చేందుకు కూడ ఇష్టపడరు. అలాంటిది 80 ఏళ్ల వయసులో ఎనిమిది మంది వృద్ధులు విమానం నుంచి జంప్ చేసే స్కై డైవింగ్ని చేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు. ది జంపర్స్ ఓవర్ ఎయిటీ సోసైటీ (జేంఈఎస్)కి చెందిన ఎనిమిది మంది సభ్యులు జిమ్ కుల్హనే, క్లిఫ్ డేవిస్, స్కాటీ గాలన్, వాల్ట్ గ్రీన్, పాల్ హినెన్, స్కై హుమిన్స్కీ, వుడీ మెక్కే, టెడ్ విలియమ్స్ తదితరులు ఈ రికార్డును సృష్టించారు. వారంతా విమానం నుంచి దూకి ఒక వృత్తాకారంలో స్కై డైవింగ్ చేశారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ స్కైడైవింగ్ హాల్ ఆఫ్ ఫేమ్ సెలబ్రేషన్ కోసం మూడు రోజుల ఈవెంట్లో భాగంగా స్కైడైవ్ డిలాండ్లో నిర్వహించిన స్కైడైవ్లో వారు ఫీట్ని ప్రదర్శించారు. ఈ ఆధునిక స్కై డ్రైవింగ్ క్రీడలో మా బృందం కాలానుగణంగా అభివృద్ధి చెందుతుంది అని తెలిపేలా ఈ ప్రదర్శన ఇచ్చినందుకు తమకు గర్వంగా ఉందని ఆ వృద్ధ సభ్యులు చెబుతున్నారు. (చదవండి: ట్రక్కును ఢీకొట్టిన ఖడ్గమృగం.. వీడియో షేర్ చేసిన సీఎం) -
దోచుకున్న సొమ్ముతో విమానాల కొనుగోలు: ఆర్ఎస్ ప్రవీణ్
మర్రిగూడ: ఎంతో మంది త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో నేడు కేసీఆర్ కుటుంబపాలన కొనసాగుతోందని, దోచుకున్న సొమ్ముతో విమానాలు కొంటున్నారంటే పాలన ఏవిధంగా ఉందో అర్ధమవుతుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. ఆయన శుక్రవారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో బహుజన రాజ్యాధికార యాత్ర నిర్వహించారు. ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. గ్రామాల్లో వన భోజనాలు, బతుకమ్మ చీరలతో మాయమాటలు చెబుతూ మత్తులో ముంచడం టీఆర్ఎస్ పార్టీకే చెల్లుతుందన్నారు. ఫార్మా కంపెనీలు, రీజినల్ రింగురోడ్ల పేర్లతో బడుగు, బలహీనవర్గాల భూములను లాక్కొంటున్నారని, అగ్రవర్ణాల వారి భూములను అలాగే ఉంచుతున్నారని ఆరోపించారు. చదవండి: సాగరహారంపై ‘పిట్ట పోరు’.. కేటీఆర్–రేవంత్ల మాటల యుద్ధం -
ఎవని పాలయ్యిందిరో తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: ‘ఎవని పాలయ్యిందిరో తెలంగాణ’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు. జాతీయ పార్టీ అవసరాల కోసం కేసీఆర్ సొంత విమానాన్ని కొనుగోలు చేస్తున్నారని పత్రికల్లో వచ్చిన కథనాలను ఉటంకిస్తూ ఆయన తన ట్విట్టర్ లో ఈ వ్యాఖ్యను పోస్టు చేశారు. ‘అమరవీరుల కుటుంబాలను కలిసింది లేదు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఏనాడూ పరామర్శించ లేదు. ప్రగతి భవన్ ఏసీ గదిని వీడింది లేదు. ఫాంహౌస్ దాటింది లేదు. దేశదిమ్మరిలా తిరగడానికి విమానం కొంటున్నాడట. ఎవని పాలయ్యిందిరో తెలంగాణ’ అంటూ శుక్రవారం ట్వీట్లో రేవంత్ ఎద్దేవా చేశారు. చదవండి: సాగరహారంపై ‘పిట్ట పోరు’.. కేటీఆర్–రేవంత్ల మాటల యుద్ధం -
స్పైస్జెట్ విమానంలో సమస్య: మధ్యలోనే వెనక్కి
న్యూఢిల్లీ: బడ్జెట్ ఎయిర్లైన్ స్పైస్జెట్కు చెందిన విమానంలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. ఢిల్లీ-నాసిక్ విమానం 'ఆటోపైలట్' సమస్య కారణంగా మధ్యలోనే వెనక్కి మళ్లించాల్సి వచ్చింది. బోయింగ్ 737 స్పైస్జెట్ విమానంలో గురువారం ఉదయం సమస్య ఏర్పడింది. వెంటనే స్పందించిన సిబ్బంది విమానాన్ని తిరిగి సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ అంశాన్ని డీజీసీఏ పరిశీలిస్తోంది. ఢిల్లీ ఇందిరాగాంధీఅంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మహారాష్ట్రలోని నాసిక్కు బయలుదేరిన స్పైస్జెట్ విమానం 'ఆటోపైలట్' సమస్య కారణంగా నగరానికి మధ్యలో తిరిగి వచ్చిందని డీజీసీఏ అధికారి తెలిపారు. కాగా అధిక ఇంధన ధరలు,రూపాయి క్షీణత మధ్య ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న స్పైస్జెట్ విమానాలు ఇబ్బందుల్లో పడిన ఘటనలు గతంలో కూడా వరుసగా చోటు చేసుకన్నాయి. దీంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విమానయాన సంస్థకు షో-కాజ్ నోటీసు జారీచేయడం, ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ ఎనిమిది వారాల పాటు గరిష్టంగా 50శాతం విమానాలను మాత్రమే రన్ చేయాలని జూలై 27న ఆదేశించిన సంగతి తెలిసిందే. -
ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ విమానం.. మొదటిసారిగా ఆ నగరానికి!
సాక్షి, బెంగళూరు: అతిపెద్ద ప్రయాణికుల విమానం ఎమిరేట్స్ ఎయిర్బస్–ఏ380 బెంగళూరుకు నేరుగా సేవలను అందించనుంది. అక్టోబర్ 30న దుబాయ్ నుంచి వచ్చి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగనుంది. 2014 నుంచి ముంబైకి సర్వీసులను అందిస్తోంది. 72.75 మీటర్ల పొడవు, 24.45 మీటర్ల ఎత్తు కలిగిన ఈ విమానంలో గరిష్టంగా 853 మంది ప్రయాణించవచ్చు. ఒకసారి 3 వేల సూట్కేసులను తరలించే సామర్థ్యం ఈ విమానానికి ఉంది. అక్టోబర్ 30 నుంచి ప్రతి రోజూ బెంగళూరు నుంచి దుబాయ్కి విమానం రాకపోకలు సాగిస్తుందని ఎమిరేట్స్ సంస్థ వెల్లడించింది. ఈ విమానంలో మూడు తరగతుల (ఎకానమీ, బిజినెస్, ఫస్ట్క్లాస్) ప్రయాణికులు ప్రయాణం చేయవచ్చు. బోయింగ్–777తో పోలిస్తే 45 శాతం అధిక మంది ప్రయాణించవచ్చు. ప్రపంచంలోని 30 విమానాశ్రయాలకు ఎయిర్బస్–ఏ380 తన సేవలను అందిస్తుంది. చదవండి: Wipro Salary Hikes: విప్రో ఉద్యోగులకు శుభవార్త! -
ఒకే విమానంలో కో పైలెట్లుగా తల్లి కూతుళ్లు: వీడియో వైరల్
పిల్లలు పెద్దవాళ్లను ఆదర్శంగా తీసుకుని వాళ్లలా ఉన్నతోద్యోగం సంపాదించాలనుకుంటారు. డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్ల పిల్లలు వాళ్లాలాగే సేమ్ ప్రోఫెషిన్ని ఎంచుకోవడం అత్యంత అరుదు. కానీ ఇక్కడొక కూతురు తన తల్లి చేసే వృత్తిని ఎంచుకోవడమే ఇద్దరు ఒకేచోట తమ వృత్తిని కొనసాగించడం కూడా అరుదే. వివరాల్లోకెళ్తే...ఇక్కడొక కూతురు తన తల్లిలా పైలెట్ అయ్యింది. పైగా తల్లికూతుళ్లు ఇద్దరు కో పైలెట్లుగా విమానాన్ని నడిపారు. ఇలా జరగడం అత్యంత అరుదు. ఈ మేరకు సౌత్వెస్ట ఎయిర్లైన్స్ తన ఇన్స్టాగ్రాం పేజీలో ఈ వీడియోని పోస్ట్ చేస్తూ తొలిసారిగా తల్లి కూతుళ్ల ద్వయం పైలెట్లుగా విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించారని పేర్కొంది. అంతేకాదు నీవు నీ సొంత కాళ్లపై నిలబడటమే కాకుండా తల్లితో కలిసి విమానాన్ని ప్రయాణాన్ని పూర్తి చేసినందుకు అబినందనలు అని సదరు మహిళకి తెలిపింది. ఈ మేరకు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Southwest Airlines (@southwestair) (చదవండి: నడిరోడ్డు పై అనూహ్య ఘటన....ఒక్కసారిగా ఆగిపోయిన వాహనాలు: వీడియో వైరల్) -
ఎమర్జెన్సీ ల్యాండింగ్ టైంలో అనూహ్య ఘటన!... దూకేశాడా? పడిపోయాడా!
న్యూయార్క్: యూఎస్లోని నార్త్ కరోలినాలో ఒక విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. విమానం అత్యవసర ల్యాండింగ్ సమయంలో కో పైలెట్ కిందపడి మృతి చెందాడు. ఐతే అతను విమానం అత్యవసర ల్యాండింగ్ టైంలో దూకేశాడా? లేక ప్రమాదవశాత్తు పడిపోయాడా అనేది తెలియరాలేదు. ఒకవేళ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో పారాచూట్ లేకుండా ఎలా దూకేశాడు అంటూ అధికారులు పలు అనుమానాలు లేవనెత్తారు. మృతి చెందిన సదరు కోపైలెట్ 23 ఏళ్ల చార్లెస్ హ్యూ క్రూక్స్గా గుర్తించారు అధికారులు. అతడి మృతదేహం విమానాశ్రయానికి దక్షిణంగా సుమారు 48 కిలోమీటర్లు దూరంలో లభించిందని అధికారులు తెలిపారు. అంతేకాదు విమానంలో మరో పైలెట్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ, నేషనల్ సేఫ్టి బోర్డు ఈ ఘటనకు గల కారణాల గురించి దర్యాప్తు చేస్తున్నాయి. అంతేకాదు ఈ ప్రమాదానికి ముందు విమానం కుడివైపు ఉన్న చక్రం కోల్పోవడంతో పైలెట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సాయం కోరినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: సముద్రంలో తెల్లటి చుక్కల్లా....జెల్లీ ఫిష్ సముహం) -
ఫ్యామిలీ కోసం సొంతంగా విమానం తయారు చేశాడు!
కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ సమయం ఎంతో భారంగా గడిచింది. కొంత మంది మాత్రం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని రకరకాల వ్యాపకాలతో తమ సృజనకు పదునుపెట్టుకున్నారు. కేరళకు చెందిన ఎన్నారై అశోక్ అలిసెరిల్ తమరాక్షన్ అయితే ఏకంగా చిన్నపాటి విమానాన్నే తయారు చేశాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. తాను సొంతంగా తయారు చేసిన ఫోర్ సీటర్ విమానంలో కుటుంబంతో కలిసి యూరప్ యాత్ర చేస్తున్నాడు అశోక్. కేరళలోని అలప్పుజా ప్రాంతానికి చెందిన ఆయన లండన్లో స్థిరపడ్డాడు. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి 2006 యూకే వచ్చిన అశోక్ ప్రస్తుతం ఫోర్డ్ మోటార్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 18 నెలలు శ్రమించి.. కరోనా సమయంలో విధించిన లాక్డౌన్ విధించడంతో విమాన తయారీకి ఉపక్రమించాడు. దాదాపు 18 నెలలు శ్రమించి ‘స్లింగ్ టీఎస్ఐ’ మోడల్లో చిన్న విమానాన్ని తయారు చేశాడు. తన చిన్న కూతురు దియా పేరు కలిసొచ్చేలా విమానానికి ‘జి-దియా’ అని నామకరణం చేశాడని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వెల్లడించింది. కేరళ మాజీ ఎమ్మెల్యే ఏవీ తమరాక్షన్ కుమారుడైన అశోక్కు పైలట్ లైసెన్స్ కూడా ఉంది. దీంతో కుటుంబంతో కలిసి తన విమానంలో ఇప్పటివరకు జర్మనీ, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్ దేశాలను చుట్టేసి వచ్చాడు. విమానాన్ని ఎలా తయారు చేశానంటే.. ‘2018లో పైలట్ లైసెన్స్ పొందిన తర్వాత ప్రయాణాల కోసం రెండు సీట్ల విమానాలను అద్దెకు తీసుకునేవాడిని. నా ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకెళ్లడానికి నాలుగు సీట్ల విమానం అవసరం. కానీ అవి చాలా అరుదుగా దొరుకుతాయి. జోహన్నెస్బర్గ్(దక్షిణాఫ్రికా)కు చెందిన స్లింగ్ ఎయిర్క్రాఫ్ట్ కంపెనీ 2018లో టీఎస్ఐ మోడల్ విమానాన్ని తయారు చేయనున్నట్టు ప్రకటించింది. దీంతో ఒకసారి నేను స్లింగ్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్యాక్టరీని కూడా సందర్శించాను. ఆ తర్వాత నా సొంత విమాన తయారీకి అవసరమైన వస్తువులను ఆర్డర్పై అక్కడి నుంచి తెప్పించాను. లాక్డౌన్తో సమయం దొరకడంతో విమాన తయారీపై దృష్టి పెట్టాన’ని అశోక్ వివరించాడు. విమాన తయారీకి దాదాపు రూ.1.8 కోట్లు వెచ్చించినట్టు తెలుస్తోంది. కలల విమానంలో గగన విహారంతో వార్తల్లోకి ఎక్కారు అశోక్ అలిసెరిల్ తమరాక్షన్. అతడిని గురించి విన్నవారంతా ‘సూపర్’ అంటూ మెచ్చుకుంటున్నారు. (క్లిక్: స్పైస్జెట్కు షాక్.. ఆంక్షలు విధించిన డీజీసీఏ) -
విమానంలోంచి గుట్టలు గుట్టలుగా చేపలు...వీడియో వైరల్
ఇంతవరకు ఎన్నో రకాల వైరల్ వీడియోలు చూశాం. వాటిని చూసి అబ్బురపడ్డాం. కానీ వాటన్నింటికంటే భిన్నమైన వైరల్ వీడియో ఇది. ఈ వీడియో చూస్తే ఇది నిజమేనా! అనిపిస్తుంది. కళ్లముందు సాక్ష్యంగా వైరల్ వీడియో కనిసిస్తున్న నమ్మశక్యంగా అనిపించదు. ఇంతకీ ఏంటా వీడియో? ఏముందంటే... వివరాల్లోకెళ్తే....సరస్సుల పునరుద్ధరణలో భాగంగా ఓ విమానం చేపలను సరస్సులో పడేస్తోంది. చిన్న చిన్న చేపలను నీటితో సహా ఒక్కసారిగా నీటిలో చల్లుకుంటూ వెళ్తోంది. ఇలా చేపలు లేని సరస్సుల్లో వేస్తుంటారు. ఈ ఘటన వాసచ్ పర్వత ప్రాంతంలోని సిల్వర్ లేక్ ఫ్లాట్ రిజర్యాయర్లో చోటు చేసుకుంది. ఇలా వైమానిక పద్ధతిలో చేపలను సరస్సులో వదలడం 1956 నుంచి మొదలైంది. ఇది అక్కడ స్థానిక సరస్సులోని చేపలను ఏ మాత్రం ప్రభావితం చేయదని అంటున్నారు అధికారులు. ఇలా ఎక్కువగా చేపల పునరుత్పత్తి లేని సరస్సులోనే చేస్తామని వివరించారు. అంతేకాదండోయ్! 1950 దశకానికి ముందు దూర ప్రాంతాలకు చేపలను తరలించాలంటే గుర్రం పాలను సేకరించి వాటిలో వేసి తీసుకువెళ్లేవారంట. ఐతే ఇలా వైమానిక పద్ధతిలో చేపలను తరలించడం కొంచెం ఖర్చుతో కూడిన పని అయినప్పటికీ చాలా త్వరిత గతిన అయిపోతుందంటున్నారు అధికారులు. ఈ వీడియోని ఉటా డివిజన్కి చెందిన వైల్డ్ లైఫ్ రీసోర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. (చదవండి: విమానాశ్రయంలో ఏకంగా 109 జంతువులు కలకలం...షాక్లో అధికారులు) -
ఐఆర్సీటీసీ ప్రత్యేక విమాన ప్యాకేజీలు
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): పర్యాటకుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) విశాఖపట్నం నుంచి రెండు ప్రత్యేక ఫ్లైట్ టూర్ ప్యాకేజీలను ప్రారంభించింది. ఈ మేరకు ఐఆర్సీటీసీ, సౌత్ సెంట్రల్ జోన్ ఏరియా ఆఫీసర్ చంద్రమోహన్ బిసా మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కాశ్మీర్హెవెన్ ఆన్ ఎర్త్ యాత్ర (3రాత్రులు, 4పగళ్లు) సాగే యాత్ర జూలై 29వ తేదీన విశాఖపట్నంలో ప్రారంభమై, ఆగష్టు 1వ తేదీన విశాఖపట్నంలోనే ముగుస్తుంది. మెస్మరైజింగ్ కేరళ (5రాత్రులు, 6పగళ్లు) ఉండే యాత్ర ఆగష్టు 10వ తేదీన విశాఖపట్నంలో ప్రారంభమై ఆగష్టు 15వ తేదీన విశాఖపట్నంలోనే ముగుస్తుంది. ఇండిగో ఎయిర్లైన్, ఎకానమి క్లాస్లో విమాన ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు. వివరాలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద గల ఐఆర్సీటీసీ కార్యాలయంలో గానీ, 0891–2500695, చందన్కుమార్– 82879 32318, గణనాథ్ 82879 32281నంబర్లలో సంప్రదించాలని చంద్రమోహన్ తెలిపారు. -
అన్నంత పని చేసిన అమెరికా! కస్సు మంటున్న చైనా
తైవాన్ జలసంధి గుండా ఇటీవల యూఎస్ మారిటైమ్ విమానం పయనించడంతో చైనా అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. అదీగాక తైవాన్ విషయంలో జోక్యం చేసుకోవద్దని ఇటీవలే అమెరికాకి గట్టి వార్నింగ్ ఇచ్చింది. పైగా ఇరు ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతం ఏర్పడుతుందని హెచ్చరించింది కూడా. మరోవైపు తైవాన్ తమ ద్వీప సమీపంలోనే చైనా వైమానిక దళాలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయంటూ పదే పదే ఫిర్యాదులు చేసింది. దీంతో యూఎస్ కూడా తైవాన్ని ఇబ్బంది పెట్టవద్దని చైనాకి సూచించింది. తైవాన్ పట్ల ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఊరుకోనని... తైవాన్కి పూర్తి మద్దతు ఇవ్వడమే కాకుండా మిలటరీ సాయాన్ని కూడా అందిస్తానని యూఎస్ తెగేసి చెపింది. ఈ మేరకు యూఎస్ తాను అన్నట్లుగానే మాటనిలబెట్టుకోవడమే గాక అన్నంత పనిచేసేసింది. దీంతో చైనా తీవ్రస్థాయిలో యూఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుందటూ కన్నెర్ర జేసింది. శాంతికి భంగం కలిగించే చర్యలకు దిగుతుందంటూ అమెరికా పై ఆరోపణలు చేసింది చైనా . యూఎస్ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని నొక్కి చెప్పింది. అంతేకాదు యూఎస్ ఎయిర్క్రాఫ్ట్ ఆపరేషన్ను పర్యవేక్షించడానికి తమ సైన్యం సదా అప్రమత్తంగానే ఉందని చైనా స్పష్టం చేసింది. ఈ మేరకు భూ, వాయు మార్గాల్లో చైనా దళాలు అప్రమత్తంగా ఉన్నాయని, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కమాండ్ ప్రతినిధి కల్నల్ షియి తెలిపారు. తైవాన్ని తన భూభాగంగానే భావిస్తున్న చైనాకి అమెరికా ఈ వ్యవహరంలో తలదూర్చడం మింగుడు పడని అంశంగా మారింది. ఐతే ఈ వ్యాఖ్యలపై అమెరికా నావికదళం ఇంకా స్పందించలేదు. (చదవండి: చైనాని శత్రువుగా చిత్రీకరించవద్దు! అమెరికా చారిత్రక తప్పిదం) -
Sakshi Cartoon: బైడెన్ నివాసం పైకి దూసుకొచ్చిన విమానం
-
జో బైడెన్ ఇంటి వద్ద విమాన కలకలం.. వైట్ హౌస్ అలర్ట్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నివాసం వద్ద ఓ విమానం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై వైట్ హౌస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఒక చిన్న విమానం అమెరికా అధ్యక్షుడికి చెందిన రెహోబోత్ బీచ్ హోమ్ ప్రాంతం(వాషింగ్టన్కు 200 కి.మీ దూరం) గగనతలంలోకి ప్రవేశించింది. నో-ఫ్లై జోన్లోకి విమానం రావడంతో ఒక్కసారిగా భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. దీంతో, ముందు జాగ్రత్త చర్యగా అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, ప్రథమ పౌరురాలు జిల్ బైడెన్ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు తెలిపారు. అయితే, ప్రెసిడెంట్ను రక్షించే బాధ్యతను స్వీకరించిన సీక్రెట్ సర్వీస్ విమానం.. పొరపాటున సురక్షిత ప్రాంతంలోకి ప్రవేశించిందని చెప్పారు. సమాచారం అందించిన వెంటనే విమానం బయటకు వెళ్లినట్టు స్పష్టం చేశారు. కాగా, ప్రెసిడెంట్, ఆయన కుటుంబానికి ఎలాంటి ముప్పులేదని, ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని సర్వీస్ ప్రతినిధి ఆంథోనీ గుగ్లియెల్మీ చెప్పారు. President Biden and the First Lady were evacuated from their beach home in Rehoboth Beach, after a private plane entered restricted airspace, a White House official told pooler @DJJudd Officers shut down one side of the street downtown while Biden was in secure location pic.twitter.com/r4jbs4RyYb — Jasmine Wright (@JasJWright) June 4, 2022 -
కాగితపు రాకెట్తో గిన్నిస్ రికార్డు! వీడియో వైరల్
కాగితపు రాకెట్లు గురించి అందరికి తెలిసే ఉంటుంది. మనందరం చిన్నప్పుడు సరదాగా ఒకరిపై ఒకరు వేసుకునే పేపర్ రాకెట్లు. క్లాస్లో ఉన్నప్పుడూ లేదా ఎప్పుడైన సరదాగా మన స్నేహితుల్ని ఆటపట్టించేందుకు రాకెట్లు చేసి వేస్తుండే వాళ్లం. ఆ కాగితపు రాకెట్ల గురించి అంతవరకే మనకు తెలుసు. కానీ కొంత మది వాటితో ఏకంగా గిన్నిస్ రికార్డులు సృష్టిస్తున్నారు. ఎలాగో తెలుసా! వివరాల్లోకెళ్తే...చిన్నప్పుడూ ఈ పేపర్ రాకెట్లు తయారు చేసి నాదే బాగా ఎత్తుకు వెళ్లింది అంటూ తెగ సంబరపడి పోయే వాళ్లం ఔనా!. ఆ రాకెట్ మంచి ఎత్తుకు బాగా ఎగిరేతే ఎంచక్కా గిన్నిస్ రికార్డులోకి ఎక్కేయొచ్చు. ఈ మేరకు దక్షిణ కొరియాకు చెందిన కిమ్ క్యు టే విసిరిన పేపర్ రాకెట్ సుమారు 77.134 మీ(252 అడుగుల 7 అంగుళాలు) దూరం ప్రయాణించింది. ఇంతక మునుపు 2012లో అమెరికన్ క్వార్టర్బ్యాక్ జో అయోబ్, ఎయిర్ప్లేన్ డిజైనర్ జాన్ ఎమ్. కాలిన్స్ పేరిట ఉన్న రికార్డును కిమ్ బద్దలు గొట్టాడు. ఐతే జో అయోబ్, కాలిన్స్ విసిరిన రాకెట్ సుమారు 69.14 మీ (226 అడుగుల 10 అంగుళాలు) దూరం ప్రయాణించి రికార్డును సృష్టించారు. కానీ కిమ్ ఆ రికార్డును చేధించి మరి సరికొత్త రికార్డును తిరగ రాశాడు. ఈ మేరకు కిమ్ తన స్నేహితులు షిన్ మూ జూన్, చీ యీ జియాన్ మద్దతుతో ఈ రికార్డుని సృష్టించగలిగానని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఈ ఘటనక సంబంధించిన వీడియోని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తన అధికారిక ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) (చదవండి: పెళ్లి మండపంలోనే పెళ్లి వద్దని తెగేసి చెప్పిన వధువు... స్పృహ తప్పి పడిపోయిన వరుడు) -
చావు నుంచి త్రుటిలో తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్
ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రెవిస్ హెడ్, అతని భార్య జెస్సికా డేవిస్ తృటిలో చావు నుంచి తప్పించుకున్నారు. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో చావు అంచుల దాకా వెళ్లి వచ్చారు. కాగా ట్రెవిస్ హెడ్ భార్య ఆరు నెలల గర్భవతి. హాలిడే వెకేషన్ను ఎంజాయ్ చేయడానికి ట్రెవిస్ హెడ్.. జెస్సీకా డేవిస్తో కలిసి మాల్దీవ్స్ వెళ్లాడు. అక్కడ సరదాగా గడిపిన వీరిద్దరు ఆదివారం ఆస్ట్రేలియాకు తిరుగుపయనమయ్యారు. ఇంకో 45 నిమిషాల్లో గమనం చేరుకుంటుదన్న దశలో ఫ్లైట్లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో పైలెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని భావించాడు. అయితే మొదటి ప్రయత్నంలో ఫ్లైట్ను ల్యాండింగ్ చేయడంలో విఫలమయ్యాడు. రెండో ప్రయత్నంలో ల్యాండింగ్ చేసినప్పటికీ స్లిడ్ అయిన ఫ్లైట్ పక్కనున్న పొదల్లోకి వెళ్లిపోయింది. అయితే పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని ట్రెవిస్ హెడ్ భార్య జెస్సీకా డేవిస్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ''హాలిడే వెకేషన్ను సరదాగా గడిపాం. ఆస్ట్రేలియాకు తిరుగపయనమవ్వడానికి మాల్దీవ్స్లో ఫ్లైట్ ఎక్కాం. గంట ప్రయాణంలో 30 నిమిషాలు పూర్తైన తర్వాత సాంకేతిక లోపం తలెత్తింది. దేవుని దయవల్ల మాకు ఏం కాలేదు. నా బిడ్డ ఈ లోకాన్ని చూడకుండానే చనిపోతానేమోనని అనిపించింది. ఆ తర్వాత నాలుగు గంటల పాటు రెస్క్యూ ప్లేన్ కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత మాల్దీవ్స్ రాజధాని మాలీలో మాకు వసతి ఏర్పాటు చేసి మరో ఫ్లైట్లో ఆస్ట్రేలియాకు తీసుకొచ్చారు.'' అని చెప్పుకొచ్చింది. ఇక ట్రెవిస్ హెడ్ ఆస్ట్రేలియా తరపున 2016లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆసీస్ తరపున 26 టెస్టులు, 45 వన్డేలు, 17 టి20 మ్యాచ్లు ఆడాడు. చదవండి: Yuvraj SIngh: కొందరు పగబట్టారు.. అందుకే టీమిండియా కెప్టెన్ కాలేకపోయా! -
విమాన టికెట్ ధరలకు రెక్కలు
గన్నవరం: కోవిడ్ పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగింది. ఇందుకు తగ్గట్లుగా దేశీయ విమాన సర్వీసులు పెరగకపోవడంతో టికెట్ ధరలకు రెక్కలొచ్చాయి. హైదరాబాద్, బెంగళూరు విమాన చార్జీలయితే విపరీతంగా పెరిగిపోయాయి. 2020 ఫిబ్రవరి వరకు దేశంలోని వివిధ నగరాల నుంచి విజయవాడ విమానాశ్రయానికి రోజుకు 36 రూట్లలో 72 సర్వీసులు తిరిగేవి. సుమారుగా 3,600 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేవారు. కోవిడ్ పరిస్థితులతో రోజువారీ సర్వీసుల సంఖ్య 32కు, ప్రయాణికుల సంఖ్య 2,200కు పడిపోయింది. సెకండ్ వేవ్ సమయంలో ప్రయాణికుల్లేక స్పైస్జెట్, ట్రూజెట్ సంస్థలు తమ సర్వీసులను పూర్తిగా రద్దు చేసుకున్నాయి. ఎయిరిండియా, ఇండిగో సంస్థలు మాత్రమే ఇక్కడికి సర్వీసులు నడుపుతున్నాయి. ఎయిరిండియా సంస్థ న్యూఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు నుంచి రోజుకు 6 నుంచి 8 సర్వీసులు తిప్పుతోంది. మిగిలిన 24 సర్వీసులూ ఇండిగో సంస్థే నడుపుతోంది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు సర్వీసులకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ రూట్లలో ఇండిగో ప్రతిరోజూ విజయవాడ–బెంగళూరు మధ్య 8, విజయవాడ–హైదరాబాద్ మధ్య మరో 8 సర్వీసులు నడుపుతోంది. ఈ రూట్లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని ఆ సంస్థ సొమ్ము చేసుకుంటోంది. దీంతో ఈ రూట్లలో ప్రయాణం చేయాలంటే టికెట్కు రూ.10 వేల వరకు చెల్లించాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ రూట్లలో ఇతర ఎయిర్లైన్స్ సర్వీసులు పెద్దగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి అని వారు పేర్కొంటున్నారు. దీనిపై ఎంపీ బాలశౌరి స్పందిస్తూ.. ఈ రూట్లలో ఇతర ఎయిర్లైన్స్ సంస్థలు కూడా సర్వీసులు నడిపే విధంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తానని చెప్పారు. సంప్రదింపులు జరుపుతున్నాం.. పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా విమాన సర్వీసులు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ఇతర ఎయిర్లైన్స్ సంస్థలతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం. – పీవీ రామారావు, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ -
మ్రియాను మించి.. ఆకాశాన ఏతెంచి...
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రపంచంలోనే అతి పెద్ద కార్గో విమానం ధ్వంసమైంది. సోమవారం ఉక్రెయిన్పై రష్యా జరిపిన దాడుల్లో ఆంటోనోవ్ ఏఎన్–225 మ్రియా విమానం ధ్వంసమైంది. అయితే అంతకన్నా పెద్ద విమానం స్ట్రాటో లాంచ్ ఇటీవల అమెరికాలో నింగిలోకి ఎగిరింది. ఆ విమానం ఎలా ఉంటుంది.. అది ఎక్కడ, ఎంత ఎత్తుకు ఎగిరింది. దాన్ని ఎవరు రూపొందించారు. అనే ఆసక్తికర విషయాలేంటో చూద్దాం! –సాక్షి, సెంట్రల్ డెస్క్ స్ట్రాటోలాంచ్ అనే బాహుబలి విమానాన్ని ఇటీవల అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో విజయవంతంగా పరీక్షించారు. మోజవ్ ఎయిర్ స్పేస్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఈ విమానం గంటా 43 నిమిషాలపాటు గగనతలంలో చక్కర్లుకొట్టింది. గరిష్టమైన 15వేల అడుగుల ఎత్తుకు వెళ్లి విన్యాసాలు చేసింది. దీన్ని ఇప్పటిదాకా మూడుసార్లు పరీక్షించగా, తాజాగా నాలుగోసారి కాలిఫోర్నియాలో పరీక్షించారు. దీని రెక్కల పొడవు 383 అడుగులు (117 మీటర్లు). సాధారణంగా ఫుట్బాల్ స్టేడియం 345 అడుగుల వెడల్పుతో ఉంటే ఇది అంతకన్నా పెద్దగా ఉంటుంది. 50 అడుగుల ఎత్తుతో ఉండే ఈ విమానంలో బోయింగ్ 747లో ఉన్నటువంటి ఇంజిన్ ఉంటుంది. ఇది 2,26,796 కిలోల పేలోడ్ను మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంటుంది. రెండు విమానాలను కలిపితే ఎలా ఉంటుందో చూడ్డానికి ఇది అలానే ఉంటుంది. ఆపరేషనల్ స్థాయికి సమీపించినట్లే... స్ట్రాటోలాంచ్ను నాలుగోసారి ప్రయోగించినప్పుడు మొదటిసారి విమానంలోని అన్ని ల్యాండింగ్ గేర్లను ఉపసంహరించుకోవాలని భావించారు. అయితే ఒక గంట తర్వాత విమానంలో వైబ్రేషన్ సమస్యతోపాటు వార్నింగ్లైట్ రావడంతో అనుకున్న సమయానికంటే ముందుగానే వెనుదిరిగింది. దీంతో మోజవ్ ఎయిర్పోర్ట్లో విజయవంతంగా ల్యాండ్ అయింది. విమానంలో ఇద్దరు పైలట్లతోపాటు ఒక ఫ్లైట్ ఇంజనీర్ ఉన్నారు. విమానం ఫుల్ ల్యాండింగ్ గేర్ ఉపసంహరణ స్థాయి వరకు వచ్చిందంటే ఇది ఆపరేషనల్ స్థాయికి సమీపించినట్టేనని, మొత్తమ్మీద ఇది విజయవంతమైందని స్ట్రాటోలాంచ్ అధ్యక్షుడు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ జకరీ క్రెవోర్ చెప్పారు. 2017 మేలో దీన్ని తొలిసారి పరీక్షించారు. వచ్చే ఏడాది మధ్యనాటికల్లా... మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు పాల్ అలెన్కు చెందిన సంస్థ దీన్ని రూపొందించింది. 2023 మధ్యనాటికల్లా దీన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ హైపర్సోనిక్ విమానం అనేక సంప్రదాయ రక్షణ వ్యవ స్థలను సమర్థంగా ఎదుర్కోవడంతోపాటు వేగం గా ఆయుధాలను చేరవేయగలదు. 2011లో చేపట్టిన ఈ ప్రాజెక్టు వ్యయాన్ని తొలుత రూ.2,250 కోట్లుగా భావించగా, 2019 నాటికి 3 వేల కోట్లకు చేరిందని అంచనా. ఈ విమానం అంతరిక్ష ప్రయోగాలకు అవసరమైన ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లగలదు. తన రెక్కల ద్వారా ఒకేసారి 3 శాటిలైట్ రాకెట్లను తీసుకెళ్లే లక్ష్యంతో దీన్ని చేపట్టారు. -
విమానంలో వృద్దుడిపై మహిళ అమానుష దాడి
ఇటీవల కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది మాస్క్ ధరించకుండా బయటకు వస్తే ఊరుకోవడం లేదు. ఆఖరికి తమ స్నేహితులను, బంధువులను సైతం మాస్క్ ధరించకపోతే ఊరుకోవటం లేదు. ఎవరికివారుగా స్వచ్ఛందంగా ఇలా సురకక్షితంగా ఉండటం మంచిదే గానీ అది సృతి మించితే ఇతరులకు, మన తోటివారికి కూడా ఇబ్బందే. అచ్చం అలానే ఒక మహిళ తింటున్నప్పుడూ మాస్ ఎందుకు ధరించవంటూ ఒక వృద్దుడిపై దాడి చేసింది. (చదవండి: నా భార్య, బిడ్డను వెతికి తీసుకువచ్చిన వారికి రూ.5000 బహుమతి!!) అసలు విషయంలోకెళ్లితే...డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ మాస్క్ ధరించకుండా భోజనం చేస్తున్న వృద్దుడిపై దాడి చేసింది. పైగా చాలా అమానుషంగా తిట్టడం వంటివి చేసింది. అయితే నిజానికి ఆమె మాస్క్ ధరించకుండా వృద్దుడుని తిట్టడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది అక్కడ ఉన్నవాళ్లందరికీ. పైగా వాళ్లంతా కూర్చొమని వారిస్తున్న వినకుండా ఆ వృద్దుడిని కొడుతుంది. దీంతో ఆ విమాన సిబ్బంది ఆమెను అడ్డుకుని అక్కడ నుంచి తీసుకువెళ్తారు. ఆ తర్వాత ఆ వృద్దుడు ఆమెను నువ్వు జైలుకు వెళ్తావు అంటాడు. ఈమేరకు ఆ విమానం అట్లాంటాలో ల్యాండ్ అయిన వెంటనే అక్కడి పోలీసులు ఆ వృద్దుడిపై దాడి చేసిన మహిళ ప్యాట్రిసియా కార్న్వాల్గా గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే ఈ సంఘటన తర్వాత విమానయాన సంస్థలు ఇలాంటి వికృత ప్రవర్తనను సహించేది లేదని ప్రకటించడం విశేషం. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: మమ్మీలను తాకకుండానే పుట్టు పూర్వోత్తరాలు..!) -
పక్షిలా ఎగిరే విమానం!... ఎలాగో తెలుసా!!:
ఫొటోలు చూశారుగా.. ఆకారంతోపాటు ఎగిరే క్రమంలోనూ పక్షిని పోలిన వినూత్నమైన ఎగిరే కారు ఇది. ఆఫ్రికాకు చెందిన ఫ్రాక్టిల్ అనే సంస్థ దీన్ని డిజైన్ చేసింది. నిట్టనిలువుగా పైకి ఎగిరే ఇలాంటి కార్ల కోసం చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నా అలాంటివి వాస్తవ రూపం దాల్చింది తక్కువే. వీటిని వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (వీటీఓఎల్) వాహనాలంటారు. (చదవండి: డొమినో ఎఫెక్ట్ గురించి ఆందోళన చెందడం లేదు!!) అయితే వీటీఓఎల్ను ఫ్రాక్టిల్ కాస్త మార్చి నియర్ వీటీఓఎల్గా కొత్త విమానాలకు పేరు పెట్టింది. పక్షి తన కాళ్లతో ఎలా చెట్టుకొమ్మను పట్టుకుంటుందో ఈ విమానమూ నేలపై కొంత ఆధారంతో నిలబడి ఉంటుంది. పక్షి మాదిరిగానే కొమ్మను బలంగా నొక్కుతూ పైకి ఎగురుతుంది. గాల్లో చేరిన తరువాత కాళ్లు లోనికి ముడుచుకుంటాయి. పూర్తిగా విద్యుత్తో నడిచే ఈ వాహనంతో సుమారు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. రన్వే, హెలిపాడ్ వంటివేవీ అవసరం లేకపోగా పైలట్ మోడ్తోపాటు రిమోట్ కంట్రోల్ ద్వారానూ దీన్ని నడపవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో 150 కిలోల బరువు ఉన్న మందులు, సరుకులను మోసుకెళ్లవచ్చని కంపెనీ తన వెబ్సైట్లో తెలిపింది. (చదవండి: అమెరికా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ అధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ) -
షాకింగ్ వీడియో: 16వేల అడుగుల ఎత్తులోంచి..
దక్షిణాఫ్రికా: స్కై డ్రైవింగ్లు గురించి వినే ఉంటాం. ఇలాంటి స్కై డ్రైవింగ్లు భయం కలిగించే అత్యద్భుతమైన ధైర్య సాహసాలతో చేసే ఒక అరుదైన విన్యాసం. కానీ ఒక్కోసారి ఈ విన్యాసాలు బెడిసికొట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఇక్కడొక దక్షిణాప్రికా బృందం చేసిన స్కైడ్రైవింగ్ చూస్తే చాలా భయం వేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది (చదవండి: అరుదైన వింత సంఘటన... తోకతో పుట్టిన బాలుడు) ఈ వీడియోలో ..మొదట ఆ బృందం అంతా విమానంలో ఆకాశంలో ఒక చోట ఈ విన్యాసం చేయడానికి చూస్తున్నట్లుగా కనిపిస్తారు. ఈ మేరకు అక్కడే ఆకాశంలో ఒక చోట గాలిలో విమానాన్ని నిలిపి నెమ్మదిగా విమానం డోర్ తీసి ఒకేసారి జంప్ చేయాలని నిర్ణయించుకుంటారు. వారు అనుకున్న విధంగా అందరూ ఒకేసారి 16 వేల అడుగుల ఎత్తులోంచి జంప్ చేస్తారు. అయితే వారు జంప్ చేసి విధానం అత్యంత భయానకంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బృందం అంతా ఒకేసారి దూకడంతో విమానం ఒక్కసారి స్పిన్ అయిపోయి అదుపుతప్పినట్టుగా వెళ్లుతుంది. పైగా ఒక దశలో విమానిం కిందకి వెళ్లే క్రమంలో వాళ్లపైకి దూసుకొస్తున్నట్లుగా ఉంటుంది. అదృష్టమేమిటంలే ఎవర్ని ఢీ కొట్టకుండా ఆ విమానం కాసేపటికి నిధానంగా కిందకి ల్యాండ్ అవ్వడానికి వెళ్లిపోతుంది. అయితే జంప్ చేసిన 9 మంది బృంద సభ్యులు ఒక్కసారిగా చెల్లచెదురైనా మళీ అంతా భలే చక్కగా ఒకరిని ఒకరు పట్టుకుంటూ రకరకాలుగా విన్యాసాలు చేస్తారు. ఈ మేరకు ఈ 9 మంది బృంద సభ్యులు ఏవియేషన్ విద్యలో భాగంగానే ఈ విన్యాసాలు ప్రదర్శిస్తారు. అయితే కొంతసేపటికి ఆ బృందం సురక్షితంగా కిందకి ల్యాండ్ అవుతారు. (చదవండి: వింతైన ఇల్లు దీని ధర ఎంత తెలుసా?) -
Viral: బ్రిడ్జ్ కింద ఇరుక్కుపోయిన విమానం.. అసలేమైంది?
సాక్షి, న్యూఢిల్లీ: గాల్లో ఎగిరే విమానాలు సాధారణ రోడ్లపై కనిపిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అలాంటి ఘటన ఆదివారం ఢిల్లీలో చోటు చేసుకుంది. ఓ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కింది ఎయిర్ ఇండియా విమానం ఇరుక్కుపోయింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడయాలో వైరల్గా మారింది. ఈ ఘటన ఢిల్లీ ఎయిర్పోర్టు సమీపంలోని గురుగ్రామ్-ఢిల్లీ హైవేపై జరిగింది. ఆ విమానం ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కింద చిక్కుకొని కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యంతో చూశారు. బ్రిడ్జ్ కింద రోడ్డుపై విమానం చిక్కుకొని ఉండగా.. దాని పక్కనుంచే వాహనాలు వెళ్లుతున్నాయి. దీనిపై ఎయిర్ ఇండియా సంస్థ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. అది ఓ పాత చెడినపోయిన విమానం అని, దాన్ని చాలా రోజుల కింద అమ్మివేసినట్లు తెలిపారు. దీంతో సదరు యజమాని ఆ రెక్కలు లేని విమానాన్ని రోడ్డు మార్గంలో తీసుకెళ్లుతున్నాడని పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. #WATCH An @airindiain plane ✈️ (not in service) got stuck under foot over bridge. Can anyone confirm the date and location? The competition starts now👇 pic.twitter.com/pukB0VmsW3 — Ashoke Raj (@Ashoke_Raj) October 3, 2021 -
విమానంలో సిగరెట్ తాగిన యువతి
-
ఉక్రెయిన్ విమానం హైజాక్
కీవ్: ఉక్రెయిన్ విమానం హైజాక్కు గురయ్యింది. తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రభుత్వం అఫ్గనిస్తాన్లో ఉన్న తమ పౌరులను తరలింపు ప్రక్రియను ప్రారంభించింది. ఈ క్రమంలో దుండగులు ఉక్రెయిన్ విమానాన్ని హైజాక్ చేసి ఇరాన్కు మళ్లించారు. విమానం హైజాక్ విషయాన్ని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంగళవారం ధ్రువీకరించింది. విమానాన్ని హైజాక్ చేసింది ఎవరు అనే దాని గురించి ఎలాంటి సమాచారం లేదు. ఈ విమానం గతవారం అఫ్గనిస్తాన్ వచ్చినట్లు ఉక్రెయిన్ విదేశాంగ కార్యదర్శి తెలిపారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గత ఆదివారం మా విమానం కాబూల్ హైజాక్కు గురయ్యింది. మంగళవారం, విమానం ఆచరణాత్మకంగా మా నుంచి దొంగిలించబడింది. ఇక విమానంలో ఉక్రెయిన్లకు బదులుగా గుర్తు తెలియని ప్రయాణీకులు ఉన్నారు. 83 మంది ప్రయాణికుల బృందంతో విమానం ఇరాన్కు వెళ్లింది. మా తదుపరి మూడు తరలింపు ప్రయత్నాలు కూడా విజయవంతం కాలేదు. ఎందుకంటే మా ప్రజలు విమానాశ్రయంలోకి ప్రవేశించలేకపోయారు" అని ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి యెవ్జెనీ యెనిన్ రష్యన్ న్యూస్ ఏజెన్సీ టాస్తో పేర్కొన్నారు. విమానం హైజాక్ వార్తలను ఇరాన్ ఖండించింది. కాబూల్ నుంచి విమానం వచ్చింది, రీఫ్యూయల్ చేసుకుని వెళ్లింది. ప్రస్తుతం మా భూభాగంలో ఉక్రెయిన్ విమానం లేదు అని ఇరాన్ స్పష్టం చేసింది. -
విమానం నుంచి పడిపోయిన ఘటన: అన్నదమ్ముల విషాద గాథ
కాబూల్: అఫ్గానిస్తాన్లో ఇటీవల విమానం పైనుంచి ఇద్దరు కిందపడిన విషయం తెలిసిందే. ప్రపంచాన్ని మొత్తం ఆ ఘటన నివ్వెరపరిచింది. తాజాగా ఆ ఇద్దరి వ్యక్తుల వివరాలు తెలిశాయి. తాలిబన్ల పాలనలో తాము నరకం అనుభవిస్తామనే ఆందోళనతో ఆ ఇద్దరు హడావుడిగా విమానం ఎక్కారని సమాచారం. ఆ విమానం నుంచి మొత్తం ముగ్గురు కిందపడగా ఆ వీడియోలో మాత్రం ఇద్దరే కనిపించారు. తాజాగా వారిలో ఇద్దరి వివరాలు తెలిశాయి. చదవండి: నరకయాతన.. విమానం నుంచి కిందపడిన ఇద్దరు అఫ్గన్లు కిందపడిన ముగ్గురిలో ఇద్దరు రెజా (17), కబీర్ (16). వీరు సొంత అన్నదమ్ములు. వీరి కుటుంబంలో 8 మంది ఉంటారు. అయితే తాలిబన్లు తమ దేశాన్ని వశం చేసుకున్నారనే వార్త తెలుసుకున్న ఈ అన్నదమ్ములు ఆందోళనకు గురయ్యారు. ఈ సమయంలో కెనడా, అమెరికాలో అఫ్గన్ దేశస్తులకు ఆశ్రయిస్తున్నట్లు స్థానికులు మాట్లాడుకుంటుంటే వీరిద్దరూ విన్నారంట. దీంతో వెంటనే కుటుంబసభ్యులకు చెప్పాపెట్టకుండా ఇంట్లోని గుర్తింపు కార్డులు పట్టుకుని కాబూల్లోని విమానాశ్రయానికి పరుగెత్తుకుంటూ వచ్చారు. అక్కడ కదులుతున్న అమెరికా యుద్ధ విమానం ఎలాగైనా ఎక్కాలని భావించి అతికష్టంగా విమానం రెక్కపై ఎక్కి కూర్చున్నారు. ఎగిరిన తర్వాత విమానం పైనుంచి రెజా, కబీర్ ఇద్దరూ కిందపడిపోయారు. ఆ పడిపోతున్న వీడియో ప్రపంచాన్ని కలచివేసిన విషయం తెలిసిందే. అయితే రెజా మృతదేహం విమానాశ్రయం సమీపంలోని ఓ భవనంపై పడి ఉంది. పైనుంచి కిందపడడంతో రెజా కాళ్లు, చేతులు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. విగతజీవిగా పడి ఉన్న రెజాను కుటుంబసభ్యులు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. మరో యువకుడు కబీర్ జాడ ఇంతవరకు తెలియరాలేదు. అతడి ఆచూకీ కోసం కుటుంబసభ్యులు గాలిస్తున్నారు. ప్రస్తుతం అఫ్గానిస్తాన్లో ప్రజలు, అఫ్గాన్ సైన్యం తాలిబన్లపై నిరసనగళం వినిపిస్తన్నారు. నిరాయుధులైన ప్రజలను సాయుధ తాలిబన్లు చావబాదుతున్నారు. అఫ్గాన్ పరిణామాలపై ప్రపంచ దేశాలు ఏం చేయాలో సమాలోచనలు చేస్తున్నాయి. చదవండి: కొత్త మొక్క కనుగొన్న శాస్త్రవేత్తలు: పేరేంటంటే ‘జలకన్య’ -
కమలా హ్యారిస్కు తృటిలో తప్పిన ప్రమాదం
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్కు ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న విమానానికి సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానాన్ని తిరిగి మేరీ ల్యాండ్లో ల్యాండ్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందనీ, ఉపాధ్యక్షురాలు మరో విమానంలో బయలుదేరాలని భావిస్తున్నట్లు ప్రతినిధి సిమోన్ సాండర్స్ వెల్లడించారు. ఇది సాంకేతిక సమస్యమాత్రమే. భద్రతా సమస్యలు ఏవీ లేవని సాండర్స్ చెప్పారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అటు తాము క్షేమంగా ఉన్నామని కమలా హ్యారిస్ కూడా ప్రకటించారు. ఉపాధ్యక్షురాలిగా పదవీబాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి విదేశీ యాత్రకు బయలుదేరారు. మేరిల్యాండ్ నుంచి గ్వాటెమాల, మెక్సికో పర్యటన నిమిత్తం ఎయిర్ఫోర్స్ 2 లో బయలుదేరారు. అయితే టెకాఫ్ అయిన 25 నిమిషాల తరువాత విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది.దీన్ని గుర్తించిన ఫైలెట్లు.. వెంటనే విమానాన్ని సురక్షితంగా వెనక్కి మళ్లించారు. -
పిచ్చి పట్టిందా.., పారాచుట్ లేకుండా విమానం నుంచి దూకేశాడు..
వాషింగ్టన్ డిసి : పారా చుట్ లేకుండా సరదాగా విమానం నుంచి దూకితే ఎలా ఉంటుంది? అని ఎవరితోనైనా చెబితే ఏం ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుందా?. వెళ్లి డాక్టర్ కి చూయించుకోమని సలహా ఇస్తారు. సరిగ్గా ఇలాగే ఓ వ్యక్తి తన స్నేహితులతో అలాగే చెప్పాడు. చెప్పడమే కాదు పారా చుట్ లేకుండా విమానం నుంచి దూకి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని టెక్సాక్ కు చెంది ఐకిన్స్ వృత్తి రిత్యా పైలెట్. స్కై డ్రైవర్ కూడా. ఇటీవల ఐకిన్స్ పారాచుట్ లేకుండా విమానం నుంచి కిందకి దూకాడు. దీంతో ఆయన అభిమానులు, సన్నిహితులు సంతోషం వ్యక్తం చేశారు. అయినా ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం ఐకిన్స్ కు కొత్తేమి కాదు. 2016 లో పారాచూట్ లేకుండా విమానం నుండి దూకి గిన్నిస్ వరల్డ్ రికార్డును బద్దలుకొట్టాడు. తాజాగా 25,000వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానం నుంచి కిందకి దూకాడు. కింద పడే సమయంలో 150 చదరపు అడుగుల పరిమాణంలో ఉన్న నెట్ లోకి జారేలా ప్లాన్ చేశాడు. అతనికి ఐరన్ మ్యాన్ చిత్రానికి స్టంట్గా పనిచేసిన ప్రొఫెషనల్ స్కైడ్రైవర్ ఫెలిక్స్ సాయం చేయడంతో గాల్లో నుంచి సునాయాశంగా కిందకి దూకాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలపై పలువురు నెటిజన్లు అతని సాహసానికి ఫిదా అవుతుంటే, చిప్ దొబ్బినట్లుంది అందుకే ఇలాంటి సాహసం చేస్తున్నాడంటూ మరికొంతమంది సెటైర్లు వేస్తున్నారు. చదవండి : Corona: వేపచెట్ల కిందే చికిత్స... ప్రాణం నిలుస్తోంది! -
విమానం నడిపిన విద్యార్థులు
తెనాలి: విమానం ఎక్కడమే చాలా మంది సామాన్యులకు కల లాంటిది. కానీ తెనాలి మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు విమానంలో విహరించడమే కాదు.. ఏకంగా దాన్ని నడిపే అవకాశం కూడా లభించింది. వివరాలు.. గుంటూరు జిల్లా తెనాలి మారీసుపేటలోని చెంచు రామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాల ఎన్సీసీ క్యాడెట్లు పి.గంగాభవాని(9వ తరగతి), షేక్ నజీర్ అహ్మద్ (10వ తరగతి) శుక్రవారం సాయంత్రం గన్నవరం ఎయిర్పోర్టు బ్యారెల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్లో భాగంగా ఎన్సీసీ అధికారి పులి భాస్కరరావుతో కలిసి శిక్షణ విమానాన్ని పరిశీలించారు. 8వ ఆంధ్రా కమాండింగ్ అధికారి, పైలెట్ అయిన పంకజ్ గుప్తా వారికి అన్ని అంశాలనూ క్షుణ్నంగా వివరించారు. విద్యార్థుల ఆసక్తిని గమనించి రెండు సీట్ల విమానంలో తాను పక్కనే కూర్చొని.. ఆ ఇద్దరితో చెరోసారి విమానాన్ని నడిపించారు. ఒక్కొక్కరు 20 నిమిషాల చొప్పున గాల్లో తేలిపోయారు. గన్నవరం ఎయిర్పోర్టు బ్యారెల్లో ఎన్సీసీ అధికారి పులి భాస్కరరావుతో నజీర్ అహ్మద్, గంగాభవాని శిక్షణలో భాగంగా.. యుద్ధ విమానం ఎలా పనిచేస్తుంది? ఏయే విమానాలుంటాయి? తదితర అంశాలపై ఎన్సీసీ విద్యార్థులకు శిక్షణ ఇస్తుంటారు. విజయవాడలోని 8వ ఆంధ్రా ఎయిర్ స్క్వాడ్రన్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఆంధ్రలో ఎయిర్వింగ్ పరిధిలో 13 హైసూ్కళ్లుంటే, గుంటూరు జిల్లాలో 3 ఉన్నాయి. అందులో తెనాలి మునిసిపల్ స్కూలు ఒకటి. ఇక్కడి క్యాడెట్లకు అధికారులు యుద్ధ విమానాల గురించి బోధిస్తారు. ప్రాక్టికల్స్లో భాగంగా గన్నవరం ఎయిర్పోర్టు బ్యారెల్లో ప్రత్యక్షంగా విమానాన్ని చూపించి.. దాని గురించి వివరిస్తారు. ఈ క్రమంలో ఆంధ్రా కమాండింగ్ అధికారి, విమానం పైలెట్ అయిన పంకజ్ గుప్తా.. తెనాలి విద్యార్థుల ఆసక్తిని గమనించి.. శిక్షణ విమానాన్ని స్వయంగా నడిపే అవకాశం కల్పించారు. విమానం ఎక్కడమే గొప్ప అనుకునే రోజుల్లో, హైస్కూలు స్థాయిలోనే శిక్షణ విమానాన్ని నడపటం సంతోషంగా ఉందని విద్యార్థులు పేర్కొన్నారు. -
వైరల్: విమానంలో పిల్లి రచ్చ.. పైలట్పై దాడి
ఓ పిల్లి విమానంలోకి ఎలా చొరబడిందో తెలియదు గానీ రచ్చ రచ్చ చేసింది. ఏకంగా కాక్పిట్లో దూరి పైలట్పైనే దాడి చేసి ముప్పుతిప్పలు పెట్టింది. ఆ పిల్లి చూపించిన నరకానికి ఏం చోయాలో తెలియగా చివరికి విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ విచిత్ర సంఘటన బుధవారం సూడాన్ జరిగింది. సుడాన్ రాజధాని ఖార్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఖతార్ రాజధాని దోహాకు వెళ్లవలసిన ఈ విమానం షెడ్యూల్ ప్రకారమే బయలుదేరింది. కానీ విమానం టేకాఫ్ అయిన అరగంటకే ఓ పిల్లి హడావిడి చేసింది. స్టొవవే ఫిలైన్ జాతికి చెందిన ఈ పిల్లి విమానంలోకి ఎలా వచ్చిందో తెలియదు గానీ కాక్పిట్లో పైలెట్, సిబ్బందిపై దాడి చేసింది. దాన్ని పట్టుకునేందుకు ఎంత ప్రయత్నించినా వీలు కాకపోవడంతో విమానం యూటర్న్ తీసుకొని సుడాన్ రాజధాని నగరమైన ఖార్టూమ్లోనే మరలా దిగాల్సి వచ్చింది. అయితే ఇందులోని ప్రయాణికులంతా సురక్షింతంగానే ఉన్నారు. ఇంతకీ విమానంలోకి పిల్లి ఎలా ప్రవేశించిందో ఇప్పటికీ అధికారులకు అంతుపట్టడం లేదు. ఒకవేళ ఫ్లైట్ను ముందురోజు రాత్రి విమానాశ్రయంలో ఉంచినప్పుడు చొరబడి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ విమానం ప్రయాణానికి ముందు రోజు రాత్రి అదే విమానాశ్రయంలో ఒక హ్యాంగర్ దగ్గర హాల్ట్లో ఉంది. ఇలా ఆగి ఉన్న సమయంలో ఈ పిల్లి విమానంలోకి వెళ్లి ఉంటుందని, లేదా లేదంటే ఇంజనీరింగ్ చెక్ చేసేటప్పుడో ఈ పిల్లి ఎవ్వరి కంటా పడకుండా ఆన్ బోర్డ్లోకి ప్రవేశించి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా ఓ జంతువు కారణంగా మధ్య గాలి గందరగోళానికి ఒక దొంగ జంతువు కారణం కావడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం కూడా అహ్మదాబాద్ నుండి జైపూర్కు ప్రయాణించాల్సిన గో ఎయిర్ విమానంలోకి రెండు పావురాలు ప్రవేశించాయి. వీటి కారణంగా విమానం సుమారు 30 నిమిషాలు ఆలస్యం అయ్యింది. చదవండి: ‘నేనేం పిల్లిని కాను’: జూమ్ యాప్లో ఫన్నీ ఘటన మొబైల్లో మంత్రాలు.. ఆలయంలో పెళ్లి -
విమానాన్ని పెళ్లాడుతున్న మహిళ!
ప్రేమకు హద్దులు ఉండవంటారు. ఇక ఓ అమ్మాయి ప్రేమలో పడిందంటే ఏ హ్యాండ్సమ్ కుర్రాడో, లేక చిన్ననాటి మిత్రుడు అయ్యింటాడులే అనుకుంటారు. అయితే ఇక్కడ వింతగా జర్మనీకి చెందిన ఓ మహిళా విమానంతో ప్రేమలో పడిందంట. అంతేకాదు ఆ విమానాన్ని త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నట్లు ప్రకటించి ప్రేమకు హద్దులు లేవని నిరూపించింది. వివరాల్లోకి వెళితే.. బెర్లిన్కు చెందిన మైకేల్ కోబ్కే(30) ఆరేళ్లుగా ప్రాణపదంగా ప్రేమిస్తున్న తన కలల జెట్ బోయింగ్ 737 ఈ ఏడాది మార్చిలో నెదార్లాండ్లో పెళ్లాడుతున్నట్లు వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. ‘2014లో బెర్లిన్ టెగెల్ ఎయిర్పోర్టులో ఈ జెట్ విమానాన్ని మొదటిసారి చుశాను. చూడగానే ప్రేమలో పడ్డాను. దీనికి ‘స్కాట్జ్ (డార్లింగ్)’ అనే ముద్దు పేరును కూడా పెట్టుకున్నాను’ అని చెప్పుకొచ్చింది. ‘గత ఆరేళ్లుగా ఈ విమానంతో డేటింగ్ చేస్తున్నా. దీన్ని చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాను. 2014లో టెగెల్ ఎయిర్పోర్టు ఈ జేట్ బోయింగ్ విగ్స్, వింగ్లేట్స్, థ్రస్టర్లు చూడగానే ఆకర్షితురాలినయ్యాను. ఎయిర్పోర్టులో ఎప్పుడూ ఈ జెట్ను కేవలం కిటికి దగ్గరి నుంచే కలుసుకునే దాన్ని. అలా ఆరేళ్లుగా ఈ విమానంతో ప్రేమలో ఉన్నాను’ అని మైకేల్ పేర్కొంది. 2019 సెప్టెంబర్లో ఈ 40 టన్నుల జెట్ను మొదటిసారిగా ముద్దు పెట్టుకున్నానని కూడా వెల్లడించింది. అంతేగాక ‘దీనితో ఉన్నంత సేపు నాకు సమయం తెలీదు. ఈ విమానం వింగ్పై నిలబడి దాన్ని ముద్దాడిన క్షణాన్ని చాలా ఆనందించాను. నా జీవితంతో అదో అందమైన క్షణం’ అని విమానంతో తనకున్నా బంధాన్నిచెప్పుకొచ్చింది. ఇక మెకేల్ నిర్ణయాన్ని ఆమె తల్లిదండ్రులు, స్నేహితులు కూడా స్వాగతించినట్లు సమాచారం. View this post on Instagram My Lover and me❤️#737 #boeing737lover #737lover #737800#boeing #boeing #sas #b737 #b738 #737ng A post shared by Michèle Köbke (@airlover737) on Dec 16, 2019 at 2:00am PST -
ఇమ్రాన్ ఖాన్ విమానంలో కలకలం
న్యూయార్క్: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రయాణిస్తున్న విమానం అమెరికాలో అత్యవసరంగా కిందకు దిగింది. సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని శనివారం న్యూయార్క్లో అత్యవసరంగా కిందకు దించాల్సి వచ్చింది. ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ ప్రతినిధులు బృందం అమెరికా పర్యటన ముగించుకుని పాకిస్తాన్కు తిరిగి వెళుతుండగా విమానంలో సాంకేతిక లోపం చోటుచేసుకోవడంతో న్యూయార్క్కు మళ్లించినట్టు జీయో టీవీ వెల్లడించింది. విమానంలోని వారంతా సురక్షితంగా ఉన్నారని తెలిపింది. సాంకేతిక లోపాన్ని సరిచేసేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. విమానాన్ని బాగు చేసేంత వరకు ఇమ్రాన్ ఖాన్ ఆయన బృందం న్యూయార్క్లోనే బస చేయనుంది. ఇమ్రాన్ ఖాన్ వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో శుక్రవారం ఆయన ప్రసంగించారు. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి భారత్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. (చదవండి: కశ్మీర్పై పాక్ ప్రధాని ఇమ్రాన్ బెదిరింపులు) -
విమానం పైకెక్కి వ్యక్తి హల్చల్
అబూజా : టెకాఫ్కు రెఢీ అయిన విమానం రెక్కలపైకి ఎక్కి ఓ వ్యక్తి హల్చల్ చేశారు. విమానం బయలుదేరే సమయంలో ఓ వ్యక్తి...విమాన రెక్కలపైకి ఎక్కటం చూసిన ప్రయాణీకులు నిర్ఘాంతపోయారు. కేకలు వేస్తూ భయంతో వణికిపోయారు. ఈ నెల 19న ఐకెజాలోని ముర్తాలా ముహమ్మద్ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ముర్తలా ముహమ్మద్ ఎయిర్పోర్ట్లో అజ్మన్ ఎయిర్ ఫ్లైట్ టేకాఫ్కు సిద్ధమైంది. ఇంతలో రన్ వే పక్కనే ఉన్న పొదల నుంచి ఓ వ్యక్తి అకస్మాత్తుగా విమానం వైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అది గమనించిన పైలెట్ విమాన ఇంజన్ నిలిపివేశాడు. ఇంతలో విమానం పైకి ఎక్కిన ఆ దుండగుడు వెంట తెచ్చుకున్న బ్యాగ్ను ఫ్లైట్ ఇంజన్ పైన పెట్టి విమానం రెక్కపైకి ఎక్కి నిలబడ్డాడు. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ప్రయాణీకులు భయపడిపోవడంతో వారందరినీ విమానం నుంచి దింపేశారు. తర్వాతి విమానంలో వారిని గమ్యస్థానాలకు చేర్చారు. -
రూ.72 లక్షల జరిమానా.. జీవితకాల నిషేధం
లండన్: కాక్పిట్లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించడమే కాక.. విమనా సిబ్బందిపై దాడి చేసినందుకు గాను ఓ యువతిపై జీవితకాలం విమానయానం చేయకూడదంటూ నిషేధం విధించారు. వివరాలు.. చ్లోయి హైనెస్(22) అనే యువతి గత నెల 22న తన బామ్మతో కలిసి యూకే నుంచి టర్కీకి ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో విమానం గాల్లో ఉండగా.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ను తెరవడానికి, కాక్పిట్లోకి వెళ్లడానికి ప్రయత్నించింది. అడ్డుకోబోయిన ఇద్దరు సిబ్బంది మీద దాడి చేసి వారిని గాయపర్చింది. ఆపడానికి ప్రయత్నించిన ప్రయాణికులపై కూడ దాడి చేసింది. ఈ విషయం గురించి సదరు విమానయాన సంస్థ సీఈవో మాట్లాడుతూ.. ‘నా జీవితంలో ఇలాంటి ప్రయాణికురాలిని ఇంతవరకూ చూడలేదు. ఆమె చూడ్డానికి చాలా చిన్నగా ఉంది. కానీ చాలా బలవంతురాలు. ఆమె తీరు చూస్తే.. మా మీద యాసిడ్ పొయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తోచింది. ఆమె సృష్టించిన బీభత్సం వల్ల విమానాన్ని వెనక్కి తీసుకురావాల్సి వచ్చింది. కానీ ఆమె చేసిన పనికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఆమె ప్రవర్తన వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడటమే కాక.. డబ్బు కూడా వృథా అయ్యింది. ఆ మొత్తన్ని ఆమె నుంచి తిరిగి రాబడతాం. అందుకనే ఆమె మీద రూ. 72 లక్షల జరిమానాతో పాటు.. జీవితాంతం విమానంలో ప్రయాణించకుండా నిషేధం విధించామ’ని తెలిపాడు. -
పైలట్ చాకచక్యం.. తప్పిన ప్రమాదం
యాంగాన్ : పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఏడుగురు విమాన సిబ్బంది సహా మొత్తం 89 మంది ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన మయన్మార్లోని మాండలే అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. విమానంలో సాంకేతికలోపంతో ముందు భాగంలోని టైరు తెరచుకోలేదు. దీంతో రన్ వేపై పైలట్ ఆ విమానాన్ని దింపుతున్న సమయంలో ముందు భాగం రోడ్డును తాకింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులతోపాటు సిబ్బందికి గాయాలు కాలేదు. యూబీ 103 విమానంలో ఆదివారం ఉదయం సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ‘ముందు భాగంలోని టైరు తెరుచుకోకపోవడంతో వెనకవైపున ఉండే టైర్ల సాయంతో మాత్రమే విమానాన్ని దించాల్సి వచ్చింది. పైలట్ తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ విమానాన్ని సురక్షితంగా దించారు’ అని ఓ అధికారి తెలిపారు. #MNA (Embraer 190) #Yangon-#Mandalay this morning, landing at the #Mandalay airport - Nose Lansing Gear failure on landing. Flight Capt. has done the amazing job. #Myanmar pic.twitter.com/7dDzSIs13V — Cape Diamond (@cape_diamond) May 12, 2019 -
వైరలవుతున్న వజ్రాల విమానం..!?
రెండు రోజుల క్రితం ఎమిరేట్స్ విమానయాన సంస్థ పోస్ట్ చేసిన ఓ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ ఫోటో చూసిన దగ్గర నుంచి నెటిజన్లలో ఒకటే అనుమానం.. ‘ఇది నిజమేనా’.. ‘ఇంత ఖరీదైన విమానమా’.. ‘ఎంత ఖర్చు చేశారు’ అనే ప్రశ్నలు క్యూ కట్టాయి. ఇంతలా ఆకర్షించడానికి ఏముందా ఫోటోలో అని ఆలోచిస్తున్నారా.. ఎందుకంటే ఆ విమానం వేల వజ్రాల కాంతితో మిరిమిట్లుగొలుపుతోంది. దాంతో చూసిన వారికి ఇది వజ్రాలు పొదిగిన విమానమేమో అనే అనుమానం వచ్చింది. కానీ ఇది నిజంగా వజ్రాలు పొదిగిన విమానం కాదు. కేవలం ఫోటో మాత్రమే. ఈ విషయాన్ని ఎమిరేట్స్ సంస్థనే ప్రకటించింది. Presenting the Emirates ‘Bling’ 777. Image created by Sara Shakeel 💎💎💎 pic.twitter.com/zDYnUZtIOS — Emirates Airline (@emirates) December 4, 2018 విమానం ఫోటోను పోస్ట్ చేస్తూ ‘‘బ్లింగ్’ 777 ఇమేజ్ క్రియేటెడ్ బై సారా షకీల్’ అంటూ ఎమిరేట్స్ తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అంటే ఇది కేవలం ఫోటో మాత్రమే అని ఎమిరేట్సే స్వయంగా ప్రకటించింది. అయితే నెటిజన్లు అంతా ఫోటోను మాత్రమే చూశారు. పక్కనే ఉన్న క్యాప్షన్ని చూడకపోవడంతో ఈ అనుమానాలు బయలు దేరాయి. చివరకు ఎమిరేట్స్ అధికారి ఒకరు ఇది సారా షకీల్ రూపొందించిన చిత్రం అంటూ వివరణ ఇచ్చారు. ‘ఆమె సృష్టించిన ఈ కళాఖండాన్ని మాత్రమే మేం పోస్టు చేశాం. ఇది నిజం కాదు’ అంటూ సదరు అధికారి మీడియాకు స్పష్టం చేశారు. ప్రముఖ క్రిస్టల్ ఆర్టిస్ట్ అయిన సారా షకీల్.. ఈ అద్భుత చిత్రాన్ని రూపొందించి.. తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అది కాస్తా ఎమిరేట్స్ సంస్థను ఆకర్షించింది. వెంటనే వారు ఆమె అనుమతితో ఈ ఫొటోను రీపోస్టు చేశారు. -
ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కోలకతా: ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. 76మంది ప్రయాణీకులతో బయలుదేరిన ఇండిగో విమానం కోలకతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం సాయంత్రం 8.30 గంటలకు అత్యవసర పరిస్థితుల్లో సురక్షితంగా ల్యాండ్ అయింది. గువహటికి వెళ్లాల్సిన విమానం టేకాఫ్ తీసుకున్నకొన్నినిమిషాలకే అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చిందని అధికారులు ప్రకటించారు. కాక్పిట్లో పొగ అలారం మోగడంతో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) విభాగానికి సమాచారం అందించారని తెలిపారు. పొగలను గుర్తించినట్టు చెప్పారు. అయితే పైలట్ అప్రతమత్తతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో ప్రయాణీకులు, సిబ్బందితోపాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి,హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. హైదరాబాద్ నుంచి గోవాకు వెళుతున్న ఇండిగో విమానం మంగళవారం ఉదయం టేకాఫ్ అయిన 20 నిమిషాలకే సాంకేతిక లోపం తలెత్తింది. అప్రమత్తమైన పైలట్ వెంటనే ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్కు పూనుకున్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణీకులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఆ సమయంలో ఇండిగో విమానంలో 146 మంది ప్రయాణీకులున్నారని అధికారులు తెలిపారు. కాగా ఇండిగో ఎయిర్లైన్స్ ఇటీవల తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఆదివారం పలు ఎయిర్పోర్ట్ల్లో ఇండిగో సిస్టమ్స్ అనూహ్యంగా డౌన్ కావడంతో గంటన్నర పాటు ఇండిగో విమానాల సేవలు నిలిచిపోయాయి. -
చెరువులోకి విమానం
వెల్లింగ్టన్, న్యూజిలాండ్ : రన్ వే మీద ఆగాల్సిన విమానం కాస్తా అదుపు తప్పి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. దాంతో విమానంలో ఉన్న ప్రయాణికులు పడుతూ.. లేస్తూ.. ఈదుకుంటూ వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటన న్యూజిలాండ్లోని మైక్రోనేషియన్ ద్వీపంలో శుక్రవారం ఉదయం జరిగింది. 36 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో వస్తున్న ఎయిర్ న్యుగిని విమానం స్థానిక వెనో ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతుండగా అదుపుతప్పింది. దాంతో ఒక్కసారిగా రన్వే పై నుంచి సమీపంలోని చెరువులోకి దూసుకెళ్లింది. అయితే చెరువు లోతు తక్కువగా ఉండటంతో విమానం పూర్తిగా మునగలేదు. ఈ లోపు ప్రమాదాన్ని గమనించి స్థానికులు వెంటనే పడవలతో వెళ్లి ప్రయాణికులను, సిబ్బందిని కాపాడారు. కొందరు ప్రయాణికులు ఈత కొట్టుకుంటూ వచ్చి ఒడ్డుకు చేరుకున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని ఎయిర్పోర్టు సిబ్బంది తెలిపారు. కానీ సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ప్రయాణికులను, సిబ్బందిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత లేదు. ఘటనపై పపువా న్యూ గినియా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. -
విమానంలో బీజేపీ వ్యతిరేక నినాదాలు..
ట్యూటికోరిన్: తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ తమిళిసై సౌందరరాజన్ ఎదుట బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఒక మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ట్యూటికోరిన్ ఎయిర్పోర్టులో సోమవారం జరిగింది. కెనడాలో ఇండియన్ రీసెర్చ్ స్కాలర్ అయిన లూయిస్ సోఫియా(28), సౌందరరాజన్లు ఇద్దరూ ఒకే విమానంలో ట్యూటికోరిన్కు వస్తున్నారు. సౌందరరాజన్, సోఫియా ముందు సీట్లో కూర్చున్నారు. సోఫియా అకస్మాత్తుగా ‘డౌన్ విత్ మోదీ-బీజేపీ-ఆర్ఎస్ఎస్ ఫాసిస్ట్ గవర్నమెంట్’ అంటూ బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో సౌందరరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విమానం ట్యూటికోరిన్లో ల్యాండ్ కాగానే సోఫియాను అరెస్ట్ చేశారు. ఎయిర్పోర్టులో సౌందరరాజన్ మాట్లాడుతూ.. ఒక విమానంలో ప్రయాణించేటపుడు ఆ విధంగా అరుస్తూ రాజకీయ వ్యాఖ్యలు చేయవచ్చా? ఇది పబ్లిక్ ఫోరం కాద’ని ప్రశ్నించారు. దీని వెనక తీవ్రవాద సంస్థల ప్రమేయం ఉన్నట్లుగా కనిపిస్తోందని, ఆమె ఒక సాధారణ ప్రయాణికురాలిగా కనిపించడం లేదని, తన ప్రాణానికి కూడా ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. పబ్లిక్ న్యూసెన్స్ కింద సోఫియాపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే లోకల్ కోర్టు ఆమెకు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. సోఫియా తండ్రి కూడా బీజేపీ చీఫ్కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ఇంతవరకు సౌందరరాజన్కు వ్యతిరేకంగా ఎలాంటి కేసు నమోదు చేయలేదు. సోఫియా ఒక రచయిత, గణిత శాస్త్రవేత్త. స్టెరిలైట్ కాపర్ ప్లాంట్, చెన్నై-సేలం 8 లేన్ ఎక్స్ప్రెస్వేలకు వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశారు. గత మే నెలలో పోలీసు కాల్పుల్లో 13 మంది చనిపోవడంతో స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ను ప్రభుత్వం మూసివేసిన సంగతి తెల్సిందే. సోఫియాను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ తప్పుపట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే జైల్లో పెడితే.. ఎన్ని లక్షల మందిని జైల్లో పెట్టాల్సి వస్తుందో ఊహించుకోవాలన్నారు. -
పార్కింగ్లో కూలిన విమానం
లాస్ ఏంజిల్స్ : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో చిన్న విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. శాంటా అనా నగరంలోని స్టాప్లెస్ సూపర్ సెంటర్ షాపింగ్ మాల్ పార్కింగ్లో విమానం కూలిందని అధికారులు వెల్లడించారు. విమానం పార్కింగ్లో ఉన్న ఓ కారును ఢీ కొట్టిందని వివరించారు. శాన్ఫ్రాన్సిస్కోలోని ఓ కంపెనీ పేరిట విమానం నమోదు అయి ఉన్నట్లు వెల్లడించారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) వెల్లడించిన వివరాల ప్రకారం విమానం కాంకోర్డ్ సిటీ ఈస్ట్ బే సబర్బ్ నుంచి బయలుదేరి ఆరెంజ్ కౌంటీలోని జాన్ వేన్ విమానాశ్రయానికి చేరుకోవాల్సవుందని తెలిపారు. అయితే, సాంకేతిక సమస్య వల్ల షాపింగ్ మాల్ వద్ద కూలిందని చెప్పారు. పైలట్ ఎమర్జెన్పీ ల్యాండింగ్కు ప్రయత్నించినప్పటికీ విమానం క్రాష్ ల్యాండ్ అయ్యిందని పేర్కొన్నారు. ఘటనపై ఎఫ్ఏఏ దర్యాప్తు చేపట్టింది. -
రోడ్డుపై విమానం ల్యాండ్ .. తప్పిన ప్రమాదం
కాలిఫోర్నియా : విమానం రన్వే పై ల్యాండ్ అవ్వడం చూస్తుంటాం. కానీ ఓ మహిళా పైలట్ విమానాన్ని అత్యవసరంగా నడిరోడ్డుపై ల్యాండ్ చేసింది. ఈ ఘటన కాలిఫోర్నియాలోని హంటింగ్టన్ బీచ్ రోడ్డుపై చోటుచేసుకుంది. విమానం ల్యాండ్ అవ్వడం చూసి వాహనదారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే అప్రమత్తమై కార్లను రోడ్డు పక్కకు తీసుకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అంతేకాక ఆ సమయంలో రద్దీ కూడా చాలా తక్కువగా ఉండటంతో ప్రాణనష్టం జరగలేదు. సాంకేతిక లోపం వల్ల పైలట్ రోడ్డుపై ల్యాండ్ చేసినట్లు తెలుస్తోంది. విమానంలో గాల్లో ఉన్నప్పుడు ఇంజిన్లో సమస్య రావడంతో ట్రైనీ పైలట్ రోడ్డుపై ల్యాండ్ చేసింది. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు అక్కడి చేరుకుని ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ప్రయాణిస్తున్న కారుపై విమానం ల్యాండ్ అవ్వటంతో డ్రైవర్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. వెంటనే కారు వేగాన్ని తగ్గించి సైడ్ తీసుకున్నాడు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. -
విమానం సీట్లో బంగారం
శంషాబాద్ : విమానంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు మంగళవారం అర్ధరాత్రి జెడ్డా నుంచి వచ్చిన ఎయిరిండియా 966 విమానంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఓ సీటు పక్క భాగంలో దాచిన 799 గ్రాముల బరువు కలిగిన నాలుగు బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. వీటి విలువ రూ.25,54,880 ఉంటుందని అధికారులు నిర్ధారించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు బంగారం దాచిన ప్రయాణికుల వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. -
గాలి కోసం.. విమానం కిటికీ తెరిచాడు
బీజింగ్ : గాలి ఆడట్లేదని కిటికీ తెరిచాడో విమాన ప్రయాణికుడు! ఈ ఘటన చైనాలోని మిన్యాంగ్ నాన్జియావో ఎయిర్పోర్ట్లో ఏప్రిల్ 27న చోటు చేసుకున్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. దీని ప్రకారం చెన్(25).. విమానంలోని అత్యవసర ద్వారం వద్ద సీట్లో కూర్చున్నాడు. సరిగ్గా విమానం టేకాఫ్ అవుతుందనగా ఉన్నట్లుండి కిటికీ తెరిచాడు. అది అత్యవసర ద్వారం కావడంతో పూర్తిగా తెరచుకొని లోపలికి గాలి చొచ్చుకొచ్చింది. దీంతో కంగారుపడిన సిబ్బంది టేకాఫ్ అర్ధాంతరంగా ఆపేసి ఆ యువకుడిని పోలీసులకు అప్పగించారు. విచారణలో ఆ యువకుడు చెప్పిన సమాధానం పోలీసులను ఆశ్చర్యపరిచింది. తనకు అవగాహన లేకే కిటికీ తెరిచానని, అది అత్యవసర ద్వారం కావడంతో పూర్తిగా ఓపెన్ అయ్యిందని వెల్లడించాడు. 15 రోజుల పాటు విమాన ప్రయాణాలు చేయకుండా ఆ యువకుడిపై నిషేధం విధించడంతోపాటు 70 వేల యెన్లను జరిమానా విధించినట్లు సమాచారం. -
బుల్లి విమానం.. కరెంటుతో నడుస్తుంది!
విమానాలు పెట్రోల్ వంటి శిలాజ ఇంధనంతో కాకుండా విద్యుత్తుతో నడిస్తే కాలుష్య సమస్యలు చాలా వరకూ తగ్గుతాయి. అచ్చంగా ఇదే ఆలోచనతో సిద్ధమైన విమానం సన్ఫ్లయర్ ఇటీవలే పరీక్షలు పూర్తి చేసుకుంది. అయితే ఏంటి? అంటున్నారా? ఇందులో చాలా విశేషాలు ఉన్నాయి మరి. ఒక్కటొక్కటిగా చెప్పుకుందాం. దీనిని అమెరికా కంపెనీ ‘బై ఏరో స్పేస్’ తయారు చేసింది. మొత్తం బరువు 1860 కిలోలు మాత్రమే. ఇద్దరు ప్రయాణించే వీలుంది. మొత్తం ఆరు లిథియం అయాన్ బ్యాటరీల్లో నిక్షిప్తమైన విద్యుత్తుతో 3.5 గంటలపాటు నడవగలదు ఈ విమానం. సాధారణ లిథియం అయాన్ బ్యాటరీల కంటే ఎక్కువగా.. అంటే ప్రతి కిలో బరువున్న బ్యాటరీలో 260 వాట్స్/గంట విద్యుత్తు నిల్వ ఉండటం విశేషం. అంతేకాకుండా వీటిని వేగంగా రీఛార్జ్ చేసుకోవచ్చు కూడా. ప్రయాణించే ఎత్తు, వేగం, ప్రతికూల పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యం కూడా ఇప్పటికే తయారైన ఇతర విద్యుత్తు విమానాలతో పోలిస్తే చాలా ఎక్కువని కంపెనీ అంటోంది. కార్బన్ ఫైబర్ వంటి అత్యాధునిక మిశ్రమ లోహాలను వాడటం ద్వారా తాము విమానం మొత్తం బరువును గణనీయంగా తగ్గించగలిగామని అంటోంది. ప్రస్తుతానికి తాము పైలట్లకు శిక్షణ ఇచ్చే లక్ష్యంతో సన్ఫ్లయర్ను తయారు చేశామని, నాలుగు సీట్లు ఉన్న సన్ఫ్లయర్–4ను తయారుచేసే ఆలోచన కూడా ఉందని కంపెనీ తెలిపింది. అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. సాధారణ విమానాలతో పోలిస్తే ఈ విమానాల ప్రయాణ ఖర్చు పది రెట్లు తక్కువగా ఉండటం. -
సౌండ్లెస్ సూపర్సోనిక్
నాసా కోసం రూ.1610కోట్లు ఖర్చుచేసి లాక్హీడ్ మార్టిన్ సంస్థ తయారుచేయనున్న సూపర్సోనిక్ ‘ఎక్స్’ విమానం ఊహాచిత్రమిది. 55వేల అడుగుల ఎత్తులో, గంటకు 1,513 కి.మీ.ల వేగంలో దూసుకెళ్లేలా దీన్ని తయారుచేస్తున్నారు. ఇది వెళ్తున్నపుడు.. కారు తలుపు వేసినపుడు వచ్చేంత తక్కువ శబ్దమే వస్తుందని కంపెనీ చెబుతోంది. 94 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుండే ఈ విమానం బరువు 14,650 కేజీలు. -
విమానంలో ప్రయాణికుడు మృతి
శంషాబాద్: ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ విమానంలో తీవ్ర అస్వస్థతతో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్కు చెందిన ఈకే372 విమానం దుబాయి నుంచి బ్యాంకాక్కు బయలుదేరింది. మార్గంమధ్యలో సూడాన్కు చెందిన మహ్మద్ అలీ(55) అనే ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం అతన్ని విమానాశ్రయ ప్రాంగ ణంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అలీ విమానంలోనే మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. సుమారు మూడు గంటల తర్వాత విమానం తిరిగి బయలుదేరింది. -
ఎయిర్పోర్టులో తప్పిన ప్రమాదం
శంషాబాద్ : శంషాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం పెనుప్రమాదం తప్పింది. విమానంలో ఇంధనం నింపే క్రమంలో ఏర్పడిన లీకేజీని సిబ్బంది వెంటనే గుర్తించి అప్రమత్తమయ్యారు. జెడ్డా నుంచి ఇండోనేసియా వెళ్తున్న సిటీలింక్ ఎయిర్వేస్కు చెందిన విమానం ఇంధనం కోసం ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయంలో దిగింది. ఇంధనం నింపుతున్న సమయంలో లీకేజీ ఏర్పడి రన్వేపై పడింది. దీన్ని వెంటనే గమనించిన సిబ్బంది ఫైర్ ఇంజిన్ల సహాయంతో రన్వేను శుభ్రం చేశారు. సరైన జాగ్రత్తలు తీసుకున్న తర్వాత విమానం ఇక్కడి నుంచి టేకాఫ్ అయ్యింది. -
ఇదేంటో గుర్తుపట్టారా ?.. తప్పిన భారీ ప్రమాదం
సాక్షి, చెన్నై : పైన ఫోటోలో ఏముందో గుర్తుపట్టారా ? ల్యాండ్ అయిన తర్వాత స్పైస్ జెట్ విమాన టైర్లు పేలడంతో రన్వేతే రాపిడి జరిగి ఫోటోలో ఉన్న ఆకారానికి వచ్చాయి. 199 మంది ప్రయాణికులతో గురువారం చెన్నై నుంచి ఢిల్లీ వెలుతున్న విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. టైర్లను లిఫ్ట్ చేసే హైడ్రాలిక్ సిస్టమ్లో సమస్య ఏర్పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్ వే నుంచి టేకాఫ్ అవుతుండగా విమానం టైరు పేలినట్టు సిబ్బంది గుర్తించారు. అప్రమత్తమైన పైలట్ విమానాన్ని సురక్షితంగా తిరిగి చెన్నై విమానాశ్రయంలో దించారు. విమానంలోని ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించి, తిరిగి టెర్మినల్ బిల్డింగ్లోకి తీసుకెళ్లారు. టైర్ పేలిన ఘటనతో మెయిన్ రన్ వే పాడయ్యింది. దీంతోమూడు గంటలపాటూ మెయిన్ రన్వేను మూసివేశారు. సంబంధిత వార్త : టేకాఫ్ అవుతుండగా పేలిన టైర్ -
మధ్యలోనే వెనక్కి వెళ్లిన విమానం
నార్వే : టాయిలెట్లలో సమస్య ఏర్పడి దాదాపు సగం దూరం వెళ్లిన విమానాన్ని తిరిగి వెనక్కి తీసుకొచ్చి దింపేశారు. ఆ విమాన ప్రయాణీకుల్లో టాయిలెట్స్లో సమస్య ఏర్పడితే పరిష్కరించే ప్లంబర్స్ 60మందికి పైగా ఉన్నప్పటికీ వారు ముందుకు రాకపోవడంతో దాదాపు రెండున్నరగంటలపాటు రివర్స్ జర్నీ చేసి సమస్య పరిష్కరించుకోవాల్సి వచ్చింది. నార్వే ఎయిర్ విమానంలో ఈ సమస్య తలెత్తింది. వివరాల్లోకి వెళితే.. నార్వేలోని ఓస్లో నుంచి డీవై 1156 అనే విమానం జర్మనీలోని మ్యూనిచ్కు బయలుదేరింది. అది సరిగ్గా స్వీడన్ బోర్డర్ దాటే సమయంలోనే టాయిలెట్లలో సమస్య ఉన్నట్లు తెలిసింది. అయితే, అదే విమానంలోమ మొత్తం 186మంది ప్రయాణీకులు ఉండగా కనీసం 60 నుంచి 70మంది ప్లంబర్లు ఉన్నారు. వారంతా రార్క్జాప్ అనే కంపెనీలో పనిచేసేందుకు మ్యూనిచ్కు వెళుతున్నారు. పైగా వారందరికీ మంచి సుశిక్షితులుగా గుర్తింపు ఉంది. కానీ, వారిలో ఏ ఒక్కరు కూడా టాయిలెట్లో సమస్యను పరిష్కరించి తమను తాము నిరూపించుకోలేకపోయారు. దీనిపై వర్కర్లను తెప్పించుకున్న కంపెనీ సీఈవో ఫ్రాంక్ ఓల్సెన్ మాట్లాడుతూ సహాయం చేసేందుకు తమవాళ్లు సిద్ధంగా ఉన్నప్పటికీ అప్పటికి విమానం 10వేల అడుగుల ఎత్తులో ఎగురుతోందని, ఆ సమస్య వెలుపల నుంచి పరిష్కరించాల్సింది కావడంతో తమ వారెవరూ కూడా ఆ పనిచేయలేదని వివరణ ఇచ్చారు. మొత్తానికి దాదాపు రెండుగంటలపాటు ప్రయాణించిన విమానాన్ని తిరిగి ఓస్లోకు మళ్లించి సమస్య పరిష్కరించి మరోసారి ప్రయాణం ప్రారంభించారు. -
మృత్యువు అంచులను చూశారు
-
మృత్యువు అంచులను చూశారు
అంకారా(టర్కీ) : టర్కీకి చెందిన పెగాసస్ ఎయిర్లైన్స్కు చెందిన విమానానికి ఆదివారం పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి రన్ వేపై నుంచి పక్కకు వెళ్లినట్లు టర్కీ మీడియా పేర్కొంది. టర్కీ రాజధాని అంకారా నుంచి ట్రబ్జాన్ పట్టణానికి 162 మంది ప్రయాణీకులతో విమానం బయల్దేరినట్లు చెప్పింది. ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పిన విమానం.. కొంచెం ఉంటే సముద్రంలోకి దూసుకెళ్లేదని తెలిపింది. సముద్రానికి కొద్ది మీటర్ల దూరంలో విమానం ఆగినట్లు చెప్పింది. ఈ ఘటనలో ప్రయాణీకులకు ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించింది. అయితే, విమానం నుంచి పెద్ద ఎత్తున పొగలు వచ్చాయని చెప్పింది. దీంతో ఫైర్ ఇంజన్లు హూటాహుటిన అక్కడికి చేరుకుని పొగను అదుపులోకి తీసుకొచ్చాయని పేర్కొంది. కాగా, విమాన ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ట్రబ్జాన్ ప్రభుత్వం వెల్లడించింది. -
సిడ్నీ నదిలో కూలిన విమానం
సిడ్నీ : ఆస్ట్రేలియాలో విమానం కూలిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర సిడ్నీకి 50 కిలోమీటర్ల దూరంలోగల హక్సిబరీ నదిలో ఆదివారం విమానం కూలింది. సింగిల్ ఇంజిన్తో నడిచే ఎయిర్ క్రాఫ్ట్ 43 అడుగుల ఎత్తు నుంచి నదిలో కూలిపోయిందని యాక్టింగ్ సూపరింటెండెంట్ మైగోర్మెన్ వెల్లడించారు. మూడు మృతదేహాలను వెలికి తీసినట్లు తెలిపారు. మిగతా వారికోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయన్నారు. విమానం ఎందుకు కూలిందనేది తెలియాల్సి ఉందన్నారు. -
మహిళ అని కూడా చూడకుండా..
అమెరికా పోలీసులు ఓ మహిళని సౌత్ వేస్ట్ ఎయిర్లైన్స్ విమానం నుంచి ఈడ్చుకుంటూ తీసుకువెళ్లిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. వివరాలు.. సౌత్ వేస్ట్ ఎయిర్లైన్స్లో ఓ మహిళ( పేరు వెల్లడించలేదు ) బాల్టిమోర్ నుంచి లాస్ఏంజిల్స్కు వెళ్లడానికి సిద్ధమైంది. అయితే అదే విమానంలో రెండు శునకాలు కూడా ఆన్బోర్డులో ఉన్నాయి. దీంతో కుక్కలంటే తనకు అలెర్జీ ఉందని, తనకు ప్రాణాంతకమైన వ్యాధులు సోకే అవకాశం ఎక్కువగా ఉందని విమాన సిబ్బందికి ఆ మహిళ ఫిర్యాదు చేశారు. శునకాలని విమానం నుంచి పంపించాలని సిబ్బందిని కోరారు. అయితే సిబ్బంది దానికి నిరాకరించి ఆమెనే వెళ్లిపోవాలని ఆదేశించారు. దీనికి నిరాకరించడంతో ఆమెను బయటికి పంపించడానికి విమాన సిబ్బంది పోలీసుల సహకారాన్ని కోరారు. ముందుగా సౌత్ వెస్ట్ సిబ్బంది మహిళతో విమానంలోని వెనకవైపు భాగంలో చర్చించారని ప్రయాణికులు తెలిపారు. మరుసటిరోజు ఉన్న తమ విమానసర్వీసులో ఆమెకు టికెట్ బుక్ చేస్తామని సిబ్బంది చెప్పినా ఆమె నిరాకరించిందని తెలిపారు. ఆ రోజులో అదే చివరి విమానం కావడంతో తాను ఖచ్చితంగా దాంట్లోనే వెళ్తానని తేల్చిచెప్పిందని తోటి ప్రయాణికులు చెప్పారు. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులతో కూడా తాను విమానంలో నుంచి దిగనని ఆమె స్పష్టం చేశారు. దీంతో ఓ పోలీసు అధికారి అమె వీపువెనక నుంచి ముందుకు చేతులు పెట్టి ఆమెను సీట్లోనుంచి పైకి లాగగా, మరో వ్యక్తి ముందు కాళ్లను పట్టుకొని మహిళ అని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లారు. అయితే అమెరికాలోనే గత ఏప్రిల్లో చికాగోలో యునైటెడ్ ఎక్స్ప్రెస్ ఫ్లైట్లో సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది. ఓ వ్యక్తిని పోలీసులు తన సీటు నుంచి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి విమానం దింపారు. ఆ ఘటనపై అప్పట్లో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో యునైటెడ్ ఎక్స్ప్రెస్ ఫ్లైట్లో జరిగిన తప్పిదమే తిరిగి పునరావృతం అవ్వడంతో సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ ఆలస్యం చేయకుండా సదరు మహిళకు క్షమాపణలు చెప్పింది. ప్రయాణికురాలిని విమానం నుంచి దించడానికి స్థానిక పోలీసులు వ్యవహరించిన తీరు చాలా బాధాకరం అని ఎయిర్లైన్స్ అధికార ప్రతినిధి క్రిస్ మెయిన్జ్ తెలిపారు. శునకాలతో తన ఆరోగ్యానికి ఇబ్బంది అని మెడికల్ సర్టిఫికెట్లు చూపించి ఉంటే ఆమె ప్రయాణానికి ఇబ్బంది ఉండకపోయి ఉండేదన్నారు. 'మా నాన్నకి సర్జరీ ఉంది. నేను ఖచ్చితంగా వెళ్లాలి' అంటూ ప్రాదేయపడినా పోలీసులు ఆ మహిళా ప్రయాణికురాలిపై దురుసుగా ప్రవర్తించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. 'మీరు అసలు ఏం చేస్తున్నారు. నా ప్యాంటు కూడా ఊడి పోతోంది(సరి చేసుకుంటూ).. నేను నడవగలను .. దయచేసి నా మీద చేతులు వేయకండి.. నేనొక ప్రొఫెసర్ని' అంటూ ఆ మహిళ చెప్పడం వీడియోలో రికార్డయింది. హాలీవుడ్ సినీ నిర్మాత బిల్ డుమాస్ ఈ తతంగాన్ని మొత్తం తన సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు పోలీసుల తీరుపై త్రీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓ మహిళా ప్రొఫెసర్పై ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అంటూ నిప్పులు చెరిగారు. 'విమానం నుంచి దింపకూడదని ఆమె అధికారులతో చివరివరకు పోరాడింది' అని బిల్ డుమాస్ తెలిపారు. -
మహిళ అని కూడా చూడకుండా..
-
అదృష్టం.. అంతే?!
సాక్షి, వాషింగ్టన్ : నిజంగా భూమ్మీద నూకలు మిగిలి ఉంటే.. ఎటువంటి ప్రమాదంలో చిక్కుకున్నా బతికేస్తాం. విమానం నుంచి కిందపడ్డా.. మహాసముద్రంలో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయినా.. ప్రాణాలతో బయటపడతాం. మీరు నమ్మినా.. నమ్మకపోయినా.. సరిగ్గా ఇటువంటి ప్రమాదం నుంచి కొందరు ప్రాణాలతో బయటపడ్డారు.. అది కూడా విమాన ప్రమాదంనుంచి.. అమెరికాలోని ప్లెయిన్విల్లే ప్రాంతంలో ఒక ఆసుపత్రి ఉంది. మంగళవారం ఆ ఆసుపత్రి ముందు.. ఒక తేలికపాటి విమానం చక్క్ర్లు కొడుతోంది. చూసిన జనాలు దానిని పట్టించుకోలేదు. ఇంతలో హఠాత్తుగా అదుపు తప్పిన విమానం.. నేరుగా చెట్టును ఢీకొట్టింది. చిత్రంగా ఆ విమానం ఎటువంటి కార పర్కింగ్లో పార్క్ చేసినట్లు చక్కగా పార్కింగ్ప్లేస్లో ల్యాండయింది. ఆ విమానంలో ప్రయాణిస్తునన మ్యాన్ఫ్రెడ్ ఫ్రాస్ట్ సహా మరో ఇద్దరికి చిన్నచిన్న గాయాలయ్యాయి. వీరంతా ఎదురుగా ఉన్న ఆసుపత్రిలో చికిత్స తీసుకుని చక్కా ఇంటికి పోయారు. -
బాలునికి అస్వస్థత.. విమానం వెనక్కి
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు బయల్దేరిన విమానంలో ప్రయాణిస్తున్న ఓ బాలుడు తీవ్ర అస్వ స్థతకు గురయ్యాడు. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా వెనక్కి మళ్లించారు. స్పైస్ జెట్ విమానం విశాఖ నుంచి మంగళవారం రాత్రి 8.40 గంటలకు హైదరాబాద్కు బయల్దేరింది. కొద్దిసేపటికే విమానంలో ప్రయాణిస్తున్న ఎనిమిదేళ్ల బాలుడు తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. ఊపిరందక విల విల్లాడిపోయాడు. బాలుడి తల్లి ఆందోళ నకు గురికావడంతో విమానాన్ని తిరిగి విశాఖకు తీసుకొచ్చారు. ఈలోగా విమానా శ్రయంలో అప్రమత్తమైన వైద్య బృందాలు బాలుడికి ప్రాథమిక వైద్యమందించాయి. ఆస్తమా కారణంగా బాలుడు ఇబ్బంది పడి నట్టు వైద్యులు తేల్చారు. దీంతో తల్లీకొడు కులు ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో విమానం విశాఖ నుంచి రాత్రి 10.15 గంటలకు తిరిగి బయల్దేరింది. -
సన్నీకి తప్పిన ప్రమాదం..
ముంబై: బాలీవుడ్ నటి సన్నీలియోన్ పెను ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. సన్నీ తన భర్త డేనియల్, మరికొందరు స్నేహితులతో కలిసి బుధవారం ఓ ప్రైవేటు విమానంలో ప్రయాణిస్తోంది. ఆ సమయంలో వాతావరణం అనుకూలించక పోవడంతో విమానం కుదుపులకు గురైంది. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని జాగ్రత్తగా మారుమూల ప్రాంతంలో దింపేశాడు. విమానం ప్రమాదానికి గురైనప్పుడు తాను అనుభవించిన భయానక క్షణాలను వివరిస్తూ సన్నీ లియోన్ ఓ సెల్ఫీ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. మేము ప్రాణాలతో ఉన్నందుకు దేవుడికి ధన్యవాదాలు! వాతావరణం అనుకూలించని కారణంగా మా ప్రైవేటు విమానం పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ప్రస్తుతం ఇంటికి వెళుతున్నాము.. థ్యాంక్స్ యూ గాడ్ అని సన్ని ట్వీట్ చేశారు. పైలట్స్ అద్భుతమైన నైపుణ్యం కలవారని, తమ జీవితాలను కాపాడారని సన్ని చెప్పారు. సన్నీ ప్రాణాలతో బయటపడటంతో ఆమె అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. Thank the lord we are all alive! Our private plane almost crashed through bad weather. Counting our stars and driving home! Thank you God! pic.twitter.com/9jhTQ1arHX — Sunny Leone (@SunnyLeone) 31 May 2017 -
పక్షి దెబ్బా మజాకా...
కోల్కతా: పక్షి ఢీకొనడంతో విమానాన్ని అత్యవసరంగా దించాల్సి వచ్చింది. సోమవారం దిల్లీ నుంచి కోల్కతా వెళుతున్న బోయింగ్ 787-8 ఎయిర్ ఇండియా విమానాన్ని పక్షి ఢీకొంది. దాంతో ఇంజన్లో లోపం ఏర్పడింది. అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని కోల్కతా విమానాశ్రయంలో దించాడు. ఆ సమయంలో విమానంలో 254 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఎయిరిండియా అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపరి పీల్చుకున్నారు. -
విమానంలోంచి బిల్డింగ్పై పడేశారు
మెక్సికో: గాల్లో వెళ్లే విమానంలో నుంచి ఓ వ్యక్తిని కిందకు పడేసిన సంఘటన మెక్సికోలో సంచలనం సృష్టిస్తోంది. మెక్సికోలోని డ్రగ్స్ అక్రమ రవాణా ముఠాలు ఎక్కువగా ఉండే ప్రాంతమైన సినోలా రాష్ట్రంలో కొద్ది ఎత్తులో వెళ్తున్న విమానంలో నుంచి ఒక వ్యక్తిని బిల్డింగ్పై పడేశారు. ఎల్డొరాడో నగరంలోని ఐఎమ్ఎస్ఎస్ ఆసుపత్రి మీద ఆ వ్యక్తి శరీరం పడిందని ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన హెల్త్ అధికారి ఒకరు తెలిపారు. ఆసుపత్రి రూఫ్ నుంచి వ్యక్తి శరీరాన్ని లోపలికి తీసుకొచ్చి చికిత్స అందించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అయితే, వ్యక్తిని చంపి కిందకు పడేశారా? లేదా ప్రాణాలతోనే కిందకు పడేశారా? అనే విషయాన్ని వైద్యులు వెల్లడించలేదు. కాగా, సినోలా రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా ముఠాలు ఒకరిపై ఒకరు ప్రతీకారదాడులు చేసుకోవడం షరామామూలై పోయింది. 2016లో సినోలా డ్రగ్స్ అక్రమ రవాణా డాన్ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఇక్కడి మరింత రెచ్చిపోయి ప్రతీకార దాడులకు పాల్పడుతున్నాయి. -
కుప్పకూలిన విమానం..నలుగురి మృతి
కాలి ఫోర్నియా: అమెరికాలో ఓ చిన్న విమానం కుప్పకూలింది. సోమవారం కాలిఫోర్నియాలోని రివర్ సైడ్ లో సోమవారం ఒక నివాస ప్రాంతం లోకి కూలిపోవడంతో నలుగురు దుర్మరణం చెందారు. పెద్ద శబ్దంతో ఒక్కసారిగా విమానం కూలిపోయిన విమానం మంటల్లో చిక్కుకోవడంతో , ఆప్రాంతమంతా దట్ట మైన పొగవ్యాపించిందనీ ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈశాన్య రివర్సైడ్ మున్సిపల్ విమానాశ్రయంనుంచి బయలుదేరిన చిన్న విమానం సెస్నా 310 నివాసం ప్రాంతంపై కూలిపోయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి ఇయాన్ గ్రెగర్ ప్రకటించారు. ఈ ప్రమాదంలో రెండు గృహాలు మంటల్లో చిక్కుకున్నాయని ఫైర్ చీఫ్ మైఖేల్ మూర్ తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురితో బయలుదేరిన విమానం సాన్జోస్ కు తిరిగి వస్తుండగా, అకస్మాత్తుగా నివాసప్రాంతాల్లోకి దూసుకొచ్చి కుప్పకూలడంతో మంటలు వ్యాపించాయి. వీరిలో ఇద్దరు పెద్దవాళ్లు, ముగ్గురు టీనేజర్లు ఉన్నట్టు సమాచారం. ఓ యువతి సహా ఇద్దరిని రక్షించిన పోలీసులు చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే చనిపోయినవారు, విమానంలోనివారా, లేక స్థానికులా అనేది ఇంకా గుర్తించలేదని చెప్పారు. దాదాపు 30 మంది స్తానికులను అక్కడినుంచి సురక్షిత ప్రాంతానికి కు తరలించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
సముద్రంలో కూలిన విమానం
మాస్కో: రష్యాలో రక్షణ శాఖకు చెందిన గల్లంతైన విమానం సముద్రంలో కూలిపోయినట్లు తెలుస్తోంది. నల్ల సముంద్రంలో విమానశకలాలు గుర్తించినట్లు రష్యా మీడియా వెల్లడించింది. టీయూ-154 మిలిటరీ విమానం సోచి నుంచి సిరియా సముద్రతీర నగరం లటాకాకు బయలు దేరింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5:20 గంటలకు సోచిలో టేకాఫ్ అయిన విమానం.. 5:40 గంటలకు రాడార్ నుంచి తప్పిపోయినట్లు ఎమర్జెన్సీ మినిస్ట్రీ అధికారులు వెల్లడించారు. విమానంలో జర్నలిస్టులు, సైనికాధికారులు, మ్యుజీషియన్స్ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం విమానంలో 83 మంది ప్రయాణికులతో పాటు 8 మంది సిబ్బంది ఉన్నారు. -
91 మందితో విమానం అదృశ్యం!
-
విమానం హైజాక్... పేల్చేస్తామని బెదిరింపులు
-
విమానం హైజాక్ కథ సుఖాంతం
లిబియా విమానం హైజాక్ ఉదంతం సుఖాంతమైంది. విమానంలోని 111 మంది ప్రయాణీకులతో పాటు సిబ్బందినికూడా హైజాకర్లు విడిచిపెట్టారు. తొలుత బందీల్లో మహిళలను, చిన్నారులను వదిలిట్టిన హైజాకర్లు చివరికి ప్రభుత్వానికి లొంగిపోయారు. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. లిబియా ప్రభుత్వ రంగ సంస్థ ఆఫ్రికియా ఎయిర్ వేస్ కు చెందిన ఎయిర్ బస్ 320 అనే విమానాన్ని శుక్రవారం హైజాక్ చేశారు. మొత్తం111మంది ప్రయాణికులు ఏడుగురు సిబ్బందితో బయలుదేరిన విమానాన్ని దారి మళ్లించారు. విమానాన్ని పేల్చివేస్తామని బెదిరించారు. దీంతో మాల్టీస్ ప్రధానమంత్రి జోసెఫ్ మస్కట్ రంగంలోకి దిగి లిబియా ప్రధాని ఫయీజ్ అల్ సెర్రాజ్తో కూడా ఆయన సంప్రదింపులు జరిపారు. భద్రతా దళాలు రక్షణ మరియు అత్యవసర చర్యల్ని చేపట్టి, హైజాకర్లతో మంతనాలు జరిపారు. నైరుతీ లిబియా సబా నుంచి ట్రిపోలీ వెళుతుంగా హైజాకర్లు దాళి మళ్లించారు. దీంతో మాల్టా ఎయిర్పోర్టులో హైఅలర్ట్ ప్రకటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కొన్ని విమానాలను రద్దుచేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. Informed of potential hijack situation of a #Libya internal flight diverted to #Malta. Security and emergency operations standing by -JM — Joseph Muscat (@JosephMuscat_JM) December 23, 2016 -
విమాన ప్రమాదానికి గురైన జట్టుకే టైటిల్
ఆసిన్సియన్: ఇటీవల కొలంబియాలో విమాన ప్రమాదానికి గురైన బ్రెజిల్ ఫుట్ బాల్ క్లబ్ జట్టుకు కోపా సుడామెరికన్ టైటిల్ అప్పగించేందుకు దక్షిణ అమెరికా ఫుట్బాల్ సమాఖ్య అంగీకరించింది. దాంతో పాటు ఆ జట్టుకు రెండు మిలియన్లు యూఎస్ డాలర్ల ప్రైజ్ మనీని కూడా ఇవ్వనున్నారు. ప్రత్యర్థి జట్టు అట్లెటికో విజ్ఞప్తి మేరకు ఆ టైటిల్ను వారికి ఇవ్వడానికి అంగీకరించిన విషయాన్ని దక్షిణ అమెరికా ఫుట్ బాల్ సమాఖ్య తాజాగా స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తాజాగా వెల్లడించిన దక్షిణా అమెరికా ఫుట్ బాల్ సమాఖ్య.. ఈ లీగ్ ఫెయిర్ ప్లే అవార్డును అట్లాటికో జట్టుకు ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొంది. గత కొన్నిరోజుల క్రితం బ్రెజిల్ కు చెందిన చాపీకోయెన్స్ జట్టు ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలి పలువురు ఆటగాళ్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ జట్టు మెడిల్లిన్ లో జరిగే తొలి అంచె ఫైనల్కు వెళుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. తొలి ఫైనల్లో కొలంబియన్ క్లబ్ జట్టు అట్లెటికో జట్టుతో చాపీకోయెన్స్ ఆడాల్సి ఉంది. ఈ ప్రమాదంలో దాదాపు 71 మంది ప్రయాణికులు అసువులు బాసిన సంగతి తెలిసిందే. ఇందులో 19 ఫుట్ బాల్ ఆటగాళ్లు ప్రాణాలు కోల్పోగా, అతికొద్ది మంది మాత్రమే గాయాలతో బయటపడ్డారు. -
విమానం ల్యాండవుతుండగా పేలిన టైరు
ముంబై: ఎయిర్ ఇండియా వియానం ముంబై లోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి ముంబైకి వస్తున్న ఎ1 614 విమానం ల్యాండ్ అవుతుండగా టైర్ పేలిపోయింది. దీంతో ఒక్కసారి కలకలం రేగింది. 128 మంది ప్రయాణికులు, సిబ్బందితో వస్తుండగా మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రయాణీకులు, సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. నిర్దేశిత సమయానికి మరో విమానాన్ని ఏర్పాటు చేశామని, ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసామన్నారు. -
కడలిపై విమాన కలకలం
టీ.నగర్: కన్యాకుమారి సముద్రంపై గుర్తు తెలియని విమానం చక్కర్లు కొట్టడంతో కలకలం చెలరేగింది. దీంతో పోలీసులు రాత్రంతా గస్తీ పనులలో నిమగ్నమయ్యారు. కన్యాకుమారి జిల్లాలోని ఆరోగ్యపురం నుంచి నీరోడి వరకు 45కు పైగా సముద్రతీర గ్రామాలున్నాయి. ప్రస్తుతం ఈ తీర గ్రామాలలో భద్రతను పెంచారు. కుళచ్ఛల్ నుంచి కోస్టుగార్డు పోలీసులు ఆధునిక పడవలలో ప్రతిరోజు గస్తీ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి కన్యాకుమారి నుంచి కుళచ్ఛల్ వరకు గల తీర ప్రాంతాల్లో ఓ విమానం చక్కర్లు కొట్టింది. దీనిపై ఆందోళన చెందిన స్థానికులు వెంటనే ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ కార్యాలయ కంట్రోల్ రూమ్కు సమాచారం తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న కన్యాకుమారి పోలీసులతో పాటు కుళచ్ఛల్ నుంచి కోస్టుగార్డు పోలీసులు కూడా వచ్చి తీర ప్రాంతాలలో గస్తీ తిరిగారు. ఈ విమానం మూడు గంటల సేపు ఆ ప్రాంతంలో పర్యటించినట్లు తెలిసింది. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు గస్తీని పెంచారు. తీర ప్రాంతాలలో అనుమానిత వ్యక్తులు సంచరించినట్లయితే వెంటనే తెలియచేయాలని పోలీసులు ప్రజలను కోరారు. -
విమానంలో పేలిన స్మార్ట్ ఫోన్
చెన్నై:గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ల పేలుళ్లతో ఇబ్బందులు పడుతున్న కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ ను మరో వివాదం చుట్టుకుంది. సింగపూర్ నుంచి చెన్నైకి వచ్చిన ఇండిగో విమానంలో శాంసంగ్ నోట్ 2 బ్యాటరీ పేలి, పొగలు వ్యాపించాయి. స్వల్పంగా మంటలు అంటుకోవడం కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దారు. విమానంలోని 182 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. అయితే ఈ ఘటనపై డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే శాంసంగ్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. సోమవారం సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరింది. చెన్నైలో జరిగిన పేలుడు ఘనటలో ఎలాంటి నష్టం జరగలేదు. అయితే ఈ ఘటనతో డీజీసీఏ మరోసారి అప్రమత్తమైంది. ప్రయాణికులు శాంసంగ్ నోట్ ఫోన్లను తీసుకు రావద్దంటూ ఆంక్షలు విధించాలని ఎయిర్ లైన్స్ ను కోరింది. శాంసంగ్ నోట్ స్మార్ట్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయాల్సిందిగా ప్రయాణికులను కోరుతూ ప్రతి విమానంలో ఒక ప్రకటన చేయాలని సూచించింది. కాగా విమానాల్లో శాంసంగ్ ఫోన్లు వాడొద్దని ఇప్పటికే డీజీసీఐ నిషేధం విధించిన విషయం తెలిసిందే. -
తన విమానంలోకి జర్నలిస్టులకు ఓకే
న్యూయార్క్: ఎట్టకేలకు తన ప్రచారక విమానంలోకి అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ విలేకరులను అనుమతించింది. ఇప్పటికే ఆమె పూర్తి చేసిన 272 రోజుల ప్రచారంలో ఆమె ప్రయాణిస్తున్న విమానంలో మీడియా ప్రతినిధులతో సమావేశానికి ఆమె అనుమతించలేదు. అయితే, ఇక ఈ నెల (సెప్టెంబర్) 5 నుంచి మీడియా ప్రతినిధులకు నేరుగా తన విమానంలోనే ప్రెస్ మీట్ అవకాశం ఇవ్వనున్నారు. ఈ విమానంలో హిల్లరీతోపాటు ఆమె సలహాదారులు, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, రిపోర్టర్లు ఉండనున్నారు. ఒహియో, ఇల్లినాయిస్లో భారీ ప్రచారంతో సెప్టెంబర్ 5న హిల్లరీ బిజిబిజీగా మారనున్నారు. -
విమానం గాల్లో ఉండగా మిరాకిల్
దుబాయ్: అది సెబు పసిఫిక్ ఎయిర్ ఫ్లైట్. ఈ నెల(ఆగస్టు) 14న దుబాయ్ నుంచి మనీలాకు బయల్దేరింది. అందులో ఓ గర్భిణీ స్త్రీ, ఆమె తల్లి వెళ్లారు. అలా విమానం టేకాఫ్ తీసుకొని మధ్యలోకి వెళ్లగానే ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. దీంతో తోటి ప్రయాణికులు అప్రమత్తమవడంతోపాటు విమానంలోనే సిబ్బందికి ఈ విషయం చేరవేయడంతో మెడికల్ అసిస్టెంట్స్ వచ్చారు. ప్లైట్ మధ్యలో దించే పరిస్థితి లేదు. మరోపక్క పురిటినొప్పులు ఎక్కువై ఆ బాధతో అరుస్తుండగా ఆమెను సీట్లో నుంచి కొంచెం విశాలమైన చోటుకి తీసుకెళ్లి అక్కడ ఏర్పాట్లు పూర్తి చేస్తుండగానే ఓ పండంటి బిడ్డకు జన్మినిచ్చింది. అక్కడే ఓ టబ్ నిండా మినరల్ వాటర్ నింపి ఆ నీటితో పసిబిడ్డను శుభ్రం చేశారు. అనంతరం తల్లికి స్నానం చేయించారు. ఆ తర్వాత ఆమె తన ముద్దులపాపను చేతుల్లోకి తీసుకొని ఏం చక్కా ఎప్పటిలాగే తన సీట్లో కూర్చుంది. అలా నిమిషాల్లోనే విమానంలో ఇద్దరుగా వచ్చినవారు ముగ్గురయ్యారు. ఆ ప్రయాణికురాలు తల్లిగా ఆమెకు తల్లిగా ఉన్న పెద్దావిడ బామ్మగా మారింది. ఇదంతా పక్క సీట్లో కూర్చుని గమనించిన ఓ ప్రయాణికురాలు తన ఫేస్ బుక్ లో ఆ మాతృమూర్తి ఫొటోతో సహా పోస్ట్ చేసింది. ఇది నిజంగా ఓ మిరాకిల్ అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు.. ఈ పాప జన్మించే సమయంలో విమానం భారత దేశ గగనతలంలో ఉంది. అప్పుడే జన్మించిన బిడ్డ రక్షణ చర్యలకోసం విమానాన్ని అత్యవసరంగా ఢిల్లీలో కూడా దించారు. అలా 8 గంటల్లో ముగియాల్సిన ప్రయాణం 18 గంటలు పట్టింది. అయినప్పటికీ ఏ ఒక్క ప్యాసింజర్ కూడా ప్రశ్నించలేదంట. మరో ఆశ్చర్యం ఏంటంటే భారత భూభాగంలో జన్మించిన ఈ బిడ్డకు టెక్నికల్ గా భారత పౌరసత్వం వస్తుందట. అయితే, విమానంలోగానీ, నౌకలోగాని జన్మించిన బిడ్డకు అవి ఏ దేశానికి చెందినవి అవుతాయో ఆ దేశాల పౌరసత్వాలే వస్తాయని యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. -
టేకాఫ్ తీసుకోగానే కూలిన విమానం
హ్యూస్టన్: టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే ఓ విమానం కూలిపోయిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందారు. ఈ ఘటన అమెరికాలోని హ్యూస్టన్లో చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ తీసుకున్న 'పైపర్ పీఏ-32' రకానికి చెందిన విమానం వెస్ట్ హ్యూస్టన్ ఎయిర్పోర్ట్ సమీపంలో కూలిపోయినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో విమానంలో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎయిర్పోర్ట్ సమీంపలోని చెట్ల పొదల్లో విమానం కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. నేలను తాకగానే భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో విమానం తునాతునకలైనట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. మృతిచెందిన వారిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. విమానం కూలిపోవటానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. -
కుప్పకూలిన విమానం..నలుగురి మృతి
హూస్టన్: అమెరికాలో ఓ చిన్నవిమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో నలుగురు మరణించారని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. నలుగురితో బయలుదేరిన సింగిల్ ఇంజీన్ పీఏ- 32 ప్రయివేట్ హూస్టన్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే జనావాసాలపై కుప్పకూలింది. శుక్రవారం సాయంత్రం వెస్ట్ హూస్టన్ విమానాశ్రయంనుంచి గాల్లోకి లేచిన కొద్ది సేపటికే నేలపై పడిపోయి పూర్తిగా ధ్వంసమైంది. అయితే మంటల్లో చిక్కుకున్న విమానంనుంచి చిన్నచిన్న పేలుళ్లను గమనించామని ప్రత్యక్ష సాక్షులు కొంతమంది చెప్పారు. మృతులను ఇంకా గుర్తించలేదని, ప్రమాదానికి కారణాలను విచారిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. దర్యాప్తు ప్రారంభించామన్నారు. -
అలా అరిచినందుకే.. శిక్షపడింది..!
లండన్ః పాకిస్తాన్ సంతతికి చెందిన ఓ వ్యక్తి ''అల్లాహ్ -ఒ-అక్బర్'', ''బూమ్'' అంటూ విమానంలో అరవడం, ప్రయాణీకులను భయభ్రాంతులకు గురిచేయడంతో అతడికి పది వారాల జైలు శిక్ష పడింది. అతడు వాడిన పదాలు తప్పు కాకపోయినప్పటికీ విమానంలో అలా ప్రవర్తించడాన్ని కోర్టు తప్పుబట్టింది. షెహరాజ్ సర్వార్ అనే వ్యక్తి విమానంలో అల్లకల్లోలం సృష్టించడంతో అతడికి లండన్ కోర్టు ఏడు వారాల జైలు శిక్ష విధించింది. ఫిబ్రవరి నెలలో దుబాయ్ నుంచి బర్మింగ్ హామ్ వెడుతున్న ఎమిరేట్స్ బోయింగ్ 777 విమానంలో ప్రయాణించినప్పుడు అతడు చేసిన హడావుడికి ప్రయాణీకులను హడలి పోయేలా చేసింది. కాసేపు ఏం జరుగుతోందో తెలియక అంతా ఖిన్నులైపోయారు. అల్లాహ్-ఒ-అక్బర్ అంటూ అతి పెద్ద గొంతుతో, భీకరంగా పదే పదే అరుస్తూ ప్రయాణీకుల గుండెల్లో విమానాలు పరిగెత్తిచాడు. చివరికి విమానం ల్యాండ్ అయిన తర్వాత కూడ 'బూమ్' అంటూ గట్టిగా అరిచి అందర్నీ భయపెట్టినట్లు బర్మింగ్ హామ్ క్రౌన్ కోర్టు ప్రాసిక్యూటర్ అలెక్స్ వారెన్ తెలిపారు. క్యాబిన్ సిబ్బంది కూర్చోమని చెప్పినా వినకుండా సదరు వ్యక్తి అరుస్తూనే ఉండటంతో కొందరు ప్రయాణీకులు ఆగ్రహంతో పోలీసులకు ఫిర్యాదు చేశారని, అనంతరం అతడ్ని అరెస్టు చేసినట్లు అలెక్స్ వారెన్ కోర్టుకు తెలిపారు. సర్వార్ హింసాత్మక ప్రవర్తనపై ప్రయాణీకులనుంచి వెల్లువెత్తిన నేరారోపణలను ఆయన కోర్టుకు వివరించారు. ప్రాసిక్యూషన్ వాదనలు విన్న న్యాయమూర్తి ఫ్రాన్సిస్ లయర్డ్ .. విమానంలో 38 ఏళ్ళ సర్వార్ విపరీత ధోరణితో ప్రవర్థించినట్లుగా నిర్ధారించారు. శిక్షించకుండా వదిలేస్తే మరోసారి విమానాల్లో ప్రయాణీకులను భయపెట్టే ఇటువంటి ప్రయత్నాలు జరిగే అవకాశం ఉండటంతో నిందితుడు సర్వార్ కు 10 వారాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. నిందితుడికి జైలు శిక్ష ముగిసిన తర్వాత 12 నెలల పర్యవేక్షణ ఆర్డర్ తో విడుదల చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. సర్వార్.. పాకిస్తాన్ లోని తన అమ్మమ్మ అంత్యక్రియలకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఇటువంటి ఘటన జరిగిందని, అతడు కలత చెంది ఉండటంతోనే ఇలా జరిగి ఉండొచ్చని వాదించిన నిందితుడి తరపు న్యాయవాది బల్బీర్ సింగ్ సైతం తన క్లైంట్ ప్రవర్తన అవివేకంతోనే జరిగిందని ఒప్పుకున్నారు. ప్రయాణీకులను భయపెట్టే విధంగా అల్లాహ్-ఒ-అగ్బర్ అంటూ అరవడం మూర్ఖత్వమే అయినప్పటికీ, దేవుడా నీవు ఎంతో గొప్పవాడవు అంటూ ప్రార్థించడమేనని, అతడి చర్యలు ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది కలిగినందుకు క్షమించమంటూ సింగ్ కోర్టుకు విన్నవించారు. -
మంటలార్పడానికి వెళ్లి.. మాయమైంది!
మాస్కో: అడవిలో చెలరేగిన కార్చిచ్చును ఆర్పడానికి 10మందితో వెళ్లిన ఓ అతిపెద్ద విమానం కనిపించకుండాపోయింది. ఈ ఘటన రష్యాలో జరిగింది. తూర్పు శివారు ప్రాంతమైన ఇర్కుట్స్కీలోని అటవీ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. వీటిని ఆర్పడానికి ఇల్యూషిన్ ఐఎల్-76 విమానం పదిమంది సిబ్బందితో బయలుదేరింది. ఉదయం బయలుదేరిన ఈ విమానం మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో చివరిసారిగా సమాచారమిచ్చింది. ఆ తర్వాత రాడార్ నుంచి సంబంధాలు తెగిపోవడంతో ఆ విమానం ఏమైందనే ఆచూకీ తెలియకుండా పోయిందని రష్యా అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఐఎల్-76 విమానం ప్రపంచంలోనే మంటలు ఆర్పే అతిపెద్ద విమానం. ఈ విమానంలో ఐదుగురు విమాన సిబ్బంది, ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది ఉన్నారని, విమానం ఆచూకీ కోసం గాలిస్తున్నామని రష్యా అధికారులు తెలిపారు. -
అతడి విమానం ఎంతో గొప్పదట!
అమెరికాః రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్షపదవికి పోటీపడుతున్న డోనాల్డ్ ట్రంప్ తన విమానం గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్నాడట. తాను ప్రచారానికి వినియోగించే స్వంత ఫ్లైట్ ముందు ఎయిర్ ఫోర్స్ విమానం కూడ ఎందుకూ పనికిరాదన్నాడట. తన విమానంలో ఉన్న ప్రత్యేక సౌకర్యాలు అధ్యక్షుడు ఒబామా ప్రయాణించే విమానానికి సైతం లేకపోవచ్చంటూ చెప్పడం చూస్తే... నిజంగా ఆయనగారి విమానం ఏ రేంజ్ లో ఉందోనని అంతా ఎగ్జైటింగ్ గా ఫీలయ్యారట. తన ప్రచారంలో భాగంగా ఓ వేదికపై స్పీచ్ ఇస్తున్న డోనాల్డ్ ట్రంప్ తన విమానంగురించి చెప్పి మురిసిపోయాడట. విమానంలోని సీటు బెల్టులకు, బాత్ రూం లోని ట్యాప్ లకు సైతం బంగారు పూత పూసి ఉంటుందని చెప్పుకొచ్చాడట. సాధారణంగా బోయింగ్ విమానం అంటే 200 మంది ప్రయాణీకులతో, ఎయిర్ హోస్టెస్ లతో సందడి చేస్తుంది. అలాంటిది ట్రంప్ వినియోగించే బోయింగ్ 757 విమానం మాత్రం ఆయన చెప్పినట్లుగానే ప్రత్యేక సౌకర్యాలు కలిగి ఉందట. కేవలం 43 మంది ప్రయాణీకులు మాత్రమే ఎక్కగలిగేట్లు విమానంలో ఏర్పాట్లు చేశారట. స్టాబాంగ్ ఏవియేషన్ నిర్వహణలో ఆ ప్రత్యేక విమానం నడుస్తుంది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ అల్టెన్ నుంచి ట్రంప్ ఆ విమానాన్ని 2005 సంవత్సరంలోనే కొనుగోలు చేసి, అనంతరం అందులో తనకు కావలసినట్లుగా మార్పులు చేర్పులు చేసుకున్నాడు. నిజంగా ట్రంప్ సొంత విమానం చూస్తే అన్ని హంగులూ కలిగిన స్వంత గృహంలా కనిపిస్తుంది. విమానంలో లగ్జరీ సీట్లు, వాటికున్న బెల్టులకు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు పూత ఉంటాయి. తన అభిరుచికి తగ్గట్లుగా చేసుకున్న ఏర్పాట్లలో ముఖ్యంగా విమానంలో మీటింగ్ హాళ్ళు, సిల్క్ లైన్ మాస్టర్ బెడ్ రూం, సుమారు వెయ్యి చిత్రాలను ప్రదర్శించగలిగే శక్తి ఉన్న 57 అంగుళాల టెలివిజన్, సకల సౌకర్యాలు కలిగిన బాత్ రూం లు, వీలైనంత వరకూ బంగారు పూతతోనే కనిపిస్తాయట. ఈ ప్రత్యేక విమానంలోనే ఆయన ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నాడు. ఇన్ని హంగులతో కూడిన ఆ విమానం ప్రస్తుతం 100 మిలియన్ డాలర్లు అంటే.. సుమారు 675 కోట్ల రూపాయలు విలువ చేస్తుందట. -
రెండు గంటలు ఆకాశంలో విమానం చక్కర్లు
చెన్నై: సాంకేతిక లోపం కారణంగా విమానం సుమారు రెండు గంటల పాటు ఆకాశంలో చక్కర్లు కొట్టింది. తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయం నుంచి సోమవారం సాయంత్రం 5.20 గంటలకు ఎయిర్ ఏషియా విమానం కౌలాలంపూర్కు బయలుదేరింది. అందులో 151 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్ తీసుకోగానే ఇంజిన్లో సాంకేతిక లోపం ఏర్పడింది. పైలట్ తిరుచ్చి విమానాశ్రయ అధికారులకు వెంటనే సమాచారం అందించారు. విమానంలో ఉన్న ఇంధనం స్థాయి తగ్గేవరకు తిరుచ్చి చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందిగా అధికారులు సూచించారు. దీంతో రెండు గంటలపాటు విమానం ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. ప్రయాణికులు ఏం జరుగుతుందోనన్న భయంతో సీట్లలోనే కూర్చుండిపోయారు. రాత్రి 7.15 గంటలకు విమానంలో పెట్రోల్ స్థాయి తగ్గడంతో విమానాన్ని తిరుచ్చి ఎయిర్పోర్టులో భద్రంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఇంట్లో నుంచే ఎగిరే విమానం
విమానంలో ప్రయాణించాలంటే విమానాశ్రయాలకు వెళ్లాల్సిన పనిలేదు. కేవలం 15 మీటర్ల స్థలం ఉంటే చాలు ఇంట్లో నుంచే ఎక్కడికైనా ఎగిరిపోవొచ్చు, తిరిగి ల్యాండ్ అవ్వొచ్చు. విమానాలకు ఎంతో ఖర్చుతో కూడిన ఇంధనం అవసరమౌతుంది, ఇదంతా సాధ్యమయ్యే పనేనా అనుకుంటున్నారా?..ఇంట్లో మనం సాధారణంగా వాడే కరెంట్ సాకెట్ నుంచే ఛార్జింగ్ చేస్తే చాలు గాల్లో హాయిగా చక్కర్లు కొట్టి రావొచ్చు. నలుగురు జర్మన్ ఇంజనీర్లు కలిసి ఇంట్లో నుంచే గమ్యస్థానాలకు చేరే కొత్త రకం మినీ విమానం 'లిలియం' డిజైన్ను చూస్తే 2018 వరకు ఇది సాధ్యమయ్యేదిలానే కనిపిస్తుంది. రెండు సీట్ల సామర్థ్యం ఉన్న కొత్త ఆల్ట్రాలైట్ చిన్న విమానం లిలియం. ఇది ఎగరడానికి, ల్యాండ్ అవ్వడానికి కేవలం 15 మీటర్ల స్థలం ఉంటే చాలు. లిలియం స్టార్టప్ను మునిచ్ యూనివర్సిటీ విద్యార్థులు..డానియల్ వీగాండ్, పాట్రిక్ నాథన్, సెబాస్టియన్ బోర్న్, మాథియాస్ మీనర్లు కలిసి ప్రారంభించారు. యూరోపియన్ స్పెస్ ఏజెన్సీలో(ఈఎస్ఏ) బిజినెస్ ఇంక్యుబేటర్లో లిలియం ప్రాజెక్టును హోస్ట్ చేశారు. 'వీగాండ్ తమ కాన్సెప్ట్ను ప్రాక్టికల్గా వివరించారు..వాతావరణానికి కలిగే లాభాలను వివరించారు. ఎలక్ట్రిక్ ఇంజిన్లను వాడటం వల్ల తక్కువ శబ్ధం ఉద్గారమవ్వడంతో పాటూ వాతావరణానికి ఎలాంటి హానీ జరగదు' అని ఈఎస్ఏ తెలిపింది. రోజూ వారి అవసరాల కోసం ఉపయోగపడే విధంగా దీన్ని తయారు చేస్తున్నట్టు దీని డిజైనర్లలో ఒకరు డానియల్ వీగాండ్ తెలిపారు. ఎంతో ఖర్చుతో కూడిన భారీ ఎయిర్ పోర్టుల అవసరం లేకుండానే ఈ విమానం సునాయాసంగా ఎగిరిపోతుంది. ఇంట్లోనే విమానానికి ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఇంకా నిర్మాణదశలోనే ఉన్న ఈ గుడ్డు ఆకారంలో ఉండే లిలియం విమాన అమ్మకాలు 2018 ఏడాది వరకు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని దీని డిజైనర్లు చెబుతున్నారు. గరిష్టంగా 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ విమానం.. గంటకు 400కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఉందని ఇంజనీర్లు తెలిపారు. 'లిలియం ఇంజన్లలో ఉపయోగించే టెక్నాలజీతో జెట్ విమానాలు, హెలీకాప్టర్లలో వచ్చే శబ్ధాలకన్నా చాలా రెట్లు తక్కువ వస్తుంది. దీనికి ఇంట్లో వాడే సాకెట్తోనే ఛార్జింగ్ చేయోచ్చు. వాతావరణం అనుకూలంగా ఉన్న సమయాల్లో మాత్రమే దీంట్లో ప్రయాణించొచ్చు' అని వీగాండ్ తెలిపారు. లైట్ స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ కేటగిరికి చెందిన దీన్ని నడపడానికి పైలెట్ లైసెన్స్ ఉండి కేవలం 20 గంటల ట్రైనింగ్ ఉంటే సరిపోతుంది. దీని ధర విషయంలో ఇంకా ఓ స్పష్టత రాకపోయినా..ఇప్పటికే ఉన్న మినీ విమానాలకంటే తక్కువకే ఇది లభిస్తుందని ఈఎస్ఏ తెలిపింది. -
చుక్కలు చూపించిన విమానం!
న్యూయార్క్ః విమాన ప్రయాణం అంటేనే ఇటీవల వణుకు పుట్టే పరిస్థితి వస్తోంది. సాంకేతిక లోపాలు ఏర్పడటం, పక్షులు అడ్డు పడటం, ల్యాండింగ్ లో పొరపాట్లు జరగడం వంటి సంఘటనలు మామూలైపోయింది. తాజాగా న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై ల్యాండ్ అవ్వాల్సిన బోయింగ్ విమానం ఒక్క ఉదుటున ఎగిరి పడటంతో ప్రయాణీకులు అదిరి పడ్డారు. ప్రాణాలు గుప్పెట్టో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. న్యూయార్క్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వాల్సిన బోయింగ్ 767 ప్యాసింజర్ విమానం ప్రయాణీకులకు చుక్కలు చూపించింది. ల్యాండ్ అయ్యే ముందు పైలట్ మనసు మార్చుకోవడంతో రన్ వే పై బౌన్స్ కొట్టి, తిరిగి టేకాఫ్ అయ్యింది. పైలట్ రఫ్ రైడింగ్ తో విమానంలోని ప్యానెల్స్, మెకానికల్ బాక్స్ లు ఇతర చిన్న చిన్న వస్తువులు ప్రయాణీకులపై పడ్డాయి. హోస్టన్ నుంచి 214 మంది ప్రయాణీకులతో బయల్దేరిన 557 విమానం ల్యాండింగ్ విషయంలో ఏర్పడ్డ అస్థవ్యస్థ స్థితికి ప్రయాణీకులు వణికిపోయారు. ల్యాండ్ అయ్యేందుకు రన్ వే పైకి వచ్చిన విమానం స్కిప్ అవ్వడంతో పైలట్ తిరిగి టేకాఫ్ చేశాడని, తిరిగి ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించగా విమానం తిప్పలు పెట్టడంతో మరోసారి టేకాఫ్ చేశాడని ఇలా పలుమార్లు ల్యాండింగ్ కు ప్రయత్నించడం, టేకాఫ్ అవ్వడం ప్రయాణీకులను తీవ్ర ఆందోళనకు గురి చేసిందని ఓ ప్రత్యక్ష సాక్షి... ప్రయాణీకుడు తెలిపాడు. చివరిసారి ల్యాండ్ అయ్యేందుకు ముందు ఆకాశంలో పైటట్ కనీసం 30 సార్లు చక్కర్లు కొట్టించినట్లు తెలిపిన ప్రయాణీకుడు.. ఎట్టకేలకు ల్యాండ్ చేయడంతో ప్రయాణీకుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసినట్లు చెప్పాడు. అయితే విమానం చివరికి సేఫ్ గా ల్యాండ్ అయ్యిందని, ప్రయాణీకులకు ఎటువంటి గాయాలు తగల్లేదని ఎయిర్ లైన్స్ వెల్లడించింది. అయితే అంతటి సందిగ్ధావస్థలోనూ ఓ వ్యక్తి వీడియోను తీసి సిబ్బందికి అందించడం విశేషం. -
విమానంలో ప్రయాణికురాలి పట్ల అసభ్య ప్రవర్తన
శంషాబాద్ (రంగారెడ్డి): విమానంలో ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. శుక్రవారం సాయంత్రం విజయవాడ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విమానంలో గుమ్మడి వెంకటేశ్వరరావు అనే ప్రయాణికుడికి, ప్రయాణికురాలికి మధ్య ఈ విషయంలో తీవ్ర వాగ్వివాదం కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై విమానాశ్రయంలో దిగిన తర్వాత బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
విమానంలో పుట్టిన 'జెట్ స్టార్'
ఆకాశంలో ఎగురుతున్న విమానంలో ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డకు ఎయిర్ లైన్స్ పేరు పెట్టుకుంది. నిండు గర్భిణిగా ఉన్న మహిళ జెట్ ఎయిర్ లైన్స్ లో ప్రయాణిస్తుండగా నొప్పులు రావడంతో ఆమెకు సిబ్బంది సహా... విమానంలో ప్రయాణిస్తున్న ముగ్గురు డాక్టర్లు కూడ సహకరించారు. దీంతో సుఖప్రసవాన్ని పొందిన ఆమె.. పుట్టిన మగ బిడ్డకు ఎయిర్స్ లైన్స్ పేరు పెట్టుకుంది. ఏప్రిల్ 22 శుక్రవారం సింగపూర్ నుంచి మయన్మార్ కు ప్రయాణిస్తున్న జెట్ ఎయిర్వేస్ విమానంలో సా లెర్ టు అనే మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఉన్నట్టుండి ఆమెకు నొప్పులు రావడంతో ఎయిర్ లైన్స్ సిబ్బంది సహా విమానంలో ప్రయాణిస్తున్న ముగ్గరు డాక్టర్లు సహకరించి సుఖ ప్రసవం జరిగేట్లు చూశారు. విమాన సిబ్బంది తనపై చూపించిన అభిమానానికి కృతజ్ఞతతో సా లెర్ తన బిడ్డకు 'జెట్ స్టార్' అని పేరు పెట్టుకుంది. అనుకోకుండా ఆమె ఇంటిపేరు కూడ స్టార్ అని ఉండటంతో ఆపేరు కలసి వచ్చింది. విమాన ప్రయాణంలో ఎటువంటి ప్రమాదం లేకుండా మహిళకు సహకరించి ఓ అతిచిన్న ప్రయాణీకుణ్ని సురక్షితంగా ప్రసవించేందుకు తమ సిబ్బంది సహాయపడ్డందుకు ఎంతో గర్వంగా ఉందని ఎయిర్ లైన్స్ తెలిపింది. సహ ప్రయాణీకులతో పాటు బేబీ జెట్ స్టార్ కూడ ప్రయాణించి ప్రశంసలు అందుకున్నాడని, ఇది ఎప్పటికీ మరచిపోలేని సంఘటన అని ఎయిర్ లైన్స్ వెల్లడించింది. జెట్ స్టార్ పుట్టిన సందర్భాన్ని వేడుకగా జరుపుకునేందుకు వెయ్యి డాలర్ల ఖరీదైన పిల్లల ఉత్పత్తులను జెట్ స్టార్ కుటుంబానికి బహుమతిగా ఇచ్చింది. మా విమానంలో సా జెట్ స్టార్ పుట్టిన విషయాన్ని తెలియజేయడం మాకెంతో గర్వంగా ఉందని జెట్ ఎయిర్ వేస్ పోస్ట్ చేసింది. కస్టమర్ సర్వీస్ మేనేజర్ నేతృత్వంలో సిబ్బంది సహాయం అందించారని, ప్రసవం అనంతరం తల్లీ బిడ్డలు 3K583 విమానంలో యాన్ గన్ లో ల్యాండ్ అయ్యారని, అనంతరం యాన్ గన్ లోకల్ ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యారని ఎయిర్ లైన్స్ పోస్ట్ లో తెలిపింది. 6 పౌండ్ల, ఏడు ఔంసుల బరువుతో పుట్టిన శిశువు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడని, ఏషియా విమానంలో ప్రసవం జరగడం ఇదే మొదటి సారని, వెయ్యి డాలర్ల ఖరీదైన పిల్లల ఉత్పత్తులను జెట్ స్టార్ కుటుంబానికి బహుమతిగా ఇచ్చామని పోస్ట్ లో వివరించారు. -
బేగంపేటలో కూలిన విమానం
క్రేన్ ఒరిగి కింద పడటంతో రెండు ముక్కలు... ఓ భవనం నేలమట్టం విమాన తరలింపు క్రమంలో బేగంపేట ఎయిర్పోర్టులో ఘటన ఇరవై టన్నుల భారీకాయం... నూట డెబ్భైమంది సామర్థ్యం... వినువీధిలో వేల కిలోమీటర్లు దూసుకుపోయే విహంగాన్ని భువిపై ఒక్క అడుగు కదిపించలేకపోయారు. ఆరు భారీ క్రేన్లు... వాటికి అండగా ఆరు ప్రొక్లైనర్లు... వీటన్నింటినీ నడిపించి కార్యం చక్కబెట్టడానికి వందల సంఖ్యలో సిబ్బంది, నిపుణులు, అధికారులు. అంతా కలసి రెండే రెండు కిలోమీటర్లు రోడ్డు మార్గం గుండా తరలించడానికి డెబ్భైరెండు గంటలుగా చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. వేల మీటర్ల ఎత్తుకెగరగల ఎయిర్బస్ను క్రేన్తో పట్టుమని పదడుగులు కూడా లేపలేక ఎత్తినచోటే కుదేశారు. ఫలితంగా మూడు రోజుల శ్రమ మూడే నిమిషాల్లో నీరుగారిపోయింది. క్రేన్ తీగ తెగి కింద పడ్డ ‘ఎయిర్ ఇండియా 320 ఎయిర్బస్’ చూస్తుండగానే రెండు ముక్కలైంది. బేగంపేట విమానాశ్రయంలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. భారీ ఆస్తినష్టం జరిగినా అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. - హైదరాబాద్ ఎక్కడ.. ఎందుకు? ఎయిర్ ఇండియాకు చెందిన భారీ ఎయిర్బస్ 320 బేగంపేట విమానాశ్రయంలో మూడేళ్లుగా నిరుపయోగంగా ఉంది. దీని పొడవు 111 అడుగులు. బరువు 20 టన్నులు. దీన్ని విమానాశ్రయం సమీపంలోని ఎయిర్ ఇండియాకు చెందిన ‘సెంట్రల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్’ (సీటీఐ)కి తరలించాలని అధికారులు నిర్ణయించారు. బోయిన్పల్లి ఓల్డ్ ఎయిర్పోర్టు రోడ్డు గుండా బాలానగర్ వెళ్లే మార్గంలో ఉన్న సీటీఐలో ఎయిర్ ఇండియా స్టాఫ్కు శిక్షణ ఇచ్చేందుకు విమానాన్ని ఉపయోగించుకోవాలన్నది లక్ష్యం. మూడు రోజుల కసరత్తు... విమానాన్ని తరలించేందుకు సీటీఐ అధికారులు మూడు రోజులు కసరత్తు చేశారు. తొలుత విమానంలోని సీట్లు, కాక్పిట్లోని ఇంజిన్లను తొలగించారు. ఖాళీ బాడీని భారీ క్రేన్ ద్వారా సీటీఐకి తీసుకువెళ్లాలనుకున్నారు. విద్యుత్, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసుల అనుమతులు తీసుకుని వారిని అప్రమత్తం చేశారు. ఎయిర్పోర్డు ప్రహరీతో పాటు ఓల్డ్ ఎయిర్పోర్టు రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్, కేబుల్స్ను యుద్ధప్రాతిపదికన తొలగించారు. భారీ ఏర్పాట్లు... జాగ్రత్తలు ఎయిర్బస్ను తీసుకెళ్లే భారీ క్రేన్తో పాటు మరో ఐదు క్రేన్లు అదనంగా తెప్పించారు. రోడ్డుకు అడ్డంగా ఉండే బండరాళ్లు, చెట్లు తొలగించేందుకు ఆరు ప్రొక్లైనర్లు రప్పించారు. ప్రమాదాలు సంభవిస్తే వెంటనే స్పందించేలా రెండు అంబులెన్సులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది కలపి దాదాపు 300 మంది ఇదే పనిలో తలమునకలయ్యారు. శనివారం రాత్రి 11.30 గంటల నుంచే ఓల్డ్ఎయిర్పోర్టు గుండా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కిలోమీటర్ దూరం వరకు పాదచారులను సైతం అనుమతించలేదు. తెల్లవారుజాము 3.30 గంటలు... ఎయిర్లైన్స్ నిపుణుల నేతృత్వంలో ఆదివారం తెల్లవారు జాము 3.30 గంటల ప్రాంతంలో భారీ క్రేన్ ఎయిర్బస్ను పైకి లేపింది. దాన్ని క్రేన్బేస్పై అమర్చేందుకు మూడు గంటలుగా అంతా శ్రమిస్తున్నారు. ఉదయం 6.30... అంతా సిద్ధం.. మరో పది నిమిషాల్లో క్రేన్ బయలుదేరుతుందని ట్రాఫిక్ పోలీసులకు సమాచారం. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు, పాదచారుల రాకపోకల్ని పోలీసులు నియంత్రిస్తున్నారు. అంతలోనే అవాంతరం. ఆకాశంలోకి ఎత్తిన విమానాన్ని బేస్పై కూర్చోబెట్టే క్రమంలో తీగ తెగి క్రేన్ కుడివైపునకు ఒరిగింది. అధికారులు అప్రమత్తమయ్యే లోపే క్షణాల్లో విమానం రహదారి పక్కనే ఉన్న ఓ భవనంపై పడి రెండు ముక్కలుగా విడిపోయింది. భవనం నేలమట్టమైంది. ఆస్తి నష్టం భారీగా ఉంటుందని అంచనా. కట్టుదిట్టంగా తీసుకున్న జాగ్రత్తల ఫలితంగా ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం తరలింపు బాధ్యతలను దుర్గా క్రేన్స్ సంస్థ తీసుకుంది. వారి తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇంత భారీ విమానాన్ని క్రేన్ ద్వారా తరలించడం సరైంది కాదని నిపుణులు అంటున్నారు. 3 రోజుల్లో తొలగింపు విరిగిపోయిన విమాన శకలాలను మూడు రోజుల్లో తొలగిస్తాం. అప్పటి వరకు ఈ మార్గంలో రాకపోకలపై ఆంక్షలుంటాయి. ఈ విమానం మూడేళ్లుగా సర్వీసులో లేదు. మా ఇన్స్టిట్యూట్లో డోర్ మెయింటెనెన్స్, కాక్పిట్ మెయింటెనెన్స్, అత్యవసర సమయాల్లో ప్రయాణికుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో శిక్షణలు ఇచ్చేందుకు మాత్రమే ఎయిర్బస్ బాడీని తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. - కెప్టెన్ సోమన్ అతులా , సీటీఐ మరిన్ని ఫోటోలకు ఇక్కడ క్లిక్ చేయండి -
విమానం పై కూలిన క్రేన్
-
50 ఏళ్ల తర్వాత బయటపడింది..
బ్యూనస్ ఎయిర్: 50 ఏళ్ల క్రితం కూలిపోయిన విమాన శకలాలు, సిబ్బంది శవాలను తాజాగా గుర్తించారు. అర్జెంటీనా లో కూలిపోయిన రెండు ఇంజిన్ల పైపర్ అపాచీ విమాన శిధిలాలను అర్ధశతాబ్దం తర్వాత బయటపడింది. దీంట్లో నలుగురు వ్యక్తుల మృతదేహాలు సంబంధించిన అస్తిపంజరాలు లభించాయని అర్జెంటీనా జాతీయ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఆ నలుగురిలో ఒకరు పైలట్ కాగా , పాన్ అమెరికన్ అర్జెంటీనా ఆయిల్ కంపెనీ అధిపతి మిగెల్ షాంచెజ్ తో పాటు, మరో ఇద్దరు ఇంజనీర్ల మృతదేహాలుగా గుర్తించామని జిన్హువా శుక్రవారం ప్రకటించింది. స్థానిక వ్యక్తి ఒకరు విమాన రెక్క భాగాన్ని సోమవారం గుర్తించారని, మిగిలిన భాగం భూస్థాపితమైందని తెలిపింది. సరస్సులోని కొంతభాగం ఆవిరి కావడంతో ఈ శిధిలాలు భూమినుంచి పైకి చొచ్చుకు వచ్చాయని పేర్కొంది. కాగా అక్టోబర్ 19, 1964లో చెబుత్ రాష్ట్రం లోని ఓ సరస్సులో విమానం కూలిపోయింది. అనంతరం దీని ఆచూకీ కోసం రెండు బృందాలు శోధించినా ప్రయోజనం లభించలేదు. -
కుప్పకూలిన విమానం.. సిబ్బంది అదృశ్యం
ఢాకా: బంగ్లాదేశ్ కు చెందిన ఓ కార్గో విమానం బంగాళాఖాతంలో కుప్పకూలిపోయింది. నలుగురు సిబ్బందితో బయలుదేరిన చిన్న కార్గో విమానం బయలుదేరిన కొద్దిసేపటికే క్రాష్ అయింది. బంగ్లాదేశీ పట్టణంలోని కోక్స్ బజార్ తీరం సమీపంలో బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో పైలట్ మరణించాడు. కో-పైలట్ , మరో ఇద్దరు అదృశ్యం అయ్యారు.. వీరికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
వినోదం కోసం ఎమర్జెన్సీ తలుపు తీశాడు!!
ముంబై: జెట్ ఎయిర్వేస్ విమానాయాన సంస్థకు ప్రయాణికుల నుంచి చిత్రమైన చిక్కులు ఎదురవుతున్నాయి. విచిత్రమైన కారణాలతో ఇద్దరు ప్రయాణికులు విమానంలో నిబంధనలు ఉల్లంఘించడంతో వారిపై జెట్ ఎయిర్వేస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జర్మనీకి చెందిన స్టీవ్ టిట్ష్లెర్ ఆదివారం అబుధాబి నుంచి జెట్ ఎయిర్వేస్ (9 డబ్యూ 585) విమానం ఎక్కి ముంబై వచ్చాడు. ముంబై విమానాశ్రయంలో విమానం పార్క్ చేసి ఉండగా అతడు ఉన్నట్టుండి ఎమర్జెన్సీ తలుపు తీశాడు. దీనిని చూసి ఆందోళన చెందిన విమాన సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఎందుకు తలుపు తీశావని ఆయనను అడిగారు. స్టీవ్ చెప్పిన సమాధానం విని వారు బిత్తరపోయారు. కేవలం వినోదం కోసం తాను ఎమర్జెన్సీ తలుపు తీసినట్టు ఆయన చెప్పుకొచ్చాడు. దీంతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఆయనను అరెస్టుచేసి సహర్ పోలీసు స్టేషన్కు తరలించారు. జెట్ ఎయిర్వేస్లో ఆయన ఢిల్లీలోకి వెళ్లాల్సి ఉన్నా అందుకు అనుమతించలేదు. ఆయనపై విమానాయాన చట్టం 1937లోని సెక్షన్ 29, ఐపీసీ సెక్షన్ 336 ప్రకారం కేసు నమోదుచేశారు. వాష్రూమ్లో స్మోకింగ్! రవి ధాంకర్ ఆదివారం సింగపూర్ నుంచి ముంబై వచ్చాడు. జెట్ ఎయిర్వేస్ (9డబ్ల్యూ 09) విమానంలో వచ్చిన అతను విమానంలోని వాష్రూమ్లో సిగరెట్ తాగుతూ దొరికిపోయాడు. ఆయన బాగా మద్యం మత్తులో ఉన్నట్టు కనిపించాడని, విమానం బాత్రూమ్ వద్ద అతను పొగ తాగుతుండగా సహచర ప్రయాణికులు గుర్తించి సిబ్బందికి తెలిపారని విమానాయాన సంస్థ అధికారులు తెలిపారు. విమానం ముంబైలో దిగగానే అతనిని సహర్ పోలీసు స్టేషన్కు తరలించి.. కేసులు నమోదుచేశారు. -
ఢిల్లీలో విమానాల రాకపోకలకు అంతరాయం
-
కుప్ప కూలిన బీఎస్ఎఫ్ విమానం
-
కుప్ప కూలిన బీఎస్ఎఫ్ విమానం.. 10 మంది మృతి
న్యూఢిల్లీ: రాంచీకి చెందిన బీఎస్ఎఫ్ విమానం కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో అందులో ఉన్నపదిమంది ప్రాణాలుకోల్పోగా వారిలో ముగ్గురు బీఎస్ఎఫ్ అధికారులు విమాన సిబ్బంది, మిగితావారు సాంకేతిక నిపుణులు ఉన్నారు. ఈ ఘటనపై ఆరా తీసిన కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఘటనా స్థలికి బయలు దేరారు. ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ లోగల బాడ్పోలా గ్రామం వద్ద విమానాశ్రయ ప్రహరీ గోడకు ఈ విమానం ఢీకొనడంతో ఘటన చోటుచేసుకుంది. విమానంలో మొత్తం పదిమందే ఉన్నట్లు తెలిసింది. మంగళవారం ఉదయం 9.50గంటల ప్రాంతంలో తమకు దిగేందుకు అనుమతివ్వాలంటూ విమాన సిబ్బంది కోరారని, ఆ వెంటనే కొద్ది సేపటికే తమతో సంబంధాలు తెగిపోయాయని అధికారులు చెప్పారు. ప్రాథమిక సమాచారం ప్రకారం విమానం దించేందుకు అనుమతి ఇవ్వగానే విమానాశ్రయంలో దించేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడ ఓ గోడకు ఢీకొట్టిందని, అనంతరం అది కూలిపోయినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఇది కూలిన చోటే రైల్వే లైన్ కూడా ఉంది. గోడను ఢీకొట్టిన విమానం అనంతరం ఓ సెఫ్టిక్ ట్యాంకులోకి పడిపోయిందని, అనంతరం మంటలు భారీగా వ్యాపించగా దాదాపు 18 ఫైరింజన్లు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే చర్యలకు ఉపక్రమించినట్లు తెలిపారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కూడా ఘటన స్థలి వద్దకు వచ్చి ఆప్రాంతాన్ని పరిశీలించారు. -
ట్యాక్సీ వే లోకి దూసుకెళ్లిన ఫ్లైట్
వాషింగ్టన్: అమెరికాలోని నాష్ విల్లే అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం హ్యూస్టన్ నుండి 133 మంది ప్రయాణికులతో వచ్చిన సౌత్వెస్ట్ విమాన సంస్థకు చెందిన బోయింగ్ విమానం ఒకటి ప్రమాదవశాత్తు రన్ వే నుండి జారిపోయింది. రన్ వే మీద ల్యాండ్ అయిన విమానం దారి తప్పి టాక్సీ వే లోకి దూసుకెళ్లింది. అంతటితో ఆగకుండా ముందున్న గడ్డిలోకి జారుతూ వెళ్లి ఆగింది. ఈ ఘటనలో 8 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని ఎయిర్ పోర్ట్ అధికారులు సమీపంలోని అసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పెద్ద శబ్దంతో రన్వే నుండి విమానం జారి పోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. విమాన ప్రమాదంపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. -
టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం
-
టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం
విశాఖపట్నం: ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న ట్రూజెట్ విమానం వర్షం కారణంగా విశాఖపట్నంలో ల్యాండ్ అయ్యేందుకు వాతావరణం అనుకూలించలేదు. దీంతో గంట పాటు విమానం ఆకాశంలో చక్కర్లు కొట్టింది. చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్ర మంత్రి నారాయణ కుమార్తె వివాహానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. నెల్లూరులో జరిగిన ఈ వివాహానికి వెళ్లేందుకు మరో మంత్రి గంటా శ్రీనివాసరావు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. వివాహం అయిన తర్వాత టీడీపీ నేతలు రేణిగుంట నుంచి విశాఖకు విమానంలో బయల్దేరారు. మంత్రి గంటా శ్రీనివాసరావు కొడుకుతో మంత్రి నారాయణ కుమార్తె వివాహం జరిగింది. -
మరో వివాదంలో రాధే మా
ముంబై: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధే మా కు మరోసారి చుక్కెదురైంది. త్రిశూలం ధరించి విమానంలో ప్రయాణించిన కేసులో దాఖలైన పిటిషన్ పై శుక్రవారం ముంబై హైకోర్టు స్పందించింది. ఈ కేసులో కేంద్రంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఒక సామాజిక కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. నవంబరు 18లోగా దీనికి సమాధానం చెప్పాలని జస్టిస్ విఎం కనాడే, షాలిన్ ఫానల్కార్ లతో కూడిన బెంచ్ ఆదేశించింది. ఈ ఏడాది ఆగస్టులో ఔరంగాబాద్ నుండి ముంబైకి ఓ ప్రయివేటు విమానంలో రాధే మా ప్రయాణిస్తున్న సమయంలో త్రిశూలంతో ప్రయాణించడంపై సామాజిక కార్యకర్త రమేష్ జోషి వ్యాజ్యం దాఖలు చేశారు. మారణాయుధం లాంటి త్రిశూలాన్ని విమానంలో తీసుకెళ్లడం చట్టరీత్యా నేరమన్నారు. ఈ చర్య ద్వారా సివిల్ యావియేషన్ నిబంధనలను ఆమె అతిక్రమించారని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న రాధేమా మరింత ఇరకాటంలో పడ్డారు. రాధే మా మినీస్కర్టులో ఉన్న ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీంతోపాటు డబ్బులు డిమాండ్ చేయడం, బెదిరింపులు, వరకట్న వేధింపులు తదితర నేరాలతో పాటు మరికొన్ని కేసుల్లో ఆమెను పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. -
పోర్ట్బ్లయిర్ విమానం రద్దు
విశాఖపట్నం: విశాఖ నుంచి అండమాన్ రాజధాని పోర్ట్బ్లయిర్ వెళ్లాల్సిన విమానం గురువారం రద్దయింది. ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల ప్రాంతంలో వైజాగ్ చేరుకునే ఈ విమానం షెడ్యూల్ ప్రకారం వెంటనే తిరిగి బయలుదేరుతుంది. సాంకేతిక కారణాలతోనే గురువారం రద్దు చేశామని, యథావిధిగా రేపు నడుపుతామని అధికారులు చెబుతున్నారు. ఈ విమానంలో వెళ్లాల్సిన ప్రయాణికులను అధికారులు స్థానిక హోటల్కు తరలించి, బస కల్పించారు. -
విమానంలో మంటలు: ప్రయాణికులు సురక్షితం
ఢిల్లీ: వారణాసి -ఢిల్లీ ల మధ్య నడిచే ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. 153 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా విమానం (ఏఐ-405) సోమవారం వారణాసి నుంచి ఢిల్లీకి వచ్చింది. అయితే ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో విమానం టేకాఫ్ తీసుకున్న తరువాత ఇంజన్ లో మంటలు వ్యాపించాయి. దీన్ని గ్రహించిన సిబ్బంది అత్యవసరంగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లోనే విమానాన్ని కిందకు దించేశారు. విమానంలోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు ఎయిర్ పోర్ట్ సిబ్బంది తెలియజేశారు. -
రన్వేపై పేలిన విమానం టైరు
చెన్నై(టీనగర్): చెన్నై విమానాశ్రయంలో సోమవారం అండమాన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం వెనుక టైర్ పేలడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చెన్నై నుంచి అండమాన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం సోమవారం ఉదయం 11.10 గంటలకు డొమెస్టిక్ టెర్మినల్ నుంచి బయలుదేరింది. విమానంలో 77 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు. రన్వేపై వెళుతుండగా హఠాత్తుగా విమానం వెనుక టైరు భారీ శబ్దంతో పేలిపోయింది. భీతిల్లిన ప్రయాణికులు బిగ్గరగా కేకలు వేశారు. పెలైట్ చాకచక్యంగా అదుపులోకి తీసుకుని రన్వేపై నిలిపివేశారు. వెంటనే భద్రతా అధికారులు, విమానాశ్రయ ఉన్నతాధికారులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ప్రయాణికులను వరుసగా కిందికి దింపారు. ఎవరికీ ఏమీ కాలేదు. విమానాశ్రయంలో వారికి బస కల్పించారు. విమానాశ్రయ అధికారులు, భద్రతా సిబ్బంది విచారణ చేస్తున్నారు. -
అత్యవసరంగా విమానం దించివేత
రాయ్ పూర్: బంగ్లాదేశ్కు చెందిన ఓ విమానాన్ని అత్యవసరంగా దించివేశారు. ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఉన్నపలంగా ల్యాండింగ్ చేశారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి మస్కట్కు బయలుదేరిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. దీంతో భారత వైమానిక అధికారులను సంప్రదించిన పైలట్ రాయ్ పూర్ లోని వివేకానంద విమానాశ్రయంలో సురక్షితంగా దించివేశారు. సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో విమానాన్ని దించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో మొత్తం 173 మంది ప్రయాణీకులు ఉన్నారు. వారిని ఏయే ప్రాంతాలకు చేర్చే విషయాన్ని భారత అధికారులు బంగ్లా అధికారులతో సంప్రదిస్తున్నారు. -
కుప్పకూలిన విమానం
-
సీఎం జపాన్ పర్యటనకు తొలి విడతగా రూ.1.70కోట్లు
నేటి అర్ధరాత్రి 1 గంటకు విమానంలో జపాన్ పయనం సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం జపాన్, హాంకాంగ్ పర్యటనకోసం తొలి విడతగా రూ.1.70 కోట్లను విడుదల చేసేందుకు ఆర్థికశాఖ శుక్రవారం ఆమోదం తెలిపింది. పర్యటన ముగిశాక మిగతా వ్యయానికి సంబంధించి ఆర్థికశాఖ నిధులను విడుదల చేయనుంది. జపాన్ పర్యటనకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని బృందం శనివారం అర్ధరాత్రి 1 గంటకు హైదరాబాద్నుంచి విమానంలో బయల్దేరనుంది. సీఎం వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, ప్రభుత్వ కమ్యూనికేషన్స్ సలహాదారు పరకాల ప్రభాకర్, ఢిల్లీలో రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు, సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శి సతీష్చంద్ర, మున్సిపల్, ఆర్థిక, పరిశ్రమల శాఖల ముఖ్యకార్యదర్శులు ఎ.గిరిధర్, పీవీ రమేశ్, ఎస్.ఎస్.రావత్, పరిశ్రమల మౌలిక వసతుల కల్పనశాఖ కార్యదర్శి అజయ్జైన్, సీఆర్డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్ వెళ్లనున్నారు.ఈ పర్యటనలో సీఎం రాజధాని నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలని జపాన్ ప్రధానిని ఆహ్వానించనున్నారు. 8వ తేదీ వరకు బాబు బృందం జపాన్లోనే పర్యటిస్తుంది.అనంతరం 9, 10 తేదీల్లో హాంకాంగ్లో పర్యటిస్తుంది. 10వ తేదీ రాత్రి అక్కడ్నుంచీ బయల్దేరి హైదరాబాద్కు తిరిగి రానుంది. జపాన్ పర్యటనలో ప్రముఖులతో భేటీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన జపాన్ పర్యటనలో పలు సంస్థల ప్రతినిధులు, ప్రముఖులతో భేటీ కానున్నారు. ఈ నెల 6వ తేదీ ఉదయం ఫ్యూజీ ఎలక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెంజీ గోటో, సుమిటోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పోరేషన్ (ఎస్ఎమ్బీసీ), మిత్సుబిషి కార్పొరేషన్ ప్రతినిధులతో సీఎం సమావేశమవుతారు. అలాగే 7న కూడా ప్రముఖ బ్యాంకింగ్ అధికారులు, పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. నేడు మంత్రివర్గం సమావేశం.. సీఎం అధ్యక్షతన శనివారం ఉదయం 10 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. అమెరికాలో నలుగురు మంత్రులు ఇదిలా ఉండగా అమెరికాలో జరుగుతున్న తానా సభల్లో పాల్గొనేందుకు నలుగురు మంత్రులు వెళ్లారు. -
రోడ్లపైనే ల్యాండింగ్...
హైదరాబాద్: అత్యవసర సమయాల్లో జాతీయ రహదారులను రన్వేలుగా ఉపయోగించుకునే ప్రయత్నంలో భాగంగా గురువారం మథుర సమీపంలోని యమునా ఎక్స్ప్రెస్వేపై మిరాజ్ 2000 రకం యుద్ధవిమానాన్ని ల్యాండ్చేస్తున్న దృశ్యం. భారత వాయుసేనకు చెందిన ఓ యుద్ధవిమానాన్ని ఇలా రహదారిపై విజయవంతంగా ల్యాండ్ చేయడం ఇదే తొలిసారి. -
అగ్గిపెట్టెతో విమానాన్ని హైజాక్ చెయ్యొచ్చా!
వరుస విమాన ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ పోర్టులలో తనిఖీలపై కేంద్ర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రయాణ సమయంలో అగ్గిపెట్టెను వెంటే ఉంచుకుంటానని, మంత్రిని కాబట్టి నన్నెవరూ తనిఖీ చేయరని చెప్పారు. 'నేను చైన్ స్మోకర్ని కాబట్టి అగ్గిపెట్టో, లైటరో ఎప్పుడూ వెంటే ఉంటుంది. విమానం ఎక్కేటప్పుడు కూడా! అయినా.. అగ్గిపెట్టెతో ఎవరైనా ఫ్లైట్ని హైజాక్ చెయ్యొచ్చా! ప్రపంచంలో అలాంటి సంఘట ఎప్పుడైనా జరిగిందా? అంటూ ఆశ్యర్యం వ్యక్తం చేశారు. మంగళవారం ఢిల్లీలో ఓ కార్యక్రమంలో ఆయన కామెట్లకు అవాక్కయిన విలేకరులు.. 'విమానయాన మంత్రి అయిఉండీ ఇలా మాట్లాడటం సబబేనా?' అని ప్రశ్నించగా, నేనన్నదాంట్లో తప్పేముంది? అని తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు. -
విమానం @ 2030
800 మంది ప్రయాణించే సౌలభ్యం, మూడంతస్తుల్లో సకల సదుపాయాలతో గదులు, పడకలు, సిబ్బంది కార్యాలయాలు. ఇవన్నీ 2030లో రాబోయే సరికొత్త విమానం హంగులు. బార్సిలోనాకు చెందిన ఆస్కార్ వినాల్స్ అనే డిజైనర్ ఈగల్ కాన్సెప్ట్ అనే డిజైన్ రూపొందించారు. విమానం మొత్తానికి సరిపోయే విద్యుత్ను రెక్కలకున్న సౌరఫలకాలతో ఉత్పత్తి చేసుకుంటుందట. 96 మీటర్ల రెక్కలుండటంతో ల్యాండింగ్ సులువుగా చేయొచ్చట. 525 మందిని తీసుకెళ్లగల సామర్థ్యంతో ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఎయిర్బస్ ఏ380తో పోలిస్తే కొత్త విమానం నమూనా (ఇన్సెట్)లో. -
విమానంలో ఫుడ్కు రుచి లేదా?
న్యూఢిల్లీ: మనం విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు మన ముందు పంచభక్ష పరమన్నాలు పెట్టినా తినబుద్ధి కాదు. కడుపులో ఎలుకలు గోల చేస్తుంటే గిచ్చుకుంటూ గిచ్చుకుంటు తిని ఏదో తిన్నామనిపిస్తాం. ఈ విషయంలో ప్రయాణిలను మెప్పించేందుకు వివిధ విమానయాన సంస్థలు రకరకాల ప్రయోగాలు చేసి విఫలమయ్యాయి. బ్రిటిష్ ఎయిర్ లైన్స్ అయితే 2013లో సెలబ్రిటీ చెఫ్ హెస్టన్ లాంటి నల భీములను తీసుకొచ్చి వండించి మరీ ప్రయాణికులను వడ్డించింది. అయినా ప్రయాణికులను తృప్తిపర్చలేక పోయింది. కాఫీ చేయడంలో కాకలుతీరిన యోధులను కూడా తీసుకొచ్చి ప్రయోగాలు చేసింది. అయినా ఆశించిన ఫలితం రాలేదు. ఎందుకు ఇలా జరుగుతుందో వంటా వార్పు తెలిసిన నిపుణులకు ఎంతకూ అర్థం కాలేదు. మొన్న మొన్ననే ఈ రహస్యాన్ని శాస్త్ర విజ్ఞాన నిపుణులు ఛేదించారు. విమానం 30 వేల అడుగులకు పైగా ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికుల నాలుకల్లో రుచిని గుర్తించే కణజాలం మొద్దుబారి పోవడమే ప్రధాన కారణం. ఎంత ఎత్తులో ప్రయాణిస్తున్నాం, విమానంపైనా, తెలియకుండా మనపై కలుగుతున్న ఒత్తిడి ఎంత ? అన్న అంశంపై మన నాలుకల్లోని రుచిని ఆస్వాదించే కణ జాలం ఎంత శాతం మొద్దుబారి పోతుందన్నది ఆధారపడి ఉంటుందని వారంటున్నారు. తీపి, పులుపు, ఉప్పు, చేదు, వగరు లాంటి రుచులను గుర్తించే కణజాలం నాలుకలపై వేలల్లో ఉంటుంది. ఆ కణ జాలం జీవితకాలం పట్టుమని పదిహేను రోజులే. నశించిన కణ జాలం చోట ఎప్పటికప్పుడు కొత్త కణ జాలం పుట్టుకొస్తుంది. వయస్సు మీరితే ఇదికాస్త మందగిస్తుంది. భూ ఉపరితలంపై తయారు చేసిన వంటకాలను ఫ్రీజర్లలో భద్రపరిచి దాన్ని విమానంలోకి తీసుకొచ్చి మళ్లీ అక్కడ వేడి చే సి వండించడం వల్ల కూడా కొంత రుచిలో మార్పు రావడం రెండవ కారణం. విమానం క్యాబిన్లో ఉండే పొడి వాతావరణం కూడా ఆహార పదార్థాల రుచిపై ప్రభావం చూపించడం మూడం కారణమని శాస్త్రవేత్తలు తేల్చి చెబుతున్నారు. ప్రయాణికులకు ఇష్టమైన ఆహార పదార్థాల్లో కొంత మెంతిని కలిపితే కొంతవరకు రుచిని రక్షించవచ్చని బ్రిటిష్ ఎయిర్లైన్స్ నలభీములు అనుభవంతో చెబుతున్నారు. ఒక్క ఆహార పదార్థాలే కాకుండా విమానంలో సర్వ్చేసే వైన్స్ కూడా రుచిలేకుండా చప్పగుంటున్నాయట. బ్రేవరీస్లో వైన్స్ తయారవుతున్నప్పుడు అవి నిర్దేశిత రుచిలో ఉన్నాయా అన్న విషయాన్ని రూఢీ చేయడానికి నిపుణులు ఉంటారన్న విషయం మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఆ నిపుణులు విమానంలోనూ ప్రయాణిస్తూ తమ బ్రాండ్ల వైన్ల రుచి మారకుండా ఏం చేయాలన్న విషయమై ప్రయోగాలు జరుపుతున్నారట. -
అమెరికా అధ్యక్షుడికి కొత్త విమానం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు విదేశీ పర్యటనకు వెళ్లేప్పుడు ఉపయోగించే విమానాన్ని ‘ఎయిర్ ఫోర్స్ వన్’ గా వ్యహరిస్తారనే విషయం తెల్సిందే. అమెరికా ఆధ్యక్షుడు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఎయిర్ ఫోర్స్ వన్ విమానాన్ని సాంకేతికంగా 747-200 బీ జంబో జెట్గా వ్యవహరిస్తారు. ఇదే విమానంలో బరాక్ ఒబామా ఇటీవల భారత్ పర్యటనకు వచ్చి వెళ్లారు. ఇప్పుడు ఆ స్థానంలో ఆధునీకరించిన బోయింగ్ 747-8 (సాంకేతికనామం) విమానాన్ని తీసుకరావాలని నిర్ణయించారు. ఎందుకు ఈ అవసరం వచ్చిందంటే గత 30 ఏళ్లుగా అమెరికా అధ్యక్షుడు 747-200బీ వెర్షన్ విమానాన్ని వాడుతున్నారని, సాంకేతక రంగంలో వచ్చిన మార్పులతో ఆధునీకరించిన కొత్త విమానాన్ని ‘ఎయిర్ ఫోర్స్ వన్’గా తీసుకరావాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ఎయిర్ ఫోర్స్ సెక్రటరీ దెబోరా లీ జేమ్స్ మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలియజేశారు. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మరింత పటిష్టంగా తీర్చిదిద్దడంతోపాటు ఇంధనం ట్యాంక్ సామర్థ్యాన్ని కూడా పెంచామని ఆయన చెప్పారు. సకల హంగులు కలిగిన ఈ విమానాన్ని తొలిసారిగా అమెరికాలోనే ఉత్పత్తి చేసినట్టు, దీనికి రూ. 2,286 కోట్లు ఖర్చయినట్టు ఆయన తెలిపారు. అయితే ఈ విమానం దేశాధ్యక్షుడికి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. ప్రస్తుత ఎయిర్ ఫోర్స్ వన్లో కూడా సకల సౌకర్యాలు ఉన్నాయి. అధ్యక్షుడితోపాటు ఆయన అంగరక్షకులు, వైట్హౌజ్ సిబ్బంది, వివిధ శాఖలకు చెందిన మంత్రులు, మార్బలం ప్రయాణించేందుకు అవసరమైన వసతులన్నీ ఉన్నాయి. అధ్యక్షుడితోపాటు వైట్హౌజ్ సిబ్బంది బస చేయడానికి ప్రత్యేక గదులు, వారు సమావేశమవడానికి ప్రత్యేక హాళ్లు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు ఓ ఆస్పత్రి కూడా ఉంది. ఒకేసారి రెండు వేల మందికి భోజనం తయారు చేయడమే కాకుండా అంతమందికి ఒకేసారి సర్వ్చేసే అవకాశం కూడా ఇందులో ఉంది. అంతేకాకుండా బాంబు దాడులే కాకుండా అణ్వస్త్రాలను తట్టుకునే శక్తి కూడా ఈ విమానానికి ఉంది. అణు బాంబుల దాడి సందర్భంగా వెలువడే అణు ధార్మిక తరంగాలను నిలువరించే ప్రత్యేక కవచం కూడా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ‘వైట్ హౌజ్’కు రెక్కలు తొడిగితే ఎలా ఉంటుందో ఎయిర్ ఫోర్స్ వన్ అలా ఉంటుంది. గతనతలంలో ఎక్కడ ఉన్నా అమెరికా అధ్యక్షుడు ‘వైట్ హౌజ్’లో ఉన్నట్టుగా విధులు నిర్వహించేందుకు వీలుగా ఇందులో ఏర్పాట్లు ఉంటాయి. ఒక్కసారి ఇంధనం నింపితే సగం ప్రపంచాన్ని చుట్టి రావచ్చు. గగనతలంలోనే ఇంధనాన్ని నింపుకొనే సౌకర్యం కూడా దీనికి ఉంది. సాధారణంగా ఎయిర్ ఫోర్స్ వన్ రెండు విమానాలు ఉంటాయి. అధ్యక్షుడు ఏ విమానంలో వెళతారనేది చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచుతారు. అధ్యక్షుడు ఎక్కిన విమానాన్ని ఎయిర్ ఫోర్స్ వన్గా వ్యవహరిస్తారు. ఈ విమానం నిర్వహణ బాధ్యతలను మెరైన్ కోర్ చూస్తోంది. దేశాధ్యక్షుడు ఈ విమానంలో దేశంలోపల ప్రయాణిస్తే ‘మెరైన్ వన్’గా వ్యవహరిస్తారు. చాలా అరుదుగా అధ్యక్షుడు ఆర్మీ హెలికాప్టర్లో ప్రయాణిస్తారు. అప్పుడు దాన్ని ‘ఆర్మీ వన్’గా వ్యవహరిస్తారు. ఇక ఉపాధ్యక్షుడు ప్రయాణించే విమానాన్ని ‘ఎయిర్ ఫోర్స్-టూ’గా వ్యవహరిస్తారు. -అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనెడీ 1963, నవంబర్ 22వ తేదీన టెక్సాస్లోని డల్లాస్లో హత్యకు గురైనప్పుడు ఆయన భౌతికదేహాన్ని ఎయిర్ఫోర్స్ వన్ విమానంలోనే వాషింగ్టన్ తీసుకొచ్చారు. -కెనెడీ స్థానంలో అమెరికా 36వ అధ్యక్షుడిగా లిండన్ జాన్సన్ పదవీ బాధ్యతలు స్వీకరించినదీ ఈ విమానంలోనే. -చైనాను సందర్శించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా రిచర్డ్ నిక్సన్ ప్రయాణించిందీ ఈ విమానంలోనే. -ఒసామా బిన్ లాడెన్ సారథ్యంలో టెర్రరిస్టులు 9/11 దాడులు జరిపినప్పుడు అప్పటి దేశాధ్యక్షుడు జార్జి డ బ్ల్యూ బుష్ పాలనాపరమైన ఆదేశాలను ఈ విమానం నుంచే ఇచ్చారు. -ఎయిర్ ఫోర్స్ వన్ టైటిల్తో 1997లో వచ్చిన హాలీవుడ్ సినిమాతో ఈ విమానం ప్రత్యేకతల గురించి సామాన్య ప్రజలకు కూడా తెల్సింది. హారిసన్ ఫోర్డ్ నటించిన ఆ సినిమాలో ఎయిర్ ఫోర్స్ వన్ను రష్యన్లు హైజాక్ చేయడం సినిమా ఇతివృత్తం. -
విమాన ప్రమాదం: దయనీయ స్థితిలో ఆరేళ్ల బాలుడు!
లండన్: ఓ విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆరేళ్ల బాలునికి పెద్ద కష్టం వచ్చిపడింది. ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్న ఆ బాలుడు తల్లి దండ్రులను కోల్పోయి దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. కనీసం తన తల్లి దండ్రులను కోల్పోయానన్న వార్త కూడా ఆ బాలునికి తెలియకపోవడం తీవ్రంగా కలిచివేస్తోంది. యునైటెడ్ కింగ్ డమ్ లోని హమ్ షైర్ దేశంలో శనివారం జరిగిన విమాన ప్రమాద ఘటన ఆ బాలుని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వారు బయల్దేరిన తేలికపాటి విమానం ల్యాండింగ్ చేసే సమయంలో ప్రమాదంలో చిక్కుకుంది. మళ్లీ ఆ విమానాన్ని గాల్లోకి తీసుకెళ్లే యత్నంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆ బాలుని తల్లి దండ్రులు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. అయితే తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఆ బాలుని పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం సృహ కోల్పోయిన ఆ బాలుడు మృత్యువుతో పోరాడుతున్నాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. -
500 కి.మీ. దూరంలోని మనుషులనూ చూస్తుంది..
విమానం ఆకారంలోని భారీ బెలూన్లా కనిపిస్తున్న ఈ ఎయిర్షిప్(గగననౌక) 500 కిలోమీటర్ల పరిధిలో కదులుతున్న మనుషులు, అన్ని వాహనాలనూ పసిగడుతుంది. తీరప్రాంత నిఘా కోసమని అమెరికా సైన్యం దీనిని రూపొందించింది. 24 గంటల పాటు, 360 డిగ్రీల కోణంలో వస్తువుల కదలికలపై ఇది నిఘా పెడుతుంది. రెండు ఎయిర్షిప్లతో ‘జ్లెన్స్’ అనే ఈ వ్యవస్థను మేరీల్యాండ్లోని సైనిక కేంద్రం వద్ద రూ. 17 వేల కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు. 10 వేల అడుగుల ఎత్తులోకి పంపే ఈ ఎయిర్షిప్లలో ఒకటి నిరంతరం తీర ప్రాంతాన్ని స్కానింగ్ చేస్తుంది. మరోటి కచ్చితమైన రాడార్ సాయంతో నేలపై, సముద్రంపై, ఆకాశంలోని వస్తువులను గుర్తిస్తుంది. అయితే, తీరప్రాంత భద్రత కోసమేనని సైన్యం చెబుతున్నా.. సొంత పౌరులపై నిఘా పెట్టేందుకే ఈ ఎయిర్షిప్లను ఏర్పాటు చేస్తున్నారంటూ అమెరికాలో ఇప్పుడు దుమారం రేగుతోంది. -
వీడని విమానం అదృశ్యం మిస్టరీ.. భారత్ సాయం
న్యూఢిల్లీ: ఇండోనేసియా విమాన అదృశ్య ఘటనపై సాయం చేసేందుకు భారత్ సంసిద్ధత వ్యక్తం చేసింది. అండమాన్ సముద్రంలో సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నౌకలను సిద్ధంగా ఉంచింది. విమానం ఆచూకీ కనుగొనేందుకు భారత్ మూడు నౌకలు, ఒక విమానాన్ని సిద్ధంగా ఉంచింది. కాగా ఇండోనేసియా విమానం అదృశ్యమై పది గంటలు దాటుతున్నా ఇంకా ఆచూకీ లభ్యం కాలేదు. తూర్పు బెలితుంగ్ వద్ద సముద్రంలో కూలినట్టు అనధికార సమాచారం. ఆదివారం ఉదయం ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానం-క్యూజెడ్ 8501 గగన తలం నుంచి అదృశ్యమైంది. విమానంలో మొత్తం 162 మంది ఉన్నారు. -
కూలిన సుఖోయ్ -30 విమానం
పుణె:ఓ యుద్ధ విమానం కూలి పోయిన ఘటన పుణెలో మంగళవారం సంభవించింది. భారత యుద్ధ విమానం సుఖోయ్ 30 ఎమ్ -ఐ తూర్పు పుణెకు 35 కిలోమీటర్ల దూరంలో కుప్పుకూలింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ఈ ఘటనలో పైలెట్ తో సహా కో పైలెట్ కూడా క్షేమంగా బయటపడ్డారు. వారు స్వల్పపాటి గాయాలతో బయటపడ్డారు. ఈ ఇద్దరి పైలెట్లను ఒక ఐఎఎఫ్ హెలికాప్టర్ లో తీసుకొచ్చినట్లు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ తెలిపింది. ఈ దుర్ఘటన మంగళవారం మధ్యాహ్నం 1.10 ప్రాంతంలో జరిగినట్టు లాహ్ గాన్ ఏఎఫ్ఎస్ అధికారి స్పష్టం చేశారు. గాలిలోకి ఎగిరిన కాసేపట్లోనే విమానం కూలినట్లు తెలిపారు. -
పాక్ విమానంపై కాల్పులు!
పెషావర్: యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబూ దాబి నుంచి పాకిస్థాన్లో పెషావర్కు వస్తున్న పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్(పీఐఏ) విమానానికి మంగళవారం త్రుటిలో ముప్పు తప్పింది. పెషావర్ దగ్గరలో దాన్ని లక్ష్యంగా చేసుకుని నలుగురు గుర్తుతెలియని సాయుధ దుంగడులు మెషిన్గన్లతో కాల్పులు జరిపారు. అయితే విమానానికి ఎలాంటి నష్టమూ వాటిల్లలేదు. విమానం పెషావర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. పోలీసులను ఉటంకిస్తూ జియో న్యూస్ ఈ మేరకు వెల్లడించింది. విమానంలో ఎంతమంది ప్రయాణికులున్నది తెలియడం లేదు. అయితే తమ విమానంపై కాల్పులు జరగలేదని పీఐఏ ప్రతినిధి స్పష్టం చేశారు.