కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని రెడ్డికాలనీలో గురువారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సూరంపుడి శాంతి(28) పదే ళ్ల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన శాంతి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
వివాహిత ఆత్మహత్య
Published Thu, Apr 21 2016 1:03 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement