Archaeological Survey of India
-
సిద్ధవటం.. అప్పట్లో ప్రఖ్యాత శైవక్షేత్రం
బి.కొత్తకోట: వైఎస్సార్ జిల్లా సిద్ధవటం అటవీ రేంజిలోని లంకమల అభయారణ్యం ఒకప్పుడు దేశంలోనే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాలతో వర్ధిల్లిందని భారత పురావస్తు శాఖ గుర్తించింది. బెంగళూరు, చెన్నై పురావస్తు కేంద్రాల నుంచి వచ్చిన పురావస్తు శాఖ డైరెక్టర్ డాక్టర్ కె.మునిరత్నంరెడ్డి, వివిధ విభాగాల్లో నిష్ణాతులైన యేసుబాబు, మేకా వి.రాఘవేంద్రవర్మ, సిద్ధవటం అటవీ రేంజి ఆఫీసర్ బి.కళావతితో కూడిన బృందం లంకమల అభయారణ్యం పరిధిలోని శాసనాలను అధ్యయనం చేసేందుకు గురువారం పర్యటించింది.బృందం ఇక్కడ పరిశీలన జరిపి లేబుల్ శాసనాల (బండరాయిపై చెక్కబడిన పేర్లు)ను సేకరించింది. అట్లూరు మండల పరిధిలోకి వచ్చే సుమారు 3,200 అడుగుల ఎత్తులోని లంక మలలోని గోపాలస్వామి కొండ, పరిసరాల్లో రెండు బండలపై సిద్ధమాతృక, శంఖులిపి, దేవనాగరి లిపిలలో ఉత్తర భారతీయ యాత్రికుల పేర్లు చెక్కబడ్డాయి. వీటిని ప్రత్యేక యాత్రికులకు చెందిన శాసనాలుగా నిర్ధారించారు. వీటిపై చెక్కబడిన 12 లేబుల్ శాసనాలను పరిశీలించిన బృందం వాటి కాపీలను తీసుకుంది. కుషానుల కాలం నాటి కళాత్మకతలేబుల్ శాసనాల్లో పేర్లు చెక్కిన తీరు పురావస్తు శాఖ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. అత్యంత కళాత్మకంగా చెక్కబడిన ఈ పేర్లను పరిశీలించాక 6వ శతాబ్దంలో అప్పటి కుషాను రాజుల కాలం నాటి కళాత్మకత కనిపిస్తోందని అధికారులు వెల్లడించారు. కుషానుల కాలం నాటి బొటనవేలి మొన శైలిలో తలకట్టును ఉపయోగించి పేర్లను చెక్కినట్టు గుర్తించారు. ఇది 5–6 శతాబ్దాల నాటి ఉత్తర భారత సిద్ధమాతృక లిపి అని నిర్ధారించారు.క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 4–5 శతాబ్దాల వరకు బ్రాహ్మి లిపిని వాడినట్టు కూడా ఆధారాలు ఉన్నాయి. కశ్మీర్, పంజాబ్లో శారద లిపి, ఒడిశాలో గౌడ, బెంగాల్లో ప్రోటోబెంగాలి లిపిగా ఉండేవి. తర్వాత ఉత్తర భారతంలో 8–9 శతాబ్దాల్లో మనుగడలో ఉన్న సిద్ధ మాతృక లిపి దేవ నాగరిలిపిగా పరిణామం చెందినట్టు భావిస్తున్నారు. లంకమలలో వెలుగుచూసిన లేబుల్ శాసనాల్లో ఈ విషయాలు స్పష్టమయ్యాయి.నేడు గుహలు, శాసనాల పరిశీలనసిద్ధవటం అటవీ రేంజి పరిధిలోని లంకమల అభయారణ్యంలో వెలుగు చూసిన ప్రాచీన కాలపు శాసనాలపై భారతీయ పురావస్తు శాఖ పరిశోధన, అధ్యయన బృందం శుక్రవారం సిద్ధవటం మండలంలోని నిత్యపూజలకోన కొండపై శాసనాలు, గుహలు, రాతి విగ్రహాలను పరిశీలించనుంది. ఈ బృందం సిద్ధవటం నుంచి పంచలింగాలకోనకు చేరుకుని అక్కడి నుంచి సుమారు 4 కిలోమీటర్లు కాలినడకన నిత్యపూజల కోనకు చేరుకుంటుంది. అక్కడ ప్రాచీన మానవులు నడయాడిన జాడలు, వెలుగులోకి వచ్చిన ఆధారాలను పురావస్తుశాఖ అధికారులు కాపీ చేసుకోనున్నారు. అనంతరం చరిత్రను పరిశోధించి అధ్యయనం చేస్తారు.వెలుగులోకి ఆశ్చర్యకర విషయాలుపురావస్తు శాఖ బృందం పరిశీలనలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రాంతం ఒకప్పుడు పవిత్ర శైవక్షేత్రంగా, దేశవ్యాప్తంగా ఖ్యాతి గడించిన ప్రాంతంగా బృంద సభ్యులు గుర్తించారు. ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితమైన దేవనాగరి లిపిని బండరాయిపై కళాత్మకంగా చెక్కిన తీరును బట్టి ఇది దక్షిణ భారతదేశంలో వెలుగు చూసిన తొలి లేబుల్ శాసనంగా బృందం తేల్చింది. ఇక్కడి ఆధారాలు ఆశ్చర్యకరమైన, లంకమల ప్రాంత గొప్పతనాన్ని చెబుతున్నాయి.లంకమలలోని గోపాలస్వామి కోన, నిత్యపూజల కోన ప్రాంతాలు ఇప్పటికీ ప్రసిద్ధి చెందినవే. గోపాలస్వామికొండపై ఆలయానికి పశ్చిమాన ఎత్తైన కొండపై రెండు బండరాళ్లు ఉన్నాయి. వాటిలో శ్రీ విశిష్ఠ కంకణధారి, యె ధర్మజ, చంద్రహాస తదితర పేర్లు కలిగిన లేబుల్ శాసనాలు ఉన్నాయి. ఇవి దేవనాగరి లిపికి చెందినవి కాగా.. క్రీ.శ. 4–16 శతాబ్దాల మధ్య ఇక్కడికి వచ్చిన యాత్రికుల పేర్లను బండపై చెక్కినట్టు లభ్యమైన లిపి ఆధారంగా నిర్ధారించారు. ఈ పేర్లు ఉత్తర భారతం నుంచి లంకమల ఆలయాల దర్శనం కోసం వచ్చిన యాత్రికులవై ఉంటాయని భావిస్తున్నారు. ఇందులో 4వ శతాబ్దానికి చెందిన బ్రాహ్మిలిపి పరిణామ క్రమాన్ని గుర్తించడం విశేషం. తొలి శాసనం ఇదేఉత్తర భారతానికి చెందిన యాత్రికులు లంకమలకు వచ్చినట్టు వెల్లడిస్తున్న తొలి చారిత్రక ఆధారం ఈ శాసనాలే అని పురావస్తు బృందం నిర్ధారించింది. దక్షిణ భారతంలో ఏకైక ఉత్తర భారత యాత్రికుల పేర్లు సిద్ధమాతృకలో రాసి ఉన్న ఇవి ఏకైక శాసన ఆధారమని పేర్కొంటున్నారు. ఈ శాసన అధ్యయనం దక్షిణ భారత చరిత్రలో మొదటిసారి కాబోతోందని వెల్లడించారు. శాసనాల అధ్యయనం నిపుణుడు యేసుబాబు మాట్లాడుతూ వీటిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తే మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. -
సంభాల్ మసీదు బావి వివాదం.. యథాతథ స్థితిని కొనసాగించండి
న్యూఢిల్లీ: సంభాల్లోని మొఘలుల నాటి జామా మసీదు సమీపంలోని వివాదాస్పద బావిపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని శుక్రవారం సుప్రీంకోర్టు భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ)తోపాటు ఉత్తరప్రదేశ్ అధికారులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి జామా మసీదు నిర్వహణ కమిటీ వేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కేంద్రం, ఏఎస్ఐలతోపాటు సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్కు, హరి శంకర్ జైన్ తరపున ఉన్న హిందూ కక్షిదారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 21వ తేదీన ఉంటుందని, రెండు వారాల్లోగా అక్కడి పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. బావికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్ట రాదని స్పష్టం చేసింది. మసీదు కమిటీ వేసిన పిటిషన్పై అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చే వరకు మసీదులో చేపట్టిన సర్వే నివేదికను సీల్డ్ కవర్లోనే ఉంచాలంది. -
అజ్మీర్ దర్గాపై కొత్త వివాదం
అజ్మీర్/న్యూఢిల్లీ: రాజస్తాన్లోని ప్రఖ్యాత అజ్మీర్ దర్గాపై కొత్త వివాదం మొదలైంది. ప్రస్తుతం దర్గా ఉన్న స్థలంలో గతంలో శివాలయం ఉండేదని పేర్కొంటూ కొందరు స్థానిక సివిల్ కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేశారు. శివాలయాన్ని కూల్చివేసి, సూఫీ సాధువు ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ పేరిట దర్గా నిర్మించారని వారు పేర్కొన్నారు. దర్గా ప్రాంగణాన్ని దేవాలయంగా గుర్తించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై న్యాయస్థానం స్పందించింది. పిటిషన్పై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ బుధవారం అజ్మీర్ దర్గా కమిటీకి, మైనార్టీ వ్యవహారాల శాఖకు, భారత పురావస్తు సర్వే విభాగానికి(ఏఎస్ఐ)కి నోటీసులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్లోని సంభాల్ పట్టణంలో షాహీ జామా మసీదు సర్వే వ్యవహారంలో ఘర్షణ జరిగి నలుగు మృతిచెందిన కొన్ని రోజులకే అజ్మీర్ దర్గాపై కోర్టు నోటీసులు జారీ చేయడం గమనార్హం. అజ్మీర్ సైతం మత ఘర్షణలకు కేంద్రంగా మారుతుందా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సమాజంలో అలజడి సృష్టించడానికే పిటిషన్ ఇదిలా ఉండగా, అజ్మీర్ దర్గా వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది. దీనిపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్పందించారు. మతాల పేరిట చిచ్చురేపి, సమాజంలో అలజడి సృష్టించడానికి ఉద్దేశపూర్వకంగానే ఈ పిటిషన్ దాఖలు చేశారని అజ్మీర్ దర్గాను పర్యవేక్షించే అంజుమన్ సయీద్ జద్గాన్ కార్యదర్శి సయీద్ సర్వర్చిïÙ్త ఆరోపించారు. మతాలవారీగా సమాజాన్ని ముక్కలు చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మత సామరస్యానికి, లౌకికవాదానికి ప్రతీక అయిన అజ్మీర్ దర్గా మైనార్టీ వ్యవహారాల శాఖ పరిధిలోకి వస్తుందని, దీంతో ఏఎస్ఐకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏమిటీ వివాదం?: అజ్మీర్ దర్గాను సంకట్ మోచన్ మహాదేవ్ ఆలయంగా ప్రకటించాలని కోరుతూ సెప్టెంబర్ నెలలో అజ్మీర్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. అక్కడ పూజలు చేసుకొనే అవకాశం ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింన తర్వాత తదుపరి విచారణను కోర్టు డిసెంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది. అజ్మీర్ దర్గాకు ఏదైనా రిజి్రస్టేషన్ ఉంటే వెంటనే రద్దు చేయాలని హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా డిమాండ్ చేశారు. ఏఎస్ఐ ద్వారా అక్కడ సర్వే చేపట్టాలని, దర్గా ప్రాంగణంలో పూజలు చేసుకొనే హక్కు హిందువులకు కల్పించాలని పేర్కొన్నారు. దర్గా ఉన్నచోట శివాలయం ఉండేదని, హరవిలాస్ సర్దా రాసిన పుస్తకంలో ఈ విషయం ప్రస్తావించారని గుర్తుచేశారు. సర్వే చేస్తే నష్టమేంటి? గిరిరాజ్ సింగ్ అజ్మీర్ దర్గాలో సర్వే చేయాలని కోర్టు ఉత్తర్వు ఇచ్చింందని, సర్వే చేస్తే వచ్చిన సమస్య ఏమిటి? కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రశ్నించారు. మొఘల్ రాజులు మన దేశంపైకి దండెత్తి వచ్చారని, ఇక్కడి ఆలయాన్ని కూల్చేశా రని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చే స్తోందని విమర్శించారు. జవహర్లాల్ నెహ్రూ 1947లోనే ఈ బుజ్జగింపు రాజకీయాలు ఆపేసి ఉంటే ఇప్పుడు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు. దేశాన్ని అస్థిరపర్చడానికి కుట్రలు: ఒవైసీ అజ్మీర్ దర్గా 800 ఏళ్లుగా ఉందని ఐఎంఐ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఉర్స్ సందర్భంగా ప్రధానమంత్రి అక్కడ చాదర్ సమరి్పంచడం సంప్రదాయంగా వస్తోందని, ఇప్పటిదాకా పనిచేసిన ప్రధానులంతా ఈ సంప్రదాయం పాటించారని వెల్లడించారు. దేశాన్ని అస్థిరపర్చడానికి కుట్రలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్తో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వ్యక్తులే ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యవహారాలతో దేశానికి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రార్థనా స్థలాల చట్టం–1991 ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న ప్రార్థనా స్థలాలను యథాతథంగా కొనసాగించాలని, వాటిలో ఎలాంటి మార్పులు చేయరాదని ఒవైసీ తేల్చిచెప్పారు. దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాం: కపిల్ సిబల్ అజ్మీర్ దర్గా విషయంలో రగడ జరుగుతుండడం బాధాకరమని ఎంపీ కపిల్ సిబల్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. మన దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాం? ఇదంతా ఎందుకు? అని ప్రశ్నించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనా? అని నిలదీశారు. లోక్సభ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ రాకపోవడంతో కొందరు వ్యక్తులు ఓ వర్గం ప్రజలను లక్ష్యంగా చేసుకొని, గొడవలు సృష్టిస్తున్నారని సమాజ్వాదీ పార్టీ ఎంపీ మొహిబుల్లా నద్వీ ఆరోపించారు. సివిల్ కోర్టు ఉత్తర్వును పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సజ్జాద్గనీ లోన్ తప్పుపపట్టారు. -
సమాధి ఆక్రమణపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్(డీసీడబ్ల్యూఏ)పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేశారు. 700 ఏళ్ల చరిత్ర ఉన్న లోధి హయాం నాటి సమాధిని ఆక్రమించుకోవడం పట్ల మండిపడింది. ఆ సమాధిని ఎందుకు పరిరక్షించకపోతున్నారని భారత పురావస్తు పరిశోధన విభాగాన్ని(ఏఎస్ఐ) ప్రశ్నించింది. ఆ ప్రాచీన కట్టడానికి ఎంత మేరకు నష్టం జరిగిందో అధ్యయనం చేయడానికి, పునరుద్ధరణకు అవసరమైన చర్యలను సూచించడానికి పురావస్తు నిపుణుడిని నియమిస్తామని వెల్లడించింది. 15వ శతాబ్దంలో నిర్మించిన సమాధికి చెందిన స్థలాన్ని, కట్టడాలను 1960వ దశకంలో డీసీడబ్ల్యూఏ ఆక్రమించుకుంది. ఓ గదిలో కార్యాలయం సైతం ఏర్పాటు చేసుకుంది. ఆ ప్రాచీన కట్టడాన్ని సంఘ విద్రోహ శక్తులు చాలావరకు ధ్వంసం చేశామని, అందుకే తాము ఆ«దీనంలోకి తీసుకున్నామని డీసీడబ్ల్యూఏ వాదించింది. ప్రాచీన కట్టడాన్ని ఆక్రమించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ డిఫెన్స్ కాలనీకి చెందిన రాజీవ్ సూరీ తొలుత ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించారు. ఆ సమాధిని రక్షిత ప్రాంతంగా ప్రకటించాలని, దాన్ని పరిరక్షించేలా ప్రభుత్వ అధికారులకు ఆదేశించాలని కోరారు. ఢిల్లీ హైకోర్టు సానుకూలంగా స్పందించకపోవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మానం బుధవారం విచారణ చేపట్టింది. సమాధికి చెందిన గదిలో ఏసీ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారని ఆక్షేపించింది. దానికి అద్దె చెల్లిస్తున్నారా? అని ప్రశ్నించింది. ప్రాచీన కట్డడాలను కాపాడాల్సిన ఏఎస్ఐ ఏం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. సమాధి స్థలాన్ని ఖాళీ చేయాలని డీసీడబ్ల్యూఏను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 21వ తేదీకి వాయిదా వేసింది. -
భోజ్శాల కాంప్లెక్స్: ప్రభుత్వం చేతికి ఏఎస్ఐ రిపోర్టు
భోపాల్: హైకోర్టు ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్ ధార్లోని వివాదాస్పద భోజ్శాల(కమల్ మౌలా మాస్క్) కాంప్లెక్స్లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వే చేపట్టింది. తాజాగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వే రిపోర్టును సోమవారం మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి అందజేసింది.సర్వే రిపోర్టు ప్రకారం.. సిల్వర్, కాపర్, అల్యూమినియం, స్టీల్తో తయారు చేయబడ్డ 31 నాణేలను గుర్తించారు. ఈ నాణేలు ఇండో-సస్సానియన్ (10-11వ శతాబ్దం), ఢిల్లీ సుల్తానేట్ (13-14వ శతాబ్దం), మాల్వా సుల్తానేట్ (15-16వ శతాబ్దం), మొఘల్ (16-18వ శతాబ్దం), ధార్ రాష్ట్రం (19వ శతాబ్దం), బ్రిటిష్(19-20వ శతాబ్దం)వారికి చెందినవిగా పేర్కొంది. మొత్తం 94 శిల్పాలు, శిల్పాల శకలాలు, నిర్మాణాలు బయటపడినట్లు పేర్కొంది.బయటపడిన ఈ శిల్పాలు బసాల్ట్, పాలరాయి, మృదువైన రాయి, ఇసుకరాయి, సున్నపురాయితో తయారు చేయబడినట్లు తెలిపింది. ఈ శిల్పాలు హిందూ దేవుళ్లు వినాయకుడు, బ్రహ్మ, నరసింహ, భైరవలో పాటు పలు జంతువులు, మానవుల రూపంలో ఉన్నాయి. వాటితో పాటు సింహం, ఎనుగులు, గుర్రాలు, కుక్క, కోతి, పాము, తాబేలు, పక్షులతో కూడిన శిల్పాలను గుర్తించినట్లు తెలియజేసింది. పలు శాసనాలపై సంస్కృతం, ప్రాకృత భాష రాసి ఉన్నట్లు పేర్కొంది. వాటిపై విద్యావ్యవస్థకు సంబంధించిన కార్యకలాపాలు జరిగినట్లు సూచిస్తున్నాయి. మరోవైపు.. భోజ్ రాజు హాయాంలో అక్కడి విద్యాకేంద్రం ఉన్నట్లు ఏఎస్ఐ రిపోర్టు సూచిస్తోంది.మార్చి 11న భోపాల్ హైకోర్టు భోజ్శాలలో సర్వే నిర్వహించాలని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ను ఆదేశించింది. మధ్య యుగానికి సంబంధించిన భోజ్శాల కాంప్లెక్స్ సరస్వతీ దేవీ ఆలయమని హిందువులు, కమల్ మౌలా మసీదు అని ముస్లింలు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ కాంప్లెక్సులో ప్రతి మంగళవారం హిందువులు పూజలు చేస్తుండగా శుక్రవారం ముస్లింలు నమాజ్ చేస్తున్నారు.ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు పూర్తి సర్వే రిపోర్టును జూలై 15వరకు సమర్పించాలని ఏఎస్ఐని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు జూలై 22కు వాయిదా వేసింది. -
జ్ఞానవాపి మసీదు సెల్లార్లో పూజలు చేసుకోండి
వారణాసి: వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని ఆనుకుని ఉన్న వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కేసు బుధవారం అత్యంత కీలక మలుపు తీసుకుంది. మసీదు ప్రాంగణంలో భారత పురావస్తు శాఖ చేసిన శాస్త్రీయ సర్వే నివేదిక ప్రకారం మసీదు కింద ఒకప్పుడు ఆలయం ఉండేదని బయటపడిన నేపథ్యంలో హిందువుల అనుకూలంగా వారణాసి కోర్టు నుంచి తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. మసీదు సెల్లార్లోని హిందూ దేవతలను ఆరాధించేందుకు, పూజా కార్యక్రమాలు చేసుకునేందుకు ఒక పూజారికి అనుమతినిస్తూ వారణాసి జిల్లా కోర్టు బుధవారం ఉత్తర్వులిచి్చంది. మసీదు ప్రాంగణంపై యాజమాన్య హక్కుల కేసులో పిటిషనర్ అయిన శైలేంద్ర కుమార్ పాఠక్కు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయని ఆయన తరఫు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ చెప్పారు. ‘‘ ఏడు రోజుల్లోగా ఆ మసీదు సెల్లార్లో పూజకు అనువుగా ఏర్పాటు చేయాలని జిల్లా మేజిస్ట్రేట్ను వారణాసి జిల్లా కోర్టు జడ్జి ఏకే విశ్వేశ ఆదేశించారని లాయర్ మదన్ వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కాశీ విశ్వనాథ్ ట్రస్టుకు ఈ పూజల బాధ్యతలు అప్పగించింది. పిటిషనర్ శైలేంద్ర తాత,పూజారి సోమ్నాథ్ వ్యాస్ గతంలో ఈ సెల్లార్లోనే 1993 డిసెంబర్దాకా పూజలు చేసేవారు. ఆ క్రమంలోనే ఇక్కడ పూజలు చేసుకునే హక్కులు తమకు దక్కుతాయంటూ ఆయన కోర్టు ఆశ్రయించారు. మసీదులో చిన్న కొలను వజూఖానా ముందున్న నంది విగ్రహం వద్ద ∙బ్యారీకేడ్లను తొలగించాలని, పూజలకు మార్గంసుగమం చేయాలని జడ్జి ఆదేశించారు. -
హిందువులకు అప్పగించండి: వీహెచ్పీ
న్యూఢిల్లీ: వారణాసిలోని జ్ఞానవాపి మసీదును అంతకుముందున్న ఆలయాన్ని ధ్వంసం చేసి నిర్మించినట్లు ఏఎస్ఐ సర్వే మరోసారి రూఢీ చేసినందున ఆ ప్రాంతాన్ని హిందువులకు అప్పగించాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) కోరింది. శివలింగం లభించిన వజూ ఖానాగా చెబుతున్న చోట హిందువులకు పూజలకు అనుమతులివ్వాలని డిమాండ్ చేసింది. మసీదును హిందూ ఆలయంగా ప్రకటించాలని వీహెచ్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు. -
Archaeological Survey Of India: జ్ఞానవాపి మసీదులో దేవతా విగ్రహాలు
వారణాసి: ఉత్తరప్రదేశ్లో వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కింద పురాతన హిందూ ఆలయ అవశేషాలున్నాయంటూ కోర్టుకు భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) సమర్పించిన సర్వే నివేదికలో మరి కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. శివలింగం భాగాలు, హిందూ దేవతల ధ్వంసమైన విగ్రహాలు మసీదులో ఉన్నాయి. వాటి ఫొటోలు తాజాగా జాతీయ మీడియాకు లభించాయి. హనుమాన్, గణేష, నంది విగ్రహాల ఫొటోలు, కొన్ని పానవట్టాలు, కిందిభాగం లేని శివలింగం వాటిలో ఉన్నాయి. శతాబ్దాల నాటి నాణేలు, పర్షియన్ లిపి సున్నపురాయి శాసనం, రోలు ఉన్నాయి. మసీదు కింద భారీ ఆలయముండేదని నివేదిక నిరూపిస్తోందని హిందువుల తరఫు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ చెప్పారు. ఆలయ రాతిస్తంభాలనే కాస్త మార్చి మసీదు నిర్మాణంలో వాడారని నివేదికలో ఉందన్నారు. ‘‘17వ శతాబ్దంలో ఔరంగజేబు ఇక్కడి ఆదివిశ్వేశ్వర ఆలయాన్ని కూల్చేసినట్లు నివేదికలోని ఆధారాలు బలంగా చాటుతున్నాయి. దీన్ని బట్టి ఇక్కడ ఒక ఆలయం ఉండేదని స్పష్టమవుతోంది’’ అని ఆయన చెప్పారు. దీనితో అంజుమన్ అంజామియా మసీదు కమిటీ ప్రతినిధి అఖ్లాఖ్ అహ్మద్ విభేదించారు. ‘‘ఇందులో కొత్తేమీ లేదు. గతంలోనూ అవి ఉన్నాయని ఏఎస్ఐ తెలిపింది. తాజా నివేదికలో వాటి కొలతలను స్పష్టంగా పేర్కొంది. అవి పురాతనమైనవని చెప్పే ఆధారాలను ఏఎస్ఐ ప్రస్తావించలేదు. ఆ రాళ్ల వయసు ఎంత అనే అంశాలపై ఏఎస్ఐ ఇంకా ఎలాంటి నిర్ధారణకు రాలేదు. సర్వేలో ఉన్నవన్నీ ఏఎస్ఐ అభిప్రాయాలు మాత్రమే. అవి నిపుణుల అభిప్రాయాలు కాదు’’ అని ఆయన వాదించారు. గత ఏడాది జిల్లా కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్ఐ మసీదు కాంప్లెక్స్లో శాస్త్రీయసర్వే చేపట్టి గత ఏడాది డిసెంబర్ 18వ తేదీన సీల్డ్ కవర్లో సర్వే నివేదికను సమర్పించింది. తాజాగా కోర్టు వాటిని కేసులో భాగమైన ఇరుపక్షాల ప్రతినిధులు, న్యాయవాదులకు అందజేశారు. దీంతో నివేదికలోని అంశాలు బహిర్గతమయ్యాయి. -
జ్ఞానవాపి అడుగున భారీ ఆలయం ఆనవాళ్లు!
వారణాసి: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ స్థానంలో భారీ హిందూ ఆలయ నిర్మాణం ఉండేదని భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) నివేదిక పేర్కొంది. హిందూ పక్షం న్యాయవాది విష్ణు శంకర్ జైన్ గురువారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో నివేదికలోని అంశాలను చదివి వినిపించారు. గ్రౌండ్ పెన్ట్రేటింగ్ రాడార్(జీపీఆర్) సర్వేలో వెల్లడైన అంశాలు కూడా ఈ నివేదికలో ఉన్నాయి. ప్రస్తుత నిర్మాణం అంతకుముందున్న నిర్మాణంపైన కట్టిందేనని కూడా సర్వేలో తేలింది. ‘మసీదులో చేసిన మార్పులను ఈ సర్వే గుర్తించింది. పూర్వమున్న స్లంభాలను, ప్లాస్టర్ను చిన్నచిన్న మార్పులతో తిరిగి ఉపయోగించినట్లు కనిపిస్తున్నాయి. హిందూ ఆలయం నుంచి తీసుకున్న కొన్ని స్తంభాలను కొద్దిగా మార్చివేసి కొత్త నిర్మాణంలో ఉపయోగించారు. స్తంభాలపై ఉన్న చెక్కడాలను తొలగించే ప్రయత్నం చేశారు’అని ఏఎస్ఐ నివేదిక పేర్కొన్నట్లు జైన్ వివరించారు. దేవనాగరి, తెలుగు, కన్నడ, ఇతర లిపిలలో రాయబడిన పురాతన హిందూ దేవాలయానికి చెందిన మొత్తం 34 శాసనాలు ప్రస్తుత, పూర్వపు నిర్మాణాలపై ఉన్నాయని జైన్ పేర్కొన్నారు. ‘ఇవి వాస్తవానికి పూర్వం ఉన్న హిందూ దేవాలయంలో ఉన్న శాసనాలు. ఇవి ప్రస్తుతం ఉన్న నిర్మాణంలోనూ మరమ్మత్తు సమయంలో ఇవి ఉపయోగించబడ్డాయి. దీనిని బట్టి పూర్వం అక్కడ ఉన్న హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసి, దానికి సంబంధించిన భాగాలను తిరిగి వాడినట్లుగా రుజువవుతోంది. ఈ శాసనాల్లో జనార్థన, రుద్ర, ఉమేశ్వర వంటి దేవతల పేర్లు కూడా ఉన్నాయి’అని నివేదికలో ఉన్నట్లు జైన్ చెప్పారు. కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకుని ఉన్న జ్ఞానవాసి మసీదు సముదాయాన్ని హిందూ, ముస్లిం పక్షాలకు ఇవ్వాలంటూ వారణాసి కోర్టు బుధవారం తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఈ నివేదిక వెలుగులోకి రావ డం గమనార్హం. జ్ఞానవాపి మసీదు అంతకుముందున్న హిందూ ఆలయ నిర్మాణంపైనే నిర్మితమయిందా అన్న విషయం తేల్చేందుకు గత ఏడాది వారణాసి కోర్టు అక్కడ ఏఎస్ఐ సర్వే జరపాలంటూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. -
Gyanvapi: కోర్టుకు చేరిన జ్ఞానవాపి సర్వే నివేదిక
వారణాసి: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో చేపట్టిన శాస్త్రీయ సర్వే నివేదికను సోమవారం ఏఎస్ఐ(ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) అధికారులు సీల్డు కవర్లో వారణాసి జిల్లా కోర్టుకు సమర్పించారు. దీనిపై ఈ నెల 21న విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. వారణాసిలోని ప్రఖ్యాత కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని ఆనుకుని ఉన్న 17వ శతాబ్ధం నాటి మసీదును అప్పట్లో ఉన్న ఆలయంపైనే నిర్మించారంటూ అందిన పలు పిటిషన్లపై కోర్టు సర్వే చేపట్టాలని జూలైలో ఆదేశించిన విషయం తెలిసిందే. సర్వే నివేదిక ప్రతులను ముస్లిం పక్షం వారికి కూడా ఏఎస్ఐ అధికారులు అందజేసినట్లు హిందూ పిటిషనర్ల తరఫున న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ వెల్లడించారు. తదుపరి విచారణ 21న ఉంటుందని కోర్టు పేర్కొందని తెలిపారు. సర్వే నివేదిక వివరాలను బహిర్గతం చేయరాదంటూ ముస్లిం పక్షం కోర్టులో వేసిన పిటిషన్ను తాము సవాల్ చేస్తామన్నారు. మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతల శిల్పాల వద్ద పూజలు చేసేందుకు అనుమతించాలంటూ కొందరు మహిళలు వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా జూలై 21న జిల్లా కోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత నిర్మాణాలకు ఎటువంటి నష్టం కలగని రీతిలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుని శాస్త్రీయంగా సర్వే చేపట్టాలని ఏఎస్ఐకి పురమాయించింది. ‘మసీదు గోపురాలు, సెల్లార్లు, పశ్చిమ దిక్కు గోడ కింద సర్వే చేయాలి. పిల్లర్ల వయస్సును నిర్ధారించాలి. భవనం రీతిని విశ్లేషించాలి’అని సూచించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించగా చుక్కెదురైంది. ఏఎస్ఐ అధికారులు సకాలంలో సర్వేను పూర్తి చేయలేకపోవడంతో కోర్టు ఆరు పర్యాయాలు గడువును పొడిగించింది. కృష్ణ జన్మభూమి–షాహీ ఈద్గా కేసు విచారణ వాయిదా ప్రయాగ్రాజ్: మథురలోని కృష్ణ జన్మభూమి ఆలయాన్ని ఆనుకుని ఉన్న షాహీ ఈద్గా మసీదు ఆవరణలో సర్వే చేపట్టాలన్న అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను ముస్లిం పక్షం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై వచ్చే జనవరి 9వ తేదీన విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించిందని ముస్లిం పక్షం అలహాబాద్ హైకోర్టుకు తెలిపింది. దీంతో, సర్వే కమిషన్ విధివిధానాలు, కూర్పుపై సోమవారం జరగాల్సిన విచారణను హైకోర్టు వాయిదా వేసింది. హిందూ ఆలయంపైనే మసీదును నిర్మించినట్లు ఆనవాళ్లు ఉన్నాయంటూ కొందరు వేసిన పిటిషన్పై గురువారం విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు.. మసీదు సర్వేను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా అధికారిని నియమించేందుకు అంగీకరించింది. -
Gyanvapi case: జ్ఞానవాపి నివేదికకు మరో 10 రోజుల గడువు
వారణాసి(యూపీ): జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) శాస్త్రీయ సర్వే నిర్వహించి నివేదిక సమర్పించేందుకు మరో 10 రోజుల గడువును వారణాసి జిల్లా కోర్టు మంజూరుచేసింది. నవంబర్ 17(శుక్రవారం)లోగా సర్వే వివరాలను నివేదించాలని గతంలో ఆదేశించగా మరో 15 రోజుల గడువుకావాలంటూ శుక్రవారం కోర్టును ఏఎస్ఐ తరఫు లాయర్లు అభ్యర్థించారు. టెక్నికల్ రిపోర్ట్ ఇంకా అందుబాటులో లేని కారణంగా గడువును పెంచాలని ఏఎస్ఐ కోరడంతో జిల్లా జడ్జి ఏకే విశ్వేశ్ నవంబర్ 28 వరకు గడువు ఇచ్చారని హిందువుల తరఫు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ వెల్లడించారు. ఆలయ పురాతన పునాదులపైనే 17వ శతాబ్దంలో మసీదు నిర్మించారంటూ దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్ఐ సర్వే చేపట్టిన విషయం తెల్సిందే. ఆగస్టు నాలుగో తేదీన నివేదిక సమర్పించాలని మొట్టమొదటిసారిగా కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత కేసు విచారణల సందర్భంగా గడువు పొడిగిస్తూ వచ్చారు. తాజాగా గడువును జిల్లా కోర్టు నవంబర్ 28గా నిర్దేశించింది. ‘న్యాయం జరగాలంటే సర్వే జరగాల్సిందే’ అంటూ వారణాసి కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు సమర్థించడంతో ఈ సర్వే ప్రక్రియకు తొలి అడుగు పడింది. -
కర్ణాటక ప్రభుత్వానికి కేంద్ర పురావస్తు శాఖ నోటీసులు
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన హంపీలోని విరూపాక్ష ఆలయంలో చారిత్రక స్తంభాన్ని తవ్వినట్లు వచ్చిన ఆరోపణలపై భారత ఆర్కియోలాజికల్ సర్వే కర్ణాటక దేవదాయ శాఖకు నోటీసులు జారీ చేసింది. ఇటీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరైన కర్ణాటక రాజ్యోత్సవ కార్యక్రమంలో జెండా ఏర్పాటు కోసం అక్కడ డ్రిల్లింగ్ చేసినట్లుగా ఆరోపిస్తున్నారు. చారిత్రక ప్రదేశంలో తవ్వే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆక్షేపిస్తోంది. హంపీ విరూపాక్ష ఆలయ సముదాయం కేంద్ర సాంస్కృతిక శాఖ పరిధిలోని భారత ఆర్కియోలాజికల్ సర్వే రక్షణలో ఉందని, అనుమతులు లేకుండా ఆలయాన్ని మూసివేయడం, స్తంభాల మధ్య రంధ్రాలు చేయడం నిబంధనలకు విరుద్ధమని దేవదాయ శాఖ ఇన్ఛార్జ్ అధికారికి ఇచ్చిన నోటీసులో భారత ఆర్కియోలాజికల్ సర్వే పేర్కొంది.చారిత్రక కట్టడాల రక్షణ చట్టం (AMASR Act)లోని సెక్షన్ 30ను ఉల్లంఘించినందుకు గానూ వివరణ ఇవ్వాలని కోరింది. విజయనగర సామ్రాజ్య కాలంలో రాజధాని నగరంగా ఉన్న హంపిలోని స్మారక కట్టడాల సమూహంలో విరూపాక్ష ఆలయం భాగంగా ఉంది. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో విజయనగర రాజు రెండవ దేవరాయ నిర్మించారని చరిత్రకారులు భావిస్తున్నారు. 1986లో యునెస్కో హంపిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఇక్కడి వివిధ స్మారక చిహ్నాలను కేంద్ర సాంస్కృతిక శాఖ పరిధిలోని భారత ఆర్కియోలాజికల్ సర్వే పరిరక్షిస్తోంది. -
జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వే పూర్తి
లక్నో: వారణాసి జ్ఞానవాపి మసీదులో భారత పురావస్తు సర్వే(ఏఎస్ఐ Archaeological Survey of India) చేపట్టిన సర్వే పూర్తైంది. అయితే.. నివేదికను సమర్పించేందుకు ఏఎస్ఐ గడువు కోరడంతో నవంబర్ 17వ తేదీదాకా వారణాసి కోర్టు సమయం ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే పూర్తి చేసి, నివేదిక ఇవ్వడానికి భారత పురావస్తు సర్వే (ఏఎస్ఐ)కు వారణాసి కోర్టు మరింత గడువిచ్చింది. ఈ నెల 17 వరకు సమయమిస్తూ జిల్లా న్యాయమూర్తి కే విశ్వేష్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సర్వేకు ఉపయోగించిన పరికరాల వివరాలతో పాటు సర్వే నివేదికను పూర్తిస్థాయిలో సిద్దం చేసేందుకు టైం కోరిందని, అందుకు కోర్టు అంగీకరించిందని ప్రభుత్వ న్యాయవాది అమిత్ శ్రీవాస్తవ మీడియాకు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. అక్టోబర్ 5వ తేదీన జ్ఞానవాపి సర్వే కోసం నాలుగు వారాల గడువు ఇచ్చిన వారణాసి కోర్టు.. తర్వాత ఎలాంటి గడువు ఉండబోదని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: జ్ఞానవాపి కేసులో తొందరపాటు వద్దు.. సైంటిఫిక్ సర్వేపై సుప్రీం కోర్టు -
కోర్టు ఆవల రాజీ ఒప్పందం కుదుర్చుకోండి
వారణాసి(యూపీ): వారణాసిలోని జ్ఞానవాపి మసీదును గతంలో ఆలయం ఉన్న ప్రదేశంపై నిర్మించారా? అన్న దానిని తేల్చే విషయంలో న్యాయస్థానంలో నలుగుతున్న అంశాన్ని కోర్టు ఆవల రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని విశ్వ వేదిక్ సనాతన్ సంఘ్ పిలుపునిచ్చింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో పురావస్తు శాఖ సర్వే కొనసాగుతున్న ఈ తరుణంలో సనాతన సంఘ్ చీఫ్ జితేంద్ర ఇలా బహిరంగ లేఖ రాయడం గమనార్హం. ఈ లేఖ తమకు అందిందని దీనిపై అంతర్గత సమావేశంలో చర్చిస్తామని ఇంతెజామియా మస్జిద్ కమిటీ సంయుక్త కార్యదర్శి మొహమ్మద్ యాసిన్ చెప్పారు. -
జ్ఞానవాపి మసీదులో రెండోరోజూ సర్వే
వారణాసి: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో పురావస్తు శాఖ(ఏఎస్ఐ) అధికారుల సర్వే రెండో రోజూ కొనసాగింది. హిందూ ఆలయ నిర్మాణంపైనే 17వ శతాబ్దంలో ఈ మసీదును నిర్మించారనే పిటిషన్పై వారణాసి కోర్టు శాస్త్రీయ సర్వేకు ఆదేశించిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్వే పనులు సాగాయి. ఏఎస్ఐ అధికారులతోపాటు ప్రభుత్వ న్యాయవాది రాజేశ్ మిశ్రా, ఐఐటీ కాన్పూర్ నిపుణులు, అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సభ్యులు అక్కడున్నారు. ఆదివారం కూడా సర్వే కొనసాగుతుందని అధికారులు తెలిపారు. సర్వేకు పూర్తిగా సహకరిస్తున్నట్లు మసీదు కమిటీ తెలిపింది. మసీదులో శాస్త్రీయ సర్వే జరపాలంటూ వారణాసి జిల్లా కోర్టు ఇచి్చన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు సమరి్థంచడం తెలిసిందే. సెప్టెంబర్ 4 లోగా సర్వే పూర్తి చేయాలని శుక్రవారం వారణాసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
జ్ఞానవాపి ముస్లిం కమిటీకి సుప్రీంలో చుక్కెదురు
ఢిల్లీ: జ్ఞానవాపి మసీదులో భారత పురావస్తు శాఖ సర్వేకు సుప్రీం కోర్టు సైతం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. సర్వే కొనసాగించాలంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలంటూ సుప్రీంను ఆశ్రయించింది జ్ఞానవాపి మసీదు కమిటీ. ఒకవైపు సర్వే ఇవాళ మొదలుకాగా.. మరోవైపు మసీద్ కమిటీకి సుప్రీంలో చుక్కెదురుకావడం గమనార్హం. అయితే శుక్రవారం ఈ అభ్యర్థనపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పిటిషన్ను తిరస్కరించింది. ఈ సర్వే ద్వారా చరిత్ర పునరావృతం అవుతుందని.. గాయాలు తిరిగి తెరపైకి వస్తాయని అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ వాదనలు వినిపించింది. అయితే.. ఈ వాదనలో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఏకీభవించలేదు. మనం ఇప్పుడు గతంలోకి వెళ్లొద్దు అంటూ బెంచ్ వ్యాఖ్యానించింది. ASI Survey నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వలేమంటూ పిటిషనర్కు తేల్చి చెప్పింది. అయితే అదే సమయంలో జ్ఞానవాపిలో చేసే సర్వే నాన్-ఇన్వాసివ్ మెథడ్(పరికరాల్లాంటివేం ఉపయోగించకుండా) చేయాలని, ఎలాంటి డ్యామేజ్ జరగొద్దంటూ పురావస్తు శాఖను ఆదేశించింది సుప్రీం. అందుకు ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ అంగీకరించారు. జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించి.. ఆ నివేదికను నాలుగు వారాల్లోగా అందజేయాలంటూ జులై 21వ తేదీన వారణాసి(యూపీ) జిల్లా కోర్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI)ను ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు జూలై 24న తాత్కాలికంగా నిలిపేసింది. దీనిపై విచారణ జరిపి, తగిన తీర్పు వెల్లడించాలని అలహాబాద్ హైకోర్టును ఆదేశించింది. హైకోర్టు గురువారం తీర్పు చెప్తూ, సైంటిఫిక్ సర్వేను నిర్వహించాలని ఆదేశించింది. న్యాయం కోసం ఇక్కడ సైంటిఫిక్ సర్వే నిర్వహించడం అవసరమని, దీనివల్ల ఇరు పక్షాలకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడింది. ఉత్తర ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సైంటిఫిక్ సర్వేను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (Archaeological Survey of India-ASI) శుక్రవారం ఉదయం ప్రారంభించింది. 17వ శతాబ్దంనాటి ఈ మసీదును అంతకన్నా ముందే నిర్మించిన హిందూ దేవాలయంపైన నిర్మించారా? అనే అంశాన్ని నిర్ధారించేందుకు ఈ సర్వే జరుగుతోంది. సర్వే కోసం ఏఎస్ఐకి నాలుగు వారాల సమయం మాత్రమే ఉంది. -
జ్ఞానవాపిలో పురావస్తు సర్వేకు బ్రేక్.. సుప్రీం కీలక ఆదేశాలు
ఢిల్లీ/లక్నో: వారణాసి జ్ఞానవాపి మసీద్లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(భారత పురాతత్వ సర్వేక్షణ) సర్వేపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజులపాటు (బుధవారం సాయంత్రం ఐదు గంటల దాకా) సర్వేను నిలిపివేయాలని ఏఎస్ఐను ఆదేశించింది. సోమవారం ఉదయం ఈ సర్వే జరగనుందని వారణాసి జిల్లా మెజిస్ట్రేట్(కలెక్టర్) ఇంతకు ముందే స్పష్టం చేశారు. దీంతో పోలీసుల బృందం ముందుగా లోనికి ప్రవేశించగా.. 40 మంది ఏఎస్ఐ అధికారులు వాళ్లను అనుసరిస్తూ లోనికి వెళ్లారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు.. సీల్ వేసిన ప్రాంతాన్ని మాత్రం సర్వే నుంచి మినహాయించారు. ఒకవైపు సర్వే జరగుతున్న సమయంలోనే.. మసీదు నిర్వాహణ కమిటీ వేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. సర్వేను తాత్కాలికంగా ఆపేయాలని ఏఎస్ఐను ఆపేయాలని ఆదేశించింది. వాజుఖానాలో ఆకారం బయటపడడం.. అది శివలింగమని హిందూ సంఘాలు, నీటి కొలను నిర్మాణమని మసీదు కమిటీ పరస్పరం వాదించుకుంటున్నాయి. ఈ క్రమంలో స్థానిక కోర్టు సర్వే చేపట్టాలంటూ పురావస్తు శాఖను శుక్రవారం ఆదేశించింది. దీంతో.. సర్వే త్వరగతిన పూర్తి చేసిన ఆగష్టు 4వ తేదీన జిల్లా న్యాయస్థానానికి ఏఎస్ఐ తన నివేదికను అందించాల్సి ఉంది. #WATCH | Varanasi, UP: Police team enters Gyanvapi mosque complex, ASI survey begins pic.twitter.com/kAY9CwN0Eq — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 24, 2023 ► మే 16, 2022న జ్ఞాన్వాపి మసీదు కాంప్లెక్స్లోని వాజుఖానాలో ఆ ఆకారం బయటపడింది. ► జ్ఞానవాపి మసీదు కూడా కాశీ విశ్వనాథ్ ఆలయ కాంప్లెక్స్లో భాగమేనని.. ఆ మసీదు గోడలపై హిందూ దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నాయని.. తమకు పూజ చేసుకునే అవకాశం కల్పించాలని కోర్టును ఐదుగురు మహిళలు కోరడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. అయితే ఈ వాదనను మసీదు కమిటీ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. ► ప్రశ్నార్థకమైన ఆ నిర్మాణాన్ని శివలింగం అని హిందూ వర్గాలు వాదిస్తుండగా.. ముస్లిం పక్షం ఈ వస్తువు 'వజూఖానా' రిజర్వాయర్ వద్ద వాటర్ ఫౌంటెన్ మెకానిజంలో భాగమని చెబుతోంది. ► ఇప్పటికే ఈ ఆకారంపై వీడియో రికార్డింగ్ సర్వే నిర్వహించారు. ► ప్రార్థనా స్థలాల చట్టం-1991ని జ్ఞానవాపి మసీదు విషయంలో వర్తింప చేయాలని మసీదు కమిటీ కోరింది. కానీ, గత నెల విచారణ సందర్భంగా జ్ఞానవాపి మసీదుకు ఈ చట్టం వర్తించదని న్యాయస్థానం తీర్పు చెప్పింది. ► శివలింగం లాంటి నిర్మాణంపై శాస్త్రీయ పరిశోధన నిర్వహించాలని హిందూ ఆరాధకుల అభ్యర్థనను వారణాసి కోర్టు గత సంవత్సరం తిరస్కరించింది. కానీ, అలహాబాద్ హైకోర్టు కార్బన్ డేటింగ్కు అనుమతించింది. ► అయితే ఈ ఏడాది మే 19వ తేదీన.. జ్ఞానవాపి కేసులో సుప్రీం కోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. కార్బన్ డేటింగ్ పద్దతి సహా సైంటిఫిక్ సర్వేను నిర్వహించేందుకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు తాజాగా(మే 12వ తేదీన) ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. తొందరపాటు వద్దని, సైంటిఫిక్ సర్వేను వాయిదా వేయాలని ఆదేశించింది. ► మసీదును పురాతన హిందూ దేవాలయంపై నిర్మించారా? లేదా? కనుగొనాలని కోర్టును నలుగురు మహిళలు వారణాసి జిల్లా కోర్టును ఆశ్రయించారు. హిందూ మహిళల పిటిషన్ ఆధారంగా.. జులై 21వ తేదీన జ్ఞానవాపి మసీదు ప్రాంగణాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)తో శాస్త్రీయ సర్వే చేయించడానికి అనుమతినిచ్చింది. ఆగష్టు 4లోగా నివేదికను సమర్పించాలని ఏఎస్ఐని ఆదేశించింది. అయితే.. సుప్రీంకోర్టు సీలింగ్ విధించిన వజుఖానా ప్రాంతాన్ని మాత్రం ఇందుకు మినహాయించింది. ► తాజాగా.. జ్ఞానవాపి మసీదుకు సంబంధించిన అన్ని ఉత్తర్వులపై వెంటనే స్టే ఇవ్వాలని మసీదు కమిటీ కోరుతోంది. జూలై మొదటి వారంలోనే ఈ పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. అయితే, విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకుని ఉన్న జ్ఞానవాపి మసీదు ఆవరణలో సర్వే చేపట్టాలంటూ వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో మసీదు కమిటీ సత్వర విచారణ కోరుతోంది. దీంతో ఇవాళ్టి సుప్రీం విచారణపైనా ఉత్కంఠ నెలకొంది. ► సుప్రీంకోర్టులో ముస్లిం పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ముస్లింల పిటిషన్పై సీజేఐ ధర్మాసనం అత్యవసరంగా విచారణ చేపట్టింది. ► సుప్రీంకోర్టులో విచారణ సందర్బంగా మసీదు కమిటీ వాదనలు వినిపిస్తూ.. 1500వ సంవత్సరం నుంచి అక్కడ మసీదు ఉంది. ఈ విషయంలో అంత తొందర ఎందుకు?. దీనిపై స్టేటస్ కో ఆర్ఢర్ ఉండాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. దీనికి జూలై 26న విచారణ జరుగునున్నట్టు కోర్టుకు తెలిపారు. అప్పటి వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని కోరారు. Gyanvapi case | Supreme Court says no ASI survey of Gyanvapi mosque complex till 5 pm, July 26th. High Court order shall not be enforced till 26th July. In the meantime, the mosque committee shall move High Court. pic.twitter.com/MMm9Xw1W3Q — ANI (@ANI) July 24, 2023 ► ఈ సందర్భంగా ధర్మాసనం.. జూలై 28వ తేదీ శుక్రవారం వరకు యథాతథ స్థితి ఉంటుందని స్టేట్కో ఇవ్వగలరా అని సొలిసిటర్ జనరల్ను ప్రశ్నించింది. ఇక, యూపీ ప్రభుత్వం హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ప్రస్తుతానికి అక్కడ ఎటువంటి తవ్వకాలు లేదా ఆక్రమణ జరగడం లేదన్నారు. ఈ క్రమంలో జూలై 26 వరకు అక్కడ ఎలాంటి సర్వేలు నిర్వహించరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. బుధవారం సాయంత్రం 5గంటల వరకు సర్వే ఆపాలని ఆదేశించింది. -
తవ్వి తీశారు.. అప్పగించటం మరిచారు
కొండాపూర్లో మ్యూజియాన్ని మూడేళ్లుగా మూసి పెట్టిన కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ), అంతకంటే పెద్ద ఘనకార్యాన్నే చేసింది. పన్నెండేళ్ల క్రితం తవ్వకాల్లో వెలుగు చూసిన వస్తువులను సంబంధిత ఉన్నతాధికారి ఇప్పటివరకు వాటిని మ్యూజియంకు హ్యాండోవర్ చేయలేదు. ఆ తవ్వకాల్లో ఏయే వస్తువులు లభించాయో నివేదికనూ అందజేయలేదు. తవ్వకాల్లో దొరికిన వస్తువులెన్ని? అవి ఎక్కడున్నాయి? వాటిల్లో అన్నీ ఉన్నాయా? లేదా? వంటి విషయాలేవీ బయటి ప్రపంచానికి చెప్పలేదు. నివేదిక ఇవ్వకున్నా ఏఎస్ఐ పన్నెండేళ్లుగా చేష్టలుడిగి చూస్తుండటం విడ్డూరం. పుష్కర కాలం కిందట ఆ తవ్వకాలకు నేతృత్వం వహించిన అధికారి, ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయబోతున్నారు. దీంతో తవ్వకాల్లో దొరికిన చారిత్రక సంపద విషయం గందరగోళంగా మారింది. సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డికి చేరువలో ఉన్న కొండాపూర్ అద్భుత శాతవాహన కేంద్రం. క్రీ.పూ.2వ శతాబ్దం–క్రీ.శ.2వ శతాబ్దం మధ్య ఇది వ్యాపార, ఆధ్యాత్మి క పట్టణం. 19వ శతాబ్ద ప్రారంభం, 1940, 1970ల్లో పలుమార్లు ఇక్కడ తవ్వకాలు జరిగాయి. చరిత్రపరిశోధకులు గొప్పవిగా భావించే అనేక ఆధారాలు వెలుగు చూశాయి. రోమన్లు వచ్చి ఇక్కడ స్థిరపడి అంతర్జాతీయస్థాయిలో వాణిజ్యాన్ని నిర్వహించినట్టు తేలింది. అగస్టస్ కాలం నాటి బంగారు నాణేలూ ఇక్కడ దొరి కాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతున్న చైనా పోర్సలీస్ బొమ్మలను తలదన్నే బొమ్మలు అక్కడ 2 వేల ఏళ్ల నాడే మనుగడలో ఉన్నట్టు తేలింది. నాటి బంగారు ఆభరణాలు, మణులు, వైఢూర్యాలు, కెంపులు, పచ్చల లాంటివెన్నో వెలుగు చూశాయి. ఓ పట్టణానికి సంబంధించిన అవశేషాలు కనిపించాయి. దీంతో అక్కడ 86 ఎకరాల స్థలాన్ని ఏఎస్ఐ తన ఆధీనంలోకి తీసుకుని ఓ మ్యూజియంను నిర్మించింది. తవ్వకాల్లో వెలుగు చూసిన వాటిల్లోంచి కొన్నింటిని ప్రదర్శనకు ఉంచింది. మరోసారి తవ్వకాలు.. 2009 నుంచి 2011 వరకు ఏఎస్ఐ మరోసారి తవ్వకాలు జరిపింది. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తవ్వకాల విభాగం (4) సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టు మహేశ్వరి ఆధ్వర్యంలో తవ్వకాలు జరిగాయి. అందులోనూ వేల సంఖ్యలో విలువైన వస్తువులు, శాతవాహన కాలం నాటి నాణేలు భారీ గా వెలుగు చూశాయి. అయితే.. ఏయే వస్తువులు దొరికాయి? వాటి ప్రత్యేకతలేంటి? అనే నివేదికను మాత్రం ఏఎస్ఐ బహిర్గతం చేయలేదు. ఎంతోమంది అడిగినా స్పందించలేదు. ఈలోపు అధికారి మహే శ్వరి వివిధ ప్రాంతాలకు బదిలీ అయ్యారు. ఆమె నివేదిక పోవడం, లభించిన వస్తువులను ఇక్కడి అధికారులకు హ్యాండోవర్ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. వాటిని పెట్టిన గది తాళంచెవులు కూడా అప్పగించలేదు. దీంతో తవ్వి తీసినా కూడా అవి అజ్ఞాతంలోనే ఉండిపోయాయి. పరిశోధనలకు ఆస్కారమే లేక.. కర్ణాటకలోకి మస్కిలో తవ్వకాలు జరిపినప్పు డు 33 బంగారు నాణేలు వెలుగు చూశాయి. మస్కి తవ్వకాల్లో లభించిన 33 ఫనమ్ బంగారు నాణేల్లో కేవలం ఒకటి మాత్రమే హోయసల రాజ్యానిదని, మిగతావన్నీ అంతకు చాలా ముందుగా ఉన్న విష్ణుకుండినులు సహా ఇతర పాలకులు అని వాటిని పరిశోధించిన ప్రముఖ నాణేల నిపుణుడు డాక్టర్ రాజారెడ్డి తేల్చారు. అలాంటి కొత్త విషయాలు కొండాపూర్లో 2009లో జరిపిన తవ్వకాల్లో దొరికిన నాణేల్లోనూ ఉంటాయన్న ఉద్దేశంతో వాటి పరిశోధనకు కేంద్రప్రభుత్వం నుంచి 2015లో అనుమతి పొందారు. అయితే.. నాటి అధికారి వాటిని హ్యాండోవర్ చేయకపోవటంతో పరిశోధనకు కేటాయించలేమని అధికారులు చెప్పారు. అలా పరిశోధనలేవీ జరగలేదు. (చదవండి: అర్ధరాత్రి నుంచి ఉరుములు, పిడుగులతో వాన) -
పర్యాటకులకు గుడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా చారిత్రక ప్రదేశాల్లో ఫ్రీ ఎంట్రీ!
న్యూఢిల్లీ: 75వ స్వాతంత్య్ర దినోత్సవం, ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా పర్యాటకులకు శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని చారిత్రక ప్రదేశాలను ఉచితంగా సందర్శించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని సుమారు 3,400 ప్రాంతాల్లో ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది కేంద్ర సాంస్కృతి, పర్యాటక శాఖ. భారత్ను అమృత కాలంలోకి తీసుకెళ్లేందుకు ఆజాదీ కా అమృత్ మహోత్సవం ఉపయోగపడుతుందని పేర్కొంది. చరిత్రను స్మరించుకుంటూ సంస్కృతి, వారసత్వాన్ని గుర్తు చేస్తూ బంగారు భవిష్యత్తుకు మార్గం వేసేందుకు సాయపడుతుందని పేర్కొంది. 2021, మార్చి 12న గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం నుంచి ఫ్రీడమ్ మార్చ్ను ప్రారంభించారు ప్రధాని మోదీ. ఆజాదీ కా అమృతి మహోత్సవంలోని కార్యక్రమాల వివరాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమం 2023, ఆగస్టు 15 వరకు కొనసాగుతుందని ప్రకటించారు. అనంతరం మహాత్మాగాంధీ సహా.. స్వాతంత్య్ర సమర యోధులకు నివాళులర్పించారు. 𝗙𝗿𝗲𝗲 𝗘𝗻𝘁𝗿𝘆 𝗔𝘁 𝗔𝗹𝗹 𝗠𝗼𝗻𝘂𝗺𝗲𝗻𝘁𝘀 (𝗔𝘂𝗴𝘂𝘀𝘁 𝟱-𝟭𝟱): As part of 'Azadi ka #AmritMahotsav' and 75th I-Day celebrations, @ASIGoI has made Entry Free for the visitors/tourists to all its protected monuments/sites across the country, from 5th -15th August, 2022 pic.twitter.com/NFuTDdCBVw — G Kishan Reddy (@kishanreddybjp) August 3, 2022 ఇదీ చదవండి: ఎన్నో ఉద్యోగాలు వదులుకున్నాడు.. చివరికి అరకోటి ప్యాకేజీతో షాకిచ్చాడు! -
చెరువుల తవ్వకాల్లో బయటపడ్డ ఇటుకల గోడ...అది మౌర్య సామ్రాజ్యపు..
పాట్నా: కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మిషన్ అమృత్ సరోవర్ పనుల్లో భాగంగా బీహార్లోని పాట్నాలో కుమ్రహర్ ప్రాంతంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) తవ్వకాలు చేపట్టింది. ఈ తవ్వకాల్లో ఒక పురాతనమైన గోడల అవశేషాలు బయటపడ్డాయి. ఇవి రెండు వేల ఏళ్ల నాటి మౌర్య సామ్రాజ్యపు గోడల అవశేషాలని ఆర్కియాలజిస్ట్ గౌతమి భట్టాచార్య అన్నారు. అంతేకాదు బహుశా కుషాన్ యుగం నుంచి కూడా ఉండవచ్చని చెబుతున్నారు. వాస్తవానికి మిషన్ అమృత్ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా పాట్నాలో రక్షిత చెరువులను పునరుజ్జీవింప చేసే పనులను చేపట్టామని తెలిపారు. అందులో భాగంగా ఈ తవ్వకాలు జరుపుతున్నప్పుడు చెరువులో ఈ పురాతన గోడల అవశేషాలు గుర్తించామని చెప్పారు. ఈ గోడలోని ఇటుకలు క్రీస్తు శకం 30వ శతాబ్దం నుంచి 375 కాలంలోని మధ్య ఆసియా(అంటే ప్రస్తుత ఆప్గనిస్తాన్)ని పాలించిన కుషాన్ యుగానికి చెందినవని తెలుస్తోందన్నారు. ఈ విషాయాన్ని న్యూఢిల్లీలోని ఏఎస్ఐ ప్రధాన కార్యాలయంలోని సీనియర్ అధికారులకు కూడా తెలియజేశాం అని గౌతమి పేర్కొన్నారు. ఈ మేరకు బీహార్లోని పాట్నాలో మొత్తం పదకొండు రక్షిత నీటి వనరులను పునరుజ్జీవింప పనులు చేపట్టింది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ). (చదవండి: ఈ జంట మరీ వైల్డ్! పూల దండలుగా) -
Qutub Minar Row: ఆలయ పునరుద్ధరణ సాధ్యం కాదు!
న్యూఢిల్లీ: రక్షిత స్మారక ప్రదేశం అయితే కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో.. ఆలయాన్ని పునరుద్ధరించడం సాధ్యం కాదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తేల్చి చెప్పేసింది. భారత పురావస్తు సర్వే శాఖ కీలక ప్రకటన చేసింది. కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో ఆలయపునరుద్ధరణ వ్యవహారం సాకేత్ కోర్టుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో.. ఆ స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలనే అభ్యర్థనను ఏఎస్ఐ తోసిపుచ్చింది. కుతుబ్ మినార్ అనేది 1914 నుంచి పరిరక్షణ స్మారకంగా కొనసాగుతోంది. అలాంటి చోటులో నిర్మాణాలను మార్చడం సాధ్యం కాదు. స్మారక చిహ్నం వద్ద ఆరాధన పునరుద్ధరణ అనుమతించబడదు అని ఏఎస్ఐ స్పష్టం చేసింది. పూజలకే కాదు.. నమాజ్కు నో ఆర్కియాలజీ నిబంధనల ప్రకారం.. నివాసం లేని ప్రదేశాల్లో ప్రార్థనలకు అనుమతించరు. ఈ లెక్కన.. కుతుబ్మినార్ దగ్గర పూజలకే కాదు.. నమాజ్కు అనుమతులు ఇవ్వలేదు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతుండగా.. తాము తాజాగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. పాలసీ ప్రకారం.. నమాజ్ను నిలిపివేయాలని గతంలోనే కోరామని, పంపిన ఆదేశాలు కూడా ఎప్పటివో అని స్పష్టం చేసింది. జ్ఞానవాపి మసీద్ సర్వే వ్యవహారం వార్తల్లో నిలిచి వేళ.. ఏఎస్ఐ మాజీ రీజినల్ డైరెక్టర్ ధరమ్వీర్ శర్మ కుతుబ్మినార్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుతుబ్ మినార్ను కుతుబ్ అల్ దిన్ ఐబక్ కట్టించలేదని, సూర్యుడి దశను అధ్యయనం చేసేందుకు రాజా విక్రమాదిత్య కట్టించాడని వాదిస్తున్నాడు. మరోవైపు హిందూ సంఘాలు కుతుబ్ మినార్ వద్దకు చేరుకుని విష్ణు స్తంభ్గా పేరు మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. చదవండి: కుతుబ్ మినార్ తవ్వకాలపై కేంద్రం క్లారిటీ -
కుతుబ్మినార్ కాదు సూర్య గోపురం!
Qutub Minar was built by Raja Vikramaditya to observe the sun: తాజ్మహల్ కాదు తేజో మహల్ అనే వివాదం తలెత్తి సద్దుమణగక మునుపే మరో వివాదం తెర మీదకు వచ్చింది. కుతుబ్ మినార్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఓ సీనియర్ అధికారి. అది కుతుబ్ మినార్ కాదని.. సూర్యగోపురం అని ఆయన అంటున్నారు. ఐదవ శతాబ్దంలో రాజావిక్రమాదిత్య ఈ గోపురాన్ని నిర్మించాడని ఆర్కియాలజీ సర్వే మాజీ అధికారి ధర్మవీర్ శర్మ వాదిస్తున్నారు. అంతేగాదు ఆయన సూర్యుని దిశను అధ్యయనం చేయడం కోసం కుతుబ్ మినార్ని రాజవిక్రమాదిత్య నిర్మించారని, కుతుబ్ అలల్ దిన్ ఐబాక్ దీన్ని నిర్మించలేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది కతుబ్మినార్ కాదు సూర్యగోపురం(అబ్జర్వేటరీ టవర్)’’ అని కూడా చెప్పారు. తాను ఆర్కియాలజీ సర్వే తరుఫున కుతుబిమినార్లో పలుమార్లు సర్వే చేసినట్లు కూడా చెప్పుకొచ్చారు. అంతేగాదు కుతుబ్ మినార్ టవర్లో 25 అంగుళాల వంపు ఉందని జూన్ 21న సూర్యస్తమయం అయ్యే సమయంలో అరగంట సేపు కనువిందు చేసే నీడ ఈ ప్రాంతంలో ఏర్పడదని ఒక కొత్త విషయాన్ని కూడా వెల్లడించారు. కుతుబ్మినార్ అనేది స్వతంత్ర నిర్మాణమే గానీ.. మసీదుకు సంబంధించినది కాదని చెప్పారు. తలుపులు కూడా ఉత్తరం వైపు ఉన్నాయని, ఇది రాత్రిపూట ఆకాశంలోని ధృవ నక్షత్రాన్ని చూసేందుకంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. (చదవండి: వేలం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం) -
తెలుగింటికి వెలుగొచ్చింది
కడప కల్చరల్: ఇక కనిపించదనుకున్న తొలి తెలుగు శాసనం బండను పరిశోధకులు కనుగొన్నారు. కళ్లెదుటే కనిపిస్తున్నా బండపై అక్షరాల అస్పష్టత కారణంగా ఇప్పటివరకు దాన్ని గుర్తించలేకపోయారు. అయినా.. పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నించి తెలుగు వారి కలలను సాకారం చేశారు. తెలుగుభాష ప్రాచీనతను స్పష్టం చేసే ఆధారం లభించడంతో వైఎస్సార్ జిల్లా వాసులు సంబరాలు చేసుకుంటుండగా.. ప్రపంచంలోని తెలుగు భాషాభిమానులంతా ఆనందోత్సహాలు వ్యక్తం చేస్తున్నారు. మూల శాసనం లభ్యమైంది క్రీ.శ. 575లో వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం కల్లమలలో రేనాటి పాలకుడైన ధనుంజయుడు వేయించిన తొలి తెలుగు శాసనం ఉన్నట్టు చరిత్ర పరిశోధకులు ఎప్పుడో స్పష్టం చేశారు. కానీ.. దాని నకలు (ఎస్టామ్ పేజ్) మాత్రమే లభ్యమైంది తప్ప దానికి మూలమైన శాసనం గల బండ మాత్రం కనిపించ లేదు. నకలు తీసిన సమయంలోనే ఆ రాతిని చెన్నైలోని పురావస్తు మ్యూజియానికి చేర్చారనే ప్రచారం సాగింది. తెలుగు భాషాభిమానులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మేధావుల బృందాలు ఆ మ్యూజియానికి వెళ్లి శాసనం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. శాసనం బండ దొరక్కపోవడంతో నకలుతోనే సరిపెట్టుకుంటూ వచ్చారు. బయట పడిందిలా.. కొన్నేళ్ల క్రితం భారత పురావస్తు శాఖ ఎపీగ్రఫీ విభాగం డైరెక్టర్ చెవుకుల అనంత పద్మనాభశాస్త్రి తొలి తెలుగు శాసనాన్ని కల్లమలలో తాను 1975 ప్రాంతంలో చూశానని, దాన్ని ధ్రువీకరించుకుని జాగ్రత్త చేయాలని సూచించారు. నాటినుంచి పరిశోధకులు శోధన ప్రారంభించారు. శాస్త్రీయంగా ముందుకు సాగారు. శాసనాన్ని గుర్తించినా అప్పటికే ఆ బండపై గల అక్షరాలు కనిపించని స్థాయిలో ఉన్నాయి. భక్తులు, యోగులు ఆ బండ విలువ తెలియక దానిపై కూర్చోవడం, పచ్చడి నూరుకోవడంతో అక్షరాలు అరిగిపోయి అస్పష్టంగా మారాయి. దీంతో అది తొలి తెలుగు శాసనం కాదని అంతా కొట్టిపడేశారు. ఆ బండ ఎప్పుడో చెన్నై మ్యూజియానికి చేరిందని గట్టిగా వాదించారు. వాస్తవానికి అంతవరకు తొలి తెలుగు శాసనంగా భావించిన ఎర్రగుడిపాడు శాసనాన్ని బ్రిటిషర్లు చెన్నై మ్యూజియానికి చేర్చారు. కానీ.. ఆ తర్వాత కల్లమల శాసనమే తొలి తెలుగు శాసనమేనని స్పష్టమైనా అది చెన్నైకి చేరిందన్న ప్రచారం మాత్రం ఆగలేదు. రెండిటికీ తొలి తెలుగు శాసనంగా గుర్తింపు ఉన్నా శాస్త్రీయ పరిశోధనల్లో ఆ తర్వాత కల్లమల శాసనమే మొదటిదని స్పష్టమైంది. కాగా, కల్లమలలోని తొలి తెలుగు శాసనం అక్కడి చెన్నకేశవస్వామి ఆలయంలోనే ఉందని శాసన పరిశోధకులు డాక్టర్ అవధానం ఉమామహేశ్వరశాస్త్రి ద్వారా తెలుసుకున్న తెలుగు వీరాభిమాని, రాష్ట్ర ఉపాధ్యాయ ఐక్యవేదిక అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులురెడ్డి ఆ శాసనం బండకు రక్షణ కల్పించేలా మంటపం కట్టించాలని భావించారు. పరిశోధకులు ఉమామహేశ్వరశాస్త్రి, శ్రీనివాసులురెడ్డి, ప్రొఫెసర్ సాంబశివారెడ్డి, మరికొందరు భాషాభిమానులు, పరిశోధకులతో కలిసి శనివారం కల్లమల వెళ్లి మరోసారి అక్షరాలను పోల్చుకుని అవి కాల ప్రభావంతో అస్పష్టంగా మారినా శాస్త్రీయంగా అదే తొలి తెలుగు శాసనమని మరోమారు స్పష్టం చేశారు. ఈ విషయం మరునాటికి విస్తృతంగా ప్రచారమైంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారిలో ఆనందం వెల్లివిరిసింది. ఇది ఉభయ తెలుగు రాష్ట్రాలలో సాహిత్యం, చరిత్రపరంగా ఉన్న ఎన్నో సందేహాలకు సమాధానం ఇవ్వనుంది. ప్రబలమైన సాక్ష్యం లభించింది ఎర్రగుడిపాడు శాసనం తొలి తెలుగు శాసనమని కొన్నాళ్లపాటు ప్రచారం జరగ్గా.. అది అప్పట్లోనే చెన్నై మ్యూజియానికి చేరింది. కొన్నేళ్ల తర్వాత కల్లమల శాసనమే తొలిదని స్పష్టమైంది. దీంతో చెన్నైకి చేరింది కల్లమల శాసనమని అందరూ పొరపాటుపడ్డారు. దశాబ్దకాలంగా నేను ఆ బండ కలమలలోనే ఉందని చెబుతూ వచ్చినా నమ్మేవారు కరువయ్యారు. ఇప్పుడు శాస్త్రీయంగా మరోమారు చెప్పడంతో విస్తృతంగా ప్రచారం జరిగి ఈ విషయంలో స్పష్టత వచ్చింది. – అవధానం ఉమామహేశ్వరశాస్త్రి సంతోషంగా ఉంది తొలి తెలుగు శాసనం బండ కల్లమలలో లేదని తెలిసి భాషాభిమానిగా మొదట్లో ఎంతో బాధపడ్డాను. కానీ పరిశోధకులు ఉమామహేశ్వరశాస్త్రి ఆ బండ కల్లమలలోనే ఉందని మరోమారు స్పష్టం చేశారు. రాష్ట్ర అధికారి వాడ్రేవు చినవీరభద్రుడు ఇటీవల కల్లమల శాసనాన్ని పరిశీలించి దాన్ని పరిరక్షించుకునే ప్రయత్నాలు చేయాలని సూచించారు. దీంతో ఆ శాసన బండ గురించి స్పష్టత ఇవ్వాలని పరిశోధకులను కోరారు. స్థానిక భాషాభిమానుల సహకారంతో వారితో కలిసి కల్లమల వెళ్లి ఆ బండను గుర్తించడంతో సంతోషం కలిగింది. – ఒంటేరు శ్రీనివాసులురెడ్డి -
మన అంకోర్వాట్ కూలుతోంది..
సాక్షి, హైదరాబాద్: అంకోర్వాట్ (ఆంగ్కోర్వాట్)... ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న కంబోడియాలోని అద్భుత హిందూ దేవాలయం. 12వ శతాబ్దంలో నిర్మితమైన ఈ ఆలయాన్ని గతేడాది దాదాపు 26 లక్షల మంది పర్యాటకులు సందర్శించారు. యునెస్కో గుర్తింపు పొందిన ఈ కట్టడాన్ని పునరుద్ధరించటంలో కీలక పాత్ర భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) దే. మన సాయంతోనే దాన్ని పునరుద్ధరించి ప్రపంచపటంలో ప్రధాన పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా నిలిపారు. అయితే మన దేశంలో అంకోర్వాట్ తరహా శైలిలో నిర్మించిన మందిరం ఒక్కటే ఉంది. ఇది చిన్న నిర్మాణమే అయినా, నిర్మాణశైలి అంకోర్వాట్దే. ఆ ఒక్క నిర్మాణం మన తెలంగాణలోనే ఉంది. విశేషమేంటంటే.. అంకోర్వాట్కు ఈ చిన్న నిర్మాణమే స్ఫూర్తి అన్నది చరిత్రకారుల మాట. ఎందుకంటే అంకోర్వాట్ కంటే దాదాపు 550 ఏళ్ల క్రితమే దీన్ని నిర్మించారని చెబుతారు. ఆ తరహా నమూనాలో నిర్మించిన దేశంలోనే ఏకైక ఈ చిన్న గుడిని పరిరక్షించటం ఇప్పుడు అదే ఏఎస్ఐకి సాధ్యం కావటం లేదు. ఎందుకంటే స్థానిక యంత్రాంగం ఎన్ఓసీ ఇవ్వకపోవటమే. కళ్ల ముందే ఆ అద్భుత నిర్మాణం కూలిపోతున్నా.. యంత్రాంగం దాని పరిరక్షణకు ముందుకు రావటం లేదు. స్వచ్ఛందంగా అడుగు ముందుకేసి పూర్తిస్థాయిలో పూర్వ రూపు కల్పిస్తామన్న ఏఎస్ఐకి సహకరించటం లేదు. ఆరో శతాబ్దంలో నిర్మాణం! ములుగు జిల్లా కేంద్రానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో కొత్తూరు గ్రామ శివారులోని దట్టమైన అడవిలో దేవునిగుట్టపై కొలువుదీరింది ఈ ఆలయం. మూడేళ్ల క్రితమే దేవునిగుట్ట ఆలయం బయటి ప్రపంచానికి తెలిసింది. అప్పటివరకు స్థానికులే అక్కడ ఉత్సవాలు నిర్వహించుకునేవారు. దాన్ని ఎవరు నిర్మిం చారో ఇదమిత్థంగా ధ్రువీకరించేందుకు అక్కడ శాసనాలు లభించలేదు. దాని శైలి ఆధారంగా వాకాటకుల హయాంలో నిర్మితమైనట్టు చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఆరో శతాబ్దంలో వాకాట రాజు హరిసేన హయాంలో నిర్మించి ఉంటారని అంచనా. అప్పట్లో మహాయానబుద్ధిజం ప్రభావం ఎక్కువ. ఆలయం దక్షిణం వైపు అజంతాలో ఉండే బోధిసత్వ పద్మపాణి తరహాలో భారీ శిల్పం ఉంటుంది. కానీ అది మహాశివుడి రూపమైన దక్షిణామూర్తి విగ్రహమని, హరిసేన హయాంలోనే హిందూయిజం విస్తరించటం బాగా ఉండేదని కొందరి వాద న. ఆలయంలో ఎలాంటి విగ్రహాలు లేవు. ఇసుక రాళ్లే ఇటుకలుగా.... చాలా తేలికగా ఉండే ఇసుక రాళ్లను పేర్చి దేవునిగుట్ట గుడిగా మలిచారు. ఆ రాళ్లపై మానవ, జంతు ఆకృతులను తీర్చిదిద్దారు. ఆ ఆకారాలను వరసగా పేరిస్తే పూర్తి రూపమొస్తుంది. అంటే.. ముందుగానే రాళ్లపై శిల్పంలోని భాగాలు చెక్కి పేర్చి పూర్తి ఆకృతినిచ్చారు. ఇది కంబోడియాలో ఉండే నిర్మాణాలశైలి. ఒక గర్భగుడి మాత్రమే నిర్మించారు. ముందు ఎలాంటి మండపాలు లేవు. గర్భాలయం లోపల నిలబడి చూస్తే శిఖరం చివర వరకు కనిపిస్తుంది. ఆలయం వెలుపల, లోపల రాళ్లపై చిత్రా లు కనిపిస్తాయి. దట్టమైన అడవిలో ఉండటం, బయటి ప్రపంచానికి తెలియకపోవటంతో ఇంతకాలం దాన్ని పట్టించుకోలేదు. ఫలి తంగా రాళ్లు కదిలిపోయి ఆలయం కూలేదశకు చేరింది. దీన్ని గుర్తించిన తర్వాత మూడేళ్ల క్రితం ఏఎస్ఐ అధికారులు పరిశీలించారు. అది హెరిటేజ్ తెలంగాణ రక్షిత కట్టడం జాబితాలో లేకపోవటంతో పరిరక్షణకు సిద్ధమయ్యారు. వెంటనే స్థానిక గ్రామపంచాయతీ ప్రతినిధులను కలిసి లిఖితపూర్వకంగా విన్నవించారు. దీనికి స్పందించిన నాటి గ్రామ పంచాయతీ ఎన్ఓసీ ఇచ్చింది. వెంటనే నాటి భూపాలపల్లి (ప్రస్తుత ములుగు జిల్లా) కలెక్టర్కు ఎన్ఓసీ కోసం దరఖాస్తు చేసింది. అప్పట్నుంచి అది పెండింగులోనే ఉంది. తరచూ అధికారులు జిల్లా యంత్రాంగాన్ని వాకబు చేస్తున్నా ఫలితముండటం లేదు. ఇటీవలి భారీ వర్షాలకు ఆలయం రాళ్లు బాగా కదిలిపోయాయి. వచ్చే వానాకాలం నాటికి మొత్తం నేలమట్టమయ్యే ప్రమాదం నెలకొంది. ఇక్కడికి తరచూ విదేశీ నిపుణులు అధ్యయనంలో భాగంగా వచ్చి అబ్బురపడుతున్నారు. అంకోర్వాట్ తరహాలోనే నిర్మాణం ఉందని తేల్చి చెబుతున్నారు. కానీ దాన్ని పరిరక్షించాలన్న ఆలోచన మాత్రం మన యంత్రాంగానికి రావటం లేదు. -
కేంద్రానికి నవీన్ పట్నాయక్ లేఖ
భువనేశ్వర్ : ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన కోణార్క్ సూర్య దేవాలయంలో పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కేంద్రానికి లేఖ రాశారు.13వ శతాబ్దంలో నిర్మించిన అత్యంత పురాతన దేవాలయంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేని కారణంగా సందర్శకులు ఇబ్బంది పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎక్కడిక్కడ నీరు నిలిచి పోవడంతో ఆలయాన్ని సందర్శించకుండా చాలా మంది పర్యాటకులు వెనుదిరిగి వెళ్లిపోతున్నారని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మకు రాసిన లేఖలో పేర్కొన్నారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకుని శాశ్వత నివారణ చర్యలు చేపట్టి వారసత్వ కట్టడాన్ని రక్షించాల్సిందిగా నవీన్ పట్నాయక్ విఙ్ఞప్తి చేశారు. కేంద్రం, భారత పురావస్తు శాఖ నుంచి అనుమతి లభిస్తే ఆలయ పునరుద్ధరణ దిశగా చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. -
సాధికారతతో సమస్యలపై పోరు
న్యూఢిల్లీ: ఆర్థిక సాధికారత సాధించిన మహిళలు సామాజిక సమస్యలపై పోరాడగలుగుతారని ప్రధాని మోదీ అన్నారు. మహిళల్లో అపార శక్తి దాగి ఉందని, తమ శక్తి సామర్థ్యాలేమిటో వారు గుర్తించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు కోటి మంది స్వయంసహాయక బృందాల మహిళలతో నమో యాప్ ద్వారా ముచ్చటించారు. సమాజ సర్వతోముఖాభివృద్ధికి మహిళా సాధికారత కీలకమని ఉద్ఘాటించారు. ‘మహిళా సాధికారతకు ఆర్థిక స్వాతంత్య్రం ముఖ్యం. మహిళలు ప్రతిభావంతులు. వారికి మరొకరు చెప్పాల్సిన అవసరం లేదు. తామేంటో నిరూపించుకునేందుకు వారికి అవకాశం ఇస్తే చాలు. ఆర్థిక స్వాతంత్య్రం మహిళా సాధికారతకు దోహదపడుతుంది. ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబడిన మహిళలు అన్ని సామాజిక దురాచారాలకు ఎదురొడ్డి నిలుస్తారు’ అని కితాబిచ్చారు. గ్రామీణాభివృద్ధిలో స్వయం సహాయక బృందాల పాత్రను ఆయన కొనియాడారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుమారు 20 లక్షల స్వయం సహాయక బృందాలను ఏర్పాటుచేశామని, 2.25 కోట్లకు పైగా కుటుంబాలను వాటిలో భాగం చేశామని తెలిపారు. ప్రస్తుతం 45 లక్షల స్వయం సహాయక బృందాల్లో సుమారు 5 కోట్ల మంది మహిళలు క్రియాశీలకంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధికి ఈ బృందాలు పునాది వేస్తున్నాయని ప్రశంసించారు. గ్రామీణాభివృద్ధిలో కీలకమైన వ్యవసాయం, పశుపోషణ రంగాలు మహిళలు లేకుండా మనుగడ సాగించలేవని అన్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక బృందాలు తమ జీవితాల్లో తీసుకొచ్చిన మార్పును, స్ఫూర్తిదాయక గాథలను పలువురు మహిళలు ప్రధానితో పంచుకున్నారు. ‘వారసత్వ’ రక్షణకు ప్రజా భాగస్వామ్యం దేశ వారసత్వ సంపద పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంచాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రాచీన కట్టడాలను విస్మరించడంపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని..వాటి ప్రాముఖ్యతను యువ తరానికి తెలియజేసి వారి వైఖరిలో మార్పు తీసుకురావాలని అభిలషించారు. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో మోదీ గురువారం నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ..మన ప్రాచీన వారసత్వ కట్టడాలు, సంపదను కాపాడుకోవాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని నొక్కి చెప్పారు. కొన్ని కట్టడాల వద్ద ప్రజలు ఫొటోలు, సెల్ఫీలు దిగకుండా నిషేధాజ్ఞలు విధించడాన్ని తప్పు పట్టారు. ‘విదేశాల్లో ఎక్కడికెళ్లినా ప్రాచీన కట్టడాల వద్ద రిటైర్ అయిన వారే గైడుగా పనిచేస్తూ కనిపిస్తారు. వాటిని కాపాడుకునే బాధ్యతను సమాజమే తీసుకుంటుంది. అలాంటి విలువలనే భారత్లోనూ పాదుకొల్పాలి. పాఠశాలల సిలబస్లో వారసత్వ కట్టడాల సమాచారాన్ని చేరిస్తే, విద్యార్థులు వాటి గురించి తెలుసుకుంటూ పెరుగుతారు. టూరిస్ట్ గైడుగా పనిచేసేలా యువతను ప్రోత్సహించాలి. వారసత్వ స్థలాల పరిరక్షణలో పాలుపంచుకునేలా కార్పొరేట్ కంపెనీలను ఒప్పించాలి’ అని అన్నారు. -
ఎర్రకోటలో ‘దుమ్ము’ దులిపారు..
న్యూఢిల్లీ : భారత చరిత్రలో ఎర్రకోటకు ఉన్న విశిష్టత గురించి అందరికి తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశ ప్రధాని జాతీయ జెండా ఎగరేసేది ఇక్కడి నుంచే. అయితే పెరిగిపోతున్న కాలుష్యం వల్ల అటువంటి అద్భుత కట్టడాల ఉనికి ప్రశ్నార్ధకంగా మారుతుంది. దాదాపు నాలుగు శతాబ్దాల కిందట మెఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన ఎర్రకోటని పరిరక్షించటానికి భారత పురావస్తు సర్వే విభాగం(ఏఎస్ఐ) నడుం బిగించింది. అందులో భాగంగా ఎర్రకోట పరిధిలో దుమ్మును తొలగించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. కేవలం ఐదు నెలల కాలంలోనే కోటకు ముప్పుగా పరిణమించిన 22 లక్షల కేజీల దుమ్ము, ధూళిని ఏఎస్ఐ తొలగించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ పక్రియను మొదలుపెట్టిన పురావస్తు శాఖ... గత వందేళ్ల నుంచి దాదాపు రెండు మీటర్ల మందంగా విస్తరించిన మట్టి పొరను తొలగించామని ఏఎస్ఐ డైరక్టర్ జనరల్ జె శర్మ తెలిపారు. నేలపై పేరుకుపోయిన దుమ్ము కట్టడానికి ప్రమాదకరంగా మారిందన్నారు. ఎర్రకోటకు వాస్తవ రూపాన్ని తెచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. కోట లోపల మరుగుదొడ్లు, తాగునీరు వంటి వసతులు కల్పించడానికి ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. -
కేంద్ర పురావస్తుశాఖ పరిధిలోకి టీటీడీ!
-
‘తాజ్మహల్ను షాజహాన్ మాకు రాసిచ్చారు’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో ఏడో వింత, ప్రఖ్యాత కట్టడం తాజ్మహల్ను దాని నిర్మాత మొఘల్ చక్రవర్తి షాజహాన్ తమకు రాసిచ్చారని ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు వాదిస్తోంది. ఈ మేరకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)తో సుప్రీంకోర్టులో పోరాడుతోంది. మంగళవారం సున్నీ వక్ఫ్ బోర్డు వాదనలు విన్న దేశ అత్యున్నత న్యాయస్థానం తాజ్మహల్ను షాజహాన్ సున్నీ బోర్డుకు రాసిచ్చిన పత్రాలను చూపాలని కోరింది. పత్రాలను కోర్టు ముందు ఉంచేందుకు వారం రోజుల పాటు గడువు ఇచ్చింది. భార్య ముంతాజ్పై తన ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్మహల్ను నిర్మించారు. 1658లో షాజహాన్ మరణించారు. తాజ్మహల్ వక్ఫ్ బోర్డుకు చెందుతుందని షాజహాన్ చేసిన డిక్లరేషన్ కాకుండా మరే ఆధారాలు ఉన్నా కోర్టు ముందు ప్రవేశపెట్టాలని సున్నీ బోర్డుకు సుప్రీంకోర్టు సూచించింది. తాజ్మహల్ వక్ఫ్ బోర్డుకు చెందుతుందంటే భారతదేశంలో ఎవరు నమ్ముతారు? అంటూ సున్నీ బోర్డును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ప్రశ్నించారు. ఇలాంటి కేసుల వల్ల విలువైన కోర్టు సమయం వృథా అవుతోందన్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన అనంతరం తాజ్మహల్తో పాటు దేశ సాంస్కృతికను తెలియజెప్పే కట్టడాలను కాపాడే బాధ్యతను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తీసుకుంది. -
ఏఎస్ఐ ఆధ్వర్యంలో పునరుద్ధరణ కార్యక్రమాలు
► త్వరలో ఉప్పుగుండూరు బుద్ధ స్థూపం పనులు ప్రారంభం ► మోటుపల్లిలో నంది విగ్రహం చోరీపై పోలీసులకు ఫిర్యాదు ► ఒంగోలులో పురావస్తు ప్రదర్శనశాలకు స్థలం కోసం కృషి ► ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కన్సర్వేషన్ అసిస్టెంట్ అన్నంబొట్ల వెంకటేశ్వరరావు ఒంగోలు కల్చరల్: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో పునరుద్ధరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కన్సర్వేషన్ అసిస్టెంట్ అన్నంబొట్ల వెంకటేశ్వరరావు వెల్లడించారు. గురువారం ఆయన సంస్థ కార్యక్రమాల గురించి ’సాక్షి’తో మాట్లాడారు. ఏఎస్ఐ ఆధ్వర్యంలో జిల్లాలోని ఉప్పుగుండూరు, మోటుపల్లి, కనపర్తి, సత్యవోలు, పిటికాయగుళ్ల, భైరవకోన ఉన్నాయన్నారు. పూసలపాడులో తవ్వకాలు నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు. ఉప్పుగుండూరు–చిన్నగంజాం మధ్య కొమ్మమూరు కాలువ సమీపంలోని బౌద్ధ స్థూపానికి సంబంధించిన పనులను త్వరలో పునః ప్రారంభిస్తామన్నారు. ముందుగా అక్కడ ఒక షెడ్ను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. బాపట్ల భావన్నారాయణస్వామి ఆలయ గాలి గోపురం పనులతోపాటు తమ శాఖ ఆధ్వర్యంలో ఉదయగిరి కోట జీరో్ణద్ధరణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. జిల్లాలోని భైరవకోనలో టాయిలెట్ బ్లాక్ను నిర్మించామన్నారు. ఒంగోలులో తమ శాఖకు జిల్లా అధికార యంత్రాంగం స్థలం కేటాయిస్తే ఆర్కియలాజికల్ మ్యూజియం నిర్మించే ందుకు చర్యలు చేపడతామని తెలిపారు. జిల్లాలో పురావస్తు శాఖ తవ్వకాలలో లభ్యమైన విగ్రహాలను, ఇతర చారిత్రక ఆధారాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు దీనివల్ల అవకాశం కలుగుతుందన్నారు. ప్రాచీన చరిత్ర కలిగిన ఆలయాలను, పురావస్తు ప్రాధాన్యత ఉన్న ప్రాంతాలను పరిరక్షించడం తమ లక్ష్యమని తెలిపారు. చిన్నగంజాం మండలం మోటుపల్లి వీరభద్రస్వామి ఆలయ మండపంలో ఈ నెల 12న అపహరణకు గురైన నంది విగ్రహం గురించి చిన్నగంజాం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.ఆలయాల్లో విగ్రహాల అపహరణ, గుప్తనిధుల ముఠాల ఆగడాలకు అడ్డుకట్ట వేసే విషయంలో పోలీసు యంత్రాంగంతోపాటు ప్రజలు కూడా తమవంతు సహకారాన్ని మరింతగా అందజేయాలని ఆయన కోరారు. -
బుద్ధుని అవశేషాలపై ఏం చేస్తారు: విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: ప్రకాశం జిల్లా వెనంపల్లిలో ఇటీవల బయటపడ్డ పురాతన బుద్ధుని అవశేషాల ప్రాముఖ్యతపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది. రాష్ట్రంలో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఒకటి, రెండో శతాబ్దానికి చెందిన బుద్ధుని అవశేషాలు కోసం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) వారు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని విజయసాయిరెడ్డి కోరారు. ప్రకాశం జిల్లా వెనంపల్లిలో రెండు బుద్దుని విగ్రహాలు లభించాయని, ఈ ప్రాంతం చంద్రవరం బుద్దిస్ట్ ప్రాంతంలో ఉందని సాంస్కృతిక, పర్యాటకశాఖ సహాయమంత్రి మహేశ్ చంద్ర రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. గతంలోనూ ఏఎస్ఐ వారు ఎన్నో సర్వేలు చేసి తవ్వకాలు జరిపి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అవశేషాలు వెలికితీశారని.. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ ఆలయం నుంచి పురాతన నంది విగ్రహం చోరీ అయిందని, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఇప్పటివరకూ ఏమైనా చర్యలు తీసుకుంటే ఆ వివరాలు తెలపాలని కోరారు. చోరికి గురైన నంది విగ్రహం గురించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) వారికి ఎలాంటి రిపోర్ట్ రాలేదన్నారు. విగ్రహం చోరీపై ఏదైనా సమాచారం అందితే యాంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజరీస్ యాక్ట్-1972 ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి మహేశ్ చంద్ర సమాధానమిచ్చారు. -
కోహినూర్ను గిఫ్ట్గా ఇచ్చారు
వజ్రాన్ని తిరిగి తీసుకురాలేమని కేంద్రం సంకేతం ♦ ఆనాటి పంజాబ్ పాలకులు బ్రిటన్కు బహుమతిగా ఇచ్చారు ♦ అది కావాలంటే.. మన దగ్గరున్న విదేశీ చారిత్రక సంపదను తిరిగి ఇవ్వాల్సి రావొచ్చన్న సాంస్కృతిక శాఖ ♦ వజ్రాన్ని తీసుకురావాలన్న పిటిషన్ను కొట్టేయలేమన్న సుప్రీం న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్ వజ్రాన్ని యునెటైడ్ కింగ్డమ్ (బ్రిటన్) నుంచి భారత్కు తిరిగి తీసుకురావాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్ను) కొట్టివేయటానికి సుముఖంగా లేమని సుప్రీంకోర్టు పేర్కొంది. అలా చేస్తే కోహినూర్ వజ్రంపై భారతదేశపు న్యాయమైన హక్కును బ్రిటన్ నిరాకరించటానికి దారితీయొచ్చని, భవిష్యత్తులో దాన్ని వెనక్కితెచ్చే ప్రయత్నాలకు అవరోధంగా మారే అవకాశముందని పేర్కొంది. కోహినూర్ తోపాటు టిప్పుసుల్తాన్ ఉంగరం, కత్తి వంటి అమూల్యమైన వారసత్వ సంపదను తిరిగి భారత్కు రప్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆలిండియా హ్యూమన్ రైట్స్, సోషల్ జస్టిస్ ఫ్రంట్ సంస్థలు పిల్ వేయడం తెలిసిందే. దానిని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. స్పందన తెలపాల్సిందిగా ఇంతకుముందే కేంద్రాన్ని ఆదేశించింది. తాజాగా సోమవారం దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్, యు.యు.లలిత్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తరఫున సొలిసిటర్ జనరల్ రంజిత్కుమార్ వివరణ ఇచ్చారు. ‘‘కోహినూర్ బలవంతంగా తీసుకెళ్లారనో, దొంగతనానికి గురైందనో చెప్పలేం. సిక్కు యుద్ధాల్లో తమకు సహకరించినందుకు 1849లో మహరాజా రంజిత్సింగ్ వారసులు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆ వజ్రాన్ని ఇచ్చారు. ఆ వజ్రాన్ని వెనక్కి తీసుకురావాలని పార్లమెంటులోనూ, బయటా చాలా సార్లు డిమాండ్లు వచ్చాయి. కానీ కోహినూర్ లాంటి సంపదను వెనక్కివ్వాలని మనం కోరితే.. మన దేశంలోని మ్యూజియాల్లో ఉన్న విదేశీ చారిత్రక సంపద, కళాఖండాలను తిరిగి ఇచ్చేయాల్సిందిగా ఆయా దేశాలు కోరతాయి. అప్పుడు మన మ్యూజియాల్లో ఏమీ మిగలవు’’ అని చెప్పారు. తద్వారా ఆ వజ్రాన్ని వెనక్కు తీసుకురాలేమని సంకేతాలిచ్చారు. దీనిపై ధర్మాసనం పై విధంగా స్పందించింది. తాము ఈ పిల్ను కొట్టివేసినట్లయితే.. భవిష్యత్తులో భారత్ ఆ వజ్రాన్ని అడిగినప్పుడు ‘మీ సుప్రీంకోర్టు పిల్ను కొట్టివేసింది’ అన్న కారణం చూపుతూ నిరాకరించేందుకు అవకాశం ఉంది’ అని పేర్కొంది. ఈ అంశంలో విదేశాంగశాఖ ఇంకా తన అభిప్రాయాన్ని, వివరణను సమర్పించాల్సి ఉండటంతో.. కోహినూర్పై హక్కు విషయంలో ప్రభుత్వ వైఖరిపై సమగ్రమైన అఫిడవిట్ను దాఖలు చేయాలని నిర్దేశిస్తూ విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఇదిలావుంటే.. కోహినూర్ను వెనక్కి తీసుకొచ్చే అంశంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఎలాంటి చర్యలూ చేపట్టబోదని ఆ శాఖ మంత్రి మహేశ్శర్మ చెప్పారు. అది దౌత్యపరమైన అంశమని.. దానిపై కేంద్ర, విదేశాంగశాఖలు నిర్ణయం తీసుకుంటాయన్నారు. గుంటూరు నుంచి బ్రిటన్ వరకూ..! ప్రపంచంలోని అత్యంత విలువైన వజ్రాల్లో కోహినూర్ ఒకటి. వంద శాతం స్వచ్ఛత గల ఈ వజ్రం బరువు 108 క్యారెట్లు. దీని విలువ రూ.6,600 కోట్ల పైమాటేనని అంచనా. అసలు కోహినూర్ అంటే పర్షియన్ భాషలో ‘కాంతి శిఖరం’ అని అర్థం. 14వ శతాబ్దంలో గుంటూరు సమీపంలో ఈ వజ్రం దొరికినట్లు ప్రచారంలో ఉంది. అప్పట్లో ఏకంగా 793 క్యారెట్ల బరువుతో ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం అది. ఔరంగజేబు హయాంలో దానికి మెరుగుపెట్టించే ప్రయత్నంలో.. 186 క్యారట్లకు తగ్గిపోయింది. బ్రిటిషర్ల వద్ద మరింత చిక్కిపోయింది. తొలుత కాకతీయుల చేతిలో ఉన్న ఈ వజ్రం ఆ తర్వాత ఎన్నో చేతులు మారింది. మొఘలుల చేతిలో నుంచి నాదిర్షా దండయాత్ర సమయంలో పర్షియాకు మారింది. అనంతరం క్రమంగా పంజాబ్ పాలకుడు మహరాజా రంజిత్సింగ్ వద్దకు చేరింది. సిక్కు యుద్ధాల సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ రంజిత్సింగ్ వారసులకు సహాయపడడంతో.. వారు బ్రిటిష్ వారికి అప్పగించారు. అలా ఆ వజ్రం చివరికి బ్రిటన్ మహారాణి కిరీటంలోకి చేరింది. ఈ వజ్రం తమదంటే తమదని భారత్తోపాటు పాకిస్తాన్, ఇరాన్, అఫ్ఘానిస్తాన్లు కూడా వాదిస్తున్నాయి. కోహినూర్ వజ్రం పురుషులెవరికీ కలసి రాదనే నమ్మకం ఉంది. బ్రిటిష్ రాచకుటుంబంలోనూ ఆ నమ్మకం కొనసాగి.. క్వీన్ విక్టోరియా కిరీటంలో భాగమైంది. -
కోహినూర్ ఇక ఎప్పటికీ భారత్కు తిరిగి రాదా?
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ప్రఖ్యాత వజ్రమైన కోహినూర్ ఇక ఎప్పటికీ భారత్కు దక్కకపోవచ్చు. మన చారిత్రక సంపద అయిన ఈ వజ్రాన్ని తిరిగి భారత్కు తీసుకొచ్చే విషయమై సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇదే సంకేతాలను ఇచ్చింది. కోహినూర్ వజ్రాన్ని భారత్ కు తిరిగి ఇవ్వాల్సిందిగా యునైటెడ్ కింగ్డమ్ను బలవంతపెట్టలేమని, ఎందుకంటే ఈ వజ్రాన్ని బ్రిటన్ దొంగలించడం కానీ, బలవంతంగా తీసుకుపోవడంగానీ చేయలేదని, ఆ దేశానికి కానుకగా ఇచ్చామని కేంద్రం న్యాయస్థానానికి విన్నవించింది. స్వాతంత్ర్యానికి పూర్వం దేశం ఆవలకు తరలిపోయిన ప్రాచీన సంపదను ప్రభుత్వం తీసుకురాకూడదంటూ 43 ఏళ్ల కిందట తీసుకొచ్చిన చట్టాన్ని ఉటంకిస్తూ కేంద్రం తరఫున సోలిసిటర్ జనరల్ రంజిత్కుమార్ సోమవారం వాదనలు వినిపించారు. 1849నాటి సిక్కు యుద్ధంలో ఓడిపోయిన నేపథ్యంలో మహారాజా రంజిత్ సింగ్ 105.602 క్యారెట్ల కోహినూర్ వజ్రాన్ని ఈస్టిండియా కంపెనీకి అందజేశారని ఆయన సుప్రీంకోర్టుకు నివేదించారు. ఆంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజరీ చట్టం 1972 ప్రకారం దేశం నుంచి అక్రమంగా తరలిపోయిన ప్రాచీన సంపదను మాత్రమే ఆర్కియాలిజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తిరిగి తీసుకొచ్చే అవకాశముంటుందని తెలిపారు. కోహినూర్ వజ్రంతోపాటు భారత్ నుంచి తీసుకుపోయిన ప్రాచీన సంపదను తిరిగి తీసుకురావాల్సిందిగా బ్రిటన్లోని భారత హైకమిషనర్కు ఆదేశాలు ఇవ్వాలంటూ అఖిల భారత మానవ హక్కులు, సామాజిక న్యాయం సంస్థ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిని విచారణకు చేపట్టిన న్యాయస్థానం గతంలో కేంద్రం సమాధానం కోరిన సంగతి తెలిసిందే. -
పజ్జూరులో త్వరలో తవ్వకాలు
పురావస్తు శాఖ డిప్యూటీ డెరైక్టర్ బ్రహ్మచారి తిప్పర్తి: నల్లగొండ జిల్లాలోని తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామ శివారు పరిధి పాటివారి స్థలంలో తొలి చారిత్రక యుగం నాటి ఆనవాళ్లు లభించాయని, త్వరలో తవ్వకాలు చేపట్టనున్నామని పురావస్తు శాఖ డిప్యూటీ డెరైక్టర్ బ్రహ్మచారి తెలిపారు. గురువారం ఆయన పజ్జూరులో పాటివారి స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. తవ్వకాలకు సంబంధించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి వచ్చిందని, రైతులు, గ్రామస్తుల సహకారంతో నాటి ఆధారాలను వెలికితీయనున్నట్లు తెలిపారు. ఒకటి, రెండో యుగం కాలం నాటి ఆనవాళ్లు లభించడంతోపాటు 10, 12వ యుగం నాటి ఆలయం కూడా ఇదే గ్రామంలో ఉందని, ఈ తవ్వకాలతో మధ్యకాలంలో ఉన్న చరిత్ర, ఆధారాలు బయటపడే అవకాశముందని చెప్పారు. ఆయన వెంట పురావస్తుశాఖ అధికారులు నాగరాజు, భానుమూర్తి, తదితరులు ఉన్నారు. -
పజ్జూరులో తొలి యుగ ఆనవాళ్లు..!
♦ పురాతన ఆవాస ఆధారాలకు నెలవైన నల్లగొండ జిల్లా పజ్జూరు గ్రామం ♦ 25 ఎకరాల విస్తీర్ణంలో శోధిస్తే నాటి 2వ శతాబ్ద చరిత్ర వెలుగులోకి.. ♦ తవ్వకాలకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి ♦14 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న అంశానికి త్వరలోనే పరిష్కారం ♦ నేడు సందర్శించనున్న రాష్ట్ర పురావస్తు శాఖ డిప్యూటీ డెరైక్టర్ ♦ స్థానికులు సహకరిస్తే ఆధారాలు లభిస్తాయంటున్న అధికారులు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఒకటి, రెండు శతాబ్దాల జీవన శైలిని కళ్లకు కట్టే చారిత్రక ఆధారాలకు నల్లగొండ జిల్లా నెలవు కానుంది. తొలి చారిత్రక యుగంలో మానవులు వాడిన ఆయుధాలు, అలంకరణలు, ఆభరణాలు ఎన్నో లభించిన నీలగిరిలో మళ్లీ అలాంటి ఆధారాలే లభించనున్నాయని పురావస్తు శాఖ అధికారులు అంటున్నారు. జిల్లా కేంద్రమైన నల్లగొండకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిప్పర్తి మండలం పజ్జూరు శివారులోని పాటిమీద ఉన్న 25 ఎకరాల విస్తీర్ణం లో తొలిచారిత్రక యుగం నాటి ఆవాస ప్రాంతం ఉందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో లభించిన విగ్రహాలు, ప్రతిమలు, ఆభరణాల ఆధారం గా ఇక్కడ తవ్వకాలు జరిపేందుకు అనేక సార్లు ఆర్కియాలజికల్ ఇండియా (ఏఎస్ఐ) అనుమతి కోరినా 14 ఏళ్లుగా పెండింగ్లోనే ఉంది. అయితే, ఇప్పుడు ఇక్కడ తవ్వకాలు జరిపేందుకు ఏఎస్ఐ అనుమతి లభించడంతో త్వరలోనే ఇక్కడ చారిత్రక ఆనవాళ్లు లభిస్తాయని పురావస్తు శాఖ అధికారులు విశ్వసిస్తున్నారు. రాష్ట్ర ఆర్కియాలజీ శాఖ డిప్యూటీ డెరైక్టర్ పి. బ్రహ్మచారి గురువారం పజ్జూరు లో ఉన్న ఈ క్షేత్రాన్ని పరిశీలించనున్నారు. మూడు నెలల క్రితమే.. ఇక్కడి చారిత్రక ఆధారాలపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పురావస్తు శాఖ అధికారులు మూడు నెలల క్రితం ఇక్కడ పరిశోధన చేశారు. పురావస్తు శాఖ జిల్లా అసిస్టెంట్ డెరైక్టర్ పి. నాగరాజు అక్కడకు వెళ్లి పజ్జూరు పాటి మీద ఉన్న ఆ క్షేత్రాన్ని పరిశీలించారు. అప్పుడు ఆ క్షేత్రంలో ప్రాథమిక స్థాయి ఆధారాలు లభించాయి. ఎర్రని, నల్లని కుండ పెంకులు, అప్పటి మహిళలు అలంకరణ కోసం ఉపయోగించే పూసలు, ఇతర ఆభరణాలు దొరికాయి. అప్పట్లో మహిళలు ఎలా ఉండేవారో ప్రతిబింబించే మృణ్మయ (టైట) ప్రతిమ కూడా లభించింది. చెవి రింగులు కూడా దొరికాయి. ఇక్కడ ఓ బౌద్ధ స్థూపం ఉందని, అయితే అది పూర్తిగా ధ్వంసమైయిందని అధికారులు చెబుతున్నారు. పొలాల్లో అప్పుడప్పుడు దొరుకుతున్న చారిత్రక ఆనవాళ్లు ఏంటో అర్థం కాక రైతులు వాటిని పారేసేవారని పురావస్తు శాఖ అధికారులు అంటున్నారు. స్థానికులు ఇచిచన ఈ ఆధారాల మేరకు జిల్లా పురావస్తుశాఖ అధికారులు ఇక్కడ తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని మరోసారి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను కోరారు. 1941లోనే తొలి తవ్వక ఆధారాలు నల్లగొండ జిల్లాలో ఇప్పటికే శాతవాహనులు, ఇక్ష్వాకులు, మహాక్షత్రీయులు, మహా తలవరీ యులు, రోమన్ సామ్రాజ్యాల ఆనవాళ్లు లభిం చాయి. జిల్లాలోని తిరుమలగిరి మండలం ఫణిగిరిలో జరిపిన తవ్వకాల్లో ఆయా రాజ్యాల్లో వాడిన నాణేలు, గారప్రతిమలు, బుద్ధుని జీవనశైలిని ఆవిష్కరించే సున్నపురాయి పలకలు లభించాయి. తొలుత 1941-44 మధ్య కాలం లో (స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ సామ్రా జ్య కాలంలోనే) ఇక్కడ తవ్వకాలు జరిపారు. ఆ తర్వాత ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండి యా అనుమతి మేరకు 2000 సంవత్సరం నుంచి ఈ తవ్వకాలు దఫదఫాలుగా జరుపుతున్నారు. ఈ తవ్వకాల్లో బంగారు, రాగి, సీసం, వెండి, పుటిన్తో తయారు చేసిన నాణేలు లభించాయి. ఆనాటి ఎగేట్, చెట్, లాపిస్లాజిలీ అనే అలంకరణ ఆభరణ సామగ్రి, మట్టిపూసలు కూడా దొరికాయి. ఇక్ష్వాక వంశస్తుడు వీరపురుష దత్తుని రాజ్యం లో చెక్కించిన గౌతమ బుద్ధుడి జీవనగాధలను ప్రతిబింబించే సున్నపు రాయి పలకలు లభిం చాయి. బుద్ధుడి జననం, మహాభినిష్ర్కమ ణం, జ్ఞానోదయం, ధర్మచక్ర పరివర్తనం, మహాపరి నిర్వాణం విశేషాలను ఈ పలకల్లో పొందుపర్చారు. ఆమె నమ్మకం.. వారి పూనకం వాస్తవానికి ఇక్కడ చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయన్న విషయం నాటకీయ పరిస్థితిలో వెలుగులోకి వచ్చింది. 2001లో పజ్జూరు గ్రామంలో ఓ రైతు పొలంలో దేవతను పోలిన విగ్రహం లభించింది. ఈ విగ్రహం చూసిన వారంతా పూనకం పొందుతుండడంతో ఆమె నమ్మకం.. వారి పూనకం అంటూ గ్రామంలో వదంతులు వచ్చాయి. చివరకు అది 10,11 శతాబ్దాల్లో పూజలందుకున్న భైరవమూర్తి విగ్రహమని తేలింది. దీనిగురించి తెలుసుకున్న అప్పటి ఆర్కియాలజీ డెరైక్టర్ రాంలక్ష్మణ్ ఈ ప్రాంతం వాసే కావడంతో.. ఆయన హైదరాబాద్ నుంచి భానుమూర్తి అనే అధికారిని పరిశోధన కోసం పంపారు. ఆయన ఈ విగ్రహాన్ని పరిశీలించి తొలి చారిత్రక యుగ ఆనవాళ్లను గుర్తించారు. అప్పటి నుంచి ఇక్కడ తవ్వకాల కోసం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి కోరుతూనే ఉన్నా.. ఇప్పటికి మోక్షం కలగడం విశేషం. చారిత్రక ఆనవాళ్లు లభించాయి ‘పజ్జూరు పాటి మీద తొలి చారిత్రక యుగ ఆనవాళ్లు లభించాయి. ఈ ప్రాంతంలో ఒకటి, రెండు శతాబ్దాలకు చెందిన ఆవాస ప్రాంతం ఉందనేది మా అభిప్రాయం. ఇక్కడ తవ్వకాలు జరిపేందుకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపాం. అక్కడి నుంచి అనుమతి వచ్చింది. స్థానికులు సహకరిస్తే రెండు, మూడు నెలల్లో చారిత్రక ఆధారాలను వెలుగులోకి తెస్తాం.’ - పి. నాగరాజు, అసిస్టెంట్ై డెరెక్టర్, పురావస్తు శాఖ, నల్లగొండ ఆమనగల్లులో 8, 9 శతాబ్దాల విగ్రహాలు వేములపల్లి : నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లులో గల గుట్టపై ఉన్న శ్రీ పార్వతి రామలింగేశ్వరస్వామి ఆలయం పరిసరాలలో 8, 9 శతాబ్దాలకు చెందిన దేవతా విగ్రహాలను గుర్తించినట్లు పురావస్తుశాఖ అధికారులు తెలిపారు. ఆ గ్రామానికి చెందిన గడ్డం రాంస్వరూప్రెడ్డి విజ్ఞప్తి మేరకు బుధవారం పురావస్తుశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ పి.నాగరాజు ఆధ్వర్యంలో ఆలయ పరిసరాలలోని శాసనాలు, దేవతా విగ్రహాలను పరిశీలించారు. 1300 సంవత్సరాల క్రితమే ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా శాసనాలలో ఉందన్నారు. ఆలయ నిర్వహణకు ఎవరెవరు ఎంత భూమిని విరాళంగా ఇచ్చారన్న అంశం కూడా వీటిలో ఉందన్నారు. 15 రోజుల్లో పూర్తిస్థాయి పరిశోధన అనంతరం స్పష్టత వస్తుందన్నారు. 8, 9 శతాబ్దాలకు చెందిన మహిషాసురమర్ధిని, నంది, బ్రహ్మ, వల్లీ సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాలను తాము గుర్తించినట్లు చెప్పారు. ఆలయ పరిసరాలలోరెండు శాసనాలను గుర్తించామని వీటిని రాష్ట్ర కూటులు వేసినట్లుగా తెలుస్తోందన్నారు. భావితరాలకు వీటి గురించి తెలిపేందుకు సిమెంటు దిమ్మెలపై శాసనాలు, విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పురావస్తుశాఖ అధికారి వెంట తెలంగాణ చరిత్ర పరిశోధన బృందం సభ్యుడు హరగోపాల్ తదితరులు ఉన్నారు. -
విహారం...వినోదం...బావిలోనే!
ఇక్కడ కనిపించేది ఏడంతస్తుల మేడ కాదు. ఏడు నిలువుల లోతున్న బావి. పేరు రాణీ కీ వావ్. అంటే రాణి గారి బావి అని అర్థం. ఇది గుజరాత్లోని పఠాన్కు నాలుగు కిలోమీటర్ల దూరంలో సరస్వతి నదీ తీరాన ఉంది. ఆ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్కు 130 కి.మీ.ల దూరం. ఈ బావిలోకి దిగడం ఓ విచిత్రం. అయితే, ఏ మెట్టు నుంచి నుంచి దిగామో తిరిగి అదే మెట్టుకు చేరడం అసాధ్యమే. నిజమే! ఒక చోట మొదలై తిరిగి అదే చోటుకు రావడం అంటే ఓ పజిల్ని పూరించినట్లే. ఏడు అంతస్తులలో ఏడు విశాలమైన వరండాలు, ఆ వరండాలకు ఆధారమైన స్తంభాల మీద అందమైన శిల్పాలు, చల్లటి గాలి... అన్నీ కలసి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కానీ 64 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 27 మీటర్ల లోతున్న ఈ బావిలోకి దిగడం ఓ సాహసం. ఓసారి దిగిన తర్వాత ప్రపంచాన్ని జయించినంత గొప్ప అనుభూతి కలుగుతుంది. ఎవరిదీ ఆలోచన?! ఈ ప్రదేశాన్ని క్రీ.శ 11వ శతాబ్దంలో సోలంకి రాజవంశం పాలించింది. ఆ రోజుల్లో మొదటి భీమదేవుని జ్ఞాపకార్థం ఆయన భార్య రాణి ఉదయమతి దీనిని నిర్మించింది. అయితే ఇంత పెద్ద నిర్మాణం సరస్వతి నదికి వచ్చిన వరదల్లో మునిగి 1980 వరకు ఇసుక మేటలోనే ఉండిపోయింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తవ్వకాల్లో బయట పడిన ఈ బావి గత ఏడాది జూన్లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చేరింది. వందల ఏళ్లపాటు మట్టిలో ఉన్నప్పటికీ స్తంభాల మీదున్న శిల్పాలు చెక్కు చెదరలేదు. బుద్ధుడు, విష్ణువు, దశావతారాలు, కల్కి, రాముడు, మహిషాసురమర్దని, నరసింహుడు, వామన, వరాహ అవతారాలతోపాటు నాట్య భంగిమలో ఉన్న నాగకన్యలు... మొత్తం ఐదు వందల శిల్పాలున్నాయి. ఏడంతస్తుల నిర్మాణంలో సుమారు ఎనిమిది వందల శిల్పాలు చెక్కి ఉండవచ్చని అంచనా. ఇప్పుడు ఐదు అంతస్తులు మాత్రమే సరిగ్గా ఉన్నాయి. సాధారణంగా బావిలో దిగిన వాళ్లు ఆక్సిజన్ తగినంత అందక, ఎక్కువసేపు ఉండలేకపోతారు. కానీ ఈ నిర్మాణంలో మెట్లు దిగి కిందికి వెళ్లే కొద్దీ ఎటువంటి అసౌకర్యమూ ఉండదు. విశాలమైన వరండాలు, స్తంభాల మధ్య నుంచి గాలి సులువుగా ప్రసరించేటట్లు ఉంటుంది నిర్మాణశైలి. నాలుగో అంతస్తు నుంచి మరొక బావి అనుసంధానమై ఉంటుంది. పైన దీర్ఘచతురస్రాకారంలో, లోతుకు వెళ్లే కొద్దీ వలయాకారంగా ఉంటుంది. ఈ బావి ఎందుకంటే... గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇలాంటి బావులు ఎక్కువగా కనిపిస్తాయి. క్రీస్తు పూర్వం మూడు వేల ఏళ్ల నుంచి అనుసరిస్తున్న విధానం ఇది. భూగర్భ జలాలను రక్షించుకోవడానికి లోతైన బావులను తవ్వుతారు. వర్షపు నీరు చేరడానికి కాలువలు, చిన్న చిన్న తటాకాలను తవ్వుతారు. పనిలో పనిగా కొన్నింటిని విహారకేంద్రాలుగా మలచుకుంటారు. ఎండాకాలంలో ఇవి చక్కటి వేసవి విడుదులు. ఈ బావుల పరిసరాల నుంచి ఓ పది అడుగుల దూరంలో భానుడి తీవ్రత భరించలేనంత తీక్షణంగా ఉన్నప్పుడు కూడా దిగుడు బావి దగ్గర శీతల పవనాలు వీస్తుంటాయి. అప్పటి ఆర్కిటెక్టులకు నేచురల్ ఎయిర్ కండిషనింగ్ టెక్నాలజీ ఏదో తెలిసే ఉంటుంది. ఇన్ని తెలిసిన తర్వాత ఇలాంటి దిగుడుబావిలోకి తొంగి చూడని యువత ఉండదు. అలాగే పఠాన్లో తయారయ్యే పటోలా చీరల మీద మనసు పారేసుకోని మహిళ ఉండదు. ఇదే ట్రిప్లో మధేరాలోని సన్ టెంపుల్ను, దాని పక్కనే ఉన్న సూర్యకుండ్ను కూడా చూడవచ్చు. రాన్ ఆఫ్ కచ్లో ఫ్లెమింగోలను, ఎండకు కాంతులీనుతూ కళ్లను మిరుమిట్లు గొలిపే ఉప్పు కయ్యలను కూడా చూడచ్చు. అయితే ఇక్కడ ఒక కిలో ఉప్పు కొనడం కష్టమే. కనీసం నాలుగు కిలోలైనా కొనాలి. ఎందుకంటే కిలో ఉప్పు పావలా. ఇప్పుడు పావలాలే లేవు మరి! -
పురావస్తు శాస్త్రవేత్త ఐ.కె.శర్మ మృతి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త, భారత పురావస్తు శాఖ పూర్వ డెరైక్టర్ ఇంగువ కార్తికేయ శర్మ (ఐ.కె.శర్మ) (76) గురువారం ఉదయం హైదరాబాద్లోని (విద్యానగర్) తన ఇంట్లో కన్నుమూశారు. ఆయనకు భార్య రాజేశ్వరి, కుమార్తెలు విమల, విజయ, కుమారుడు శివ ఉన్నారు. గురువారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరిగాయి. శర్మ మృతిపట్ల కేంద్ర పురావస్తుశాఖ సూపరింటెండెంట్ ఆర్. కృష్ణయ్య, రాష్ట్ర పురావస్తుశాఖ పూర్వ డెరైక్టర్ పి. చెన్నారెడ్డి, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డెరైక్టర్ ఈమని శివనాగిరెడ్డి పలువురు సీనియర్ ఆర్కియాలజిస్ట్లు సంతాపం తెలిపారు. శ్రీశైలం డ్యాం నిర్మాణం నేపథ్యంలో ముంపునకు గురైన కూడలి సంగమేశ్వర-పాపనాశి ఆలయ సముదాయాలను పరిరక్షించి ఆలంపురం తదితర ప్రాంతాలలో పునఃప్రతిష్ట చే యడంలో ఐ.కె.శర్మ కీలక పాత్ర పోషించారు. కార్తికేయ శర్మ మృతి పట్ల పురావస్తు శాఖ అధికారులు, సిబ్బంది, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. -
స్వప్న భారతంలో మాయా స్వర్ణం
బైలైన్ ఎం.జె.అక్బర్, సీనియర్ సంపాదకులు భయానక కాల్పనిక సాహిత్యం మన దేశంలో జనాదరణ పొందకపోవడానికి కారణం ఏమిటి? ఆ విషయంలో వార్తా పత్రికల నుంచి పోటీ మరీ ఎక్కువగా ఉండటమే. అతి క్రూరమైన, అసంభవాలను సృష్టించే కాల్పనిక శక్తిలో దైనందిన వార్తలతో పోటీపడగలిగిన వైపరీత్యపు బుర్ర ఏ రచయితకైనా ఉండటం సాధ్యమేనా? స్వామీజీలుగా చెలామణి అవుతూ జలగల్లాగా నొప్పి తెలియకుండా నెత్తురును పీల్చేసే కొందరు తుచ్ఛుల దుష్ట పన్నాగాలు ఎల్లెడలా వ్యాపించి ఉన్న దేశం మనది. పదునైన కోర పళ్లతో ఆడవాళ్ల మెడ నుంచి నెత్తురును పీల్చేసే రక్త పిశాచి ‘డ్రాక్యులా’గానీ, ఆ పాత్రను సృష్టించిన బ్రామ్ స్టోకర్గానీ మనకు అవసరం లేదు. అలాంటి మోసకారి స్వాముల భక్తులు కోట్లలో ఉన్నారు. ఆ తుచ్ఛులు ఆక్రమించిన భూములు వేల ఎకరాల్లో విస్తరించాయి. మనవాళ్లు ఎంత మూర్ఖంగా ఉండగలరు? ఎంతైనా మూర్ఖంగా ఉండగలరని రుజువవుతూనే ఉన్నది, నిజమే. సామూహిక వెర్రి కథ అతి సుదీర్ఘమైనది, సంక్లిష్టమైనది. ఉత్తరప్రదేశ్లోని దౌండియా ఖేరా అనే ప్రాంతంలో వెయ్యి టన్నుల బంగారం ఉన్నదని సాగి స్తున్న అన్వేషణకు సాటిరాగ ల సామూహిక వెర్రి మరొకటి ఉండక పోవచ్చు. 150 ఏళ్ల క్రితం రాజా రామ్బక్ష్ ఆ బంగారాన్ని అక్కడ పాతర వేసినట్టు స్వామి శోభన్ సర్కార్ అనే వ్యక్తి ఇటీవల కలగన్నారు. ఆ కల ఆధారంగానే నిధి కోసం అన్వేషణ సాగుతోంది! ఆయన ఆ కలగనడానికి ముందు ఎవరూ విని ఉండని ఆ రాజా హఠాత్తుగా బాలీవుడ్ చిత్ర కథనాయకుడై పోయాడు. మన బంగారంపై తెల్లవాళ్ల చేతులు పడకుండా కాపాడటానికి ఆ అనామకపు రాజు ఈ నిధిని 1857కు ముందే పాతర వేసి ఉండాలి. భారత సాంస్కృతిక, పురావస్తు సంస్థ ఉన్నతాధికారులు సైతం ఈ నిధి గురించి పెదాలు తడుపుకుంటున్నారు. మూకుమ్మడిగా జనం అత్యుత్సాహాన్ని ప్రదర్శించడాన్ని తప్పు పట్టడానికి లేదు. కంప్యూటర్ యుగపు యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సదరు పూజ్యనీయులైన స్వామీజీ వద్దకు దూతను పంపి,.. ప్రజల మనిషినైన తాను ఆ నిధిని అభివృద్ధి కోసం ఉపయోగించడాన్ని దైవ స్వరూపుడైన ఆ మనిషి అనుమతిస్తారో లేదో వాకబు చేసినట్లు తెలుస్తోంది. అద్భుతమైన ఈ బంగారం ఎన్నటికైనా బయటపడితే... దాన్ని దయనీయ స్థితిలో ఉన్న ప్రజల కోసం గాక రాజకీయవేత్తల సంక్షేమం కోసమే బహుశా వినియోగిస్తారు. అది వేరే కథ. వ్యక్తిగతంగా నా మటుకు నేను ఆ బంగారాన్ని కనుగొనాలనే ఆశిస్తాను. అందులోంచి ఓ పిడికెడు బంగారాన్ని ప్యాంటు జేబులోకి తోసేయగలగడం కాదుకదా దాని వాసన చూడటానికి కూడా నన్ను అనుమతించరు. ఆ నిధితో అఖిలేష్యాదవ్ పంచిపెట్టిన కంప్యూటర్లకు డబ్బు చెల్లించగలుగుతారు. బహుళజాతి సంస్థలకు అది ఆనందదాయకమైన వార్త అవుతుంది. అయితే కొన్ని తెలివి తక్కువ ప్రశ్నలు నా ఖాళీ బుర్రను తొలిచేస్తున్నాయి. ‘శాస్త్రీయమైన ఆధారాలు’ దొరికాయి కాబట్టే ఈ స్వర్ణ నిధి కోసం తవ్వకాలు సాగిస్తున్నామని భారత ప్రభు త్వ మేధావులు వివరించారు. మనం మాట్లాడుతున్నది పుడమితల్లి కడుపున దాగి ఉన్న అపార బంగారు నిధి కుం భకోణం గురించి కాదు. రాజా రామ్ బక్ష్కు ఆయన సల హాదారులు ఆ బంగారాన్ని ఎలా దాచాలని చెప్పి ఉంటారనేదాన్ని బట్టి... ఆ నిధిని మట్టి లేదా ఇనుప కుండల్లో పాతరవేసి ఉండాలి. ఈ కుండల లేదా బిందెల గురించి మన మేధావులకు శాస్త్రీయ ఆధారాలు ఎలా లభించాయి? భూగర్భంలో ధగధగలాడుతున్న ఆ బంగారాన్ని కుశాగ్ర బుద్ధియైన ఓ లేజర్ కిరణం కళ్లారా చూసి,.. మెరిసేదంతా బంగారమేనని తేల్చేసిందా? నాకు తెలిసినంతలో వాసన చూడటం ద్వారా బంగారం ఉనికిని కనిపెట్టలేం. కాబట్టి ఢిల్లీలోని కొందరు ‘పెద్దలు’ ఈ పండుగ సెలవుల్లో సుప్రసిద్ధ సాహసిక నవల ‘ట్రెజర్ ఐలాండ్’ (స్వర్ణ ద్వీపం) చదివి ఉంటారని భావించడం సమంజసం. ఈ వెర్రితో మొట్టమొదట నశించేది వివేకం. రాజా రామ్ బక్ష్ ఎంతటి గొప్ప సంపన్నుడు? అతగాడు అవధ్ నవాబుగానీ, మరాఠా పీష్వాగానీ కాదు, బెనారస్ రాజానో, ఝాన్సీ రాణీనో కానే కాదు. అసలు అలాంటి వారి సరసన నిలిచేవాడే కాడు. లేకపోతే పాఠ్య పుస్తకాల్లో ఎక్కడో ఒక చోట అతని గురించి ఓ ముక్క మనకు వినిపించి ఉండేదే. ఆ రాజు కల్పన కాదు, నిజంగానే ఉండేవాడు. ఇంతకూ ఆ అనామకపు రాజు వెయ్యి టన్నుల బంగారాన్ని ఎలా కూడబెట్టగలిగి ఉంటాడు? ఆ కాలంలో అతి సంపన్న వ్యాపార సంస్థ ఈస్ట్ ఇండియా కంపెనీ. దాని వద్ద సైతం అంత బంగారం ఉన్నట్టు చెప్పగా వినలేదు. ఢిల్లీ మొగలాయి చక్రవర్తుల ఖజనాలో అంత బంగారం ఉండి ఉండేదేమో. ఉంటే దాన్ని 1739లోనే నాదిర్ షా ఖాళీ చేసేసి ఉంటాడు. అదీ పరిస్థితి. ఆ కాలంలో అందుబాటులో ఉన్న భారీ తవ్వకం సాధనం పార మాత్రమే. అయినాగానీ అంత బంగారాన్ని ఎలా పాతిపెట్టి ఉండాలి? చాలా మంది శ్రామికులే పనిచేసి ఉంటారని అనుకోవాలి. గత రెండు శతాబ్దాలుగా అక్కడి రైతులు, వారి సంతతి అత్యంత నిజాయితీపరులుగా ఉండి ఉండాలి. రహస్యాలను దాచి పెట్టడంలో మన దేశానిది అధమస్థానమే తప్ప అత్యుత్తమ స్థానం కాదు. 1867లో లేదా 1877లో లేదా 1887లో ఎవరూ తిరిగి ఆ నిధి జోలికి వెళ్లకుండా ఉండి ఉండాలి. బ్రిటిష్వాళ్ల చెవిలో ఓ మాట వేయకుండా ఉండాలి. ఏమైనా అది అద్భుతమే. మూఢ నమ్మకానికి, శాస్త్రీయ వివేచనకు మధ్యన జరిగే ఏ సంఘర్షణలోనైనా మూఢ నమ్మకమే కళ్లు మూసుకుని విజయం సాధిస్తుంది. ఆ బాబాకు నిధి గురించి కల వచ్చింది, సరే. ఈ సాయం సంధ్యా సమయపు నిగూఢ రహస్యాలను సవాలు చేసే సాహసం కూడా ఎవరూ చేయలేరు. సిగ్మండ్ ఫ్రాయిడ్ మన దేశానికి వచ్చి ఉంటే మనోవిశ్లేషణ, కలల అంతరార్థ వివరణ బతికి బట్టగలిగి ఉండేవి కావు. మనదేమైనా కలలు నిజమయ్యే దేశమా? దేశవ్యాప్త పేదరికం నుంచి ఢిల్లీ గతుకుల రోడ్లపై ప్రయాణం వరకు ప్రతి ఒక్కటీ కాదని రుజువుచేస్తూనే ఉన్నాయి. కలల తయారీని కూడా స్థూల జాతీయోత్పత్తికి కలిపితే మన జీడీపీ మిగతా ఆసియా దేశాలన్నిటి జీడీపీని మించిపోతుంది. ఇందులో పొరపాటు పడటానికి ఏమీ లేదు. కలల తయారీ రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు వస్తాయి. రిక్తహస్తాలను మాత్రమే మిగిల్చే కలలపై పెట్టుబడులు పెట్టేవారు మోసగాళ్లు మాత్రమే. -
దొరకని బంగారం ఆనవాళ్లు.. కొనసాగుతున్న తవ్వకాలు
ఉత్తరప్రదేశ్ : బంగారం నిధి కోసం శుక్రవారం మధ్యాహ్నం కూడా తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దౌండియా ఖేరా గ్రామంలో భారీ స్థాయిలో బంగారం నిధి ఉన్నట్లు ముమ్మరంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం తవ్వకాలు ప్రారంభించారు. 12 మంది సభ్యుల బృందం తవ్వాకాల్లో నిమగ్నమైంది. 1,000 టన్నుల బంగార నిధి ఉందని వార్తలు రావడంతో పురావస్తు శాఖ వెలికి తీసేందుకు శతవిధాలా యత్నిస్తోంది. కాగా, ఇంకా బంగారు నిధికి సంబంధించి ఎటువంటి ఆనావాల్లు లభించలేదు. దౌండియా ఖేరా గ్రామంలో 180 ఏళ్ల క్రితం రాజా రామ్భక్ష్ సింగ్ శివాలయం నిర్మించారు. ఆ ఆలయం అడుగున వెయ్యి టన్నుల బంగారం నిధి ఉందని ఆ ప్రాంతానికి చెందిన స్వామి శోభన్ సర్కారు చెప్పారు. ఆలయంలో బంగారం నిక్షిప్తమై ఉన్నట్టు తనకు కల వచ్చిందని శోభన్ సర్కారు తెలపడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అంతే కాకుండా ఇక్కడ నిధిని వెలికితీయాలని ఆయన ప్రధానిమంత్రికి, రిజర్వ్ బ్యాంకుకు లేఖలు కూడా రాయడం విశేషం. ఉన్నావ్ ప్రాంతంలో స్వామి శోభన్ కు ఆ ప్రాంతంలో మంచి పేరు ఉండటంతో సర్కారు కూడా అతని మాటల్ని నమ్మింది. ఆయన సత్యమే మాట్లాడాతారని ప్రతీతి. దీంతో పురావస్తు శాఖ కూడా ఆయన మాటలు నమ్మి ఈ ఊళ్లో తవ్వకాలు చేపట్టింది. 60 ఎకరాల సువిశాల ప్రాంతంలో నిధి ఎక్కడు ఉందో కనిపెట్టే పనిలో ప్రస్తుతం ఆ శాఖ నిమగ్నమైంది. ఒక చోట తవ్వితే శబ్దం వేరువిధంగా ఉన్నట్లు గుర్తించటంతో పురావస్తు శాఖ అధికారులు పూర్తిస్థాయిలో తవ్వకాలను శుక్రవారం నుంచి మొదలు పెట్టారు. కాగా, ఇప్పటి వరకూ ఎటువంటి బంగారు నిధి లభించలేదని పురావస్తు శాఖ తెలిపింది. సర్కారు మాత్రం ఆ నిధిపై ఆశలు భారీగానే పెట్టుకున్నట్లు కనబడుతోంది. పలుచోట్ల తవ్వకాలు జరపాలని ప్రభుత్వం వారికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు తవ్వకాలను ముమ్మరం చేశారు. -
'బంగారు' కొండ కోసం తవ్వకాలు ప్రారంభం
లక్నో : బంగారం నిధి కోసం శుక్రవారం తవ్వకాలు మొదలయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దౌండియా ఖేరా గ్రామంలో భారీ స్థాయిలో బంగారం నిధి ఉన్నట్లు ముమ్మరంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం తవ్వకాలు ప్రారంభించారు. దౌండియా ఖేరా గ్రామంలో 180 ఏళ్ల క్రితం రాజా రామ్భక్ష్ సింగ్ శివాలయం నిర్మించారు. ఆ ఆలయం అడుగున వెయ్యి టన్నుల బంగారం నిధి ఉందని ఆ ప్రాంతానికి చెందిన స్వామి శోభన్ సర్కారు చెప్పారు. ఆలయంలో బంగారం నిక్షిప్తమై ఉన్నట్టు తనకు కల వచ్చిందని శోభన్ సర్కారు వెల్లడించాడు. అంతే కాకుండా ఇక్కడ నిధిని వెలికితీయాలని ఆయన ప్రధానిమంత్రికి, రిజర్వ్ బ్యాంకుకు లేఖలు కూడా రాశారు. ఉన్నావ్ ప్రాంతంలో స్వామి శోభన్ సర్కారుకు మంచి పేరుంది. ఆయన సత్యమే మాట్లాడాతారని ప్రతీతి. అందుకే అక్కడివారు ఆయన మాటలు నమ్ముతున్నారు. పురావస్తు శాఖ కూడా ఆయన మాటలు నమ్మి ఈ ఊళ్లో తవ్వకాలు చేపట్టింది. 60 ఎకరాల సువిశాల ప్రాంతంలో నిధి ఎక్కడు ఉందో కనిపెట్టే పనిలో ప్రస్తుతం ఆ శాఖ నిమగ్నమైంది. ఒక చోట తవ్వితే శబ్దం వేరువిధంగా ఉన్నట్లు గుర్తించటంతో పురావస్తు శాఖ అధికారులు పూర్తిస్థాయిలో తవ్వకాలను శుక్రవారం నుంచి మొదలు పెట్టారు. మరోవైపు బంగారం నిధి ఉందని తెలియడంతో ఎక్కడెక్కడో ఉంటున్న దౌండియా ఖేరా గ్రామస్తులు ఇప్పుడు ఊరికి చేరుకున్నారు. మరోవైపు బంగారం నిధి తవ్వకాలు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలన్న పిటిషన్ను విచారించేందుకు న్యాయస్థానం అంగీకరించింది. కాగా బంగారం నిధి విలువ సుమారు 3లక్షల కోట్లు ఉంటుందని అంచనా.