Bail grant
-
ఆప్ నేత సత్యేందర్ జైన్కు భారీ ఊరట.. రెండేళ్లకు బెయిల్
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆప్ సీనియర్ నేత సత్యేందర్ జైన్కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ మాజీ మంత్రి అయిన సత్యేందర్ జైన్కు రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. కాగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద నమోదైన కేసులో ఆయన దాదాపు 18 నెల జైలులో ఉన్నారు.బెయిల్ మంజూరు సందర్భంగా.. హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పీఎంఎల్ఏ వంటి కఠినమైన కేసుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. విచారణలో జాప్యాన్ని ఎత్తిచూపుతూ.. సత్యేందర్ జైన్ సుధీర్ఘ కాలం నిర్బంధంలో ఉన్నారని పేర్కొంది. ఈమేరకు ఆప్ నేత మనీష్ సిసోడియా కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ.. సత్వర విచారణ అనేది ప్రాథమిక హక్కుగా తెలిపింది. ట్రయల్ ప్రారంభించడానికి ఇంకా చాలా సమయం పడుతుందన్న న్యాయస్థానం వీలైనంత త్వరగా కేసును ముగించాలని దర్యాప్తు సంస్థకు సూచించింది.కాగా జైన్ను రెండేళ్ల కిత్రం మే 2022లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. అయితే ఆరోగ్య కారణాలతో వైద్య కారణాలతో 2023 మేలో సుప్రీంకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఈ ఏడాది మార్చిలో సాధారణ బెయిల్ కోసం ఆయన చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో జైన్ ఢిల్లీలోని తీహార్ జైలుకు తిరిగి వచ్చారు.ఇటీవల కాలంలో వివిధ కేసుల్లో బెయిల్ పొందిన మూడో ఆప్ నేత సత్యేందర్ జైన్. లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గత నెలలో బెయిల్ మంజూరు అయిన సంగతి తెలిసిందే. ఇక ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఆగస్టులో బెయిల్ లభించింది. -
Delhi liquor scam: కేజ్రీవాల్ విడుదల
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. విచారణ పేరిట నిందితులను సుదీర్ఘ కాలం పాటు జైల్లో ఉంచడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను కాలరాయడమేనని ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కేసుపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయొద్దని కేజ్రీవాల్కు షరతు విధించింది. సీబీఐ తీరును ఈ సందర్భంగా తప్పుబట్టింది. ఈ ఉదంతానికి సంబంధించి ఈడీ కేసులో బెయిల్ లభించగానే కేజ్రీవాల్ను అరెస్టు చేయడాన్ని ప్రశ్నించింది. పంజరంలో చిలుకలా ప్రవర్తించొద్దంటూ చీవాట్లు పెట్టింది. కోర్టు తీర్పుతో ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. దాదాపు ఆరు నెలల కారాగారవాసం అనంతరం కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. మద్యం విధానం కుంభకోణం కేసులో గత మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేయడం తెలిసిందే. లోక్సభ ఎన్నికల్లో ప్రచార నిమిత్తం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మే 10న విడుదలైన ఆయన జూన్ 2 తిరిగి జైలుకు వెళ్లారు. అనంతరం ఈడీ కేసులో బెయిల్ మంజూరైనా సీబీఐ తిరిగి అరెస్టు చేయడాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. బెయిల్ కోసం ముందుగా ట్రయల్ కోర్టుకు వెళ్లాలన్న సీబీఐ వాదనను తోసిపుచి్చంది. అన్ని కేసులకూ ఒకే నియమాన్ని వర్తింపజేయలేమని స్పష్టం చేసింది.కేజ్రీవాల్కు షరతులివే...మద్యం కుంభకోణం ఉదంతంలో సీబీఐ కేసుపై బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయరాదు. లెఫ్టినెంట్ గవర్నర్ సంతకం అవసరమైన ఫైళ్లు మినహా మిగతా వాటిపై సంతకాలు చేయరాదు. సీఎం కార్యాలయానికి, సచివాలయానికి వెళ్లడానికి వీల్లేదు (ఈ షరతులను తాజా తీర్పులో ధర్మాసనం సడలించింది. కానీ మే 10, జూలై 12 నాటి తీర్పుల్లో సుప్రీంధర్మాసనం ఈ రెండు షరతులనూ విధించింది. వాటిని విస్తృత ధర్మాసనం మాత్రమే రద్దు చేయగలదని ఆ సందర్భంగా పేర్కొంది. దాంతో అవి అమల్లోనే ఉండనున్నాయి) ట్రయల్ కోర్టు విచారణ అన్నింటికీ హాజరు కావాలి. విచారణ త్వరగా పూర్తయేందుకు సహకరించాలి.పంజరంలో చిలుక కావొద్దు సీబీఐకి జస్టిస్ భూయాన్ హితవు ఈడీ కేసులో బెయిల్ షరతులను తప్పుబట్టిన న్యాయమూర్తి విడిగా 33 పేజీల తీర్పు కేజ్రీవాల్కు బెయిల్ మంజూరుపై న్యాయమూర్తులిద్దరూ ఏకాభిప్రాయం వెలిబుచి్చనా పలు ఇతర అంశాలపై జస్టిస్ భూయాన్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేజ్రీవాల్ను సీబీఐ అరెస్టు చేయడంలో తనకెలాంటి అసంబద్ధతా కన్పించడం లేదని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొనగా జస్టిస్ భూయాన్ మాత్రం ఆ అభిప్రాయంతో తీవ్రంగా విభేదిస్తూ విడిగా 33 పేజీల తీర్పు రాశారు. కేజ్రీవాల్ను సీబీఐ అరెస్టు చేసిన సమయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇంకా ఏమన్నారంటే... → ఈ కేసులో 22 నెలలుగా ఊరికే ఉన్న సీబీఐకి, ఈడీ కేసులో బెయిల్ వచి్చన వెంటనే కేజ్రీవాల్ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచి్చంది? → బెయిల్ను అడ్డుకోవడమే దీని వెనక ఉద్దేశంగా కని్పస్తోంది. → ప్రశ్నలకు సమాధానం దాటవేస్తున్నారు గనుక నిర్బంధంలో ఉంచాల్సిందేనన్న వాదన సరికాదు. → సహాయనిరాకరణ చేసినంత మాత్రాన నిర్బంధం కూడదు. నిందితునికి మౌనంగా ఉండే హక్కుంటుంది. → బలవంతంగా నేరాంగీకారం రాబట్టే ప్రయత్నాలు కచ్చితంగా చట్టవిరుద్ధమే.→ ఇవే అభియోగాలపై ఈడీ కేసులో బెయిల్ మంజూరయ్యాక కూడా జైల్లోనే ఉంచజూడటం అక్రమం. → సీజర్ భార్య నిందలకు అతీతంగా ఉండాలన్న సామెత సీబీఐకి పూర్తిగా వర్తిస్తుంది. అత్యున్నత దర్యాప్తు సంస్థగా నిజాయితీగా వ్యవహరించడమే కాదు, అలా కని్పంచడం కూడా చాలా ముఖ్యం. ఏకపక్ష పోకడలు పోతోందన్న అభిప్రాయం కలగకుండా జాగ్రత్త పడాలి. → సీబీఐని పంజరంలో చిలుకగా ఇదే న్యాయస్థానం ఇటీవలే ఆక్షేపించింది. అది తప్పని, తాను స్వేచ్ఛాయుత చిలుకనని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థదే → సీఎం కార్యాలయంలోకి వెళ్లొద్దని, ఫైళ్లపై సంతకాలు చేయొద్దని ఈడీ కేసులో బెయిల్ సందర్భంగా కేజ్రీవాల్కు కోర్టు విధించిన షరతులపై నాకు తీవ్ర అభ్యంతరాలున్నాయి. కాకపోతే న్యాయపరమైన క్రమశిక్షణను గౌరవిస్తూ వాటిపై నేను ఎలాంటి వ్యాఖ్యలూ చేయదలచుకోలేదు!నా పోరు ఆగదు జైలు నా స్థైర్యాన్ని పెంచింది: కేజ్రీవాల్ ‘‘జైల్లో పెట్టి నన్ను కుంగదీయాలని, నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలని చూశారు. కానీ జైలు గోడలు, ఊచలు నన్నేమీ చేయలేకపోగా నా మనోబలాన్ని వెయ్యి రెట్లు పెంచాయి. నా జీవితంలో ప్రతి క్షణం, ఒంట్లోని ప్రతి రక్తపు చుక్కా దేశసేవకే అంకితం. జాతి వ్యతిరేక శక్తులపై నా పోరు ఆగబోదు’’ అని కేజ్రీవాల్ అన్నారు. శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం ఆయన తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో గుమిగూడిన ఆప్ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం భారీ వర్షంలోనే చండ్గీరాం అఖాడా నుంచి తన అధికారిక నివాసం దాకా కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించారు. ‘జైలు తాళాలు విరిగి పడ్డా యి. కేజ్రీవాల్ విడుదలయ్యారు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వారికి ఆయన అభివాదం చేశారు. వర్షంలో తడుస్తూనే వాహనం పై నుంచి వారినుద్దేశించి మాట్లాడారు. ‘‘జాతి వ్యతిరేక శక్తులతో తలపడ్డందుకే నన్ను జైల్లో పెట్టారు తప్ప తప్పు చేశానని కాదు. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దేశాన్ని బలహీనపరిచేందుకు, విడదీసేందుకు జాతి వ్యతిరేక శక్తులు కుట్రలు చేస్తున్నాయి. ఈసీని బలహీనపరిచేందుకు, ఈడీ, సీబీఐలను పూర్తిగా చెప్పుచేతల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీటిని పూర్తిస్థాయిలో ఎదుర్కొందాం. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా. అయినా ప్రతి దశలోనూ దైవం నాకు దన్నుగా నిలిచింది. నేను సత్యమార్గంలో నడవడమే అందుకు కారణం’’ అన్నారు. అంతకుముందు కేజ్రీవాల్కు బెయిల్ లభించగానే ఆప్ ప్రధాన కార్యాలయం వద్ద, ఆయన నివాసం వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. కేజ్రీ భార్య సునీత తదితరులు వాటిలో పాల్గొన్నారు. -
ఢిల్లీ లిక్కర్ కేసు: విజయ్ నాయర్కు సుప్రీంకోర్టు బెయిల్
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ కమ్యూనికేషన్ ఇంచార్జి, వ్యాపారవేత్త విజయ్ నాయర్కు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. సుదీర్ఘకాలం పాటు జైలు శిక్ష, విచారణలో జాప్యాన్ని కీలక కారణాలుగా చూపుతూ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.కాగా లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న నాయర్.. 23 నెలలుగా తిహార్ జైల్లో ఉన్నాడు. ఈ క్రమంలోనే అండర్ ట్రయల్గా అతన్ని ఎక్కువ కాలం జైలులో ఉంచలేరని, విచారణ శిక్షగా మారకూడదని సుప్రీం న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, ఎస్వీఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం తెలిపింది. న్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టుకు హామీ ఇచ్చినప్పటికీ సకాలంలో విచారణను పూర్తి చేయలేకపోయిందని, దాదాపు 350 మంది సాక్షులను విచారించాల్సి ఉందని పేర్కొంది. ఈ మేరకు ఈ కేసులో ఇతర నిందితులైన మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవితకు బెయిల్ జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు పరిగణలోకి తీసుకుంది.‘30 అక్టోబర్ 2023న 6 నుంచి 8 నెలల్లో విచారణ ముగిస్తామని ఈడీ కోర్టుకు హామీ ఇచ్చింది. అయితే విచారణ ఇంకా ప్రారంభం కాలేదని అర్థం అవుతోంది.ఈ కేసులో దాదాపు 40 మందిని నిందితులుగా చేర్చారు. దాదాపు 350 మంది సాక్షులను విచారించాలని ప్రాసిక్యూషన్ కోరుతోంది.ఈ కేసులో పిటిషనర్ 23 నెలల పాటు కస్టడీలో ఉన్నాడు. విచారణ ప్రారంభించకుండా అతనిని అండర్ ట్రయల్గా నిర్బంధించడం శిక్షా విధానం కాదు. పిటిషనర్ను విచారణ ప్రారంభించకుండానే జైలులో ఉంచితే బెయిల్ రూల్, జైలు మినహాయింపు అనే సార్వత్రిక నియమం ఓడిపోతుంది.ఆర్టికల్ 21 ప్రకారం స్వేచ్ఛా హక్కు అనేది ఒక పవిత్రమైన హక్కు. ఇది పీఎంఎల్ఏ వంటి ప్రత్యేక చట్టాల ప్రకారం కఠినమైన నిబంధనలు రూపొందించబడిన సందర్భాల్లో కూడా దీనిని గౌరవించాల్సిన అవసరం ఉంది’ అని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.కాగా లిక్కర్ పాలసీకి సంబంధించి సీబీఐ, ఈడీ కేసులో విజయ్ నాయర్ నిందితుడిగా ఉన్నారు. నవంబర్ 2022లో సీబీఐ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. కానీ ఈడీ కేసులో గతేడాది జూలైలో ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ క్రమంలోనే ఆయన సుప్రీంను ఆశ్రయించారు. -
కవితకు బెయిల్ ఆలస్యమైనా.. న్యాయం గెలిచింది: బీఆర్ఎస్ నేతలు
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది.కవిత బెయిల్పై తెలంగాణ రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నెలకొంది. బెయిల్ విషయంలో కుమ్మక్కయ్యారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తున్నారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అయిదునెలలుగా ఒక ఆడబిడ్డ జైల్లో ఇబ్బంది పడిందని, అన్యాయంగా కవితను జైల్లో పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్.. సుప్రీంకోర్టు తీర్పును కించపరిచే విధంగా దానికి రాజకీయాలు ముడి పెట్టి దుర్మార్గంగా మాట్లాడారని మండిపడ్డారు.సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేస్తున్నారని, కేంద్రమత్రిగా ఉండి బండి సంజయ్ ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడిన వ్యాఖ్యాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మహేష్ కుమార్ గౌడ్పై కేసులు వేస్తామని, బెయిల్ను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడారని విమర్శించారు. కోర్టులో జరిగిన వాదనలు సమాజం చూసిందని, ఈబీ, సీబీఐ వరి కనుసన్నల్లో నడుస్తున్నాయనేది దేశం మొత్తం తెలుసని అన్నారు. బెయిల్ రావడం ఆలస్యమైనా.. న్యాయం గెలిచిందన్నారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. నిజం ఆలస్యంగా గెలుస్తుందని నిరూపితమైందని తెలిపారు. రాజకీయ నేతలు ఈ కేసులో లేకపోతే 15 రోజుల్లో బెయిల్ వచ్చేదని పేర్కొన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలకు చెందిన రాజకీయ నేతలు ఈ కేసులో ఉన్నారు కాబట్టే జైల్లో పెట్టారని ఆరోపించారు. ఢీల్లి లిక్కర్ కేసులో ఒక్క రూపాయి రికవరీ చేయలేదని, సౌత్ గ్రూప్ అని పేరు పెట్టి అహంకారంతో వ్యవహరించారని మండిపడ్డారు.‘చార్జీషీట్ దాఖలు చేసిన తర్వాత జైల్లో ఎందుకు ఉండాలని కోర్టు అడిగింది. అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఆ ప్రశ్నకు నీళ్లు నమిలారు. మహిళలకు బెయిల్ విషయంలో కొన్ని చట్టబద్ధమైన హక్కులు ఉంటాయి. ఢీల్లి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. బండి సంజయ్ అనాలోచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. బండి సంజయ్కు అసలు తెలివి ఉందా? సుప్రీంకోర్టులో లాయర్లు పార్టీల తరపున ఉండరు. ముకుల్ రోహత్గీ బీజేపీ ప్రభుత్వంలో సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్గా ఐదేళ్ళు పని చేశారుకేంద్ర హోంశాఖా సహాయ మంత్రి హోదాను బండి సంజయ్ కాపాడుకోవాలి. మేము బాంఛన్ అంటే కవిత ఎప్పుడో బయటకు వచ్చేది. చట్ట ప్రకారం కొట్లాడదామనే మేము ముందుకు వెళ్ళాము. స్త్రీలను ఇబ్బంది పెట్టిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోలేదు. బీజేపీలో చేరిన హిమంత బిశ్వశర్మపై కేసులు లేకుండా చేసి సీఎంను చేశారు.ఏపీలో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఇద్దరు రాజ్యసభ సభ్యులపై ఈడీ కేసులు ఎందుకు నడవడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో బీజేపీలో చేరిన ఎంతో మంది నేర చరితలపై విచారణ జరగడం లేదు. బీజేపీలో చేరితే కేసులు లేకుండా చేస్తున్నారు. కవితపై పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపిత కేసు. కేసీఆర్ను ఇబ్బంది పెట్టే కుట్ర చేశారుబండి సంజయ్ తెలంగాణలో 750 కోట్ల సివిల్ సప్లై స్కాం పై ఎందుకు మాట్లాడడం లేదు. కేంద్ర ప్రభుత్వ సివిల్ సప్లై శాఖ పై ఎందుకు దృష్టి పెట్టలేదు. తెలంగాణ ఆడబిడ్డ బెయిల్ వస్తే ఎందుకింత అక్కసు?- మాజీ మంత్రిగంగుల కమలాకర్. -
Delhi Liquor Case: సీఎం కేజ్రీవాల్కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్కే కేసులో సీఎం కేజ్రీవాల్కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. కాగా లిక్కర్ కేసులో సాధారణ బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు గురువారం విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది. అనంతరం కోర్టు వెకేషన్ బెంచ్ జడ్జి న్యాయ బిందు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.బెయిల్ మంజూరు సందర్భంగా.. లక్ష రూపాయల పూచీకత్తు బాండ్ సమర్పించాలని కోర్టు షరతు విధించింది. అయితే అప్పీల్కు వెళ్లేంత వరకు తీర్పును 48 గంటలపాటు సస్పెండ్ చేయాలని ఈడీ కోరిన్పటికీ కోర్టు తిరస్కరించింది. ఇక బెయిల్ లభించడంతో కేజ్రీవాల్ శుక్రవారం తిహార్ జైలు నుంచి బయటకు రానున్నారు. మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో సుప్రీంకోర్టు లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల తర్వాత జూన్ రెండున కేజ్రీవాల్ మళ్లీ తిహార్ జైల్లో లోంగిపోయారు. కింది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా నేడు ఆయనకు బెయిల్ మంజూరైంది. -
కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్
తన ర్యాష్ డ్రైవింగ్తో ఇద్దరి ప్రాణాలు బలిగొన్న నిందుతుడైన మైనర్కు 15 గంటల్లోనే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఆశ్చర్యకర ఘటన మహారాష్ట్రలోని పుణెలో వెలుగుచూసింది.వివరాలు.. పుణెలో మైనర్ బాలుడి డ్రైవింగ్ కారణంగా ఇద్దరి ప్రాణాలు కోల్పోయారు. పుణెలో ఆదివారం తెల్లవారుజామున పోర్స్చే కారును అతివేగంగా నడిపిన 17 ఏళ్ల బాలుడు బైక్ను బలంగా ఢీకొట్టాడు. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనీష్ అవధియా, అశ్విని కోష్ట ఎగిరి పడ్డారు. కారు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ప్రమాద సమయంలో కారు గంటకు 200 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.అయితే బాలుడు అరెస్టైన 15 గంటల్లోనే కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. నిందితుడు మైనర్ అవ్వడం వల్ల కోర్టు పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిందని అతని తరపు న్యాయవాది ప్రశాంత్ పాటిల్ చెప్పారు. బాలుడు 15 రోజుల పాటు ఎరవాడలో ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని, ప్రమాదాలపై వ్యాసం రాయాలని కోర్టు తెలిపింది. మద్యపానం సేవించకుండా ఉండేందుకు చికిత్స చేయించుకోవాలని, అలాగే కౌన్సెలింగ్ సెషన్లు తీసుకోవాలని తెలిపింది. కాగా నిందితుడు పుణెకు చెందిన ప్రముఖ రియల్టర్ కుమారుడు కావడం గమనార్హం. -
సోమా కాంతిసేన్కు బెయిల్
న్యూఢిల్లీ: 2018 నాటి ఎల్గార్ పరిషత్–మావోయిస్ట్ సంబంధాల కేసులో ఉద్యమకారిణి సోమా కాంతి సేన్(66)కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమెను సుదీర్ఘకాలం నిర్బంధించడంతోపా టు అభియోగాల నమోదులో అవుతున్న జాప్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ ఆగస్టీన్ జార్జి మసీహ్ల ధర్మాసనం తెలిపింది. మావోయిస్ట్ పార్టీకి కొత్త రిక్రూ ట్మెంట్ల కోసం ఆమె సాయం చేసినట్లుగా ఎన్ఐఏ ఎటువంటి ఆధారాలను చూపలేక పోయిందని పేర్కొంది. -
AAP MP Sanjay Singh: బీజేపీకి గట్టిగా బదులిస్తాం
న్యూఢిల్లీ: విపక్షాలపై తీవ్ర నిర్బంధ చర్యలకు పాల్పడుతున్న బీజేపీకి గట్టిగా బదులివ్వాల్సిన సమయం వచి్చందని ఆప్ ఎంపీ సంజయ్సింగ్ అన్నారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఆర్నెల్ల పాటు తిహార్ జైల్లో గడిపిన ఆయనకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం ఆయన గురువారం రాత్రి విడుదలయ్యారు. ఆప్ కార్యకర్తలు వెంట రాగా ఓపెన్ టాప్ కార్లో ర్యాలీగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. కేజ్రీవాల్ భార్య సునీతను కలిసి ఆమెకు పాదాభివందనం చేశారు. అనంతరం పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ల నివాసాలకు కూడా వెళ్లి వారి కుటుంబీకులను పరామర్శిస్తానని చెప్పారు. మోదీ నియంత పాలనలో దేశమంతా నలిగిపోతోందంటూ దుమ్మెత్తిపోశారు. ‘‘మోదీ సర్కారు ఎంతగా వేధించినా ఆప్ బెదరబోదు. కేజ్రీవాల్ రాజీనామా చేయబోరు. 2 కోట్ల మంది ఢిల్లీవాసుల ప్రయోజనాల పరిరక్షణకు జైలు నుంచే సీఎంగా విధులు నిర్వర్తిస్తారు. ఆయన, సిసోడియా, జైన్ త్వరలోనే విడుదలవుతారు’’ అని అన్నారు. అవినీతి ఆరోపణలపై విపక్ష పాలిత రాష్ట్రాల పోలీసులు మోదీ ఇంటి తలుపు తడితే విచారణకు ఆయన సహకరిస్తారా అని సంజయ్ ప్రశ్నించారు. -
Satyendar Jain: మధ్యంతర బెయిల్ మంజూరు
సాక్షి, న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్కి ఎట్టకేలకు ఊరట లభించింది. అనారోగ్యం రిత్యా ఆయనకు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనకు ఈ కేసులో తాత్కాలిక ఉపశమనం లభించినట్లయ్యింది. సత్యేందర్ జైన్ను ఢిల్లీ వదలి వెళ్లొద్దని చెబుతూ..షరతులతో కూడిని బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. ఈ ఉత్తర్వు జూలై 11 వరకు అమలులో ఉంటుందని, అలాగే ఆయన ఆరోగ్యానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను కోర్టుకి సమర్పించాలని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. ఇదిలా ఉండగా, మనీలాండరిగ్ కేసులో గతేడాది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సత్యేందర్ జైన్ను మే 30న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలుమార్లు కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించగా ఎదురుదెబ్బలు తగులుతూ వచ్చాయి. ఇదిలా ఉంటే ఆహారపు అలవాట్ల మార్పుతో జైన్ అనారోగ్యం పాలయ్యారు. జైన్ గురువారం శ్వాసకోసం ఇబ్బందులతో అకస్మాత్తుగా జైల్లో కళ్లుతిరిగి పడిపోయారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆయన్ని హుటాహుటినా జయప్రకాశ్ నారాయణ ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు.. అనారోగ్యం రిత్యా జైన్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. (చదవండి: జైల్లో కుప్పకూలిన జైన్) -
కోర్టులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఊరట
ఇస్లామాబాద్ కోర్టులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఊరట లభించింది. తనపై నమోదైన తీవ్రవాద ఆరోపణలకు చెందిన ఎనిమిది కేసుల్లో బెయిల్ లభించింది. ఇస్లామాబాద్లోని ఉగ్రవాద నిరోధక కోర్టు మంగళవారం ఇమ్రాన్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇమ్రాన్కు పాక్ మిలటరీ, ప్రభుత్వం నుంచి కాస్తా ప్రశాంతత దక్కినటైంది. కాగా పీటీఐ చీఫ్కు 8 వరకు బెయిల్ లభించిందని ఆయన న్యాయమూర్తి మహమ్మద్ అలి బోఖారి తెలిపారు. కాగా పాకిస్థాన్ ప్రధానిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారని ఇమ్రాన్ ఖాన్పై దాదాపు 150 కేసులు నమోదయ్యాయి. పదవిలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అల్ ఖదీర్ ట్రస్ట్ కేసును విచారిస్తున్న ‘నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో’ ముందు ఇమ్రాన్ హాజరు కావాల్సి ఉంది. అయితే విచారణకు ముందే మళ్లీ తనని అరెస్టు చేసే అవకాశం 80 శాతం ఉందని పీటీఐ చీఫ్ హెచ్చరించారు. ఒకవేళ తనను కస్టడీలోకి తీసుకున్నా శాంతియుతంగా ఉండాలని ఆయన తన మద్దతుదారులకు సూచించారు. ఇదిలా ఉండగా అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసుకు సంబంధించి నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో ముందు హాజరు కావడానికి కొన్ని గంటల ముందు ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ అకౌంటబిలిటీ కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందింది. మే 31 వరకు బెయిల్ మంజూరు చేసింది. చదవండి: విపత్తు దిశగా పాక్.. పిరికిపందల్లా పారిపోను: ఇమ్రాన్ ఖాన్ -
రూ.100 కోట్ల వసూళ్ల కేసులో మాజీ మంత్రికి ఊరట
ముంబై: నెలకి రూ.100 కోట్లు వసూళ్లకు సంబంధించిన కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్కు ఊరట లభించింది. ఆయన బెయిల్ మంజూరుపై స్టే పొడగించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది బాంబే హైకోర్టు. దీంతో ఆయన బుధవారం జైలు నుంచి విడుదలకు మార్గం సుగమమైంది. డిసెంబర్ 12న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేత అనిల్ దేశ్ముఖ్కు జస్టిస్ ఎంఎస్ కర్నిక్ బెయిల్ మంజూరు చేశారు. అయితే, సుప్రీం కోర్టులో సవాల్ చేసేందుకు 10 రోజుల సమయం కావాలని సీబీఐ కోరింది. దీంతో ఆయన విడుదల వాయిదా పడింది. గత వారం సీబీఐ అభ్యర్థన మేరకు డిసెంబర్ 27 వరకు బెయిల్పై స్టే విధించింది బాంబే హైకోర్టు. సీబీఐ సుప్రీం కోర్టుకు వెళ్లినప్పటికీ సర్వోన్నత న్యాయస్థానం శీతాకాల సెలవుల్లో ఉంది. దీంతో కేసు విచారణ 2023, జనవరిలోనే జరగనుంది. దీంతో మరోసారి స్టే పొడిగించాలని కోరింది దర్యాప్తు సంస్థ. కానీ అందుకు హైకోర్టు నిరాకరించింది. బెయిల్పై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించిన క్రమంలో మాజీ మంత్రి దేశ్ముఖ్ బుధవారం జైలు నుంచి విడుదలవుతారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. ఇదీ కేసు.. అనిల్ దేశ్ముఖ్ మహారాష్ట్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి రూ.100 కోట్లు వసూలు చేయాలని పోలీసులను ఆదేశించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో మనీలాండరింగ్ కేసులో గతేడాది నవంబర్లో ఈడీ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఆ తర్వాత అవినీతి ఆరోపణల కేసులో సీబీఐ అదుపులోకి తీసుకుంది. మనీలాండరింగ్ కేసులో గత అక్టోబర్లోనే బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ కేసులో స్పెషల్ కోర్టు ఆయనకి బెయిల్ నిరాకరించింది. దీంతో బెయిల్ కోసం ఎన్సీపీ నేత హైకోర్టును ఆశ్రయించారు. ఇదీ చదవండి: మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్కు బెయిల్ మంజూరు .. క్షణాల్లోనే షాక్! -
మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్కు బెయిల్ మంజూరు.. అంతలోనే
ముంబై: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దాఖలు చేసిన అవినీతి, అధికార దుర్వినియోగం కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్కు బాంబే హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుపై ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఏకసభ్య ధర్మాసనం వెల్లడించింది. అలాగే సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని పేర్కొంది. అయితే బెయిల్ మంజూరు చేసిన కొద్ది క్షణాలకే ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు సమయం కావాలని సీబీఐ హైకోర్టును కోరింది. దీనిపై స్పందించిన హైకోర్టు జస్టిస్ కార్నిక్.. అనిల్ దేశ్ముఖ్ బెయిల్ ఆర్డర్పై 10 రోజులపాటు స్టే విధిస్తున్నట్లు తెలిపారు. ఈ చర్యను దేశ్ముఖ్ తరఫున న్యాయవాదులు అనికేత్ నికమ్, ఇంద్రపాల్ సింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. బెయిల్ ఉత్తర్వులు ఏడు రోజుల్లో అమల్లోకి వచ్చేలా చూడాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. అయితే తన ఆర్డర్ను సవాల్ చేసుకోవాలంటూ జస్టిస్ పేర్కొన్నారు. కాగా 71 ఏళ్ల దేశ్ముఖ్కు అనిల్ దేశ్ముఖ్ మహారాష్ట్ర హోమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి 100 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో మనీలాండరింగ్ కేసులో గతేడాది నవంబర్లో ఈడీ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఆ తర్వాత అవినీతి ఆరోపణల కేసులో సీబీఐ అదుపులోకి తీసుకుంది. అవినీతి ఆరోపణలపై సీబీఐ, మనీలాండరింగ్ కేసులో ఈడీ రెండూ దేశ్ముఖ్పై దర్యాప్తు చేస్తున్నాయి. మనీలాండరింగ్ కేసులో గత అక్టోబర్లోనే బాంబే హైకోర్టు బెయిల్ మంజురు చేసింది. సీబీఐ కేసు కేసులో స్పెషల్ కోర్టు అతనికి బెయిల్ నిరాకరించింది. దీంతో బెయిల్ కోసం ఎన్సీపీ నేత హైకోర్టును ఆశ్రయించాడు. దేశ్ముఖ్ పిటిషన్ను విచారించిన హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే సీబీఐ అభ్యర్థనతో మళ్లీ స్టే విధించింది. చదవండి: బస్సుల్లో ఉమ్మివేస్తే జరిమానా.. ఆ అధికారం కండక్టర్కే -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిలకు తెలంగాణ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి సోమవారం సిట్ ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. రూ. 3 లక్షల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ముగ్గురి పాస్పోర్టులు పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయాలని తెలిపింది. -
ఆద్యంతం ఉద్రిక్తత, ఉత్కంఠ.. షర్మిల అరెస్ట్.. బెయిల్
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా నర్సంపేటలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర సందర్భంగా సోమవారం టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగడం, ఫ్లెక్సీలు తగులబెట్టడం, ఆమె కారవాన్కు నిప్పంటించడం తదితర సంఘటనల నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త వాతావరణం..హైదరాబాద్ వేదికగా మంగళవారం కూడా కొనసాగింది. దాడికి నిరసన వ్యక్తం చేస్తూ, తనకు న్యాయం చేయాలని కోరుతూ.. దాడిలో ధ్వంసమైన కారును స్వయంగా నడుపుకుంటూ షర్మిల ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించారు. ఆమెకు మద్దతుగా పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. అయితే షర్మిలను అడ్డుకున్న పోలీసులు..ఆమె లోపల ఉండగానే కారును క్రేన్ సాయంతో పోలీస్స్టేషన్కు తరలించారు. ట్రాఫిక్కు అంతరాయం, ఇతర ఆరోపణలతో మరో పీఎస్లో షర్మిల సహా ఆరుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం, నాంపల్లి కోర్టులో హాజరుపరచడం, షర్మిల విడుదల కోరుతూ వైఎస్ విజయమ్మ నిరాహార దీక్షకు దిగడం వంటి పరిణామాలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే షర్మిలతో పాటు ఐదుగురికి న్యాయమూర్తి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేయడంతో రోజంతా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. షర్మిలను అరెస్టు చేసి తీసుకువెళ్తున్న పోలీసులు... బందోబస్తు తప్పించుకుని.. నర్సంపేటలో ఉద్రిక్తత నేపథ్యంలో షర్మిలను అదుపులోకితీసుకున్న పోలీసులు హైదరాబాద్లోని లోటస్పాండ్ నివాసానికి తరలించిన సంగతి తెలిసిందే. కాగా నర్సంపేటలో టీఆర్ఎస్ శ్రేణులు సోమవారం వైఎస్సార్ విగ్రహానికీ నిప్పుపెట్టాయి. ఈ పరిణామాల నేపథ్యంలో షర్మిల మంగళవారం పంజగుట్ట కూడలిలోని వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తారనే ప్రచారం జరిగింది. దీంతో పోలీసులు ఉదయం 10 గంటల నుంచే లోటస్ పాండ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ షర్మిల తొలుత సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అక్కడ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉంచిన ధ్వంసమైన కారును స్వయంగా నడుపుకుంటూ, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సీఎంను కలుస్తానంటూ ప్రగతి భవన్కు బయలుదేరారు. అయితే పోలీసులు షర్మిల వాహనాన్ని అడ్డుకుని కిందకు దిగాలని కోరగా ఆమె నిరాకరించారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో పోలీసులు డ్రైవింగ్ సీటులో ఉన్న ఆమెతో సహా కారును క్రేన్ సాయంతో ఎస్సార్ నగర్ పోలీసుస్టేషన్కు తరలించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్టీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్లో కూర్చున్న షర్మిల... బలవంతంగా కారు డోర్ తెరిచి.. ఎస్సార్నగర్ పోలీసుస్టేషన్ వద్ద కూడా కారు దిగేందుకు షర్మిల అంగీకరించలేదు. దీంతో పోలీసులు మారు తాళాలు తయారు చేసే వ్యక్తిని తెచ్చి కారు డోర్ను తెరిచేందుకు యత్నించినా ఫలితం దక్కలేదు. ఎట్టకేలకు అధికారులు కారు ఎడమ వైపు ముందు డోర్ను ప్లాస్టిక్ లాఠీల సాయంతో తెరిచారు. కారులో ఉన్న నలుగురు పార్టీ నేతలను ముందుగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మహిళా పోలీసులు షర్మిలను బలవంతంగా కిందకు దింపి ఠాణా లోపలకు తీసుకువెళ్లారు. ఈలోగా షర్మిలకు సంఘీభావం తెలపడానికి వైఎస్ విజయమ్మ బయలుదేరారంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆమెను లోటస్ పాండ్లోనే గృహ నిర్భంధం చేశారు. ఈ చర్యలను నిరసిస్తూ, షర్మిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విజయమ్మ నిరాహార దీక్ష చేపట్టారు. నాంపల్లి కోర్టు నుంచి బయటకు వస్తున్న షర్మిల పలు సెక్షన్ల కింద కేసు షర్మిలపై 143, (గుమిగూడటం) 341 (అక్రమ నిర్బంధం), 506 (బెదిరింపులు), 509 (మహిళ లను దూషించడం), 336 (ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగించడం), 353 (పోలీసు విధులకు ఆటంకం కలిగించడం), 382 (దొంగతనం), 149 (అక్రమ సమావేశం), 290 (పబ్లిక్ న్యూసెన్స్, దూషించడం) సెక్షన్ల కింద పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. షర్మిలతో పాటు 20 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె పీఆర్ఓ శ్రీనివాస్ సహా ఐదుగురిని అరెస్టు చేశారు. ఎస్సార్నగర్ ఠాణాకు వచ్చిన ప్రభుత్వ వైద్యులు షర్మిలకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమెను నాంపల్లిలోని 14వ ఏసీఎంఎం ఎదుట పోలీసులు హాజరుపరిచారు. రిమాండ్ విధించాలని కోరారు. అయితే షర్మిలపై తప్పుడు కేసులు పెట్టారని ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఆమెకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. న్యాయమే గెలిచింది: విజయమ్మ షర్మిలకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేసిన తర్వాత వైఎస్ విజయమ్మ దీక్ష విరమించారు. న్యాయమే గెలిచిందని, తాము చట్టాన్ని గౌరవిస్తామని ఆమె పేర్కొన్నారు. ఎస్సార్నగర్ పీఎస్కు బ్రదర్ అనిల్ షర్మిలను పరామర్శించేందుకు ఆమె భర్త అనిల్ ఎస్సార్నగర్ పీఎస్కు వచ్చారు. సమస్యలపై పాదయాత్ర చేస్తున్న షర్మిలపై దుర్మార్గంగా వ్యవహరించడం తగదన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని దీనికి తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. కార్యకర్తలపై లాఠీచార్జి షర్మిల అరెస్టు వార్తతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున ఎస్సార్ నగర్ పోలీసుస్టేషన్కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. కొందరు యువకులు స్టేషన్ ఎదురుగా ఉన్న భవ నంపైకి ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరికొందరు కార్యకర్తలు స్టేషన్లోకి దూసుకెళ్లేందుకు యత్నించగా లాఠీచార్జి చేశారు. షర్మిల అరెస్టును ఖండించిన కిషన్రెడ్డి షర్మిల అరెస్టును కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఖండించారు. ఒక మహిళ పట్ల అసభ్యకరమైన రీతిలో టీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ ప్రభుత్వం చూపుతున్న దురహంకారం చాలా అసహ్యకరమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల తన వాహనంలో ఉండగానే క్రేన్తో లాక్కెళ్లడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడమే ప్రధాన అజెండాగా టీఆఎస్ఆర్ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. కారవాన్కు నిప్పంటించిన వారిపై కేసు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం శంకరం తండా శివారులో షర్మిల కారవాన్ను అడ్డుకుని పెట్రోల్ పోసి నిప్పంటించిన వారిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. జల్లీ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు తొగరు చెన్నారెడ్డితో పాటు మరికొంత మందిపై 427, 435 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బందిపోట్ల రాష్ట్ర సమితిగా మారిపోయింది: షర్మిల అంతకుముందు ఎస్సార్నగర్ పోలీసుస్టేషన్ వద్ద షర్మిల మాట్లాడుతూ టీఆర్ఎస్పై, పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పోలీసులు గూండాల్లా మారారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలా పని చేస్తుందో టీఆర్ఎస్కు పోలీసులు అదే విధంగా పని చేస్తున్నారు. టీఆర్ఎస్ బందిపోట్ల రాష్ట్ర సమితిగా మారిపోయింది. ఒక ఆడ పిల్లను ఈ విధంగా అరెస్టు చేయించడం సీఎం కేసీఆర్కు తగునా? నన్ను బలవంతంగా ఎందుకు అరెస్టు చేశారో ప్రజలకు చెప్పాలి. అసలు నాపై ఎందుకు దాడి చేస్తున్నారు. పాదయాత్రను కావాలనే అడ్డుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అడ్డుకుంటారా? టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతిని ప్రశ్నించకూడదా? అవినీతిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా?’ అంటూ షర్మిల ధ్వజమెత్తారు. షర్మిల అరెస్టు తీరుపై గవర్నర్ ఆందోళన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్, అందుకు దారి తీసిన పరిణామాల పట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తంచేశారు. షర్మిల అరెస్టు తీరు పట్ల, ఆమె భద్రత, ఆరోగ్య పరిస్థితిపై ఆవేదన వ్యక్తంచేశారు. షర్మిల లోపల ఉండగా, కారును లాక్కుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు కలవరపెట్టినట్లు తెలిపారు. రాజకీయ నేపథ్యం, భావజాలం ఏదైనా కావచ్చు.. మహిళా నాయకులు, మహిళా కార్యకర్తల పట్ల గౌరవంగా వ్యవహరించాల్సిన అవసరముందని గవర్నర్ పేర్కొన్నారు. -
రౌత్ అరెస్ట్ చట్టవ్యతిరేకం
ముంబై: ముంబైలోని గోరేగావ్లో పాత్రా ఛావల్(సిద్దార్థ్ నగర్) పునర్నిర్మాణాభివృద్ధి ప్రాజెక్టులో మనీ లాండరింగ్ అభియోగాలపై అరెస్టయి కారాగారంలో గడుపుతున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. కేసు వాదనల సందర్భంగా ముంబైలోని ప్రత్యేక కోర్టు జడ్జి ఎంజీ దేశ్పాండే.. కేసును దర్యాప్తుచేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ‘ ఈడీ ముందు హాజరయ్యేందుకు రౌత్ సమయం కావాలన్నారు. అంతలోపే అరెస్ట్చేయడం చట్టవ్యతిరేకం. ప్రధాన నిందితులైన హౌజింగ్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్టక్చర్(హెచ్డీఐఎల్)కు చెందిన రాకేశ్ వధవాన్, సారంగ్ వధవాన్లను ఇంతవరకు ఎందుకు అరెస్ట్చేయలేదు? మహారాష్ట్ర హౌజింగ్, ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(ఎంహెచ్ఏడీఏ) అధికారులను ఎందుకు అరెస్ట్చేయలేదో కారణం చెప్పలేదు. కేసులో మరో నిందితుడు ప్రవీణ్ రౌత్ను ఈ కేసుతో సంబంధం లేకుండా సివిల్ వివాదంలో అరెస్ట్చేశారు. సంజయ్ రౌత్ను ఎలాంటి కారణం లేకుండా అరెస్ట్చేశారు’ అని జడ్జి వ్యాఖ్యానించారు. తర్వాత సంజయ్, ప్రవీణ్లకు బెయిల్ మంజూరుచేస్తూ ఉత్తర్వులిచ్చారు. దీంతో బుధవారం రాత్రి సంజయ్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి విడుదలయ్యారు. కోర్టు ఉత్తర్వులను బాంబే హైకోర్టులో సవాల్ చేయాలని ఈడీ భావిస్తోంది. -
శివసేన సంజయ్ రౌత్కు బెయిల్ మంజూరు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు బెయిట్ మంజూరైంది. పీఎంఎల్ఏ కోర్టు సంజయ్ రౌత్కు బెయిల్ ఇచ్చింది. కాగా, సంజయ్ రౌత్.. భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంజయ్ రౌత్ 100 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. జూలై 31వ తేదీన సంజయ్ రౌత్ను ఈడీ అరెస్ట్ చేసింది. -
జర్నలిస్టు సిద్దిఖికి బెయిల్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ జైల్లో రెండేళ్లుగా మగ్గిపోతున్న కేరళ జర్నలిస్టు సిద్దిఖి కప్పన్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతీవ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందన్న అత్యున్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ హథ్రాస్లో 2020 సెప్టెంబర్లో 19 ఏళ్ల దళిత యువతి సామూహిక అత్యాచారానికి గురై మరణించిన దుర్ఘటనని కవర్ చేయడానికి వెళుతున్న సిద్దిఖిని యూపీ పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఉగ్రవాద సంస్థలకు ఆయన నిధులు అందిస్తారన్న ఆరోపణలపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిషేధ చట్టం (యూఏపీఏ) కింద అదుపులోనికి తీసుకున్నారు. మూడు రోజుల్లోగా కప్పన్ను ట్రయల్ కోర్టులో హాజరు పరిచి ఆ తర్వాత బెయిల్పై విడుదల చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ ఆధ్వర్యంలోని సుప్రీం బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆరువారాలు కప్పన్ ఢిల్లీలోనే ఉండాలని, ప్రతీ సోమవారం పోలీసు స్టేషన్ కావాలని షరతులు విధించింది. ఆ తర్వాత కేరళలో తన సొంత గ్రామానికి వెళ్లవచ్చునని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. 2020 సెప్టెంబర్ 14న హథ్రాస్లో ఒక దళిత యువతిపై అదే గ్రామానికి చెందిన నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. బాధితురాలి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చిన పోలీసులు అర్థరాత్రి హడావుడిగా అంతిమ సంస్కారాలు నిర్వహించడంతో అనుమానాలు రేకెత్తి నిరసనలు భగ్గుమన్నాయి. సంచలనం సృష్టించిన ఈ ఉదంతాన్ని కవర్ చేయడానికి యూపీ వెళుతుండగా మార్గమధ్యలోనే కప్పన్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే పాపులర్ ఫ్రంట్ ఇండియాతో సంబంధాలున్నాయని వాదిస్తూ వచ్చారు. -
అమ్నీషియా పబ్ కేసు: ప్రధాన నిందితుడు సాదుద్దీన్కు బెయిల్ మంజూరు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్లోని అమ్నీషియా పబ్ అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్కు బెయిల్ లభించింది. సాదుద్దీన్కు నాంపల్లి కోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. కాగా ఇప్పటికే ఈ కేసులో జువైనల్లో ఉన్న అయిదుగురు మైనర్ నిందితులకు తెలంగాణ హైకోర్టు కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా గత వారమే పబ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. చదవండి: ప్రజలారా జర పైలం.. మూడు వారాలు మస్తు వానలే! -
అమ్నీషియా పబ్ కేసు.. ఎమ్మెల్యే కొడుక్కి బెయిల్ మంజూరు
సాక్షి, హైదరాబాద్: అమ్నీషియా పబ్ రేప్ కేసులో ఎమ్మెల్యే కొడుకుకి బెయిల్ లభించింది. ఎమ్మెల్యే కొడుకు రహిల్ ఖాన్కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మొదట జువెనైల్ బోర్డు బెయిల్కు నిరాకరించడంతో.. హైకోర్టులో బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నాడు. దీంతో హైకోర్టు బుధవారం మైనర్ అయిన ఎమ్మెల్యే కొడుక్కి బెయిల్ మంజూరు చేసింది. కాగా జువైనల్ హోమ్లో ఉన్న నలుగురు నిందితులకు మంగళవారమే బెయిల్ వచ్చింది. సుమారు ఘటన జరిగిన 48 రోజుల తర్వాత ఈ కేసులోని నలుగురు మైనర్లకు జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇప్పటికే నలుగురు బెయిల్పై బయటకొచ్చారు. అయితే ఈ కేసులో A1గా ఉన్న సాదుద్ధీన్ మాలిక్కు మాత్రం బెయిల్ విషయంలో నిరాశే ఎదురైంది. ఇక రేప్ కేసులో పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. చదవండి: రాజగోపాల్రెడ్డి వ్యవహారంపై స్పందించిన రేవంత్ -
జుబేర్కు అన్ని కేసుల్లో బెయిల్.. తక్షణమే విడుదల చేయాలని ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద ట్వీట్తో అరెస్టయిన ఆల్ట్ న్యూస్ కో-ఫౌండర్ మహమ్మద్ జుబేర్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన అన్నీ కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ బెయిల్ మంజూరు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. జుబేర్ను రూ.20వేల పూచీకత్తుతో సాయంత్రం 6గంటల్లోగా కస్టడీ నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. అంతేకాదు అతనిపై నమోదైన అన్ని కేసులను ఢిల్లీ స్పెషల్ సెల్కు బదిలీ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కొత్తగా నమోదయ్యే కేసులకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. 2018లో ఓ మతానికి వ్యతిరేకంగా జుబేర్ చేసిన ట్వీట్కు సంబంధించిన కేసును ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్యే దర్యాప్తు చేస్తోంది. విచారణ సందర్భంగా జుబేర్ అరెస్టుకు సంబంధించి జస్టిస్ డీవై చంద్రచూడ్తో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జుబైర్ను తరచూ కస్టడీకి తీసుకెళ్లడానికి సరైన కారణమేమి కన్పించడం లేదని చెప్పింది. పోలీసులు అరెస్టు చేసే అధికారాన్ని మితంగా ఉపయోగించుకోవాలని హితవు పలికింది. అలాగే జుబేర్ను ట్వీట్ చేయకుండా నిషేధించాలని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. జర్నలిస్టును రాయొద్దని చెప్పడమంటే.. న్యాయవాదిని వాదించవద్దనడంతో సమానమని అభిప్రాయపడింది. ఆయన చేసే ట్వీట్లకు బాధ్యత కూడా ఆయనదే అని స్పష్టం చేసింది. వాటికి చట్టపరమైన నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. 2018 ట్వీట్కు సంబంధించి జుబేర్పై మొదట ఢిల్లీలో కేసు నమోదైంది. ఆ తర్వాత ఉత్తర్ప్రదేశ్లో ఏడు చోట్ల ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. దీంతో యూపీలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని జుబేర్ సుప్రీంను ఆశ్రయించారు. వాటన్నింటినీ ఢిల్లీకి బదిలీ చేసిన సుప్రీంకోర్టు.. కేసులను కొట్టి వేసే విషయంపై ఢిల్లీ హైకోర్టునే సంప్రదించాలని సూచించింది. చదవండి: పోలీసులకు, గ్యాంగ్స్టర్స్కు మధ్య భీకర కాల్పులు.. సింగర్ సిద్ధూ హత్య కేసు నిందితుడు హతం! -
బెయిల్ ఇప్పిస్తాడు... స్నాచింగ్స్ చేయిస్తాడు!
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేసిన ఘరానా స్నాచర్ మహ్మద్ ఫైజల్ షా అలీ జాబ్రీ విషయంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇతడి వెనుక ఉండి కథ నడిపేది మహ్మద్ ఖలీల్గా తేలింది. వీరిద్దరినీ జ్యుడీషియల్ రిమాండ్కు తరలించిన శాలిబండ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఆసిఫ్నగర్ ప్రాంతానికి చెందిన ఫైజల్ సోదరుడు పేరున్న వైద్యుడు. ఇంటర్మీడియట్ మధ్యలో మానేసిన ఇతగాడు కొన్నాళ్లు పంజగుట్టలోని ఓ బ్యాంక్లో కంప్యూటర్ ఆపరేటర్గా పని చేశాడు. వ్యసనాలకు బానిసగా మారి తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం 2006 నుంచి చైన్ స్నాచింగ్స్ చేయడం మొదలెట్టి ఇప్పటి వరకు 138 గొలుసులు తెంపాడు. రెండుసార్లు పీడీ యాక్ట్ కూడా నమోదైంది. ఇతడు జైల్లో ఉండగా మరో ఘరానా స్నాచర్ ఖలీఫాతో పరిచయమైంది. ఇలా ఖలీఫాను కలవడానికి వచ్చే అతడి సోదరుడు ఖలీల్తోనూ స్నేహం చేశాడు. సింగిల్గా చైన్ స్నాచింగ్స్ చేసే ఫైజల్ విషయం తెలిసిన ఖలీల్ అతడిని అడ్డు పెట్టుకుని తేలిగ్గా డబ్బు సంపాదించాలని పథకం వేశాడు. దీనిని అమలులో పెట్టడం కోసం అతడికి బెయిల్ ఇప్పించి బయటకు తీసుకువచ్చాడు. ఇప్పటి వరకు ఫైజల్కు రెండుసార్లు బెయిల్ ఇప్పించిన ఖలీల్ అతడికి ఆశ్రయం ఇవ్వడంతో పాటు చైన్ స్నాచింగ్స్ చేసేలా ప్రోత్సహించాడు. ఇలా తెచ్చిన గొలుసులను అమ్మగా వచ్చిన డబ్బును ఇద్దరూ పంచుకోవడం మొదలెట్టాడు. గతంలో సుల్తాన్బజార్ పోలీసులు ఫైజల్ను అరెస్టు చేసినప్పుడు కొన్ని నేరాలు చెప్పకుండా చేసి ఆ సొత్తు కాజేశాడు. ఖలీల్ పైనా రెండు స్నాచింగ్ కేసులు ఉన్నాయి. ఒంటరిగా బైక్పై సంచరిస్తూ స్నాచింగ్స్ చేసే ఫైజల్ మహిళల మెడలోని గొలుసులు లాగడంలో సిద్ధహస్తుడు. బాధితురాలికి ఏమాత్రం గాయం కాకుండా గొలుసు తెంపేస్తాడు. నేరం చేయడానికి వెళ్లేప్పుడే తనతో మరో షర్ట్ తీసుకువెళ్తాడు. స్నాచింగ్ చేసిన తర్వాత అనువైన ప్రాంతంలో ఆగి చొక్కా మార్చుకుంటాడు. సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేసినా చిక్కకుండా ఉండేందుకు వీలున్నంత వరకు ప్రధాన రహదారిని వాడడు. రెక్కీ లేకుండా నేరం చేయడం, చొక్కా మార్చుకోవడంతో పాటు గల్లీల్లో తిరుగుతూ తప్పించుకునే ఇతడి ఆచూకీ కనిపెట్టడానికి పోలీసులు ముప్పతిప్పలు పడాల్సి వస్తుంది. ఇటీవల శాలిబండ, నారాయణగూడ, సరూర్నగర్ల్లో మూడు స్నాచింగ్స్ చేసిన ఫైజల్తో పాటు సహకరించిన ఖలీల్ను సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ చాకచక్యంగా పట్టుకుని 120 గ్రాముల బంగారం రికవరీ, నేరాలకు వాడే పల్సర్ బైక్ రికవరీ చేసింది. (చదవండి: 12 సీసీకెమెరాలు పెట్టినా...రూ.40 లక్షలు స్వాహా) -
ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ మళ్లీ అరెస్ట్.. బెయిల్ పొందిన కొద్ది సేపటికే..
గుజరాత్ ఎమ్మెల్యే, దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీని అస్సాం పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చేసిన ట్వీట్ల కేసులో జిగ్నేష్ మేవానీకి స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసిన కొద్ది గంటల్లోనే ఆయనపై కొత్త కేసు నమోదైంది. దీంతో అస్సాం పోలీసులు జిగ్నేష్ను మళ్లీ అరెస్ట్ చేశారు. అయితే ఈసారి అధికారులపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనను అరెస్టు చేశారు. అస్సాంలోని రెండు వేర్వేరు పోలీస్ స్టేషన్లలో(బార్పేట, గోల్పరా) మేవానిపై రెండు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు భారీ భద్రత మధ్య కోక్రాఝర్ జైలు నుంచి బార్పేట పోలీస్ స్టేషన్కు పోలీసులు తరలించారు. దీనిపై జిగ్నేష్ తరుపు న్యాయవాది మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీపై తాజాగా రెండు జిల్లాల్లో నమోదైన కేసుకు సంబంధించి మళ్లీ అరెస్ట్ చేయడం చాలా బాధాకరమన్నారు. ఇది జరుగుతుందని తమకు ముందే తెలుసని, దేనికైనా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కాగా ప్రధాని మోదీపై వివాదాస్పద ట్వీట్ల కేసులో తొలిసారి మేవానిని గత బుధవారం అస్సాం పోలీసులు పాలన్పూర్ పట్టణంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అస్సాం బీజేపీ నేత అరూప్ కుమార్ దే ఫిర్యాదు మేరకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మతఘర్షణలకు దారితీసేలా రెచ్చగొట్టడం వంటి కేసుల్లో అరెస్టు అయిన మేవానీని అస్సాంలోని కోక్రాఝర్లోని స్థానిక కోర్టు ఆదివారం ఒకరోజు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అనంతరం సోమవారం ఎమ్మెల్యేకు బెయిల్ మంజూరు చేసింది. అయితే జైలు నుంచి విడుదల కాకముందే మరో కేసులో బార్పేట పోలీసులు అరెస్టు చేశారు. -
లాలూ ప్రసాద్ యాదవ్కు బెయిల్ మంజూరు
పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్కు శుక్రవారం జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాణా కుంభకోణం కేసులో అరెస్టై శిక్ష అనుభవిస్తున్న లాలూకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. కాగా, లాలూ సీఎంగా ఉన్న సమయంలో 1990ల్లో బీహార్లో దాణా కుంభకోణం కేసు చోటుచేసుకుంది. ఈ కేసులో లాలూకు సీబీఐ కోర్టు ఐదేళ్ల శిక్షతోపాటు రూ. 60 లక్షల జరిమానా విధించింది. డోరండ ట్రెజరీ నుంచి రూ. 139.5 కోట్లను చట్ట విరుద్ధంగా విత్ డ్రా చేశారనే ఆరోపణల నేపథ్యంలో సీబీఐ కోర్టు శిక్ష విధించింది. ఇదిలా ఉండగా..ఈ కేసులో ఐదేళ్ల పాటు శిక్ష పడిన లాలూ ఇప్పటికే 42 నెలలు జైలులో గడిపారు. ఇది చదవండి: బ్రిటన్ ప్రధానితో విదేశాంగ మంత్రి భేటీ -
పర్మనెంట్ బెయిల్ ఇవ్వలేం
ముంబై: కోరెగావ్–భీమా అల్లర్ల కేసులో తనకు పర్మనెంట్ మెడికల్ బెయిల్ ఇవ్వాలన్న హక్కుల నేత వరవరరావు (83) విజ్ఞప్తిని బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. ఫిబ్రవరి నుంచి తాత్కాలిక మెడికల్ బెయిల్పై ఉన్న ఆయన దాన్ని మరో ఆర్నెల్ల పాటు పొడిగించాలని, ముంబైలో కాకుండా హైదరాబాద్లో ఉండేందుకు అనుమతించాలని, విచారణ పూర్తయేదాకా పర్మనెంట్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మూడు పిటిషన్లు దాఖలు చేశారు. వాటన్నింటినీ తిరస్కరిస్తున్నట్టు జస్టిస్ ఎస్బీ శుక్రే, జీఏ సనప్లతో కూడిన బెంచ్ పేర్కొంది. అయితే కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకునేందుకు వీలుగా బెయిల్ను మూడు నెలలు పొడిగించింది. వీవీలో పార్కిన్సన్ లక్షణాలు కన్పిస్తున్నాయని ఆయన తరఫు లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఆయన్ను ఉంచిన తలోజా జైల్లో వైద్య సదుపాయాలు దారుణంగా ఉన్నాయన్న వాదనతో కోర్టు ఏకీభవించింది. రాష్ట్రంలోని అన్ని జైళ్లలో సదుపాయాలపై ఈ నెలాఖరుకల్లా సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా జైళ్ల శాఖ ఐజీని ఆదేశించింది. -
యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం.. లఖీంపూర్ నిందితుడికి బెయిల్
లక్నో: ఉత్తర ప్రదేశ్లో మొదటి దశ పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా సంచలం సృష్టించిన లఖీంపూర్ సింసాత్మక ఘటనలోని నిందితుడికి బెయిల్ లభించింది. ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు, ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్ట్ లక్నో బెంచ్ గురువారం బెయిల్ మంజూరు చేసింది. గత అక్టోెబర్ 9న ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేసిన పోలీసులు విచారించి.. రిమాండ్కు తరలించారు. అయితే పలుమార్లు బెయిల్ నిరాకరించిన కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది చదవండి: PM Modi Interview: ఎన్నికల వేళ.. లఖింపూర్ ఖేరి ఘటనపై ప్రధాని ఏమన్నారంటే.. కాగా ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీలో 2021 అక్టోబర్ 3న ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ దూసుకుపోవడంతో రైతులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. దేశవ్యాప్తంగా రైతులు, పలు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. అయితే ఉద్ధేశ్య పూర్వకంగానే రైతులపైకి ఆశిశ్ మిశ్రా తన కారును పొనిచ్చాడని ఇటీవలే కమిటీ పేర్కొంది. ఈ ఘటనకు బాధ్యతగా కేంద్రమంత్రిగా ఉన్న అజయ్ మిశ్రాను వెంటనే తొలగించాలంటూ ఇప్పటికీ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. -
ఎల్గార్ కేసులో సుధాకు డిఫాల్ట్ బెయిల్
ముంబై: ఎల్గార్ పరిషత్–మావోయిస్టులతో సంబం ధాల కేసులో అరెస్టయిన ప్రముఖ మహిళా న్యాయవాది, సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్కు బాంబే హైకోర్టు బుధవారం డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. వరవరరావుతో సహా మరో 8 మంది నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సాగించిన కుట్రలో భాగస్వామిగా మారారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సుధా భరద్వాజ్ డిఫాల్ట్ బెయిల్కు అర్హులేనని ఉత్తర్వులో స్పష్టం చేసింది.బెయిల్ కండీషన్తోపాటు ఆమెను ఎప్పుడు విడుదల చేయాలన్నది ప్రత్యేక కోర్టే నిర్ణయిస్తుందని తెలిపింది. కేసు నమదైన 90 రోజుల్లోగా కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలి. దాఖలు చేయకుండా దర్యాప్తు సంస్థ 90 రోజులకు మించి నిందితుడిని తమ అదుపులో ఉంచుకోవడానికి వీల్లేదు. ఇలాంటి సందర్భాల్లో నిందితుడికి డిఫాల్ట్ బెయిల్ పొందే అర్హత ఉంటుంది. సుధా భరద్వాజ్ను 2018 ఆగస్టులో పోలీసులు అదుపులోకి తీసుకొని, గృహ నిర్బంధంలో ఉంచారు. -
మరో టీడీపీ నేతకు జస్టిస్ లలిత బెయిల్
సాక్షి, అమరావతి: టీడీపీకి చెందిన మరో నాయకుడికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత బెయిల్ మంజూరు చేశారు. ఇప్పటికే టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభికి బెయిల్ మంజూరు చేసిన జస్టిస్ లలిత.. తాజాగా ఆ పార్టీ కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మంచౌదరికి బెయిల్ ఇచ్చారు. రూ.20 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని బ్రహ్మంచౌదరిని ఆదేశించారు. మూడు వారాల పాటు బ్రహ్మంచౌదరి మంగళగిరి, తాడేపల్లి పోలీస్స్టేషన్ల పరిధిలోకి ప్రవేశించరాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె అడ్వాన్స్ ఆర్డర్ జారీ చేశారు. పట్టాభి బెయిల్ సందర్భంగా కూడా ఆమె అడ్వాన్స్ ఆర్డర్ రూపంలో ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ కార్యాలయంలో జరిగిన గొడవ సందర్భంగా అక్కడకు వెళ్లిన తనను పలువురు టీడీపీ నేతలు కులం పేరుతో దూషించి, హత్యాయత్నం చేశారంటూ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సక్రూనాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన బ్రహ్మంచౌదరి బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ లలిత సోమవారం మరోసారి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్, న్యాయవాది కేఎం కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. బ్రహ్మంచౌదరిని అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని కొట్టారని శ్రీనివాస్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన సంబంధిత కోర్టు మేజిస్ట్రేట్కు ఫిర్యాదు చేశారని, అయితే మేజిస్ట్రేట్ మాత్రం ఎలాంటి వైద్య పరీక్షలకు ఆదేశించలేదన్నారు. అంతేకాక మంగళగిరి పోలీసులు బ్రహ్మంచౌదరిని అరెస్ట్ చేసి మేడికొండూరు పోలీసులకు అప్పగించారని, భౌతిక హాని తలపెట్టాలన్న ఉద్దేశంతోనే ఇలా చేశారని ఆయన వివరించారు. విధుల్లో ఉన్న పోలీసును కులం పేరుతో దూషించారు.. పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.దుష్యంత్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. విధుల్లో ఉన్న పోలీసు అధికారిని పిటిషనర్, ఇతర టీడీపీ నేతలు కులం పేరుతో దూషించారని తెలిపారు. విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారని చెప్పారు. ఈ కేసులోనే కాక మరో మూడు కేసుల్లో కూడా బ్రహ్మంచౌదరి నిందితుడుగా ఉన్నారని వివరించారు. పోలీసుల చిత్తశుద్ధిని పరిగణనలోకి తీసుకోవాలని, మొదట హత్యాయత్నం కేసు నమోదు చేయగా, తర్వాత దానిని తొలగించారని దుష్యంత్ కోర్టు దృష్టికి తెచ్చారు. న్యాయమూర్తి జస్టిస్ లలిత స్పందిస్తూ.. పోలీసులు కొట్టారంటూ బ్రహ్మంచౌదరి గాయాలు చూపినప్పుడు మేజిస్ట్రేట్ ఎందుకు వైద్య పరీక్షలకు ఆదేశించలేదని ప్రశ్నించారు. అలా చేయకుండా కేవలం కొట్టారన్న విషయాన్ని రికార్డ్ చేసి ఊరుకోవడం ఎంత మాత్రం సబబని ప్రశ్నించారు. మేజిస్ట్రేట్ చట్ట ప్రకారమే వ్యవహరించారు... దీనికి దుష్యంత్ స్పందిస్తూ.. కొట్టారని పిటిషనర్ చెప్పగానే, దానిపై మేజిస్ట్రేట్ పోలీసుల వివరణ కోరాని, రేపు పోలీసులిచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకుంటే, షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు విచారణకు సైతం మేజిస్ట్రేట్ ఆదేశించవచ్చని తెలిపారు. చట్టం నిర్దేశించిన విధి విధానాల ప్రకారమే మేజిస్ట్రేట్ వ్యవహరించారని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ లలిత.. పిటిషనర్పై పోలీసులు నమోదు చేసిన కేసులో ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడే కేసులన్నారు. అందువల్ల అతనికి బెయిల్ మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. ఆ సమయంలో దుష్యంత్ జోక్యం చేసుకుంటూ.. రెండు మూడు వారాల పాటు మంగళగిరి, తాడేపల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో ప్రవేశించకుండా బ్ర హ్మంచౌదరిని నియంత్రిస్తూ ఉత్తర్వులివ్వాలని కోరగా.. అందుకు న్యాయమూర్తి సానుకూలం గా స్పందించారు. పిటిషనర్ గాయాలను చూపినప్పుడు వైద్య పరీక్షలకు ఎందుకు ఆదేశించలేదో ఓ నివేదికను తమ ముందుం చాలని న్యాయమూర్తి ఆదేశించారు. -
రూ.2.75 లక్షల పూచీకత్తుతో చోక్సీకి బెయిల్
న్యూఢిల్లీ: అక్రమంగా దేశంలోకి ప్రవేశించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మెహుల్ చోక్సీకి డొమెనికా హైకోర్టు సుమారు రూ.2.75 లక్షల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. వైద్య చికిత్స కోసం ఆంటిగ్వా బార్బుడాకు చోక్సీ వెళ్లేందుకు కోర్టు అనుమతినిచ్చిందని స్థానిక మీడియా తెలిపింది. దీంతో చోక్సీని ఇండియాకు తీసుకురావాలన్న యత్నాలకు విఘాతం కలిగినట్లయింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో నిందితుడైన చోక్సీ 2018 నుంచి ఆంటిగ్వాలో తలదాచుకున్నాడు. ఇటీవలే ఆయన్ను కొందరు అపహరించి డొమెనికాకు తీసుకుపోవడం కలకలం సృష్టించింది. చోక్సీ అక్రమ చొరబాటుపై మెజిస్ట్రేట్ కోర్టు ముందు జరిగే విచారణపై కూడా స్టే మంజూరు చేసింది. చికిత్స అనంతరం చోక్సీ విచారణకు హాజరుకావాల్సిందేనని, ఈ విషయంలో బెయిల్ కుదరదని తెలిపింది. -
పీటర్ పాన్ సిండ్రోమ్: అత్యాచార నిందితుడికి బెయిల్
సాక్షి, ముంబై: 'పీటర్ పాన్ సిండ్రోమ్'తో బాధపడుతున్నందును తన క్లయింట్కు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోరిన లాయర్ అభ్యర్థన మేరకు ముంబై కోర్టు పోక్సో యాక్ట్ కింద అరెస్ట్ అయిన 23 ఏళ్ల వ్యక్తికి బెయిల్ మంజూరు చేసింది. నిందితుడు 14 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడనే ఆరోపణల మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బాధితురాలినే వివాహం చేసుకున్నాడు. ఈ సంఘటన ఈ ఏడాది ఏప్రిల్లో చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నిందితుడి తరఫున లాయర్ మాట్లాడుతూ.. ‘‘నిందితుడికి, బాధితురాలికి మధ్య ఉన్న సంబంధం గురించి ఆమె కుటుంబ సభ్యులకు తెలుసు. కాకపోతే అతడు పేదవాడు కావడం, పీటర్ పాన్ సిండ్రోమ్తో బాధపడుతున్నందున వారి వివాహానికి బాధితురాలి కుటుంబం అంగీకరించలేదు. అతనిపై కక్ష్య కట్టి ఇలా కేసు నమోదు చేశారు. కానీ బాధితురాలికి అతడంటే ఇష్టం. వారిద్దరు ప్రేమించుకున్నారు. ఆమె తన ఇష్టపూర్తిగానే అతడిని వివాహం చేసుకుంది. కానీ ఆమె కుటుంబ సభ్యులు కావాలనే అతడి మీద కిడ్నాప్ కేసు పెట్టారు’’ అని కోర్టుకు తెలిపాడు. ఈ క్రమంలో కోర్టు సదరు నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులో బాలికకు వారి బంధం గురించి పూర్తిగా తెలుసని.. ఆమె స్వచ్ఛందంగానే అతడితో కలిసి ఉంటుందని పేర్కొంది. పైగా నిందితుడికి ఎటువంటి క్రిమినల్ రికార్డ్ లేదని, అతన్ని కస్టడీలో ఉంచడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని కోర్టు తెలిపింది. పీటర్ పాన్ సిండ్రోమ్... పీటర్ పాన్ అనేది నెవర్-నెవర్ ల్యాండ్ అనే పౌరాణిక ప్రదేశం నుంచి వచ్చిన కల్పిత పాత్ర. ఇక్కడ పిల్లలు ఎప్పటికీ పెరగరు. ఈ సిండ్రోమ్ ఉన్నవారు మానసికంగా సరిగా ఎదగరు. పరిపక్వత కలిగి ఉండరు.. యుక్త వయసు వారి మాదిరిగా బాధ్యతలను స్వీకరించలేరు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని మానసిక రుగ్మతగా గుర్తించలేదు. -
మదనపల్లె హత్య: నిందితులకు బెయిల్
చిత్తూరు: దేశ్యవాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె హత్య కేసులో నిందితులకు మంగళవారం బెయిల్ మంజూరైంది. మూఢనమ్మకంతో తన ఇద్దరు కుమార్తెలు (అలేఖ్య, సాయిదివ్య)ను సొంత తల్లే జనవరి 24న దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. ఆ కేసులో ప్రధాన నిందితురాలు తల్లి పద్మజ ఉండగా తండ్రి పురుషోత్తం కూడా అరెస్టయ్యాడు. జైలుకు వెళ్లిన వారికి మదనపల్లి 2వ అదనపు జిల్లా జడ్జి వారికి బెయిల్ మంజూరు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన పద్మజ, పురుషోత్తం మానసిక సమస్యలతో బాధపడుతున్నారని భావించి వారిని మొదట తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం విశాఖపట్టణంలోని మానసిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం కొద్ది రోజుల తర్వాత వారిని మదనపల్లె సబ్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆ దంపతులు అదే జైలులో ఉంటున్నారు. అయితే కేసు నమోదై 90 రోజులు పూర్తవడంతో నిందితులకు షరతులతో కూడిన బెయిల్ను కోర్టు మంజూరు చేసింది. చదవండి: పిట్టల్లా కాల్చేసిన గ్యాంగ్స్టర్.. రెండు ప్రాణాలు బలి ‘బరాత్’లో పీపీఈ కిట్తో చిందేసిన అంబులెన్స్ డ్రైవర్ -
బోయినపల్లి కేసు: 14 మందికి బెయిల్ మంజూరు
సాక్షి, హైదరాబాద్ : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులోని నిందితులకు సికింద్రాబాద్ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. 14 మందికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రతివారం పీఎస్లో సంతకం చేయాలని షరతు విధించింది. కాగా ఇప్పటికే అఖిలప్రియకు జనవరిలో కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఆమె సోదరుడు భార్గవ్రామ్ కోసం పోలీసుల గాలింపు ఇంకా కొనసాగుతోంది. చదవండి: భార్గవ్రామ్కు కోర్టులో చుక్కెదురు.. -
సుశాంత్ కేసు: రియా సోదరుడికి బెయిల్
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో ప్రధాన నిందితురాలు నటి రియా చక్రవర్తికి అక్టోబర్లో ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె సోదరుడు సోవిక్ చక్రవర్తికి కూడా ముంబై స్పెషల్ కోర్టు బుధవారం బెయిల్ మంజురూ చేసింది. అయితే సుశాంత్ మృతి కేసుతో వెలుగు చూసిన బాలీవుడ్ డ్రగ్ కేసులో రియా, ఆమె సోదరుడు సోవిక్, సుశాంత్ ఇంటి మెనేజర్ శామ్యూల్ మిరాండాతో పాటు పలువురిని సెప్టెంబర్ 4న నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రియా, ఆమె సోదరుడు సోవిక్కు డ్రగ్ ప్లెడర్లతో సంబంధాలు ఉన్నాయని వారు సుశాంత్కు డ్రగ్ కూడా సప్లై చేసినట్లు ఆధారాలు కూడా ఉన్నాయని ఎన్సీబీ అధికారులు వెల్లడించడంతో వారిని ముంబై హైకోర్టు జైలుకు తరలించింది. ఈ నేపథ్యంలో రియా, సోవిక్లు బెయిల్ కోరుతూ సెప్టంబర్ చివరి వారంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. (చదవండి: ‘అందుకే రియా, సుశాంత్ ఇంటిని వీడింది’) అయితే అక్టోబర్లో రియాకు బెయిల్ను మంజూరు చేసిన కోర్టు సోవిక్ బెయిల్ను రద్దు చేసింది. అనంతరం నవంబర్ మొదటి వారంలో సోవిక్ మళ్లీ బెయిల్ పటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈసారి సోవిక్ బెయిల్ పిటిషన్ను విచారించిన ముంబై హైకోర్టు ఎన్సీబీ అధికారులు ఇచ్చిన సాక్ష్యాలు అమోధయోగ్యం లేవని సోవిక్కు బెయిల్ మంజూరు చేసినట్లు పేర్కొంది. కాగా ఈ ఏడాది జూన్ 14వ సుశాంత్ సింగ్ ముంబైని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముంబై పోలీసులు అతడి ప్రియురాలు రియాను అనుమానిస్తూ విచారణ చేపట్టగా డ్రగ్ కేసు వెలుగు చూసింది. దీంతో ముంబై పోలీసుల ఈ కేసు విచారణను ఎన్సీబీ అధికారులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో రియాను విచారించగా ఆమెకు, సోవిక్కు డ్రగ్ ప్లెడర్లతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. ఈ విచారణలో రియా బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్, అలియా భట్, రకుల్ ప్రీత్ సింగ్ల పేర్లను కూడా చెప్పడంతో ఎన్సీబీ వారిని కూడా విచారించిన విషయం తెలిసిందే. (చదవండి: సుశాంత్ కేసు: గాబ్రియెల్లా సోదరుడు అరెస్ట్) -
డ్రగ్స్ కేసు; హాస్యనటికి బెయిల్
ముంబై: బాలీవుడ్లో మొదలైన డ్రగ్స్ దుమారం హిందీ చిత్రసీమలో కల్లోలం రేపుతోంది. ఈ కేసులో అరెస్టయిన హాస్యనటి భారతీ సింగ్, తమె భర్త హర్ష లింబాచియాలకు బెయిల్ లభించింది. ముంబై కోర్టు సోమవారం వారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శనివారం వీరి ఇంటి నుంచి 86.5 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, భారతీ సింగ్తో పాటు లింబాచియాను శనివారం అరెస్ట్ చేసిన విషయం విదితమే. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్లో మత్తుమందులు వాడుతున్నవారికి భయం మొదలైంది. స్టార్ హీరోయిన్ల దగ్గర నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్లు వరకు ఈ వరుసలో ఉన్నారు. ఇటీవల నటుడు ఆర్జున్ రాంపాల్కు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు నోటీసులు జారీచేశారు. కరోనా ప్రభావంతో సినీ పరిశ్రమ ఇప్పటికే భారీ నష్టాలను చవిచూసింది. ఇలాంటి పరిస్థితుల్లో నటులు అరెస్టు కావడం నిర్మాతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. తీరని నష్టాల మధ్య ఈ భారం మరింత పెరిగిందని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఆన్లాక్ ప్రక్రియలో భాగంగా థియేటర్లు తెరుచుకున్నా ప్రేక్షకులు ఎంత మొగ్గుచూపుతారని అర్థంకాకపోవడంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. జూన్ నెల నుంచి బడా హీరోయిన్లు ఎన్సీబీ కార్యలయం చుట్టూ తిరుగుతున్నారు. రకుల్ ప్రీత్సింగ్ మొదలుకొని దీపికా పదుకునే వంటి ఆగ్ర కథానాయికులు ఈ ఉచ్చులో చిక్కుకున్నారు. ఇప్పటికే దీపికా విచారణకు రెండుసార్లు ముంబైలోని ఎన్సీబీ కార్యలయానికి హాజరయ్యారు. సుశాంత్ మృతి కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి బైకుల్లా జైలునుంచి బెయిల్ పై విడుదల అయ్యారు. ఈ నటిపై సుశాంత్తండ్రి అనేక ఆరోపణలు చేశారు. వీటి నడుమ డ్రగ్స్ కేసులో వీరి హస్తం ఎక్కువగా ఉందని తెలియడంతో అధికారులు విచారణ వేగవంతం చేసి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై నిఘా పెట్టడం మొదలు పెట్టారు. (చదవండి: అది నా సినిమా టైటిల్.. ఇచ్చేయ్) -
అర్నాబ్కు బెయిల్
న్యూఢిల్లీ: వివాదాస్పద టెలివిజన్ వ్యాఖ్యాత అర్నాబ్ గోస్వామికి ఎట్టకేలకు బెయిల్ దక్కింది. 2018 నాటి ఓ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం, బెయిల్ దరఖాస్తును బాంబే హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో అర్నాబ్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన బెంచ్ బుధవారం ఈ అంశంపై విచారణ జరిపి అర్నాబ్తోపాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నితీశ్ సర్దా, ప్రవీణ్ రాజేశ్ సింగ్లకు రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుపై ఇంటెరిమ్ బెయిల్ మంజూరు చేసింది. తనపై మోసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని, కేసు విచారణను నిలిపివేయాలన్న అర్నాబ్ వినతులను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అర్నాబ్ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు బాంబే హైకోర్టు తీరును తీవ్రంగా తప్పుపట్టింది. ‘‘బెయిళ్లు ఇవ్వకుండా..వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం సరికాదు’’ అని వ్యాఖ్యానించింది. -
రియాకు బెయిల్
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకి సంబంధించిన డ్రగ్స్ కేసులో నటి రియాచక్రవర్తికి ముంబై హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. 28 రోజుల జైలు జీవితం తరువాత, రియా చక్రవర్తి బైక్యులా మహిళా జైలు నుంచి బుధవారం విడుదలయ్యారు. రూ.1లక్ష వ్యక్తిగత బాండు, ప్రతిరోజూ పోలీస్ స్టేషన్లో సంతకం చేయడం, ఆరు నెలల పాటు, ప్రతినెలా ఒకటవ తారీకున ఎన్సీబీ ముందు హాజరుకావడంతోపాటు సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నం చేయరాదని హైకోర్టు షరతులు విధించింది. రియా ఎన్సీబీ అనుమతి లేకుండా, ముంబై వీడి వెళ్ళరాదని, విదేశాలకు వెళ్ళాలనుకుంటే స్పెషల్ ఎన్డీపీఎస్ కోర్టు అనుమతి తీసుకోవాలని హైకోర్టు షరతులు విధించింది. రియాకు నేర చరిత్ర లేదని, కనుక రియా సాక్ష్యాలను తారుమారు చేస్తారని తాము భావించడం లేదని బెయిలు ఆదేశాల్లో కోర్టు పేర్కొంది. చట్టం ముందు అందరూ సమానమేనని, సెలబ్రిటీలకీ, రోల్ మోడల్స్కీ ప్రత్యేక హక్కులేవీ ఉండవని హైకోర్టు వ్యాఖ్యానించింది. రియా విడుదల సందర్భంగా, మీడియా ఆమె వెంటబడటం, ఆమె వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించడం సహించబోమని ముంబై పోలీసులు మీడియాని హెచ్చరించారు. రాజ్పుత్ వ్యక్తిగత సహాయకులు దీపేష్ సావంత్, సామ్యూల్ మిరిండాలకు హైకోర్ట్ బెయిలు మంజూరు చేసింది. రియా సోదరుడు షోవిక్, డ్రగ్ స్మగ్లర్ అబ్దెల్ బాసిత్ పరిహార్లకు కోర్టు బెయిల్ ఇవ్వలేదు. -
రియాకు బెయిల్: ముంబై పోలీసుల వార్నింగ్
ముంబై: డ్రగ్స్ వ్యవహారంలో అరెస్టైన నటి రియా చక్రవర్తికి బుధవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ముంబై పోలీసులు మీడియాకు హెచ్చరికలు జారీచేశారు. ఇప్పటికే మీడియా రియా చక్రవర్తి విషయంలో పరిమితికి మించి ఉత్సాహం కనబరిచి ఇబ్బందులకు గురి చేసిన విషయం తెలిసిందే. రియా బెయిలుపై జైలు నుంచి బయటకు వచ్చే సందర్భంలో మీడియా ఆమె వాహనాన్ని వెంబడించరాదని పోలీసులు హెచ్చరించారు. ఆమెపై సంబంధం లేని ప్రశ్నలు అడగవద్దని సూచించారు. మీరు (జర్నలిస్టులు,రిపోర్టర్లు) సదరు సెలబ్రిటీలను, వారి న్యాయవాదులను ఇంటర్వ్యూ చేయాలనే ఉద్దేశంతో వారి వాహనాలను వెంబడించరాదని పేర్కొన్నారు. చదవండి: (రియా చక్రవర్తికి బెయిలు మంజూరు.. కానీ) వాహనాలను వెంబడించడం నేరమని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముంబై పోలీసు డిప్యూటీ కమిషనర్ సంగ్రామ్సింగ్ నిశాందర్ తెలిపారు. అలా చేయడం వల్ల మీ జీవితాలతోపాటు, రోడ్ల మీద నడుస్తున్న సాధారణ ప్రజల జీవితాలకు అపాయం కలుగుతుందని పేర్కొన్నారు. సెలబ్రిటీల వాహనాలను వెంబడించే క్రమంలో డ్రైవర్తో పాటు, వారిని ప్రేరేపించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. బుధవారం రియా బెయిలు పిటిషన్పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు ఆమెకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. అరెస్టైన రియా సుమారు నెల రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఉన్నారు. డ్రగ్స్ కేసులో మీడియా తనపై అసత్య ప్రచారం జరుపుతోందని వాటిని వెంటనే ఆపాలంటూ నటి రకుల్ ప్రీత్సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. -
ఢిల్లీ అల్లర్లు: జామియా విద్యార్థినికి బెయిల్
న్యూఢిల్లీ : జామియా విశ్వవిద్యాలయ విద్యార్థి, కార్యకర్త సఫూరా జర్గర్కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈశ్యాన్య ఢిల్లీ అల్లర్ల కేసులో గర్భిణి అయిన సఫూరాను ఢిల్లీ పోలీసులు ఉగ్రవాద నిరోధక చట్టం(ఉపా) కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా స్టిస్ రాజీవ్ షాక్ధర్ ఈ పిటిషన్ విచారణను చేపట్టారు. సఫూరా జర్గర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై మంగళవారం ఢిల్లీ పోలీసుల తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం తెలపకపోవడంతో ఢిల్లీ హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. (సుశాంత్ కుక్క మరణం: నిజమేనా?) అయితే ఢిల్లీ అల్లర్ల కేసు దర్యాప్తుకు ఆటంకం కలిగించే ఏ చర్యలకు పాల్పడవద్దని హైకోర్టు సఫూరా జర్గర్ను ఆదేశించింది. ఢిల్లీ విడిచి వెళ్లవద్దని, ఒకవేళ వెళ్లాలి అనుకుంటే కోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తు అధికారిని కనీసం 15 రోజులకొకసారి ఒక్కసారి ఫోన్లో సంప్రదించాలని కోర్టు ఆదేశించింది. జేఎమ్ఐలో ఎంఫిల్ విద్యార్థి అయిన సంఫూరా జామియా కోఆర్డినేషన్ కమిటీ సభ్యురాలు. అంతేగాక ఆమె ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి. ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో ఏప్రిల్లో సఫూరాను పోలీసులు అరెస్టు చేశారు. (ఢిల్లీ పోలీసులకు రాష్ట్ర హైకోర్టు క్లాస్!) -
అతడికి బెయిల్ వచ్చింది..
ముంబై : బాలీవుడ్ నటుడు, హిందీ బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ అజాజ్ ఖాన్కు బెయిల్ లభించింది. బాంద్రా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. పూచీకత్తుగా లక్ష రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. పరువు నష్టం, ద్వేషపూరిత ప్రసంగం, నిషేధ ఉత్తర్వుల ఉల్లంఘన ఆరోపణలతో సైబర్ పోలీసులు ఏప్రిల్ 18న అజాజ్ ఖాన్ను అరెస్ట్ చేశారు. అతడిపై ఐపీసీ 153(ఏ), 121, 117, 188, 501, 504, 505(2) కింద ఖర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఫేస్బుక్ లైవ్ ఇంటరాక్షన్లో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా అతడు మాట్లాడినట్టు ముంబై పోలీసులు ఆరోపించారు. ‘ఒక చీమ చనిపోయినా ముస్లింలదే బాధ్యత. ఒక ఏనుగు చనిపోయినా ముస్లింలదే బాధ్యత. ఢిల్లీలో భూకంపం వచ్చినా ముస్లింలే కారణమంటారు. దేశంలో ఏ ఘటనా జరిగినా ముస్లింల మీదే అభాండం వేస్తారు. అయితే ఈ కుట్రకు ఎవరు కారణమని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?’ అని ఫేస్బుక్ లైవ్ ఇంటరాక్షన్లో అతడు మాట్లాడినట్టు పోలీసులు తెలిపారు. అజాజ్ ఖాన్ గతంలో కూడా అనేక పర్యాయాలు అరెస్టయ్యాడు. 2016లో ఓ బ్యూటీషియన్ను లైంగికంగా వేధించిన కేసులో, 2018లో డ్రగ్స్ కేసులో అతడు కటకటాల పాలయ్యాడు. హిందీ బిగ్బాస్ 7 సీజన్లో పాల్గొన్న అజాజ్ ఖాన్.. పలు బాలీవుడ్ సినిమాలతో పాటు దూకుడు, బాద్షా, హార్ట్ ఎటాక్, నాయక్, టెంపర్ వంటి తెలుగు చిత్రాల్లోనూ నటించాడు. ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి -
రేవంత్రెడ్డికి బెయిల్
సాక్షి, హైదరాబాద్/కుషాయిగూడ: ప్రముఖుడి నివాసంపై డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారన్న అభియోగాల కేసులో అరెస్టయిన మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డికి బుధవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని, రాజేంద్రనగర్ కోర్టు నిర్ణయించిన మొత్తానికి మరో ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని షరతులు విధించింది. దర్యాప్తునకు అధికారులకు సహకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. బుధవారం ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి బెయిల్ ఉత్తర్వులు జారీ చేశారు. నాటకీయ పరిణామాల మధ్య.. చర్లపల్లి జైల్లో ఉన్న రేవంత్రెడ్డికి బెయిల్ రావడంతో బుధవారం భారీ బందోబస్తు నడుమ పోలీసులు అతన్ని జైల్ నుంచి తరలించారు. రేవంత్కి బెయిల్ మంజూరైన విష యం తెలిసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమాను లు చర్లపల్లి జైల్ వద్దకు తరలిరావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రేవంత్రెడ్డి తరçఫున వాదించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ను కలిసి వచ్చిన మాజీ ఎంపీ మల్లురవిని పోలీసులు చక్రిపురం చౌరస్తాలో అడ్డుకున్నారు. ఈ క్రమంలో మల్లురవికి పోలీసులకు నడుమ తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇక ఇక్కడే ఉండి పోరాటం చేస్తా: రేవంత్ ఢిల్లీ వెళ్లకుండా హైదరాబాద్లోనే ఉంటానని, ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్పై పోరాటం చేస్తానని రేవంత్రెడ్డి అన్నారు. జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియాతో రేవంత్రెడ్డి మాట్లాడారు. ఈ పోరాటం నా వ్యక్తిగతం కాదని, రెండు నెలల క్రితం కేసీఆర్ అవినీతిని బయటపెట్టాలని రాష్ట్ర ఇన్చార్జి కుంతియా తనకు బాధ్యతలు అప్పగించారన్నారు. కుంతియా ఆదేశాల మేరకు జన్వాడలోని కేటీఆర్ ఫామ్హౌజ్ను ప్రజలకు చూపించానన్నారు. -
సదాఫ్ జాఫర్కు బెయిల్
లక్నో: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక ఆందోళన సందర్భంగా లక్నోలో జరిగిన హింసాత్మక ఘటనల వెనక సామాజిక కార్యకర్త సదాఫ్ జాఫర్ ప్రత్యక్ష పాత్ర ఉందని నిరూపించడంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు విఫలమయ్యారు. దీంతో లక్నో సెషన్స్ కోర్టు శనివారం ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సదాఫ్ జాఫర్తో పాటు మాజీ ఐపీఎస్ అధికారి ఎస్ఆర్ దారపూరి, మరో పదిమందికి బెయిల్ మంజూరు చేస్తూ అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఎస్ఎస్ పాండే ఉత్తర్వులిచ్చారు. రూ. 50 వేలు చొప్పున వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని నిందితులను ఆదేశించారు. గత డిసెంబర్ 19న లక్నోలో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన సందర్భంగా అల్లర్లు చోటుచేసుకోవడంతో వీరందరిని పోలీసులు అరెస్టు చేసి ఐఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. రేపు (ఆదివారం) కోర్టుకు సెలవు కావడంతో సోమవారం వీరందరూ బెయిల్పై విడుదల కానున్నారు. సదాఫ్కు బెయిల్ మంజూరు చేయడంతో కోర్టుకు ఆమె తరపు న్యాయవాది హర్జ్యోత్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. (నన్ను అన్యాయంగా అరెస్టు చేశారు: సదాఫ్ జాఫర్) కాగా, జాఫర్పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ ఆమె తరపు న్యాయవాది హర్జ్యోత్ సింగ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను గురువారం విచారించిన అలహాబాద్ హైకోర్టు.. దీనిపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు పర్యవేక్షణలో ఎస్పీ హోదాలో ఉన్న అధికారితో ఈ కేసును దర్యాప్తు చేయించాలని కూడా పిటిషనర్ కోరారు. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. -
ఈడీ కేసులో చిదంబరానికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియాకు సంబంధించి ఈడీ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో చిదంబరానికి బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్ధానం బుధవారం తీర్పు వెలువరించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. మీడియాతో మాట్లాడరాదని, పాస్పోర్టును సమర్పించాలని చిదంబరాన్ని జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని సుప్రీం బెంచ్ ఆదేశించింది. ఈ కేసులో తనకు బెయిల్ నిరాకరిస్తూ నవంబర్ 15న ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, ఐఎన్ఎక్స్ మీడియా మనీల్యాండరింగ్ కేసులో ఆగస్ట్ 21న చిదంబరం అరెస్ట్ కాగా, సీబీఐ కేసులోనూ ఆయనకు ఇప్పటికే బెయిల్ లభించింది. ఇక అరెస్ట్ అయిన అనంతరం 105 రోజుల తర్వాత ఈడీ కేసులోనూ బెయిల్ లభించింది. -
కాపీ పేస్ట్ వాదనలు వద్దు
న్యూఢిల్లీ : మనీ ల్యాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీ.కే.శివకుమార్కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ పిటిషన్ విచారణను శుక్రవారం చేపట్టిన జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, ఎస్. రవీంద్రభట్ లతో కూడిన బెంచ్ ఈడీ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాపై తీవ్రస్థాయిలో విరుచుకుప డింది. కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో కాంగ్రెస్ నాయకుడు శివకుమార్కు బదులుగా, అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అని పేర్కొనడాన్ని దుయ్యబట్టింది. పి. చిదంబరం కేసుకు సంబంధించిన కోర్టు డాక్యుమెంట్లలో వాదనలను యధాతథంగా శివకుమార్ కేసులో కాపీ పేస్ట్ చేయడమేంటని నిలదీసింది. పౌరులను మీరు గౌరవించే పద్ధతి ఇదేనా అంటూ ప్రశ్నించింది. చిదంబరానికి సుప్రీంలో నిరాశ ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈడీ దాఖలు చేసిన ఈ కేసులో ఆయనపై ఉన్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, అందులో చిదంబరం ప్రమేయం ఉన్నట్టుగా ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తోందని పేర్కొంది. చిదంబరానికి బెయిల్ ఇస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళతాయని వ్యాఖ్యానించింది. -
జైలు నుంచి వచ్చిన డీకేకు ఘనస్వాగతం
సాక్షి, బెంగళూరు: యాభై రోజులపాటు జైల్లో గడిపి తిరిగి బెంగళూరు చేరుకున్న కాంగ్రెస్ మాజీ మంత్రి డీకే శివకుమార్కు ఘన స్వాగతం లభించింది. అభిమానులు భారీ సంఖ్యలో చేరుకొని ఆయనకు స్వాగతం పలికారు. మనీ ల్యాండరింగ్ కేసులో ఆయనను ఈడీ అరెస్ట్ చేసి తీహార్ జైల్లో ఉంచిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయనకు షరతులతో కూడిన బెయిలు మంజూరైంది. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన బెంగళూరు విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి భారీ ర్యాలీ మధ్య నగరంలోని కేపీసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. సిద్ధరామయ్య, పరమేశ్వర్ తదితరులు ఈ కార్యక్రమానికి రాలేదు. -
పశుగ్రాస స్కాంలో లాలూకు ఊరట
రాంచీ : బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్కు దియోగఢ్ ట్రెజరీకి సంబంధించిన పశుగ్రాస కుంభకోణంలో జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో బెయిల్ కోసం లాలూ అప్పీళ్లను కోర్టు పలుమార్లు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో జూన్ 13న ఆర్జేడీ చీఫ్ లాలూ జార్ఖండ్ హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో సుప్రీం కోర్టు సైతం లాలూ ప్రసాద్ బెయిల్ వినతిని తిరస్కరించింది. లాలూ బెయిల్పై స్పందించాలని కోర్టు సీబీఐని కోరగా, లాలూకు బెయిల్ ఇవ్వడం తగదని సీబీఐ తీవ్రంగా ఆక్షేపించింది. పశుగ్రాస కుంభకోణం కేసుల్లో దోషిగా తేలిన లాలూకు న్యాయస్ధానం 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తీవ్ర అస్వస్ధతతో బాధపడుతున్న లాలూ ప్రస్తుతం రాంచీలోని రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. దియోగఢ్ ట్రెజరీ పశుగ్రాస కేసులో లాలూకు బెయిల్ లభించినా ఇదే స్కామ్కు సంబంధించి మరో కేసులో విచారణ న్యాయస్ధానంలో పెండింగ్లో ఉండటంతో లాలూ జైలులోనే గడపాల్సిన పరిస్ధితి నెలకొంది. -
ఐటీ గ్రిడ్స్ స్కాం : అశోక్కు బెయిల్ మంజూరు
సాక్షి, హైదరాబాద్ : ఏపీ ప్రజల వ్యక్తిగత డాటాను చోరీ చేసిన కేసులో నిందితుడైన ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్కు బెయిల్ మంజూరు అయింది. షరతులతో కూడిన బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. వారానికి ఒక రోజు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని ఆశోక్ను ఆదేశించింది. అత్యంత కీలకమైన ఓటర్, ఆధార్, వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేశారని ఐటీ గ్రిడ్స్పై డేటా విశ్లేషకులు టి.లోకేశ్వర్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అశోక్పై సంజీవ్రెడ్డినగర్, మాదాపూర్ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. -
కత్తుల రవికి బెయిల్ మంజూరు
పశ్చిమగోదావరి : వైఎస్సార్సీపీ నేత కత్తుల రవికుమార్కు సొంత పూచీకత్తుపై ఏలూరు రెండవ అదనపు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై కేసు నమోదు చేయకుండా ఆయన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వైఎస్సార్సీపీ నేత రవికుమార్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. అరెస్ట్ అనంతరం పొద్దున్నుంచి ఏలూరు వీధుల్లో, సందుల్లో తిప్పుతూ బెదిరింపులకు పాల్పడుతూ చివరికి ఏలూరు రెండవ అదనపు కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి సొంతపూచీకత్తుపై బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు. బెయిల్పై బయటికి వచ్చిన రవిని వైఎస్సార్సీపీ నేతలు మాజీ మంత్రి మరడాని రంగా రావు, కొఠారు రామచంద్రరావు, కొయ్యే మోషెన్ రాజు, దళిత సంఘాల నేతలు కలిసి సంఘీభావం తెలిపారు. ‘నేను ఏ తప్పూ చేయలేదు’ వినాశకాలే ‘విప్’రీత బుద్ధి -
సీబీఐ డీఎస్పీ దేవేందర్ కుమార్కు బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ డీఎస్పీ దేవేందర్ కుమార్కు ఢిల్లీ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాపై ముడుపుల ఆరోపణల కేసుకు సంబంధించి అరెస్టయిన దేవేందర్ కుమార్కు సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి సంతోష్ స్నేహి మన్ రూ 50,000 వ్యక్తిగత పూచీ కత్తుపై బెయిల్ మంజూరు చేశారు. తనను నిర్బంధించడం అక్రమమని, తనకు విముక్తి కల్పించాలని కోరుతూ కుమార్ ఢిల్లీ కోర్టులో బెయిల్ దరఖాస్తులో పేర్కొన్నారు. బెయిల్ ఇచ్చే క్రమంలో తనకు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని కూడా కుమార్ కోర్టుకు నివేదించారు. కాగా తమపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ చట్టబద్ధతను కుమార్, ఆస్ధానాలు ఇప్పటికే న్యాయస్ధానంలో సవాల్ చేశారు. ఈ కేసులో వీరితో పాటు మనోజ్ ప్రసాద్, సోమేష్ ప్రసాద్లను సైతం నిందితులుగా చేర్చారు. మరో కేసులో సాక్ష్యాలను రూపుమాపేందుకు కుమార్ ప్రయత్నించాడని దర్యాప్తు ఏజెన్సీ కోర్టుకు తెలిపింది. సీబీఐలో సీనియర్ అధికారుల మధ్య వివాదంలో తనను ఇరికించడంతో తాను బాధితుడు అయ్యానని కుమార్ పేర్కొన్నారు. -
మాజీ మేయర్ సంజయ్కు బెయిల్
నిజామాబాద్ లీగల్(నిజామాబాద్ అర్బన్) : ఇందూరు నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. రూ. 25వేలకు సమానంగా వ్యక్తిగత బాండ్ తో పాటు అదే మొత్తంలో ఇద్దరు వ్యక్తుల జమానాత్లు సమర్పించాలని ఎస్సీ, ఎస్టీల అత్యాచారాల నిరోధక విచారణ న్యాయస్థానం ప్రత్యేక జడ్జి జీఎస్. రమేష్కుమార్ గురువారం ఉత్తర్వులు జా రీ చేశారు. శాంకరీ కళాశాల విద్యార్థినులపై లైంగి క వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై సంజయ్ను నిజామాబాద్ నాల్గోటౌన్ పోలీసులు ఈనె ల 12న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్కు తరలించింది. 19 రోజుల తర్వా త సంజయ్ తరపున్యాయవాదులు ఆకుల రమేష్, కృపాకర్రెడ్డి రెండుసార్లు బెయిల్ పిటిషన్లు దాఖ లు చేశారు. కేసు విచారణ దశలో ఉన్నందున జడ్జి పిటిషన్లను తిరస్కరించారు. గురువారం సంజయ్ న్యాయవాదులు మరోసారి తమ వాదనలు వినిపించారు. ఈ కేసులో 16 మంది సాక్షులను విచారించి, వాంగ్మూలాలను సేకరించారని, సీపీసీ సెక్షన్ 164 ప్రకారం మున్సిఫ్ మేజిస్ట్రేట్ ముందు బాధిత విద్యార్థినులు వాంగ్మూలాలను నమోదు చేశారని బెయిల్ ఉత్తర్వులో జడ్జీ పెర్కోన్నారు. సంజయ్ నిజామాబాద్లోని నాల్గోటౌన్ పోలీస్స్టేషన్లో ప్రతి సోమ,గురువారాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య హాజరుకావాలని, ఈ కేసులో విచారణాధికారి ఏసీపీ అనుమతి లేకుండా నిజామాబాద్ విడిచి పోరాదని, విచారణలో పోలీసులకు సహకరించాలని ఉత్తర్వుల్లో జడ్జి ఆదేశించారు. సంజయ్ విడుదలకు ఆర్డర్ కాపీని జిల్లా జైలుకు పంపారు. న్యాయవాదులు ఆకుల రమేష్, కృపాకర్రెడ్డి మాట్లాడుతూ సంజయ్ బెయిల్ కోసం తమ వాదనలతో జడ్జి ఏకీభవించి బెయిల్ మంజూరు చేశారన్నారు. తమ క్లయింట్ను జైలు లోపల పెట్టి కేసు విచారణ దశలో ఉందని చెప్పటం వీల్లేదని వాదించామన్నారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, కేసు విచారణలో ఉండగా బెయిల్ కోరటం చట్ట సమ్మతమేనన్నారు. జైలుకు చేరిన విడుదల ఆర్డర్ కాపీ.. నగర మాజీ మేయర్ సంజయ్కు బెయిల్ ఉత్తర్వులు వెలువడిన నేపథ్యంలో ఆయన తరపున న్యాయవాదులు సాయంత్రం 6 గంటల తర్వాత విడుదల ఆర్డర్ కాపీ జైలు అధికారులకు చేరింది. దాంతో జైలు నిబంధనల ప్రకారం సంజయ్ను గురువారం విడుదల చేసే అవకాశం లేదని, శుక్రవారం విడుదల చేయవచ్చని తెలిసింది. -
తలాక్’ నిందితులకు బెయిల్
న్యూఢిల్లీ: త్రిపుల్ తలాక్కు సంబంధించి విచారణకు ముందే నిందితులకు బెయిల్ మంజూరుచేయడంతో పాటు మరో రెండు రక్షణలు చేర్చుతూ తెచ్చిన సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ బిల్లు ఇదివరకే లోక్సభలో గట్టెక్కగా, రాజ్యభలో పెండింగ్లో ఉంది. పార్లమెంట్ సమావేశాలకు చివరి రోజైన శుక్రవారమే సవరించిన బిల్లును కేంద్రం మరోసారి లోక్సభలో ప్రవేశపెట్టే వీలుంది. భార్య వాదనలు విన్న తరువాతే భర్తకు మెజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చేలా నిబంధన చేర్చామని, అయినా ట్రిపుల్ తలాక్..బెయిల్కు అర్హంకాని నేరంగానే కొనసాగుతుందని న్యాయశాఖ మంత్రి చెప్పారు. బిల్లులో కీలక సవరణలు.. ► పోలీస్ స్టేషన్లోనే నిందితుడికి బెయిల్ లభించదు(అంటే ట్రిపుల్ తలాక్ నేరం నాన్–బెయిలబుల్గా ఉంటుంది) ► భార్యకు పరిహారం ఇచ్చేందుకు భర్త అంగీకరించాకే మేజిస్ట్రేట్ బెయిల్ ఇస్తారు. పరిహారం ఎంతనేది మేజిస్ట్రేట్ ఇష్టం. ► బాధితురాలు లేదా ఆమె రక్త సంబంధీకులు ఫిర్యాదు చేస్తేనే ఎఫ్ఐఆర్ నమోదు. ► కేసును ఉపసంహరించుకునే స్వేచ్ఛను ఇరు పక్షాల(భార్య, భర్త)కు కల్పించారు. మేజిస్ట్రేట్ తన అధికారాలతో భార్యాభర్తల మధ్య సయోధ్యకు ప్రయత్నించొచ్చు. ► మైనారిటీ తీరని పిల్లల సంరక్షణను తనకు అప్పగించాలని భార్య చేసుకున్న విజ్ఞప్తిని మేజిస్ట్రేట్ పరిశీలిస్తారు. కేబినెట్ ఇతర నిర్ణయాలు ► గిడ్డంగుల్లో నిల్వ ఉన్న సుమారు 35 లక్షల టన్నుల పప్పుదినుసులను రాయితీపై రాష్ట్రాలకు విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. మార్కెట్ ధర కన్నా కిలోకు రూ.15 తక్కువకే రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలకు కేంద్రం విక్రయించనుంది. ► ఓబీసీ కులాల ఉపవర్గీకరణకు జస్టిస్ జి.రోహిణి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పదవీకాలం నవంబర్ వరకు పొడిగింపు. ► తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మృతికి కేంద్ర కేబినెట్ సంతాపం ప్రకటించింది. మంత్రి మండలి సభ్యులు మౌనంవహించి నివాళులు అర్పించారు. -
కార్తీకి ఢిల్లీ హైకోర్టు బెయిల్
న్యూఢిల్లీ: ‘ఐఎన్ఎక్స్ మీడియా’ అవినీతి కేసులో అరెస్టయిన కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కుమారుడు కార్తీకి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 లక్షల పూచీకత్తు చూపాలని, ఒకవేళ దేశం విడిచి వెళ్లాల్సి వస్తే సీబీఐ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. బెయిల్పై బయట ఉన్న సమయంలో ఆధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించింది. ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు రూ.4.5 కోట్లు లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో ఫిబ్రవరి 28న కార్తీని సీబీఐ అరెస్టు చేసింది. ఆ మేరకు కోర్టు విధించిన 12 రోజుల జ్యూడీషియల్ కస్టడీ శనివారంతో ముగియనుంది. -
వీరభద్ర సింగ్కు బెయిల్ మంజూరు
సాక్షి, న్యూఢిల్లీ : రూ ఏడు కోట్ల మనీ ల్యాండరింగ్ కేసులో హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం వీరభద్రసింగ్తో పాటు ఆయన భార్య ప్రతిభా సింగ్ మరో ముగ్గురికి ప్రత్యేక న్యాయస్ధానం గురువారం బెయిల్ మంజూరు చేసింది. గత విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయడంతో న్యాయస్ధానం ఎదుట హాజరైన నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే కేసులో యూనివర్సల్ యాపిల్ అసోసియేట్ అధినేత చున్ని లాల్ చౌహాన్, ఇతర నిందితులు ప్రేమ్రాజ్, లవన్ కుమార్లకూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితులందరికీ రూ 50,000 వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరైంది. నిందితులకు బెయిల్ ఇవ్వరాదని, వారిని జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని విచారణ సందర్భంగా ఈడీ తరపు న్యాయవాది నితీష్ రాణా కోరారు. ఈడీ వాదనను తోసిపుచ్చిన కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. -
ఎర్రకోటపై దాడికేసులో వ్యాపారవేత్తకు బెయిల్
న్యూఢిల్లీ : ఎర్రకోటపై దాడి కేసులో కశ్మీరీ వ్యాపారవేత్తకు బెయిల్ మంజూరైంది. 2000 సంవత్సరంలో ఎర్రకోటపై దాడి కేసులో ప్రమేయం ఉందనే కారణంతో కశ్మీర్కు చెందిన అహ్మద్ కావా(37) అనే వ్యాపారవేత్తను ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఢిల్లీ పోలీసులు, గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళ అధికారులు కలిసి ఆయనను అరెస్ట్ చేశారు. ఆయనకు అడిషనల్ సెషన్స్ జడ్జి సిద్ధార్థ్ శర్మ బెయిల్ మంజూరు చేశారు. అలాగే రూ. 50 వేల సొంత పూచీకత్తు, ష్యూరిటీ సమర్పించాలని షరతు విధించారు. ఎర్రకోటపై దాడి చేసిన లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులకు అహ్మద్ ఖావా బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు బదిలీ అయ్యాయి. ఈ కారణంతోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. -
మందకృష్ణ మాదిగకు బెయిల్ మంజూరు
హైదరాబాద్ : ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు మంగళవారం బెయిల్ మంజూరు అయింది. సికింద్రాబాద్ సివిల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి పది రోజులకోసారి కార్ఖాన, రాంగోపాల్ పేట్ పీఎస్ లో హాజరు కావాలని షరతు విధించింది. ఇద్దరు వ్యక్తులతో పదివేల రూపాయల పూచీకత్తు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. -
మావోయిస్టు నేత కోబడ్ గాంధీకి బెయిల్
ఆరిలోవ (విశాఖ తూర్పు): మావో యిస్టు నేత కోబడ్ గాంధీ మంగళవారం విశాఖ కేంద్ర కారాగారం నుంచి బెయిల్పై విడుదలయ్యారు. మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహిస్తూ మారణాయుధాలు, పేలుడు పదార్థాలు కలిగి ఉన్నట్లు విశాఖ పోలీసులు గతంలో ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 4 నుంచి విశాఖపట్నం జైలులో ఉన్నారు. ఆయనపై ఉన్న కేసులన్నీ మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించినవే. ఇంగ్లండ్లో సీఏ చదివి.. కోబడ్ గాంధీ ముంబైలో ధనిక పార్సీ కుటుంబంలో జన్మించారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్గాంధీతో కలిసి డెహ్రాడూన్ యూనివర్సిటీలో పీజీ చదివారు. ఇంగ్లండ్లో సీఏ అభ్యసించారు. వివాహం జరిగిన కొద్ది రోజులకే భార్య మరణించడంతో కుటుంబాన్ని వదిలేసి మావో యిస్టు ఉద్యమంలోకి వచ్చారు. కాగా, తనపై ఎనిమిది కేసు లున్నాయని, ఎనిమిదేళ్లపాటు వివిధ కారాగారాల్లో శిక్ష అనుభవించానని కోబడ్ గాంధీ తెలిపారు. తీహార్ జైల్లో ఏడేళ్లు, చర్లపల్లి జైల్లో్ల నాలుగు నెలలు, విశాఖ జైల్లో్ల తొమ్మిది నెలలు ఉన్నట్లు చెప్పారు. వీటి న్నింటికంటే విశాఖ జైల్ బాగుందని కితాబిచ్చారు. ఇక్కడ స్నేహపూర్వక వాతావరణం ఉందన్నారు. -
మాలెగావ్ కేసులో పురోహిత్కు బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ : మాలెగావ్ పేలుడు కేసులో ఎట్టకేలకు లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్కు సుప్రీం కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. తన బెయిల్ వినతిని తోసిపుచ్చుతూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంను ఆశ్రయించారు. పురోహిత్కు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస ఆర్కే అగర్వాల్, ఏఎం సప్రేతో కూడిన బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా పురోహిత్ తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తూ నిందితుడు తొమ్మిదేళ్లుగా జైలులోనే ఉన్నా ఇప్పటివరకూ ఆయనపై అభియోగాలు నమోదు చేయలేదని చెప్పారు. పురోహిత్పై మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం కింద మోపిన అభియోగాలను వెనక్కి తీసుకున్నందున మధ్యంతర బెయిల్ పొందేందుకు అర్హుడని కోర్టుకు నివేదించారు. ఎన్ఐఏ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ మణిందర్ సింగ్ వాదిస్తూ పురోహిత్పై అభియోగాల నమోదుకు అవసరమైన ఆధారాలున్నాయని చెప్పారు. మాలెగావ్లో 2008 సెప్టెంబర్ 29న జరిగిన బాంబు పేలుళ్లలో ఏడుగురు మరణించారు. అక్కడ పెద్దసంఖ్యలో ముస్లింలున్నందునే పేలుళ్లకు లక్ష్యంగా చేసుకున్నారని 4000 పేజీల చార్జిషీట్లో పేర్కొన్నారు. పేలుళ్లకు ప్రగ్యా ఠాకూర్, పురోహిత్, సహ నిందితుడు దయానంద్ పాండేలు ప్రధాన కుట్రదారులుగా చార్జిషీట్ పొందుపరిచారు.