bhogi festival
-
గమ్యానికి చేరువై.. అంతలోనే దూరమై..
గోదావరిఖని(రామగుండం): మరో నిమిషంలో ఇంటికి చేరుకునేవారు.. ఇంకో రెండుగంటలు గడిస్తే భోగి పండుగతో ఆ ఇంట్లో సంతోషాలు వెల్లివిరిసేవి. ఈలోగా మృత్యువు ముంచుకొచి్చంది. కుటుంబానికి పెద్దదిక్కు, అతడి కొడుకు మృతిచెందడం, ఇల్లాలు ఆసుపత్రి పాలు కావడంతో ఖనిలో విషాదఛాయలు నెలకొన్నాయి. సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు, అతడి కొడుకు అక్కడికక్కడే మృతిచెందారు. గోదావరిఖని వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపిన వివరాలు.. జీడీకే–11గనిలో పనిచేస్తున్న గిన్నారపు సతీశ్(32) తనకు వరుసకు సోదరుడు అయిన వ్యక్తికి హైదరాబాద్లోని ఆస్పత్రిలో కొడుకు జన్మించాడు. వారిని చూసేందుకు ఆదివారం సతీశ్ తన భార్య కీర్తి, కుమారుడు నవీశ్(11నెలలు), బావ ఎ.సతీశ్, చెల్లె అనూషతో కలిసి కారులో హైదరాబాద్ వెళ్లారు. తిరిగి రాత్రి 11 గంటలకు గోదావరిఖనికి పయనమయ్యారు. ఎన్టీపీసీ బీ పవర్హౌజ్ వరకు తన బావ కారు డ్రైవ్ చేయగా అక్కడ కొద్ది సేపు మూత్ర విసర్జన కోసం ఆగారు. తర్వాత సతీశ్ డ్రైవింగ్ చేస్తూ వచ్చాడు. ఈక్రమంలో సోమవారం వేకువజామున 3గంటలకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకు వచ్చేసరికి కుక్క అడ్డు రావడంతో రోడ్డుపక్కన నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొనగా, సతీశ్, అతడి కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి భార్య, బావ, చెల్లె గాయాలపాలయ్యారు. ఒక్క నిమిషం గడిస్తే..ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి సతీశ్ ఇల్లు ఐదువందల మీటర్ల దూరంలో ఉంది. ఒక్క నిమిషం గడిస్తే ఇంటికి చేరుకునేవారు. ఈలోగా జరిగిన ప్రమాదం సింగరేణి యువ కార్మికుడు, అతడి ముక్కుపచ్చలారని 11నెలల చిన్నారిని కబలించింది. తన ఎదపైన ఆడాల్సిన చిన్నారి బాబును పోస్టుమార్టం అనంతరం తండ్రి మృతదేహంపై పడుకోబెట్టిన దృశ్యం ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించింది. అంత్యక్రియల కోసం మృతదేహాలను తిమ్మాపూర్ మండలం పోరండ్లకు తరలించారు. -
రోజా ఇంట ఘనంగా భోగి పండుగ సంబరాలు
-
సంక్రాంతి జరీచీర
ఏదో తప్పదు కావున పెళ్లి చేసి చేతులు దులుపుకున్నారనీ, సంక్రాంతికి పిన్నీ బాబాయిలు పుట్టింటి హోదాలో తననూ భర్తనూ పిలిచేదేమీ లేదనీ తేలిపోయాక చిన్నబుచ్చుకుంది ఆ కొత్త పెళ్లి కూతురు. భర్త గమనించాడు. వాళ్లు రాసినట్టే పిలిచినట్టే ఒక కార్డుముక్క సృష్టించాడు. పండక్కు ముందు భార్యను బయల్దేరదీశాడు. పట్నానికి తీసుకెళ్లి దర్జాగా హోటల్లో దించాడు. ‘ఇదేమిటండీ’ అని ఆశ్చర్యపోయింది భార్య. ‘మరేటనుకున్నావోయ్. ఇంతకు మించిన పుట్టిల్లు లేదు. కోరిన టిఫెను, భోజనం గదిలోకే వస్తాయి. సాయంత్రమైతే సినిమాలు షికార్లు బోలెడన్ని. ఇదే నీ పుట్టిల్ల నుకొని సంతోషపడు’ అంటాడు. మనసుంటే పండగ ఉండదా? మధురాంతకం రాజారాం ‘పండగ అల్లుడు’ కథ ఇది.చార్జీలు, పండగ ఖర్చులు తలచి పాపం ఆ పేద తల్లిదండ్రులు పెద పండుగ ఊసే ఎత్తలేదు కూతురి సంగతే మరిచినట్టు. అల్లుడు అది గమనించాడు. పండక్కు తన భార్య కొత్తచీర కట్టుకుంటే ఆ మురిపెం వేరు. సింగారమూ వేరు. కోర్టు గుమాస్తా అతను. చిన్న జీతమే. కాని పెద్ద మనసు. రిక్షా ఎక్కడం మానేశాడు. బయట టిఫెన్లు కాఫీలు మానేశాడు. నాటకాలు చూడ్డం మానేశాడు. పుస్త కాలు కొనడమున్నూ. ప్రతి పైసాను పొదుపు చేసి తెచ్చాడు ఆఖరుకు ‘పుల్లంపేట జరీచీర’! పది హేను మూరల ఆ జరీచీర కట్టుకుని కళకళ్లాడిన భార్య ‘ఇంత కష్టం చేసి నా కోసం తెచ్చారా’ అని భర్త కంఠార తల ఆన్చి బాష్పాలు రాలుస్తుంది. సయోధ్య ఉంటే కాపరం పండగే. శ్రీపాద కథ ఇది.కరువు రోజుల్లో పండగంటే ఎంత కష్టం. ఇంటి పెద్ద మనసు కష్టపెట్టుకుంటూనే ఎక్కడ ఏది సర్ది చెప్పాలా అని ఆగమవుతూ ఉంటాడు. పిల్లలకిది పడుతుందా? పండగ మరో నెలుందనగానే తట్టలు పట్టి ఎక్కడి పేడంతా సేకరించి పిడకలు కొట్టి ఆరబెట్టారు. ‘ఎన్నర్రా’ అని తండ్రి అడిగితే ‘300’ అన్నారు గర్వంగా. తండ్రికి ఎన్నో ఆలోచనలు. వాటిని పొయ్యిలోకి వాడితే కట్టెలైనా మిగిలి నాలుగు పైసలు ఆదా అవుతాయి గదా అని. ‘ఇవ్వండ్రా’ అనంటే ‘ఊహూ’. భోగి మంటలేసి ఎగిసే మంటలను చూసి పక్కింటివాళ్లను ఓడిస్తేనే పిల్లలకు ఆనందం. పేదవాడికి పండగంటే ‘సర్దుబాటే’. సాక్షాత్తూ ఆరుద్ర రాసిన కథ ఇది. అయితే ‘ఇప్పటి భోగిమంటలు ఒక మంటలేనా’ అంటారు ముళ్లపూడి వెంకట రమణ. జగన్నా థుని రథమంత ఎత్తున లేసేలా వేస్తేనే వేసినట్టట. ‘ఒరే ఫ్రెండూ... వెళ్లి రెండు బైండింగ్ అట్టలైనా పట్టుకురారా మంట పెంచుదాం’ అనంటే ఎవరింట ఉన్నాయట బైడింగ్ అట్టలూ పుస్తకాలూనూ. కోళ్లగంపలూ తాటాకు బుట్టలూ తప్ప. కావున జానెడు ఎత్తు మంటే జగన్నాథుడితో సమానం. అయితే పిల్లకారుకు చిన్న సరదా ఉందిలే. ఆ చిరుచీకట్లలో ప్లీడరు శేషయ్యగారి బోర్డు ఊడబెరికి మంటల్లో వేసి గోడ ఖాళీ ఎందుకని భోజనం తయార్ బోర్డు తెచ్చి అక్కడ వేళ్లాడదీశారు. పండగంటే పిల్లల అల్లరిది. జీవితాంతం చెప్పుకునేటందుకు జ్ఞాపకమై గూడుకట్టేది. ముళ్లపూడి ‘భోగి మంటలు’ బలే సరదా కథ. అయితే స్త్రీగళాన్ని ఎలా వదిలేస్తాం? ఒక సింగిల్ ఉమన్కు అందరూ గది అద్దెకిస్తారుగాని ఒకటే షరతు... రోజూ ఇంటి ముందర ముగ్గేయాలని. ఆ సింగిల్ ఉమన్ మంచి జర్నలిస్టు. ఆలోచనాశీలి. సమాజానికి పనికొచ్చే పనులు చేయగలిగినది. మించి తన జీవి తాన్ని తాను నిర్మించుకోగలిగేది. అయినా సరే. ముగ్గేయాల్సిందే. ‘నాకు రాదు... వచ్చినా వేయను’... ‘పనిమనిషితోనైనా వేయించు’... పండుగ నెల వచ్చిందంటే ఆమెకు గండం. ముగ్గు లేని వాకిలిగా ఆమె ఇల్లే కనపడుతుంది. ఆ నెల్లో యజమాని ఖాళీ చేయించడం ఖాయం. మరో గదికి చలో. ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలట. ఇల్లాలి చదువు, జ్ఞానం, వికాసం వీటి వల్ల కాదా దేశానికి పండగ వచ్చేది? పి.రామకృష్ణారెడ్డి కథ ‘ముగ్గు’.సంక్రాంతి తెలుగువారి ముఖ్యమైన పండగ. యుగాంతం వరకూ నిలిచే పండగ. సంస్కృతిని ఎప్పటికీ కాపాడుకోవాల్సిందే. కాని సందర్భాలలోని అంతరాలను చూసి సరిచేసి పండుగ అర్థాన్ని విశాలం చేసుకోవాలి కూడా. ‘గుమ్మం ముందు బొబ్బిలిపాట గాళ్లేమిటి... బుడబుక్కల వాళ్లేమిటి... తందానపదం వాళ్లేమిటి... గంగిరెడ్ల వాళ్లేమిటి... పగటి వేషగాళ్లేమిటి... తోలు బొమ్మలాళ్లేమిటి... ఎరకలాళ్లేమిటి... చెంచులాళ్లేమిటి... జంగాలేమిటి... సన్నాయి వాళ్లేమిటి... వీళ్లంతా నిమిష నిమి షానికి వచ్చేవాళ్లే’ అని రాస్తారు కవికొండల వేంకటరావు ‘మా ఇంట సంక్రాంతి’ కథలో. పండగ ఒకరు చేసుకునేదిగా... మరొకరు వారింటి ముందుకు వచ్చి ఇనాము అడిగేదిగా ఎందుకు ఉండాలి? ఇనాము ఇచ్చే స్థాయిలో ఒకరు, పొందే స్థాయిలో ఒకరు ఉంటే అది న్యాయమైన సమాజమేనా? జన్మ అంతరాలు, ఆర్థిక అగాథాలనే కాబోలు భోగిజ్వాలల్లో పడేయాల్సింది. గాయకుడు పుట్టా పెంచల్దాసు ‘యేటంబిడ యేడుచ్చా పోయా’ అనే కథను రాశాడు. భోగి రోజు పండగ చేసుకోనీకుండా, ఇల్లు గడిచేందుకు భత్యాలు తీసుకురమ్మని తల్లి పోరుపెడితే, చీకటితో బయల్దేరి ఇంటింటా పాటలు పాడి గింజలు, వడ్లు తీసుకుని చీకటి పడ్డాక ఇల్లు చేరి, అప్పుడు కొత్త బట్టలు కట్టుకుని ఎవరికి చూపించుకోవాలో తెలియక దిగాలు పడే పసివాడి కథ అది. దుఃఖం వస్తుంది. సంక్రాంతి ఎంతో సంబరమైన పండగ. కాని సమకాంతికై అది చేసే వాగ్దానాన్ని మనం ఇంకా అందుకోవలసే ఉంది. సామాజికంగా అందరూ అడుగు పెట్టగలిగేదే ఉత్తరాయణం అంటే. క్రాంతి రావడమే సరైన సంక్రాంతి. అటువంటి సంక్రాంతిని కాంక్షిస్తూ గుమ్మడి పూల, పసుపు చేమంతుల శుభాకాంక్షలు! -
భోగి వైభోగం
సౌరమానాన్ని ఆధారంగా చేసుకున్న పండగ భోగి. తెల్లవారు జామునే భోగి మంట వేస్తారు. కర్రపుల్లలు, పిడకల దండలు, పాత సామాన్లు, కొబ్బరిమట్టలు... లాంటివాటితో పెద్దపెద్ద మంటలు వేస్తారు. పాత వస్తువులతో పాటు, మనుషుల మనసుల్లో దాగి ఉన్న పాత అలవాట్లను సైతం అగ్నిలో దహింపచేసి, ఆరోజు నుంచి కొత్త ఆయనంలోకి, కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి కొత్త మార్గంలో ప్రయాణించడానికి సూచనగా భావిస్తారు. గ్రామాల్లో నాలుగు రోడ్ల కూడళ్లలో భోగిమంట వేస్తారు. అలా అందరూ ఒకచోట చేరటం వలన సమైక్యత ఏర్పడుతుంది. ఈ రోజున భోగి మంట వేసుకోవటం వెనుక కూడా ఆరోగ్య రహస్యం దాగి ఉంది. సరిగ్గా భోగితో దక్షిణాయనం పూర్తయ్యి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. చలి కూడా వెనకపడుతుంది. ఒక్కసారిగా వాతావరణం వేడిగా మారుతుంది. ఆ వేడిని తట్టుకోవడం కోసమే ఈ మంట వేసుకునే సంప్రదాయం వచ్చి ఉండవచ్చునని ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం. వీటి నుండి వచ్చే పొగ ఆరోగ్యం కలిగించేదే కాని హాని కలిగించేది కాదు. ఈ మంట వేయడానికి పిల్లలందరూ ఇంటింటికీ వెళ్లి తోటి పిల్లల్నందర్నీ నిద్రలేపి పరాచికాలాడుకుంటూ, చలికాచుకుంటూ కోలాహలంగా కనిపిస్తారు. సైన్సుపరంగా చెప్పాలంటే, చలికాలం వాతావరణంలో సూక్ష్మక్రిములు అభివృద్ధి చెందడానికి అనువైన కాలం. అందువల్ల అందరూ ఏకకాలంలో భోగిమంటలు వేయడం వల్ల సూక్ష్మక్రిములన్నీ నశించిపోయి అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. అదేవిధంగా ఎప్పటెప్పటి నుంచో మూలన పడి ఉన్న పాత సామానును ఏడాదికోసారి ఈ విధంగా వదిలించుకోవడం వల్ల దుమ్ము, ధూళి, ఎలుకలు, వాటిని తినడానికి పాములు చేరకుండా ఉంటాయనేది పెద్దల మాట. భోగం అంటే పిల్లలకు భోగం చేయడం. పిల్లలకు భోగిపళ్లు పోసేటప్పుడు రేగు పళ్లు, రాగి పైసలు, పువ్వులు మూడిటినీ కలిపి తలచుట్టూ మూడుసార్లు తిప్పి తలమీద పోస్తారు. కొన్ని ప్రాంతాలలో రేగుపళ్లు, చిల్లరడబ్బులు, కొత్తబియ్యం, తేగ ముక్కలు, చెరకు ముక్కలు, పాలకాయలు, పచ్చి శనగ కాయలు, పూలరేకలు అన్నీ కలిపి పోస్తారు. దీనివల్ల దృష్టి దోషం పోతుందని విశ్వాసం. పిల్లలు కూర్చునే పీటకింద ఇంట్లో తయారు చేసుకున్న పిండివంటన్నీ వేస్తారు. వాటిని తరవాత ఇంట్లో నమ్మకంగా పనిచేసే వారికి ఇచ్చేస్తారు. చివర్లో పేరంటాళ్లకి వాయినం ఇస్తారు. ఇందులో ఆరోగ్యానికి ఉపకరించే మొలకెత్తిన శనగలు తమలపాకులు, వక్క ఇస్తారు. మన పండుగల వెనుక సంప్రదాయంతోపాటు ఆరోగ్య కోణమూ దాగి ఉంది. అందుకే ఈ వంటకాలు, వాయినాలు ఆనవాయితీగా వస్తున్నాయి.వస్తు వ్యామోహానికి మంటమనుషుల మీదైనా, వస్తువుల మీదైనా వెర్రివ్యామోహం పనికిరాదు. కరుడుగట్టిన అలాంటి కోరికలేవైనా ఉంటే వాటిని వదిలించుకోవాలి. అప్పుడే జీవితం నిశ్చింతగా ఉంటుంది. ఈ మాటను ఊరికే చెబితే ఎవరూ వినరు కాబట్టి భోగిమంట రూపంలో చెబితే వింటారన్నది పెద్దల నమ్మకం. ఇక పోతే, భోగిపండ్లు లేదా రేగుపండ్లలో ఎనలేని ఔషధగుణాలు ఉన్నాయి. చలికాలంలో ఎవరికైనా జీర్ణశక్తి మందగిస్తుంది. పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కాని సమస్య తొలగిపోదు. ఒకప్పుడు ఇప్పుడున్నంత ఆరోగ్య చైతన్యం లేదు కనక.. ఆ లోటును పూడ్చేందుకు రేగుపండ్లను తినమనే వారు. రేగులోని జిగట పదార్థం అన్నవాహికను శుభ్రం చేస్తుంది. ‘భుక్త్వాచ బదరీఫలం’ అన్నది అందుకే. భోంచేసిన తర్వాత రేగుపండ్లు తింటే మంచిదని దాని అర్థం. రేగుపండ్లు శరీరంలో వేడిని పుట్టించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. ఆకలి పుట్టిస్తాయి. రేగుపండ్లకున్నప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకునే.. పండగపూట పిల్లలకు చిల్లర నాణేలతో కలిపి భోగిపండ్లు పోస్తారు. మహా భక్తురాలైన గోదాదేవి భోగినాడే రంగనాథుని పతిగా పొందిందని ద్రవిడ వేదం చెబుతోంది. అందువల్ల విష్ణ్వాలయాలలో భోగిరోజు గోదా రంగనాథులకు కల్యాణం జరిపిస్తారు. – డి.వి.ఆర్. -
భోగభాగ్యాల భోగి పండగ దేనికి సంకేతమంటే.?
'భగ' అనే పదం నుంచి భోగి అన్నమాట పుట్టిందని శాస్త్ర వచనం. 'భగ' అంటే 'మంటలు' లేదా 'వేడి'ని పుట్టించడం అని అర్ధం. మరోక అర్థంలో భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం ఈరోజున శ్రీ రంగనధాస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీనికి సంకేతంగా 'భోగి పండగ' ఆచరణలోకి వచ్చిందని పురాణ గాథ. అయితే చాలామంది భావించే విధంగా భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా. అలాంటి ఈ పండుగను అనాథిగా ఆచారిస్తూ రావడానికి గల కారణం, ఆరోగ్య రహాస్యలు గురించి సవివరంగా చూద్దామా..!భోగినాడు సూర్యుడు ఉత్తర ఆయనం వైపు పయనం ప్రారంభిస్తారు. సూర్యుడు కొంత కాలం భూమధ్యరేఖకి దక్షిణం వైపు ప్రయాణించి ఆ తర్వాత దక్షిణం నుంచి దిశ మార్పుచుని ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు. సూర్యుడు ప్రయాణించే దిక్కుని బట్టి…దక్షిణం వైపు పయనిస్తే దక్షిణాయానం.. ఉత్తరం వైపు పయనిస్తే ఉత్తరాయణం అంటారు. మకర రాశిలోకి ప్రారంభ దశలో ఆ సూర్యని కాంతి సకల జీవరాశుల మీద పడడంతో మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. సూర్యుడే ఆరోగ్యకారుడు ఆ ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకునే పండుగ ఈ మకర సంక్రాంతి.. ఇక భోగ భాగ్యాలను అందించే పండుగ భోగి అని పెద్దలు చెబుతున్నారు.ఆరోగ్య రహస్యం..ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశీ ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని జోడిస్తారు. ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరంలోని 72 వేల నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. అందువల్లే భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయం వచ్చింది. భోగి మంటలు ఎందుకంటే..చాలా మందికి భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలియదు. పురాణాల ప్రకారం, దీనికి వెనుక ఒక కథ ఉంది. ఒకానొక సమయంలో రురువు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి ఘోరంగా తపస్సు చేశాడు. అతడి తపస్సుకి మెచ్చి బ్రహ్మదేవుడి ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడిగాడు. దానికి ఆ రాక్షసుడు మరణం లేకుండా వరం ఇవ్వమని అడుగుతాడు. అందుకు బ్రహ్మదేవుడు అంగీకరించలేదు. అప్పుడు రురువు ఎవరైనా సరే 30 రోజుల పాటు గొబ్బెమ్మలు ఇంటిముందు పెట్టి, అవి ఎండిపోయిన తర్వాత మంటల్లో వేసి ఆ మంటల్లో నన్ను తోస్తేనే మరణించేలా వరమివ్వమని బ్రహ్మదేవుడిని కోరాడు. అనంతరం రురువు వర గర్వంతో దేవతలందరినీ ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. అప్పుడు దేవతలందరూ ఈ ధనుర్మాసంలో 30 రోజులపాటు ఇంటిముందు గొబ్బెమ్మలు పెట్టి.. ఆ తర్వాత వాటిని మంటల్లో పెట్టి రాక్షసుడిని అందులో తోస్తారు. అలా రాక్షసుడు చనిపోవడానికి సంకేతంగా భోగి రోజు భోగి మంటలు వేసుకోవడం ఆచారంగా వస్తోంది.ఈ పండగ సందేశం, అంతరార్థం..చలికాలంలో సూక్ష్మక్రిముల బెడద ఎక్కువగా ఉంటుంది. వాటిని తొలగిపోవడానికి మన పెద్దలు ఇలా భోగి మంటలు వేసి ఆరోగ్యాన్ని సంరక్షించుకునేవారని చెబుతుంటారు. ఇక ఈ పండుగ మనకు ఇచ్చే సందేశం ఏంటంటే..చెడు అలవాట్లను, అసూయా, ఈర్ఘ, దుర్భద్ధిని ఈ మంటల రూపంలో దగ్ధం చేసుకుని మంచి మనుసుతో జీవితాన్ని ప్రారంభించి సానుకూలా ఆలోచనలతో మంచి విజయాలను అందుకోవాలనే చక్కటి సందేశాన్ని ఇస్తోంది. మనం అగ్ని ఆరాధకులం. కనుక మాకు అసలైన భోగాన్ని కలిగించమనీ, అమంగళాలను తొలగించమని ప్రార్థిస్తూ అగ్నిహోత్రాన్ని రగులుస్తాము. గతించిన కాలంలోని అమంగళాలను, చేదు అనుభవాలు, అలాగే మనసులోని చెడు గుణాలను, అజ్ఞానాన్ని అన్నింటినీ అత్యంత పవిత్రమైన అగ్నిలో వేసి దగ్ధం చేసుకోవటమే భోగి. ఇలా మంగళాలను, జ్ఞానాన్ని పొందాలనే కోరికతో అగ్నిహోత్రుడిని పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజించటమే భోగి మంటల వెనక ఉన్న అంతరార్థం.(చదవండి: సంక్రాంతి అంటే పతంగుల పండుగ కూడా..!) -
సందళ్ల సంక్రాంతి
మనకు ఎన్ని పండుగలు ఉన్నా, సంక్రాంతి పండుగ ప్రత్యేకమైనది. సంక్రాంతి అంటేనే సందడి అనేంతగా తెలుగునాట సంక్రాంతి సంబరాలు ప్రసిద్ధి పొందాయి. సూర్యుడు మకరరాశిలోకి అడుగుపెట్టే సందర్భంగా మకర సంక్రాంతి వేడుకలు జరుపుకొంటారు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాయనం మొదలవుతుంది. ఉత్తరాయనాన్ని పుణ్యకాలంగా భావిస్తారు. అందువల్ల మకర సంక్రాంతిని తెలుగునాటనే కాకుండా, దేశవ్యాప్తంగా జరుపుకొంటారు. సంక్రాంతి వేడుకలు జరుపుకోవడంలో ఒక్కో ప్రాంతానిది ఒక్కో పద్ధతి. సంక్రాంతికి ముందురోజున భోగి మంటలు వేయడం, సంక్రాంతి రోజుల్లో ముంగిళ్లలో ముగ్గులు వేయడం దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. మకర సంక్రాంతి సందర్భంగా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో కనిపించే సంక్రాంతి సందళ్ల గురించి తెలుసుకుందాం.సంక్రాంతి రోజుల్లో తెలుగునాట ఊరూరా ముంగిళ్లు గొబ్బెమ్మలను తీర్చిదిద్దిన ముగ్గులతో కళకళలాడుతూ కనిపిస్తాయి. గంగిరెద్దుల గంటల సవ్వడులు, బుడబుక్కల వాయిద్యాల ధ్వనులు, హరిదాసుల హరినామ సంకీర్తనలు వినిపిస్తాయి. కొన్నిచోట్ల కోడిపందేల కోలాహలాలు, ఇంకొన్ని చోట్ల నింగిని తాకే పతంగుల రంగులు కనువిందు చేస్తాయి. కొన్నిచోట్ల ఆడపడుచులు సంక్రాంతి సందర్భంగా ఇళ్లల్లో బొమ్మల కొలువులు కూడా పెడతారు. మకర సంక్రాంతి వేడుకలను సాధారణంగా మూడు రోజులు, ఒక్కోచోట నాలుగు రోజులు కూడా జరుపుకొంటారు. మకర సంక్రాంతికి ముందురోజు భోగి పండుగ, సంక్రాంతి మరునాడు కనుమ పండుగ, కనుమ మరునాడు ముక్కనుమ జరుపుకొంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లోనూ సంక్రాంతి వేడుకలను దాదాపు ఒకేరీతిలో అత్యంత వైభవోపేతంగా జరుపుకొంటారు. సంక్రాంతి ప్రధానంగా వ్యవసాయ సంస్కృతిని ప్రతిబింబించే పండుగ. పంటల కోతలు పూర్తయ్యాక వచ్చే పండుగ ఇది. సంక్రాంతి నాటికి రైతుల ఇళ్లు ధాన్యరాశులతో కళకళలాడుతుంటాయి. మకర సంక్రాంతి పుష్యమాసంలో వస్తుంది. ఇంటికి ధాన్యలక్ష్మి చేరుకునే రోజుల్లో వస్తుంది కాబట్టి, సంక్రాంతి లక్ష్మి అని, పౌష్యలక్ష్మి అని అంటారు. ‘వచ్చింది వచ్చింది పచ్చ సంక్రాంతి/ వచ్చింది వచ్చింది లచ్చి సంక్రాంతి’ అంటూ సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతారు. నెల్లాళ్లు రంగవల్లుల వేడుకమకర సంక్రాంతికి నెల్లాళ్లు ముందు వచ్చే ధనుస్సంక్రాంతి నుంచి ముంగిళ్లలో నెల్లాళ్ల పాటు రంగవల్లుల వేడుక సాగుతుంది. ఇళ్ల ముందు రకరకాల రంగవల్లులను తీర్చిదిద్ది వాటిని గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. అష్టదళ పద్మం, నాగబంధం, మారేడు దళాలు, శివుడి త్రినేత్రాలు, పెళ్లిపీటల ముగ్గు వంటి సంప్రదాయ ముగ్గులతో పాటు రకరకాల ముగ్గులను తీర్చిదిద్దుతారు. ధనుస్సంక్రాంతి నుంచి మకర సంక్రాంతి వరకు సాగే నెల్లాళ్లను సౌరమానం ప్రకారం ధనుర్మాసం అంటారు. ధనుర్మాసంలో వైష్ణవాలయాల్లో తిరుప్పావై పాశురాలను పఠిస్తూ, ప్రత్యేక పూజలు చేస్తారు. కట్టుపొంగలి, చక్కెరపొంగలి వంటి వంటకాలను నైవేద్యంగా పెడతారు. భోగి పండుగ రోజున ఆలయాల్లో గోదా కల్యాణం వేడుకలను నిర్వహిస్తారు. చివరి రోజున రథం ముగ్గు వేస్తారు. దీనిని దక్షిణాయనం నుంచి ఉత్తరాయనానికి పయనం సాగించిన సూర్యుని రథంగా భావిస్తారు.భోగ భాగ్యాల భోగిపూర్వం విష్ణుచిత్తుడు అనే విష్ణుభక్తుడు ఉండేవాడు. విష్ణుచిత్తుడికి ఒకనాడు తులసివనంలో ఒక పసిబిడ్డ దొరికింది. విష్ణుచిత్తుడు ఆమెను కుమార్తెగా స్వీకరించి పెంచాడు. ఆమె గోదాదేవి. చిన్ననాటి నుంచి శ్రీరంగనాథుడిని ఆరాధించేది. శ్రీరంగనాథుడు ఆమెను మకర సంక్రాంతికి ముందు ధనుర్మాసం చివరి రోజున పెళ్లాడాడు. ఆమెను భోగభాగ్యాలతో ముంచెత్తాడు. రంగనాథుని పెళ్లాడటంతో గోదాదేవి కైవల్య భోగాన్ని పొందిందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. గోదా రంగనాథుల పరిణయానికి, భోగభాగ్యాలకు ప్రతీకగా భోగి పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. భోగి రోజున ఇంట్లోని చిన్నపిల్లలకు రేగుపండ్లు, చెరకు ముక్కలతో భోగిపండ్లు పోసి, పెద్దలు వారిని ఆశీర్వదిస్తారు. హేమంత రుతువులో చలితీవ్రత ఎక్కువగా ఉండేరోజుల్లో ఈ పండుగ వస్తుంది కాబట్టి, భోగిపండుగ రోజున వేకువ జామున ఇళ్ల ముంగిట గాని, వీథి చివరన గాని పెద్దపెద్ద భోగిమంటలు వేస్తారు. భోగిమంటల్లో పిడకల దండలు, ఎండిపోయిన తాటాకులు, పెద్దపెద్ద కర్రదుంగలు, పాత వస్తువులు వేస్తారు. రైతులు భోగిరోజున కోతలు పూర్తయిన తమ పొలాలను కొంత నీటితో తడుపుతారు. దీనిని ‘భోగి పులక’ అంటారు. భోగి రోజు నుంచి గాలిపటాల సందడి కూడా మొదలవుతుంది. సిరుల వేడుక సంక్రాంతి«రైతుల ఇళ్లు ధాన్యరాశులతో కళకళలాడే రోజుల్లో వచ్చే సిరుల పండుగ మకర సంక్రాంతి. ఈ రోజు పాలు పొంగించి, కొత్తబియ్యంతో పాయసం వండుతారు. పితృదేవతలను పూజించి, పితృతర్పణాలు విడుస్తారు. శ్రీకృష్ణుడు ఇదేరోజున గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి, ఇంద్రుడు కురిపించిన రాళ్లవాన నుంచి యాదవులను కాపాడాడని, ఇంద్రునికి గర్వభంగం చేశాడని పురాణాల కథనం. ఈరోజున ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడిని పూజిస్తారు. సంక్రాంతి రోజున చేసే దాన ధర్మాలకు రెట్టింపు ఫలితం ఉంటుందనే నమ్మకం ఉండటంతో ఈరోజున విరివిగా దాన ధర్మాలు చేస్తారు. ఇళ్లకు వచ్చే హరిదాసులకు, బుడబుక్కల వాళ్లకు, గంగిరెద్దులను ఆడించేవాళ్లకు యథాశక్తి ధన ధాన్యాలను దానం చేస్తారు. సంక్రాంతి రోజున డబ్బు, ధాన్యం మాత్రమే కాకుండా, విసనకర్రలు, వస్త్రాలు, నువ్వులు, చెరకు, పండ్లు, కూరగాయలు వంటివి కూడా దానం చేస్తారు. సంక్రాంతి రోజున చేసే గోదానం విశేష ఫలితం ఇస్తుందని చెబుతారు. అందువల్ల సంపన్న గృహస్థులు సంక్రాంతి రోజున గోదానాలు కూడా చేస్తారు. పశువుల పండుగ కనుమమకర సంక్రాంతి మరునాడు కనుమ పండుగ జరుపుకొంటారు. పొలం పనుల్లో ఏడాది పొడవునా చేదోడు వాదోడుగా నిలిచిన పశువులను అలంకరించి, వాటికి ఇష్టమైన మేతను పుష్టిగా పెడతారు. కనుమ రోజున మాంసాహారులు రకరకాల మాంసాహార వంటకాలతో విందుభోజనాలు చేస్తారు. మనకు కనుమ నాడు మినుము తినాలని సామెత ఉంది. మాంసాహారం తినని శాకాహారులు మాంసకృత్తులు పుష్కలంగా ఉండే మినుములతో తయారుచేసే గారెలు, ఆవడలు వంటి వంటకాలను ఆరగిస్తారు. కనుమ రోజున ప్రయాణాలు చేయకపోవడం సంప్రదాయంగా వస్తోంది.ముగింపు ముక్కనుమసంక్రాంతి వేడుకల్లో మొదటి మూడు రోజుల్లోనూ నిర్దిష్టంగా పాటించవలసిన సంప్రదాయ నియమాలు ఉన్నాయి గాని, నాలుగో రోజైన ముక్కనుమకు ప్రత్యేక నియమాలేవీ లేవు. కొందరు మాంసాహారులు కనుమనాడు మాంసాహారం తినరు. వారు ముక్కనుమ రోజున మాంసాహార విందులు చేసుకుంటారు. ముక్కనుమ రోజున నవవధువులు సావిత్రి గౌరీవ్రతం చేస్తారు. ఈ వ్రతాన్ని బొమ్మల నోము అంటారు. నోము పూర్తయ్యాక, పూజలో ఉంచిన బొమ్మలను నిమజ్జనం చేస్తారు. ముమ్మతాల పండుగమకర సంక్రాంతి హిందువుల పండుగ మాత్రమే కాదు, ఇది ముమ్మతాల పండుగ. హిందువులతో పాటు జైనులు, సిక్కులు కూడా మకర సంక్రాంతి పండుగను తమ తమ సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకొంటారు. జైన ఆగమం ప్రకారం ఈ దేశాన్ని పాలించిన భరత చక్రవర్తి మకర సంక్రాంతి రోజున అయోధ్యలో సూర్యుడిని చూసినప్పుడు, ఆయనకు సూర్యుడిలో ‘జిన’ దర్శనం లభించింది. వెంటనే ఆయన జినాలయాన్ని దర్శించుకున్నప్పుడు, ఆ ఆలయ ద్వారం అయోధ్య నగరానికి అభిముఖంగా ఉందట! జైన మతం ప్రకారం ఇంద్రియాలను జయించిన ఆధ్యాత్మిక విజేతను ‘జిన’ అంటారు. మకర సంక్రాంతిని పర్వదినంగా జరుపుకొనే జైనులు, ఆరోజున జైన ఆలయాలను దర్శించుకుని, ప్రార్థనలు జరుపుతారు. ఆలయాల వద్ద, తమ తమ నివాసాల వద్ద విరివిగా దానాలు చేస్తారు.సిక్కులు మకర సంక్రాంతిని ‘మాఘి’ పేరుతో జరుపుకొంటారు. సిక్కుల గురువైన గురు గోబింద్సింగ్ అనుచరుల్లో నలభైమంది 1705లో సంక్రాంతి రోజున జరిగిన ముక్తసర్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. అందువల్ల సిక్కులు సంక్రాంతిని ఆ నలభై మంది అమరవీరుల స్మారకదినంగా పాటిస్తారు. ముక్తసర్లోని గురుద్వారాలో ఉన్న తటాక జలాల్లో పవిత్ర స్నానాలు చేస్తారు. పంజాబ్, హరియాణా, జమ్ము, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని ప్రజలు సంక్రాంతి ముందు రోజును ‘లోహ్రీ’ పండుగగా జరుపుకొంటారు. లోహ్రీ సందర్భంగా వీథుల్లో భోగిమంటల మాదిరిగానే భారీగా చలిమంటలు వేసుకుని, ఆటపాటలతో ఆనందం పంచుకుంటారు. హిమాచల్ ప్రజలు సంక్రాంతి వేడుకల్లో అగ్నిదేవుడికి ప్రత్యేకంగా పూజలు జరుపుతారు.పతంగుల పండుగసంక్రాంతి సందర్భంగా పతంగులను ఎగురవేసే సంప్రదాయం మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఉంది. గుజరాత్లో పతంగుల సందడి మరింత ఎక్కువగా కనిపిస్తుంది. గుజరాతీలు ధనుర్మాసం నెల్లాళ్లూ గాలిపటాలను ఎగురవేస్తారు. పలుచోట్ల గాలిపటాల పోటీలు కూడా నిర్వహిస్తారు. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ సంక్రాంతి రోజుల్లో గాలిపటాల సందడి కనిపిస్తుంది. కర్ణాటక పర్యాటక శాఖ గోకర్ణ, కార్వార్ తదితర బీచ్లలో గాలిపటాల వేడుకలను కొన్నేళ్లుగా నిర్వహిస్తోంది. సూర్యభగవానుడికి కృతజ్ఞత తెలుపుకోవడానికే గాలిపటాలను ఎగురవేసే సంప్రదాయం పుట్టిందని చెబుతారు. చారిత్రకంగా చూసుకుంటే, మొఘల్ల కాలం నుంచి మన దేశంలో గాలిపటాలను ఎగురవేయడం వినోదక్రీడగా మొదలైనట్లు ఆధారాలు ఉన్నాయి.కోడి పందేలుకోడి పందేలు మన దేశంలో పురాతన వినోద క్రీడ. చట్టపరమైన నిషేధాలు ఉన్నా, నేటికీ ఏటా సంక్రాంతి రోజుల్లో కోడి పందేలు విరివిగా జరుగుతూనే ఉన్నాయి. కోడి పందేల కారణంగానే పలనాటి యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే! దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లోనూ కోడి పందేల ఆచారం ఉన్నా, తెలుగునాట కోడి పందేలు మరింత ఎక్కువగా జరుగుతాయి. కోడి పందేల్లో గెలుపు సాధించడం కోసం పూర్వీకులు ఏకంగా ‘కుక్కుట శాస్త్రం’ రాశారంటే, కోడిపందేల పట్ల జనాల మక్కువ ఎలాంటిదో తెలుసుకోవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో కోడి పందేలు ఎక్కువగా జరిగేవి. ఇప్పటికీ ఈ ప్రాంతాల్లో కోడిపందేలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని కోళ్ల పెంపకందారులు పెందేల కోసం మేలిరకం కోడిపుంజులను పెంచుతుంటారు. ఇదివరకు ఆంధ్రప్రదేశ్లోని భీమవరం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, తాడేపల్లిగూడెం, తణుకు తదితర పట్టణాలు పందెంకోళ్లకు ప్రధాన కేంద్రాలుగా ఉండేవి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇరవై ఏళ్ల కిందట ఆయిల్ పామ్ సాగు మొదలైనప్పటి నుంచి ఇక్కడ కూడా పందెం కోళ్ల పెంపకం మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో కంటే తెలంగాణలోనే పందెంకోళ్లు చౌకగా లభిస్తుండటంతో ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా పందెంరాయుళ్లు పుంజులను కొనేందుకు అశ్వారావుపేట, దమ్మపేట వంటి చోట్ల బారులు తీరుతుండటం విశేషం. పందెం కోళ్ల పెంపకం, వాటి శిక్షణ కోసం కోళ్ల పెంపకందారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. సంక్రాంతికి ఏటా కోట్లాది రూపాయల్లో కోడి పందేలు జరుగుతాయి. పందెం కొళ్లకు లక్షల్లో ధరలు పలుకుతాయి. పొరుగు దేశాల్లో సంక్రాంతిమన పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, సింగపూర్, మలేసియా తదితర దేశాల్లోనూ మకర సంక్రాంతి వేడుకలను జరుపుకొంటారు. బంగ్లాదేశ్లోని బెంగాలీ హిందువులు సంక్రాంతి ముందురోజు భోగిమంటలు వేసి, బాణసంచా కాలుస్తారు. సంక్రాంతి రోజున పితృదేవతలకు పూజలు చేస్తారు. పండుగ రోజుల్లో ఇళ్ల ముందు ముగ్గులు వేస్తారు. ఈ సందర్భంగా బంధుమిత్రులతో కలసి వినోదంగా పాచికలాట ఆడతారు. ఈ రోజుల్లో సమీపంలోని చెరువులకు, నదులకు వెళ్లి చేపలను వేటాడతారు. పండుగ రోజుల్లో ఎవరికి పెద్దచేపలు చిక్కుతాయో వారికి ఏడాదంతా అదృష్టం బాగుంటుందని నమ్ముతారు. నేపాల్ ప్రజలు మకర సంక్రాంతిని ‘మాఘే సంక్రాంతి’గా జరుపుకొంటారు. థారు, మగర్ సహా వివిధ స్థానిక తెగల ప్రజలు తమ తమ సంప్రదాయ రీతుల్లో ఘనంగా వేడుకలు జరుపుకొంటారు. దేవాలయాల వద్దకు చేరుకుని, సంప్రదాయ నృత్యగానాలను ప్రదర్శిస్తారు. పాకిస్తాన్లోని సింధీ ప్రజలు మకర సంక్రాంతిని ‘తిర్మూరి’ పేరుతో జరుపుకొంటారు. ఈ సందర్భంగా ఆడపడుచులకు పుట్టింటి నుంచి నువ్వులతో తయారు చేసిన పిండివంటలను పంపుతారు. శ్రీలంక ప్రజలు తమిళనాడులో మాదిరిగానే ‘పొంగల్’ వేడుకలు జరుపుకొంటారు. ఇన్పుట్స్: దాళా రమేష్బాబు, గుంటూరు తాండ్ర కృష్ణగోవింద్, కొత్తగూడెం ఫొటోలు: షేక్ రియాజ్ -
మొగలిపువ్వంటీ మొగుడ్నీయవే : నాలుగు రోజుల ముచ్చట
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంబరంగా జరపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, బొమ్మల కొలువులు భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు...కొత్త అల్లుళ్లు ఇలా సంకాంత్రి వచ్చిందంటే ఆ సందడే వేరు. దక్షిణ భారతదేశంలో పొంగల్ను నాలుగు రోజుల పాటు జరుపు కుంటారు, నాలుగు రోజుల ఈ వేడుకలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత. సంక్రాంతి సంబరాల్లో తొలి రోజును 'భోగి'గా పిలుస్తారు.ఈ భోగి పండుగకు ప్రత్యేకత ఉంది. రెండో రోజును 'మకర సంక్రాంతి'గా, మూడో రోజును 'కనుమ'గా పిలుస్తారు. నాలుగో రోజును 'ముక్కనుమ' అంటారు. సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే భోగి: భగ అనే పదం నుంచి భోగి వచ్చిందంటారు పెద్దలు. దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలు తొలిగిపోవాలంటూ అగ్ని దేవుడికి భోగి మంట సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుకోవడమే పరమార్థమే భోగి పండుగ విశిష్టత. తెల్లవారుఝామున నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేస్తారు తద్వారా చీడ పీడలు దోషాలు, తొలగిపోతాయని విశ్వాసం. భోగి అంటేనే భోగి మంటలు కదా. పాతకు బై ..బై... కొత్తకు ఆహ్వానం ఆవు పేడతో చేసిన పిడకలతో తెల్లవారుఝామునే భోగి మంటలు వేయడం అలవాటు. అంతేకాదు ఇంట్లోని పాత వస్తువులను కూడా భోగి మంటల్లో వేస్తుంటారు. ఈ ఆవు పిడకలను రకరకా పేర్లతో పిలుచుకుంటారు. ఇంకా మామిడి, రావి, మేడి చెట్ల అవశేషాలు, తాటాకులు లాంటివి భోగి మంటల్లో వేస్తారు. పాతను వదిలిపెట్టి, సరికొత్తమార్గంలోకి పయనించాలనేదే దీనర్ధం పరమార్థం. ముఖ్యంగా దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం ప్రారంభం కానుండటంతో.. కాలంతో వచ్చే మార్పులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని బోధించేదే భోగి పండుగ. అలాగే భోగి అనగానే గుర్తుకు వచ్చేది భోగి పళ్ళు. సాయంత్రం ఇంట్లోని చిన్న పిల్లలకు ముచ్చటగా భోగి పళ్లు పోసి, పేరంటాళ్లను పిలుచుకొని వేడుక చేసుకుంటారు. భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణంవైపు, మకర రాశిలోకి అడుగుపెట్టిన సందర్భమే సంక్రాంతి సూర్యుడి పండుగ. ఏడాదిలో వచ్చే తొలి పండుగు. ఈ సంక్రాంతిలో "సం" అంటే మిక్కిలి "క్రాంతి" అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని "సంక్రాంతి" గా పెద్దలు చెబుతారు. సంక్రాంతికి పుణ్య దినం సందర్భంగా అడిగిన వారికి కాదనకుండా యధాశక్తి దానధర్మాలు చేయాలని భావిస్తారు. పుష్యమాసంలో వచ్చే ఈ పండుగకు ఇంటికి ధనధాన్య రాశులు రైతుల ఇళ్లకు చేరతాయి. పౌష్యలక్ష్మితో కళకళలతో ఇల్లిల్లూ ఒకకొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది. అందుకే సంక్రాంతి రోజు మట్టి కుండలో కొత్త బియ్యం, బెల్లం,చెరకు కలిపి పొంగల్ చేస్తారు. ఈ పాలు ఎంత పొంగిపొర్లితే.. అంత సమృద్ధి , శ్రేయస్సును అని నమ్ముతారు. అంతేనా సంక్రాంతి ఈ పండుగ కొత్తబట్టలు కావాల్సిందే. ఇంకా పెద్దలకు నైవేద్యాలు, పితృతర్పణ లాంటివి ప్రధానంగా చెప్పుకోవాలి. శని దోషాలు తొలగిపోవాలని, నల్లనువ్వులతో సూర్యుడికి పూజలు, పితృదేవతలందరికీ తర్పణలిస్తుంటారు. ఇక పిండి వంటలతో ముఖ్యంగా అరిసెలు, నువ్వుండలు, సున్నుండలులాంటి స్వీట్లతోపాటు, జంతికలు చక్రాలతో అందరి ఇళ్ళు ఘుమ ఘుమ లాడుతూ ఉంటాయి. సంక్రాంతి అంటే ముగ్గూ ముచ్చట సంక్రాంతికి ముందే నెల పెట్టడం అని ముగ్గులు . ప్రతీ ఇల్లూ రంగు రంగుల రంగువల్లలతో కొత్త పెళ్లి కూతురులా ముస్తాబవుతుంది. పల్లెల్లో అయితే ఎవరుఎంత పెద్ద ముగ్గు పెడితే అంత గొప్ప అన్నట్టు. దీనిపై బాపూ లాంటి గీతకారులు కార్లూన్లు వేశారంటేనే అర్థం చేసుకోవచ్చు సంక్రాంతిలో ముగ్గుల హడావిడి. గోదావరి జిల్లాల్లో గొబ్బెమ్మలతో కన్నెపిల్లలు, చిన్న పిల్లల ముచ్చట చూసి తీరాల్సిందే. ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలకు సంకేతం. ముగ్గు మధ్యలో పెద్ద గొబ్బెమ్మకి గుమ్మడి, మందార, బంతి, చామంతి పూలు పెట్టి పసుపూ కుంకాలతో అలంకరించి, తోటి స్నేహితులను పిలుచుకుని పాడుతూ వాటి చుట్టూ పాటలు పాడతారు. సుబ్బీ గొబ్బెమ్మా! మల్లెపువ్వంటీ మరదల్నివ్వవే, చామంతిపూవంటి చెల్లెల్నివ్వవే, మొగలీ పూవంటి మొగుణ్ణివ్వవే” అంటూ అమ్మాయిలు గొబ్బెమ్మలాడతారు. ఈ నెల రోజులూ గొబ్బెమ్మల సందడి ఉంటుంది. హరిలో రంగ హరీ అంటూ హరిదాసులు, గంగిరెద్దులు, కోడి పందాలు, జానపదుల జావళి సంక్రాంతి పండుగ. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా అందంగా తలలూపుతూ చేసే నృత్యాలు..అబ్బో.. ఈ దృశ్యాలన్నీ చాలా రమణీయంగా ఉంటాయి. మూడో రోజు కనుమ: దీన్నే పశువుల పండుగ అని అంటారు. పశుపక్ష్యాదులకి గౌరవాన్ని సూచించే పండుగ వ్యవసాయ ఆధారమైన పల్లెల్లో పశువులే గొప్ప సంపద. రైతుకు ఎంతో ఆదరువు. చేతికొచ్చిన పంటను తామేకాక, పశువులూ, పక్షులూ పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. మెడలో గల్లుగల్లుమనే మువ్వల పట్టీలు పశువులకు చక్కగా అలకరించుకుంటారు. అందరూ కలిసి భోజనాలు చేస్తారు. గాలిపటాలు ఎగురవేస్తూ సరదాగా గడుపుతారు ముక్కనుమ:నాలుగో రోజైన ముక్కనుమ సంక్రాంతికి ముగింపు అనిచెప్పవవచ్చు. శాకాహారులు వివిధకూరగాయలో ముక్కల పులుసు చేసుకుంటూ, మాంసాహారులు నాన్వెజ్ వంటకాలతో విందు చేసుకుంటారు. ముక్కనమను తమిళులు ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజును కరినాళ్ అని పిలుస్తారు. పేరేదైనా.. సంబరం ఒకటే! ఆచారాలు, సాంప్రదాయాలు కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా చాలా ఉత్సాహంతో జరుపుకునే పండుగు సంక్రాంతి. పశ్చిమ బెంగాల్లో పౌషా సంక్రాంతి, తమిళనాడులో పొంగల్, అస్సాంలో బిహు, గుజరాత్లోని ఉత్తరాయణ్, పంజాబ్లోని లోహ్రీ, అస్సాంలోని మాగ్ బిహు ఉత్సవాలు జరుపుకుంటారు. -
భోగి రోజే గోదా కళ్యాణం.. చిన్నారులకు భోగిపళ్లు ఎందుకు పోస్తారు?
తెలుగునాట సంబరంగా జరుపుకునే పెద్ద పండుగా సంక్రాంతి. ఈ నాలుగు రోజుల పండుగలో మొదటి రోజు భోగభాగ్యల "భోగి"తో మొదలవుతుంది. ఈ భోగి పండుగ రోజు పెద్ద చిన్నా అంతా నలుగుపెట్టుకుని తలంటు స్నానం చేసి భోగి మంటలతో పండుగ మొదలు పెడతారు. ఆ రోజే దేవాలయాల్లో అంగరంగ వైభవంగా గోదా కళ్యాణం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రమే పసిపిల్లలకు తలపై భోగిపళ్లు పేరుతో రేగిపళ్లు పోయడం వంటి తతంగాలు జరుగుతాయి. ఆ రోజే ఇవన్నీ చేయడానికి గల కారణాలేంటో తెలుసుకుందామా!. పూర్వం ఈ దినమే శ్రీ రంగనధాస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీని సంకేతంగా "భోగి" పండగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాథ. ఒక రకంగా భగవంతుడి మనుసును గెలుచుకున్న ఓ భక్తురాలి గాథ ఇది. ప్రేమకు భగవంతుడైనా.. బంధీ అయిపోతాడని చెప్పే చక్కని పురాణ కథ ఇది. ఇక భోగి రోజు గోదా కళ్యాణం చేయడానికి కారణం ఏంటంటే.. గోదా కళ్యాణ ప్రాశస్యం.. శ్రీ మహావిష్ణువుకు భక్తులై ఆయనే లోకంగా జీవించి తరించిన మహాభక్తులను ఆళ్వారులు అంటారు. వీళ్లలో ముఖ్యమైన వారు 12 మంది. వీరిలో పెరియాళ్వారు అనే ఆయన శ్రీరంగనాధుడికి మహాభక్తుడు. ఈయన అసలు పేరు భట్టనాధుడు. ఈయనే తరువాతి కాలంలో విష్ణుచిత్తుడిగా ప్రసిద్ధి చెందాడు. విష్ణుచిత్తుడు రంగనాధుడికి ప్రతినిత్యం పూల మాలతో కైంకర్యం(అలంకరణ) చేసేవాడు. దీనికోసం ఒక తోటను పెంచి అందులో రకరకాలైన పూలతో అందంగా మాలలు కట్టి శ్రీరంగ నాథుడికి సమర్పించేవాడు. ఒకనాడు విష్ణుచిత్తునికి తులసి మెుక్క గుబురులో ఒక పసిపాప కనిపించింది. అతడు ఆ బిడ్డను భూదేవియే ప్రసాదింగా భావించి అల్లారుముద్దుగా పెంచుకోసాగాడు. అతను ఆ బిడ్డకు గోదా అని పేరుపెట్టాడు. ఈ గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగిందే. యుక్తవయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్తా ప్రేమగా మారిపోయింది. తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తానే ధరించి, తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్లూ ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని ఎంతగానో బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి, గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారమేననీ, ఆమె వేసుకున్న మాలలను ధరించిడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందనీ తెలియచేశాడు. ఇక ఆమె యుక్తవయస్సుకు రాగానే శ్రీరంగనాధుడినే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంది. దీంతో ఆమె తన తండ్రి వద్దకు వెళ్లి మానవ కాంతలెవరైనా దేవుడిని వివాహమాడిన సందర్భాలు ఉన్నాయా? అని అడుగగా ఆయన ఉన్నాయని చెప్పాడు. దానికోసం కాత్యాయని వ్రతమాచరించ వలసి ఉంటుందని చెప్పగా.. ఆమె ఆ వ్రత నియమాలను తెలుసుకొని ధనుర్మాసంలో ఆ వ్రతమును ఆచరించడమే గాక కృష్ణునిపై ప్రేమతో ఆయన్ను కీర్తిస్తూ 30 పాశురాలను కూడా పాడింది. అలా గోదా దేవి ప్రేమకు లొంగిపోయిన కృష్ణుడు విష్ణుచిత్తుడి కలలో కనిపించి గోదా దేవిని తీసుకుని శ్రీరంగనాథం రావాలని, అక్కడ ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పాడు. దీంతో విష్ణుచిత్తుని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ విషయం ఆలయ అర్చకులకు, విల్లిపుత్తూరులోని ప్రజలకు తెలియజేశాడు. అందర్ని వెంటబెట్టుకుని శ్రీరంగనాథ ఆలయానికి చేరుకున్నాడు. అయితే పెళ్లికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదా దేవి అందరూ చూస్తుండగానే కృష్ణునిలో ఐక్యమైపోయింది. అయితే ఈ గోదా కళ్యాణం జరిగింది మకర సంక్రమణం జరిగే ముందు రోజైన భోగి నాడు. అందువల్లనే అప్పటి నుంచి ప్రతి ఏడాది భోగి రోజున గోదా కళ్యాణం ఒక పండుగలా చేస్తారు. భోగిపళ్లు ఎందుకు పోస్తారంటే..? భోగి రోజున భోగి పళ్ళు పేరుతో రేగి పళ్ళను పిల్లల మీద పోస్తారు. రేగి చెట్టుకు బదరీ వృక్షం అని సంస్కృతంలో పిలుస్తారు. శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని పురాణ వచనం. అలాగే ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగినవి ఈ రేగుపళ్లు. అందువల్ల వీటికి కొన్ని నాణేలను జత కలిపి పిల్లల తలపై పోస్తారు. వాటిని తలపై పోయడం వల్ల లక్ష్మీ నారాయణుల అనుగ్రహం మన పిల్లలకు ఉండటమేగాక, ఎలాంటి దిష్టి తగలకుండా దీర్ఘా ఆయుష్షుతో ఉంటారని ప్రతీతి. ఇలా పోయడంలో మరో అంతరార్థం ఏంటంటే..? మన బాహ్య నేత్రాలకి కనిపించని బ్రహ్మ రంధ్రం మన తల పైభాగంలో ఉంటుంది. ఈ భోగి పండ్లను పోయడంతో ఆ బ్రహ్మరంధ్రం ప్రేరేపించి జ్ఞానవంతులు అవుతారని ఒక నమ్మకం కూడా. అంతేగాదు ఈ రేగు పండ్లు సూర్య కిరణలలోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి, నిల్వ ఉంచుకుంటాయి కనుక వీటిని తల మీద పోయడం వలన వీటిలోని విద్యుచ్చక్తి, మన శరీరం, ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి. అందువలనే పిల్లలకి భోగి పండ్లు పోసి ఆశీర్వదిస్తారు పెద్దలు. (చదవండి: భోగి పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది? చలి మంటలు ఎందుకు వేస్తారు?) -
భోగి పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది? చలి మంటలు ఎందుకు వేస్తారు?
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడే వేరుగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆంధ్రలో ఈ పండుగ హడవిడి మాములుగా ఉండదు. వీధులన్నీ రంగవల్లులతో కొత్త కోడళ్లు, అల్లుళ్లతో సందడిగా ఉంటుంది. ఓ పక్కన కోడి పందేల జోరు, మరోవైపు నోరూరించే రకరకాల పిండి వంటలు రుచులుతో వాతావరణం అంతా ఆహ్లాదభరితంగా మారిపోతుంది. ఎంతెంత దూరాన ఉన్న ఈ పండుగ వస్తే ఊళ్లకే వచ్చేస్తారు అందరూ. అలాంటి ప్రాముఖ్యత గల ఈ పండుగల్లో మొట్టమొదటి రోజు జరుపుకునే భోగి పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది? ఆ రోజు చలిమంటలు ఎందుకు వేస్తారు?. తదితర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం!. భోగి అనే పేరు ఎలా వచ్చిందంటే.. 'భగ' అనే పదం నుంచి 'భోగి' అనే మాట వచ్చిందంటారు పెద్దలు. దక్షిణాయనానికి అఖరి రోజుగా భోగి పండుగను భావిస్తారు. ఎందుకంటే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి.. రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖసంతోషాలను ప్రసాదించాలని ప్రజలు కోరుకుంటారు. పురాణ ప్రకారం చూస్తే..పూర్వం ఈ దినమే శ్రీ రంగనధాస్వామి లో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని అందుకు సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాథ!. భోగిమంటలు ఎందుకంటే.. అందరూ అనుకుంటున్నట్లు చలికాలం కనుక వెచ్చదనం కోసం ఈ చలిమంటలు వేసుకోవడం లేదు. ఆరోగ్యం కోసం అనే చెప్పాలి. ఎందుకంటే..? ధనుర్మాసం నేలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశీ ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మక్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు అధికంగా గాల్లో విడుదలవుతుంది. అది పీల్చడం ఆరోగ్యానికి మంచిది. అదీగాక ఈ చలికాలంలోనే అనేక వ్యాధులు ప్రబలంగా వస్తాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పీడిస్తాయి. వాటికి ఇది ఔషధంగా పనిచేస్తుంది. అలాగే ఈ భోగిమంటలు పెద్దగా వచ్చేలా రావి, మామిడి, మేడి వంటి ఔషధ చెట్ల బెరడులను వేస్తారు. అవి బాగా కాలేలా ఆవు నెయ్యిని ఉపయోగిస్తారు. అలా అగ్నిహోత్రంలో వేసిన ప్రతి 10 గ్రాములు దేశీ ఆవునెయ్యి నుంచి ఒక టన్ను ప్రాణ వాయువు విడుదల అవుతుంది. ఈ ఔషధ మూలికలు, ఆవునెయ్యి, ఆవు పిడకలు కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలికి అత్యంత శక్తి ఉంటుంది. ఈ గాలి మన శరీరంలో ఉన్న 72 వేల నాడుల్లోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ఒకరికి రోగం వస్తే తగిన ఔషధం ఇవ్వోచ్చు. అదే అందరికీ ఇవ్వడం కాస్త కష్టం, పైగా అసాధ్యం కూడా. వైద్యం చేయించుకోలేని పేదవాళ్లు కూడా ఉండొచ్చు. ఇదంతా ఆలోచించే మన పెద్దలు అందరూ కలిసి భోగిమంటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరూ పాల్గొనేలా సంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుంచే వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదీగాక కులాలకు అతీతంగా ఈ పండుగ పేరుతో అందరూ ఒక చోట చేరడం ప్రజల మధ్య ఉన్న దూరాలను చెరిపేసి ఐక్యమత్యానికి శ్రీకారం చుడుతుంది. అంత మహిమాన్వితమైన ఈ భోగి పండుగ రోజును మీ లోగిళ్లో భోగిమంటలు వేసుకుని పెద్దచిన్న అంతా పాల్గొని ఆయురారోగ్యాల పొందడమే గాక భోగభాగ్యాలు కలిగేలా ఆనందంగా ఈ పండుగ జరుపుకోండి. (చదవండి: శని దోషాలు పోయి, సకల శుభాలు కలగాలంటే ఇలా చేయండి!) -
భోగి పండుగను ఇలా మాత్రం చెయ్యొద్దు!
అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ఊళ్లు, పల్లెలు జనసందోహంతో కళకళలాడిపోతుంటాయి. ఎంతెంత దూరమైనా వ్యయప్రయాసలు కోర్చి మరీ పట్టణాలు, విదేశాల నుంచి సోంతూళ్లకి పయనమైపోతుంటారు. అంతటి సరదాలు, ఆనందాలు తెచ్చే పండుగ ఈ సంక్రాంతి పండుగ. ఈ నాలుగు రోజుల పండుగకి ఉన్న క్రేజ్ మరే పండుగకి ఉండదేమో అన్నంతలా చిన్న పెద్ద భేదం లేకుండా జరుపుకునే పండుగ. అలాంటి ఈ పండుగను మన పూర్వీకులు ఏ ఉద్దేశ్యంతో ఇలానే జరుపుకోండని మనకు ఒక సంప్రదాయన్ని అందిస్తే దానికి తిలోదాకాలు ఇచ్చేసి తప్పుగా అర్థం చేసుకుంటూ పిచ్చిపిచ్చిగా జరుపుకుంటున్నాం. అజ్ఞానంతో పర్యావరణానికి హాని కలిగించడమే గాకుండా లేనిపోనీ అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాం. ఈ విషయమై పర్యావరణ అధికారులు, వైద్యులు, ఆయా పాలనాధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా దయచేసి ఇలా చెయ్యొద్దు అని వేడుకుంటున్నారు. ఇంతకీ ఈ పండుగను ఎలా జరుపుకోవాలి? ఎలాంటివి చెయ్యకూడదు?. వాళ్లంతా భయాందోళనలు వ్యక్తం చేయడానికి రీజన్? నిజానికి ఈ సంక్రాంతి పండుగలో భోగితో మొదలయ్యే తొలి పండుగ అంటే అందరికీ సరదానే. ఎందుకంటే? బోగి మంటలతో ప్రారంభమయ్యే ఈ పండుగ సఓ సంబరంలా అంతా ఒక చోట చేరి ఐక్యమత్యంగా జరుపుకుంటారు. అయితే ఈ భోగి మంటలకు కావాల్సిన కలప, పిడకలు, వంటివి నగరాల్లో అందుబాటులో ఉండవు. అదీగాక అభివృద్ధి పేరుతో ఓ టౌన్ మాదిరివి కూడా నగరాల్లో మారిపోయాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటవన్నీ అందుబాటులో ఉండవు. పైగా అందరికి వ్యయప్రయాసలు కోర్చి మరి సొంతూళ్లుకు వెళ్లడం కూడా కుదరదు. దీంతో వారంతా ఈ భోగమంటను ఇంట్లోని పాత వస్తువులను తగలబెట్టి భోగి మంట వేసుకోవడం లేదా టైర్లు, వేస్ట్ ప్లాస్టిక్ని తగలబెట్టడం వంట పనులు చేస్తారు. ఇలాంటి చలిమంట వల్ల పర్యావరణ కాలుష్యమే గాక, ఈ పొగ పీల్చడం వల్ల అనారోగ్య సమస్యల బారినపడతారు. ముఖ్యంగా ప్లాస్టిక్, టైర్లు వంటివి కాల్చడం వల్ల చాలా విషపూరితమైన వాయువులు గాల్లోకి విడుదల అవుతాయి. వీటిని పీల్చడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు, కేన్సర్ వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయి. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యనిపుణులు, పర్యావరణ అధికారులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పండుగ అనేది మనకు కొత్త ఉత్తేజన్ని తీసుకొచ్చి ఆనందంగా గడిపేలా ఉండాలే కానీ మన వినాశనానికి కారణమయ్యేలా ఉండకూదనేది వారి ఆవేదన. కానీ చాలామంది ఇలానే చేసి చేజేతులారా తమ ఆరోగ్యాన్ని పక్కవారి ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నారు. అస్సలు మన పూర్వీకులు ఎందుకని పండగను ఇలా భోగిమంటలతో చేసుకోవాలని చెప్పారు? దానిలో దాగున్న అంతరార్థం ఏంటో తెలుసుకోకుండా అజ్ఞానంతో తప్పుగా జరుపుకుని లేనిపోనీ సమస్యలు కొనితెచ్చుకుంటున్నాం. ఇంతకీ ఎలా చేసుకోవాలంటే.. పర్యావరణ హితంగా మంచి ఔషధ చెట్ల కలప లేదా ఆవుపిడకలతో వేసిన భోగిమంటే అన్ని విధాల మంచిది. దీని నుంచి విడుదలయ్యే వాయువులు పీల్చేతే శ్వాస సంబంధ సమస్యలు తలెత్తవు. మన పూర్వీకులు ఈ భోగి మంటల వేయడానికి కారణం కూడా ఈ రోజుల్లో చలి ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇలా రావి, వేప వంటి ఔషధ గుణాలు గల చెట్ల దుంగల్ని తెచ్చి మంట వేస్తారు. అందులోనే దేశీ ఆవు నెయ్యి, పిడకలు వంటివి కూడా వేస్తారు. ఇలా భోగిమంటను వేసి దాని నుంచి విడుదలయ్యే గాలిని పీల్చితే ఎలాంటి అనారోగ్య సమస్యల రావు. పైగా శ్వాసకోశ సమస్యలు కూడా ఉండవు. ఈ శీతాకాలంలో వచ్చే జలుబు, ఆయాసం వంటి సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలని మన పెద్దలు ఈ ఆచారాన్ని తీసుకొచ్చారు. అయితే దీన్ని తప్పుగా అర్థం చేసుకుని ఇంట్లోని పాత వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు, పాత టైర్లతో చలిమంటలు వేసుకుని అనారోగ్యం పాలవ్వుతున్నారు. తెలియకుండానే అటు దేవుడి అనుగ్రహానికి నోచుకోక పోగా, ఇటు ఆరోగ్యాన్ని చేజేతులారా నాశనం చేసుకున్నవారవమవుతున్నాం అని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల దయచేసి ఇలా మాత్రం చేసుకోవద్దు. అవన్నీ అందుబాటులో లేకపోతే కనీసం కొబ్బరి చిప్పలు, వేపాకులు వంటివి తెచ్చుకుని భోగిమంట వేసుకోండి. ఇది కూడా ఆరోగ్యానికి అన్ని విధాల మంచిదే అని హితవు చెబుతున్నారు పర్యావరణ నిపుణులు. అందువల్ల అందరం ఈ పండుగను ఆరోగ్యకరమైన రీతీలో పర్యావరణ హితంగా జరుపుకుని ఆరోగ్యమనే భాగ్యాన్ని, సంతోషమనే సంపదను పొందుదాం. -
హాంగ్కాంగ్లో భలేగా బుజ్జాయిలతో భోగి!
తెలుగు సంస్కృతిలోని అందచందాలు చాలా ఎక్కువగా కనబడేది పండుగ సమయాలలోనే ఉదాహరణకు, సంక్రాంతినే తీసుకోండి. సంక్రాంతిలో అచ్చమైన తెలుగుదనం వెలుగుతూ ఉంటుంది. భోగి, మకర సంక్రమణం, కనుమ - ఈ మూడు రోజులూ పండుగే కనుక, దీన్ని పెద్ద పండుగ అంటారు. మన పండుగలకు చాలా సామాజిక, సాంప్రదాయ, సాంస్కృతిక మరియు స్వాభావికమైన ఆరోగ్య విలువలు ఉంటాయి. ఈ పండుగలలో పెద్దల ఆశీర్వదిస్తారు. పిల్లలు మహా సందడిగా ఉంటారు. ప్రత్యేకంగా భోగి పండుగనాడు సంబరమంతా పిల్లలదే. కొత్త బట్టలు ధరించి భోగి మంటల్లో భోగి పిడకలు వేయడంతో భోగి సంబరాలు మొదలవుతాయి. భోగిపళ్లలో, చెర్రీస్, శనగలు, చేమంతి, బంతి, గులాబీ పువ్వుల రేకులు, అక్షింతలు, చిల్లర నాణేలు, చాక్లెట్లు కలిపి సాయంత్రం భోగిపండ్లు పిల్లలకు దిష్టి తీసి వాటిని తలపై పోస్తారు. పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చినవారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలూ, పసుపు-కుంకుమలూ పెట్టడం ఆనవాయితీ. అయితే ప్రవాస భారతీయులుగా పండుగకు కావాల్సినవన్ని వారున్న దేశంలో సమకూర్చుకోలేకపోయినా, లభ్యమైన వాటితోనే వారు ఎంతో ఆనందోత్సాహాలతో పండుగలన్నీ సాంప్రదాయబద్ధంగా చేసుకునే ప్రయత్నం చేస్తారు. హాంగ్ కాంగ్ లో నివసిస్తున్న తెలుగు వారు కూడా ప్రతి యేట రెట్టింపు వుత్సాహంతో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి పండుగ వివరాలు తెలుపుతూ, వారి పాపకి భోగి పండ్లు సంధర్భంగా, తమ ఎస్టేట్ లో వున్న మరి కొంత మంది పసి పిల్లల్ని కలుపుకొని ‘బుజ్జాయిలతో భోగి’ చేయడం మొదలుపెట్టగా, భగవంతుని ఆశశీస్సులతో రెండు దశాబ్దాలుగా ఈ సంక్రాంతి వేడుక నిర్విఘ్నంగా కొనసాగుతున్నందుకు తమకు ఎంతో ఆనందాన్ని తృప్తినిస్తోందని తెలిపారు. హాంగ్కాంగ్లో ‘డూడు బసవన్నలు’ మరియు ‘గంగిరెద్దుల ఆటలు’ కనిపించక పోయినా, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ‘బుజ్జాయిలతో భోగి’ సందడి క్రిస్మస్ సెలవల నుంచే మొదలవుతుంది. సెలవలకి భారతదేశం వెళ్ళినప్పుడు, రానున్న సంక్రాంతి పండుగకు కావాల్సిన వస్తువులు, క్రొత్త బట్టలు, నగలు, బొమ్మలు మొదలగునవి తెచ్చుకోవడం ఒక ఆనవాయితీగా మారింది. అమ్మల పట్టు చీరలు, తళ తళ మెరిసే మేలిమి నగలు, నాన్నల పంచే సర్దుకొంటూ పిల్లల వెంట పరుగులు, చిన్నారుల క్రొత్త బోసి నవ్వులు - కేరింతలు, పిల్లల కాలి మువ్వల సవ్వడులుతో పండుగ వాతావరణానికి ఆహ్వానాలుగా ధ్వనిస్తాయి. అమ్మమ్మలు - బామ్మలు - తాతయ్యల మురిపాల నవ్వులు, సంతోషాలు ఆ భోగిపళ్ళ సందడికే ప్రకాశాన్నిస్తున్నాయి.. అందరూ భోగిపళ్ళతో సమావేశంకాగా అమ్మమ్మ - బామ్మల హస్తాల మీదుగా దీప ప్రజ్వలనంతో కార్యక్రమం ప్రారంభం కాగా, హాంగ్ కాంగ్ ప్రముఖ గాయని శ్రీమతి హర్షిణి ప్రార్థనగీతం ఆలపించగా, పెద్దలు వారు ముందుగా పిల్లలకి భోగి పళ్ళు పోసి ఆశీర్వదించగా, తల్లి తండ్రులందరు వరుసగా పిల్లలందరికి భోగి పళ్ళు పోసి ఆశీర్వదించారు. పిల్లలందరికి మరింత ఆసక్తి ఉత్సాహాన్ని ఇచ్చేది, పాల్గొంటున్న వారిచ్చే చిరు కానుకలు. వాటిని పుచ్చుకునేందుకు పిల్లల అరుపులు, కేకలు , పరుగులు ఎంత ముచ్చటగా వుంటాయో కదా. మరి కానుకలు అందుకున్న తరువాత వాటిని విప్పి చూసే హడావిడి మీ ఊహకే అంటున్నారు సంతోషంగా, ‘ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య’ సాంస్కృతిక బృందం నుంచి రమాదేవి, మాధురి, హర్షిణి, రాధిక. ఫిబ్రవరిలో తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మరొక్క మంచి మాట, హాంగ్కాంగ్లో కూడా మన దేశంలో సంక్రాంతికి గాలి పటాల పోటీల వలె ఇక్కడ జాతీయ - అంతర్జాతీయ గాలి పటాల పోటీలు నిర్వహిస్తుంటారు.. మీకు తెలుసా, గాలిపటాలు ఎగురవేయడం హాంగ్కాంగ్, చైనాలో ఒక ప్రసిద్ధ కాలక్షేపం. మొదటి గాలిపటం షాన్డాంగ్లో సన్నని చెక్క ముక్కలతో తయారు చేయబడిందని నమ్ముతారు. చైనీస్ గాలిపటాల నమూనాలు ఎక్కువగా జానపద కథలు మరియు బొమ్మలపై ఆధారపడి ఉంటాయి. మీరు తరచుగా డ్రాగన్లు, పువ్వులు, గోల్డ్ ఫిష్, సీతాకోకచిలుకల వంటి ఐకానిక్ చిహ్నాలు మరియు డిజైన్లను చూసివుంటారు. ఇలా అనేక దేశాలలో గాలిపటాలు ఎగురవేయడం ప్రసిద్ధి చెందింది - భారతదేశం, నేపాల్, ఆఫ్గనిస్థాన్, పాకిస్తాన్, చైనా, జపాన్, తైవాన్, గ్రీస్, సైప్రస్, దక్షిణ అమెరికా, పాలినేషియా, ఇండోనేషియా, హాంగ్కాంగ్. (క్లిక్ చేయండి: బెర్లిన్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు) -
ముగ్గులోనే ముగ్ధరూపాలు
వ్రతం చేసిన ఆండాళ్ భోగినాడు రంగనాథుడిలో ఐక్యం అయిందని ప్రతీతి. ధనుర్మాసంలో దాపున ఉన్న కోవెలలో ముగ్గులతోనే ఆధ్యాతిక ఆరాధన చేసింది హైదరాబాద్లో స్థిరపడ్డ కన్నడ చిత్రకారిణి లభ్య. ముగ్గులలోనే అందమైన దేవతా మూర్తులను తీర్చిదిద్దడం బాల్యంలో తన తాత వద్ద నేర్చుకున్నానని చెబుతోంది. లభ్య బొమ్మలు సంక్రాంతి కళకు వన్నె తెచ్చాయి. ‘ఇదంతా మా తాతయ్య చెలువయ్య చలువ’ అంది లభ్య తాను వేసిన ముగ్గు మూర్తులను చూపుతూ కొద్దిగా తెలుగు, మరింత కన్నడం భాషల్లో. హైదరాబాద్ బాచుపల్లిలోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో నివసించే లభ్యది బెంగళూరు. ధనుర్మాసం మొదలయ్యాక కమ్యూనిటీలో ఉన్న గుడిలో ఆమె నిత్యం వేసే ముగ్గు బొమ్మలు చుట్టుపక్కల వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒక్కో బొమ్మను తీర్చిదిద్దడానికి లభ్య ఏడెనిమిది గంటలు వెచ్చించాల్సి వచ్చింది. ‘మా తాత పేరు చెలువయ్య. ఆయన బెంగుళూరు జ్ఞానభారతి యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా పని చేసేవారు. దీపావళి, సంక్రాంతి పండుగ సమయాల్లో ఇంటిముందు చక్కని ముగ్గులు రంగులతో వేసేవారు. చిత్రాన్ని జాగ్రత్తగా వేయడం, దాన్ని రంగులతో నింపడం ఆయన వద్దే నేర్చుకున్నా’ అంటుంది లభ్య. తాత ప్రభావం వల్లే చిన్నప్పటి నుంచి బొమ్మలు గీస్తూ పెరిగిన లభ్య ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉద్యోగంలో చేరింది. ఉద్యోగం చేస్తూనే వివిధ రీతుల చిత్రకళని పరిశీలిస్తూ కుంచెకు పదును పెట్టుకుంటూ వచ్చింది. బెంగుళూరులో చిత్రకళ ఉపాధ్యాయినిగా కూడా పని చేసింది. వివాహానంతరం కొన్నాళ్లకి పూర్తి దృష్టి చిత్ర లేఖనం మీద పెట్టే ఉద్దేశ్యంతో ఉద్యోగానికి స్వస్తి చెప్పి గ్వాలియర్లోని రాజా మాన్సింగ్ తోమర్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్లో చిత్రకళను అభ్యసించింది. కాని ఆమె ప్రత్యేకత అద్భుతమైన చిత్రాలను ముగ్గులుగా నేలమీద ఆవిష్కరించడంలో ఉంది. పండుగ సందర్భాల్లో దేవతామూర్తులను, పండగ సందర్భాన్ని రంగుల ముగ్గులుగా చిత్రిస్తుంది.‘ఈ ధనుర్మాసంలో తిరు΄్పావై పాశురాలకు దృశ్యరూపం ఇచ్చాను ముగ్గుల్లో’ అందామె. వీణలో కూడా డిప్లొమా చేసిన లభ్య వద్ద చిత్రకళ నేర్చుకున్న విద్యార్థులు చాలామందే ఉన్నారు. కేవలం గీతలు రంగులు మాత్రమే కాక ఒక చిత్రాన్ని ప్రేమతో, భావోద్వేగంతో ఎలా అర్థం చేసుకోవాలో, భావనల్ని ఆలోచనలని సంప్రదాయకళగా, మోడర్న్ ఆర్ట్గా, ఫ్యూజన్ ఆర్ట్గా ఎలా మలచవచ్చో లభ్య తన విద్యార్థులకు నేర్పిస్తుంది. 2022 ముంబైలో జరిగిన ఇండియా ఆర్ట్ ఫెస్టివల్లో, బెంగుళూరులో జరిగే ‘చిత్ర సంతె’లో లభ్య చిత్రాలు అమ్ముడు΄ోయాయి. రాజా రవివర్మ చిత్రాలను ఎంతో ప్రతిభావంతంగా లభ్య పునః చిత్రీకరించింది. ఏ కళలో అయినా స్త్రీలు పురోగమించడానికి కుటుంబ బాధ్యతలు కొంత ఆటంకం కల్గిస్తాయని, పురుషులకు ఉన్న సౌకర్యం స్త్రీలకు ఎల్లవేళలా ఉండదంటోంది లభ్య. -
తెలుగులోగిళ్లలో భోగి సంబరాలు.. సందడే సందడి
-
పందెం కోళ్ళు...సంక్రాంతి ప్రత్యేకం
-
భోగిమంటల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి
-
ఖమ్మం జిల్లాలో ఘనంగా భోగి వేడుకలు
-
తెలుగువారి సిరుల పండగ సంక్రాంతి
-
భోగి భాగ్యాలు
-
మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంట్లో భోగి వేడుకలు
-
కాకినాడలో ఘనంగా భోగి వేడుకలు
-
భోగి వేడుకల్లో స్టెప్పులతో హుషారెత్తించిన మంత్రి అంబటి
-
మంత్రి రోజా ఇంట్లో సంక్రాంతి సంబరాలు
-
ఏలూరు వ్యాప్తంగా అంబరాన్నంటుతున్న సంక్రాంతి సంబరాలు
-
సంక్రాంతి వేడుకల్లో సీఎం జగన్ దంపతులు
12:01PM సీఎం జగన్.. నవరత్నాలతో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించిన నేపథ్యంలో గ్రామ సచివాలయం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలు తదితర సేవల ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాక్షాత్కారం చేసిన తీరును సాంస్కృతిక కార్యక్రమం ద్వారా కళ్ల కట్టారు. 11: 45AM సింగర్ హారిక నారాయణ్, ప్రముఖ జానపద గాయని కనకవ్వ తదితర కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మంచి జోష్తో పాటలు పాడి వీరు.. ఈ వేడుకలకు మరింత అందం తెచ్చారు. 11:38AM ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమ్మా ఉయ్యాల కోన జంపాల.. పాట పాడిన చైల్డ్ సింగర్ ప్రకృతి రెడ్డి. అనంతరం సీఎం జగన్ ఆశీర్వాదం తీసుకున్న చిన్నారి.. సీఎం జగన్ దంపతులతో సెల్ఫీ కూడా దిగింది. 11:20AM ‘శ్రీనివాస కల్యాణం’ ప్రదర్శన.. తిలకించిన సీఎం జగన్ దంపతులు ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుడు ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ‘శ్రీనివాస కల్యాణం’ ప్రదర్శనను సీఎం జగన్ దంపతులు తిలకిస్తున్నారు. 10:49AM గోశాలలో గోపూజ చేసిన సీఎం జగన్ దంపతులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంట సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. సీఎం జగన్ దంపతులు ముందుగా జ్యోతిని వెలిగించి సంక్రాంతి సంబరాల్ని ప్రారంభించారు. అనంతరం గోశాలలో గోపూజ చేశారు సీఎం జగన్ దంపతులు. ఆపై భోగి మంటను వెలిగించిన సీఎం జగన్.. హరిదాసు కీర్తనలు ఆలకించి ఆశీర్వాదం తీసుకున్నారు. రైతులు, పల్లె ప్రజలతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం సీఎం జగన్కు ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వేడుకల నిర్వహిస్తున్నారు. రైతులు, పల్లె ప్రజలతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం సీఎం జగన్కు ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వేడుకల నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా సీఎం జగన్ ఇంటి ఆవరణలో భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేశారు. వ్యవసాయ సామగ్రి, ఎడ్ల బండ్లు, గడ్డి వాములు, పశుసంపద, కుల వృత్తుల చిత్రాలతో పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పర్యవేక్షణలో ఈ సంబరాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి.. నవరత్నాలతో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించిన నేపథ్యంలో గ్రామ సచివాలయం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలు తదితర సేవల ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాక్షాత్కారం చేసిన తీరును కళ్లకు కట్టనున్నారు. ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుడు ఆనంద్ నేతృత్వంలో ‘శ్రీనివాస కల్యాణం’ ప్రదర్శిస్తారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమ్మా ఉయ్యాల కోన జంపాల.. పాట పాడిన గాయని ప్రకృతి రెడ్డి, అదే సినిమాలో ఎత్తర జెండా.. పాట పాడిన హారిక నారాయణ్, ప్రముఖ జానపద గాయని కనకవ్వ తదితర కళాకారులు ఈ వేడుకల్లో పాలుపంచుకోనున్నారు. -
మార్గాని భరత్ నివాసంలో భోగి వేడుకలు
-
విశాఖలో ఘనంగా భోగి వేడుకలు
-
హైదరాబాద్ లో భోగి మంటల వెలుగులు
-
గుంటూరు జిల్లాలో అంబరాన్నంటుతున్నసంక్రాంతి సంబరాలు
-
విజయవాడలో ఘనంగా భోగి వేడుకలు
-
దేశ వ్యాప్తంగా భోగి వేడుకలు
-
Bhogi 2023: భోగి వచ్చిందోచ్
మసక చీకటిలో భోగి మంటలు ఇంటి ముంగిటిలో వెలుతురును తెస్తాయి. పాత వస్తువులను దగ్ధం చేసి కొత్త ఉత్సాహంలోకి అడుగు పడేలా చేస్తాయి. జనులెల్లా భోగభాగ్యాలతో విలసిల్లాలని కోరే పండగ భోగి. తెల్లవారుజాము తలంట్లూ దోసెలూ మసాలా కూరలూ చంటిపిల్లల భోగిపండ్లూ మూడు రోజుల సంక్రాంతి సంబరాలకు బోణి–భోగి. మనిషిని భోగంతో బతకండి అంటుంది ఈ పండగ. సంతోషాన్ని, సంతృప్తిని కనుగొనడంలోనే భోగం ఉందని చెబుతుంది ఈ పండగ. చలి వంటి జడత్వాన్ని ఉష్ణమనే చైతన్యంతో పారద్రోలి మనిషిని కర్తవ్యోన్ముఖుణ్ణి చేసేది భోగి. పరిశ్రమే భోగమూ భాగ్యమూ అని చెప్పేదే భోగి. భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో భోగిమంటల భోగుల్లో తెల్లారకుండానే పల్లెపల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో... చీకటిని తనకు తానుగా తరిమికొట్టడానికి వెలుతురు మంటను ఇంటి ఇంటి ముంగిటకు, వీధి వీధిలోనా, ప్రతి కూడలిలో మనిషి రాజేసే ఇలాంటి పండగ మరొకటి లేదు. అంత ఉదయాన లేచి పాతవన్నీ పనికి మాలినవన్నీ దగ్ధం చేసి నవీనతలోకి అడుగుపెడదామని మనిషి అనుకునే పండగ కూడా ఇలాంటిది వేరొకటి లేదు. తెల్లారకుండానే పల్లె లేస్తుంది. మనిషీ లేస్తాడు. ఎర్రటి నాల్కులు సాచుతూ మొద్దు చలిని, మంచు మందాన్ని కోస్తూ మంటా పైకి లేస్తుంది. ‘రేపటి నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి వస్తాడు. కాంతి ప్రకాశవంతం అవుతుంది. జీవితాన్ని ప్రకాశవంతం చేసుకోవడానికి సిద్ధపడు’ అని ఇవాళ మనిషిని సిద్ధం చేయడానికి వస్తుంది భోగి. ఎల్లవేళలా శుభ్రంగా స్నానం చేసి, మంచి బట్టలు కట్టుకుని, నచ్చింది తినడానికి మించిన భోగం లేదు. అందుకే భోగినాడు తలంట్లు తెలుగునాట ఫేమస్. భోగిమంటలు కాగానే స్త్రీలు కాగుల్లో, గంగాళాలలో వేడినీళ్లు సిద్ధం చేస్తారు. ఇంటి పిల్లలు, మగవాళ్లు నలుగు పెట్టుకుని ఒంటిని తోముకోవాలనే ఆనవాయితీ. ఆ తర్వాత తలంట్లు. కొత్త బట్టలు. కొత్తబియ్యం పాయసం. ఒళ్లు, ఇల్లు, పరిసరాలు శుభ్రంగా ఉండటం, శుభ్రమైన పరిసరాల్లో సుఖవంతంగా జీవించడం భోగం. అందుకే భోగి శుభ్రతను సూచిస్తుంది. శుభ్రత అంటే బయట శుభ్రత మాత్రమే కాదు... ఆత్మిక, ఆధ్యాత్మిక శుభ్రత కూడా. జ్ఞాన శుభ్రత కూడా. వివేచనా శుభ్రత. అజ్ఞానాన్ని మించిన అంధకారం లేదు. సరైన ‘చదువు’, దృక్పథం మనిషికి ఉండాలి. మూకలు చెప్పినట్టు చేయరాదు. అలాంటి అజ్ఞాన అంధకారాన్ని మంటల్లో వేసి మాడ్చి మసి చేయమని చెబుతుంది భోగి. నీలోని కల్మషాన్ని, కసిని, పగని, ద్వేషాన్ని, చెడుని తగులబెట్టు అని చెబుతుంది భోగి. మనలో మంచితనం నిండటమే భోగం. మంచివాడిగా బతకడం, అగ్నిలా స్వచ్ఛంగా ఉండటం భోగం. అగ్నికి చీడ అంటదు. అలాంటి జీవితం జీవించగలగాలని సూచన. భోగం అంటే కేవలం ఐశ్వర్యం అనే అర్థం చూడరాదు. అన్నివేళలా చెరగని చిర్నవ్వును ధరించి ఉండగలగడం కూడా భోగమే. భోగిపళ్లు రేగిపండ్లు సూర్యుడి నుంచి ఎక్కువ శక్తిని గ్రహించి దాచుకుంటాయట. ఎటువంటి జటిల వాతావరణం లోనైనా, ఉష్ణోగ్రతలో అయినా ఎదురు తిరిగి బతికి రేగుచెట్లు నిలబడతాయట. చంటి పిల్లలు కూడా అలాంటి శక్తితో అలాంటి ఆయుష్షుతో దిష్టి గిష్టి వదిలించుకుని ఈ కొత్తకాలంలోకి ప్రవేశించాలని భోగినాటి సాయంత్రం భోగిపళ్ల పేరంటం పెడతారు. రేగుపండ్లు, తలంబ్రాలు, రాగి నాణేలు, చిల్లర పైసలు, పూల రెక్కలు కలిపి పిల్లల నెత్తిన పోసి, దిగవిడిచి దిష్టి తీస్తారు. చిట్టి చిట్టి రేగుపళ్ళు చిట్టి తలపై భోగిపళ్ళు ఎంతో చక్కని భోగిపళ్ళు ఎర్ర ఎర్రని రేగుపళ్ళు.... అని పాటలు పాడతారు. ఆయుష్షుతో ఉండటం భోగం. అందుకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం భోగం. పరిస్థితులను ఎదుర్కొనే గుండె దిటవును కలిగి ఉండటం భోగం. బొమ్మల కొలువులు... గొబ్బి పాటలు భోగినాడు బొమ్మల కొలువు పెడతారు కొంతమంది. చిన్నపిల్లలు తమ బొమ్మలు, సేకరించిన బొమ్మలు తీర్చిదిద్ది సంబరపడతారు. ఇక భోగితో మొదలెట్టి పండగ మూడు రోజులూ సాయంత్రం సందె గొబ్బెమ్మలను పెడతారు. వాటి చుట్టూ ఆడవారందరూ చేరి గొబ్బిళ్ళ పాటలు పాడుతూ గొబ్బెమ్మల చుట్టూ ఆడతారు. ‘గొబ్బియళ్ళో సఖియా వినవె చిన్ని కృష్ణుని చరితము గనవె చిన్ని కృష్ణుని మహిమను గనవె ..... ‘ ‘సుబ్బీ సుబ్బమ్మ శుభము నీయవె తామర పువ్వంటి తమ్ముణ్ణీయవె చామంతి పువ్వంటి చెల్లెల్నీయవె’ లాంటి పాటలు పాడతారు. పెళ్ళి కాని అమ్మాయిలు ‘మొగలి పువ్వంటి మొగుణ్ణీయవె’ అని కలుపుతారు. పండగ అంటే అందరికి సంతోషాన్ని ఇచ్చేది. అందరి శుభాన్ని కోరడం భోగం. ఈ భోగి సకల శుభాలను తేవాలని కోరుకుందాం. -
సంక్రాంతి సంబరాలు షురూ.. గిరి పల్లెల్లో మొదలైన సందడి
బుట్టాయగూడెం (ఏలూరు జిల్లా): సంక్రాంతి.. ఇది ఒక పండుగ మాత్రమే కాదు. ఎన్నెన్నో అనుభూతులు, మరెన్నో మేళవింపులు... భావోద్వేగాలు... ఒక మాటలో చెప్పాలంటే ఏడాదికి సరిపోయే ఎన్నో అద్భుతమైన తీపి జ్ఞాపకాల సంబరం. అలాంటి పండుగ రెండు వారాల్లో రాబోతుంది. అయితే అంతకన్నా ముందే పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఆట పాటలతో హోరెత్తించారు. సంక్రాంతి అనగానే వెంటనే గుర్తుకు వచ్చేవి భోగిమంటలు.. సంప్రదాయ పంచెకట్లు, పట్టు పరికిణీలు, గంగిరెడ్లు, డూడూ బసవన్నలు, సన్నాయి వాయిద్యాలు, రంగురంగుల ముగ్గులు, ఎడ్ల పందేలు, కోడి పందేలు, జానపదాలు, సరదాలు, షికార్లు ఇలా అనేక రకమైన కళలు, సాంస్కృతిక మైమరపుల కలబోతే సంక్రాంతి. సంక్రాంతి పండుగలో సాంస్కృతిక శోభను అదిమి పట్టుకునే విధంగా బుట్టాయగూడెం మండలంలోని తెల్లంవారిగూడెం పాఠశాలలో సంక్రాంతి సంబరాలను ఉపాధ్యాయులు నిర్వహించారు. హరిలో రంగ హరి అంటూ హరిదాసు సందడి, భోగిమంటలు, గొబ్బెమ్మలతో ముగ్గులు, రోలులో పిండి కొట్టే సాంప్రదాయం ఇలా అన్ని ఉట్టిపడేలా ఏర్పాటు చేసి ముందుగానే సంక్రాంతి సందడిని తీసుకువచ్చారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద సంక్రాంతి వచ్చిందే తుమ్మెద.. సరదాలు తెచ్చిందే తుమ్మెద... అంటూ సాగే పాటకు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో పాటు ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సైతం నృత్యాలు చేశారు. అదేవిధంగా భోగి తెచ్చే భోగం అనే పాటకు కూడా విద్యార్థులతో పాటు బాలరాజు నృత్యం చేసి అందరినీ అలరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పండగను ఆనందోల్సాహాలతో జరుపుకున్నారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు సంక్రాంతి, జానపద పాటలకు నృత్యాలు విద్యార్థినులను ఉత్సాహపరిచారు. (క్లిక్ చేయండి: ఆంధ్రా ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి) -
భోగి సంబరాల్లో అంబటి రాంబాబు డ్యాన్స్
సాక్షి, గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా సంక్రాంతి శోభ సంతరించుకుంది. శుక్రవారం తెల్లువారుజాము నుంచే భోగి మంటలు వేయటంతో పండగ వాతావరణం సందడిగా మారింది. పలువురు రాజకీయ ప్రముఖులు భోగి మంటల వేడుకల్లో సందడి చేశారు. గుంటూరు జిల్లాలొని సత్తెనపల్లిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే అంబటి రాంబాబు పాల్గొన్నారు. గాంధీ బొమ్మ సెంటర్లో సాంప్రదాయబద్దంగా భోగి మంటలు వేశారు. అనంతరం ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. మహిళలలో హుషారుగా డ్యాన్స్ చేసి అక్కడ ఉన్నవారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భోగి సంబరాల్లో పాల్గొనటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలకు తోడుగా జగనన్న సంక్షేమ పథకాలు ఉన్నాయన్నారు. -
Sankranti 2022 : తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు
-
తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పండగ తెచ్చే సంబరాలతో ప్రతిఇంటా ఆనందాలు వెల్లివిరియాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ‘మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) January 14, 2022 -
తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు..
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా సంక్రాంతి శోభ సంతరించుకుంది. శుక్రవారం తెల్లువారుజాము నుంచే భోగి మంటలు వేయటంతో పండగ వాతావరణం సందడిగా మారింది. పలువురు రాజకీయ ప్రముఖులు వారి ఇళ్ల వద్ద భోగి మంటలు వేసి.. ప్రజలుకు భోగి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్సార్ కడప జిల్లా: భోగి పండగ సందర్భంగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా బంధువుల ఇంట్లో ఏర్పాటు చేసిన భోగి సంబరాల్లో పాల్గొన్నారు. సంబేపల్లె మండలం, శెట్టిపల్లె గ్రామం తిమ్మక్కగారిపల్లెలో కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా భోగి మంటలు వేశారు. తన సోదరుడు మాజీ జడ్పీటీసీ ఉపేంద్రరెడ్డి నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొని ఎమ్మెల్యే రోజా పాత రోజులు గుర్తు చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా: రామచంద్రాపురంలో మంత్రి వేణుగోపాల కృష్ణ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగియి. గ్రామీణ సంక్రాంతిని ప్రతిబింబించే విధంగా సెట్టింగ్ ఏర్పాటు చేశారు. భోగి మంటలు వేసి, కోలాటంతో సందడి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలుగు సాంప్రదాయాల గురించి భవిష్యత్ తరాలకు తెలియజెప్పాలనే సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాని తెలిపారు. కృష్ణా: కృష్ణా జిల్లా విజయవాడలోని 42వ డివిజన్లో కార్పొరేటర్ చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి వేడుకల్లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు మంత్రికి కోలాట నృత్యాలతో స్వాగతం పలిపారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం జగన్ మోహన్రెడ్డి పరిపాలనతో రాష్ట్రప్రజలు సంతోషంగా పండగ జరుపుకుంటున్నారని తెలిపారు. ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం తోడుగా ఉండేలా సీఎం జగన్ కార్యక్రమాలు చేపడుతున్నారని గుర్తుచేశారు. నెలకొక పండుగ మాదిరి సంక్షేమ పథకాలను సీఎం ప్రవేశపెడుతుంటారని చెప్పారు. అటువంటి మంచి ముఖ్యమంత్రి నేతృత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈభోగి మంటల్లో కరోనా ఆహుతైపోవాలని, ప్రజలంతా ఆరోగ్యంతో ఉండాలని అన్నారు. ప్రజలకు మంచి చేస్తుంటే జగన్పై చంద్రబాబు విషం కక్కుతున్నారని అన్నారు. నెల్లూరు: నెల్లూరులో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆయన ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి భోగిమంట వేశారు. ప్రజలకు భోగి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. -
Bhogi Festival: భోగం వైభోగం.. భోగి పళ్లు ఎందుకు?
Bhogi 2022: మన మహర్షులు కాలంలో జరిగే మార్పులను గమనించి, ఖగోళంలో జరిగే మార్పులను తెలుసుకుని, ఆయా సమయాల్లో మనం ఏ విధంగా ప్రవర్తించాలో, దైవాన్ని ఎలా ఆరాధించాలో, ఏమేమి చెయ్యాలో తెలియజేస్తూ మనకు అనేక పండుగలను, పర్వదినాలను ఏర్పరిచారు. ఈ సంక్రాంతి పండుగ గోవులకు, ప్రకృతికి, పరమాత్మకు, పల్లెలకు, పొలాలకు, పంటలకు, మానవులకు సంబంధించిన పండుగ. మన సంస్కృతికి సంప్రదాయాలకు, ప్రకృతి ఆరాధనకు, కృతజ్ఞతా ప్రకటనకు సంబంధించిన పండుగ. మనది – వ్యవసాయ ప్రధానమైన దేశం. పంటలు చేతికొచ్చి, ఫలసాయం అందినందువల్ల దానిని పది మందికీ పంచుతూ అలా పంచటంలోని ఆనందాన్ని అనుభవించటం భారతీయులందరికీ ఆచారం. ప్రకృతిలో జరిగే గొప్ప మార్పు సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించటం. దీనినే మకర సంక్రమణం, ’మకర సంక్రాంతి’ పండుగ అంటాము. ఈ మకర సంక్రమణం ముఖ్యంగా పితృదేవతలకు తర్పణాలను సమర్పిస్తూ కృతజ్ఞతలు ప్రకటించ వలసిన ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన రోజు. దైవారాధన – సూర్యారాధన చెయ్యవలసిన రోజు. దీనికి ముందురోజు భోగి పండగ జరుపుకుంటాం. భోగి అంటే భోగం, సౌఖ్యం. భోగాన్ని అనుభవించేవాడు భోగి. అతను మహా యోగి, ఇతను మహా భోగి అంటుండటం వాడుకలో గమనిస్తాము. భోగాలను అనుభవించమని ప్రబోధించే పండుగ భోగి పండుగ. ఈ పండుగలో ఏ రోజు విశిష్టత ఆ రోజుదే అయినా, భోగి పండుగ నాడు మనమందరమూ ఆచరించే విశేషమైన అంశాలెన్నో ఉన్నాయి. భోగి పండుగ మానవులందరినీ భోగము ననుభవించమని, ఆనందంగా ఉండమనీ చెప్తోంది. పరమాత్మ పంచభూతాత్మకమైన, భోగ స్వరూపమైన ప్రకృతిని సృష్టించి, ఆ సృష్టిలోని భోగాలను ఎలా అనుభవించాలో ఆ జ్ఞానాన్ని విధి నిషేధ రూపమైన వేద విజ్ఞానరూపంగా అనుగ్రహించాడు. మనం ఆ నియమాలను పాటిస్తూ భోగాలననుభవించాలి. భోగి పండుగనాడు సూర్యోదయానికంటే ముందే ఇంటిల్లిపాదీ నిద్ర లేచి, ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కుని, అందరూ కలిసి ఆరుబైటకు చేరి, భక్తితో భోగిమంటలు వెయ్యటం అన్నది మనకి అనాదిగా వస్తున్న సంప్రదాయం. భోగిమంటల కోసం దైవ నామ స్మరణ చేస్తూ, ఆవుపేడ పిడకలను, సమిధలను పెట్టి, కర్పూరంతో అగ్నిని రగిలిస్తారు. అగ్నిదేవుని ప్రార్ధిస్తారు. ఆ మంటలు కాస్త పెరిగాక, ఇంట్లో ఉన్న పాత సామాన్లను, అక్కర్లేని చెక్కముక్కలను అన్నింటినీ ఆ మంటల్లో వేస్తారు. అంటే అక్కర్లేని చెత్తను వదిలించుకుని కొత్తదనాన్ని కోరటం కనిపిస్తుంది. భోగిమంటల వల్ల మనకు కలిగే మరొక లాభమేమిటంటే, ఈ భోగి మంటలలో ఆవుపేడ పిడకలను, సమిథలను వెయ్యటం వలన అవి కాలుతున్నప్పుడు వచ్చే ధూమం వాతావరణాన్ని శుభ్రపరుస్తుంది. పిల్లలందరూ ఈ భోగి మంటలను ఉత్సాహంగా చేస్తారు, ఎంతో ఆనందిస్తారు. భోగి మంటలలోని అంతరార్ధం ఏమిటంటే, బాధ కలిగించే అక్కర్లేని ఆలోచనలను, రాగద్వేషాది దుర్గుణాలను, కోపతాపాలను అగ్నిలో దగ్ధం చెయ్యాలి అంటే రాగద్వేషాలను వదిలెయ్యాలి అని గ్రహించటం. అందరితో సౌమనస్యంతో ఉండాలని నిర్ణయించుకోవటం. భోగి పండుగ నాడు శ్రీ సూర్యనారాయణ స్వామిని, కుల దైవాన్ని, ఇష్టదైవాన్ని, శ్రీ కృష్ణ పరమాత్మను, త్రిలోకాధిపతియై, సకల భోగాలను అనుభవిస్తున్న దేవేంద్రుని ఆరాధించి, కొత్త బియ్యంతో వండిన పొంగలి, పరమాన్నాలను దేవతలకు నివేదించి, ఆ ప్రసాదాన్ని మనం తినాలి. భోగి పళ్లు ఎందుకు? రేగు పళ్ళనే భోగిపళ్ళు అంటాము. భోగిపళ్ళు పొయ్యటానికి రేగుపళ్ళు, చెరుకు ముక్కలు, పచ్చదనాన్ని కోరుతూ పచ్చి శనగలను అంటే హరిబూట్ గింజలను, గురు గ్రహ అనుగ్రహం కోసం నానబెట్టిన శనగలను, దిష్టిని పోగొట్టే కొన్ని ద్రవ్యాలను, వక్కల లాంటి నల్లని గింజలను కలిపి, శుభాన్ని కలిగించే చామంతి, గులాబీ, బంతిపూల వంటి పూరేకలను, అక్షతలను, రాగి నాణాలను లేక చిల్లర నాణాలను అన్నింటినీ కలిపి రెండు చేతులతో తీసుకుని, పిల్లలను తూర్పుముఖంగా కూర్చోబెట్టి వారికి పైనుంచి కిందికి దిగతుడిచి, తరువాత గుండ్రంగా సవ్యంగా, అపసవ్యంగా పిల్లల చుట్టూ మూడు సార్లు తిప్పుతూ ‘ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అయిన వాళ్ళ దిష్టి, కాని వాళ్ళ దిష్టి, మంచివాళ్ళ దిష్టి, చెడ్డవాళ్ళ దిష్టి, ఎంత అందంగా ఉన్నారనే వాళ్ళ దిష్టి అందరి దిష్టి పోవాలి‘ అంటూ వారి తల మీద పొయ్యాలి. అలా దిగ తుడవటం వల్ల పిల్లలకు ఏదైనా దిష్టి తగిలితే, అది తొలగిపోతుంది. కాలమంతా దైవ స్వరూపమే అయినా, ఏ మంచి సమయంలో ఎటువంటి మంచి పనులను చేస్తే, అఖండమైన మంచి జరుగుతుందో మన మహర్షులు చెప్పారు. దానిని ఆచరిస్తూ మనమందరమూ సమస్త సన్మంగళములను పొందుదుము గాక !! ఆ మంటల అంతరార్థం మనం అగ్ని ఆరాధకులం. కనుక మాకు అసలైన భోగాన్ని కలిగించమనీ, అమంగళాలను తొలగించమనీ ప్రార్ధిస్తూ అగ్నిహోత్రుని రగులుస్తాము. గతించిన కాలంలోని అమంగళాలను, చేదు అనుభవాలేమైనా ఉంటే వాటిని, మనసులోని చెడు గుణాలను, అజ్ఞానాన్ని అన్నింటినీ అత్యంత పవిత్రమైన అగ్నిలో – అజ్ఞానాన్ని వేసి దగ్ధం చేసుకోవటం, భోగాన్ని, మంగళాలను, జ్ఞానాన్ని పొందాలనే కోరికతో అగ్నిహోత్రుని పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజించటమే భోగి మంటల వెనక ఉన్న అంతరార్థం. కాస్త జ్ఞానం కలవారు, ఈ రోజుతో చలి వెళ్ళి పోతోంది. సూర్యభగవానునిలోని తేజస్సు పెరగబోతోంది, వృద్ధి అవుతుంది అనే భావనతో భోగి మంటలు వేస్తారు. గోదాదేవిని ఆండాళ్ తల్లి అంటారు. ఈమె శ్రీ రంగనాథ స్వామిని భర్తగా పొంద గోరింది. ఇందుకోసం ఆ కాలంలో కాత్యాయనీ వ్రతాన్నాచరించిన గోపికలను ఆదర్శంగా తీసుకుంది. తాను ధనుర్మాసం నెలరోజులు మార్గళీ వ్రతాన్నాచరించి, తిరుప్పావై పాశురాలతో స్వామిని కీర్తించి, పరమాత్మ అనుగ్రహం పొందింది. మహా పర్వదినమైన భోగినాడు శ్రీరంగనాథ స్వామిని వివాహం చేసుకుని, పరమమైన భోగాన్ని పొందింది. మనం భోగి పండుగనాడు శ్రీ గోదా రంగనాథ స్వామి కల్యాణం జరిపించి, దర్శించి ఆనందిస్తాము. భోగి పండుగ నాటి విశేషం పిల్లలకు భోగి పళ్ళు పొయ్యటం. భోగి పండుగ నాడు ముత్తైదువులను ఇంటికి పిలిచి, ఇంటి పెద్దలందరూ కలిసి ఇంట్లో ఉన్న ఐదారు సంవత్సరాల లోపు పిల్లలకు దృష్టి దోషం తగలకుండా దిష్టి తీస్తూ, భోగిపళ్ళు పోసి, సకల శుభాలు కలగాలని ఆశీర్వదిస్తారు. మంగళ హారతినిస్తారు. ఇది మన సంప్రదాయం. కనుక భోగిపళ్ళు పొయ్యటం వెనక అంతరార్థం దృష్టి దోషం పరిహరించటం, చెడు సోకకూడదని కోరుకోవటం, శుభం కలగాలని ఆశీర్వదించటం. ఇదే వేదంలో చెప్పిన ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం. దీనిని పసితనం నుంచే పిల్లలకు నేర్పిస్తున్నామన్నమాట. – సోమంచి రాధాకృష్ణ -
Sankranti Festival Celebrations 2022 : సంక్రాంతి సంబురాలు
-
Sankranti Festival 2022 Celebrations: ఊరంతా సంక్రాంతి
-
Sankranti 2022: సంక్రాంతి శోభ
-
Sakshi TV Exclusive :సంక్రాంతి సందడంతా సాక్షిలోనే
-
బంగార్రాజు సంక్రాంతి బరిలోకి దిగితే.. ఖేల్ ఖతం త్వరలో...
-
సంక్రాంతి సంబరాలతో పల్లెసీమలు
ఎన్నాళ్లకెన్నాళ్లకో అచ్చమైన సంక్రాంతి సంబరాలతో పల్లెసీమలు కళకళలాడుతున్నాయి. పంటల దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో అన్నదాతలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా చేతికి సొమ్ము అందడంతో పేదలు, లావాదేవీలు జోరందుకోవడంతో వ్యాపారులు.. వెరసి అన్ని వర్గాల ప్రజల్లో కొంగొత్త సం‘క్రాంతి’ కనిపిస్తోంది. ఉద్యోగ, వ్యాపారాల కోసం పట్టణాలు, నగరాలకు వెళ్లి స్థిరపడిన వారంతా అయినవారి మధ్య పండుగ జరుపుకోవడం కోసం స్వగ్రామాలకు తరలిరావడంతో పల్లెల్లో సందడి నెలకొంది. ఏలూరులో గంగిరెద్దును ఆడిస్తున్న దృశ్యం సాక్షి, అమరావతి: నగర, పట్నవాసులు పల్లెబాట పట్టారు. అల్లుళ్లు, ఆడపడుచులు, బంధుమిత్రుల రాకతో పల్లెల్లో కొంగొత్త సంక్రాంతి కళ సంతరించుకుంది. ఉద్యోగాలు, వ్యాపారాల కోసం పట్నాలు, నగరాలకు వెళ్లి స్థిరపడిన వారంతా అయిన వారందరితో ఆనందంగా పండుగ జరుపుకోవడం కోసం స్వగ్రామాలకు చేరుకున్నారు. ప్రతి ఇంటి ముంగిటా సస్తవర్ణశోభితమైన రంగవల్లులు భోగి పండుగకు స్వాగతం పలికాయి. కొక్కొరోకో అంటూ... తొలి కోడి కూయగానే పల్లెల్లో నువ్వు ముందా.. నేను ముందా.. అని పోటీ పడిన చందంగా భోగి మంటలు వెలిగించారు. చలి వాతావరణంలో భోగి మంటల వద్ద ఆనందంగా గడిపారు. సూర్యోదయానికి ముందే మహిళలు ఇళ్ల ముందు కల్లాపు చల్లి ముత్యాల ముగ్గులు వేసి రంగులద్దారు. రంగవల్లుల మధ్యలో గోవు పేడతో చేసిన గొబ్బమ్మలను ఉంచి పుష్పాలతో అలంకరించారు. మకర సంక్రాంతికి స్వాగతం పలుకుతూ పక్షం రోజులుగా డూడూ బసవన్నలు (గంగిరెద్దులు) పల్లెల్లో సందడి చేస్తున్నాయి. ధనుర్మాసం కావడంతో ఉదయమే నుదుట నామాలు ధరించిన హరిదాసుల సంకీర్తనలు వీనుల విందు గొలుపుతున్నాయి. పట్టణాలు, నగరాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చిన వారితో పల్లెల్లో కార్ల సందడి నెలకొంది. నవరత్నాల ప్రభావం వైఎస్ జగన్ సర్కారు అమలు చేస్తున్న ‘నవరత్నాలు’ ప్రభావం సంక్రాంతిపై స్పష్టంగా కనిపిస్తోంది. నవరత్నాల్లో భాగంగా అమలు చేస్తున్న వినూత్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వల్ల అల్పాదాయ వర్గాలకు లబ్ధి కలగడంతో పండుగకు కొత్త కళ వచ్చింది. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా ప్రతి రైతు కుటుంబానికి రూ.13,500 పెట్టుబడి సాయం, అమ్మ ఒడి పథకం కింద ప్రతి విద్యార్థి తల్లి బ్యాంకు అకౌంట్లో ఏటా రూ.15,000 జమ చేస్తుండటం గమనార్హం. తాజాగా ఈనెల 11న 44.48 లక్షల మంది తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి కింద ప్రభుత్వం రూ.6,673 కోట్లు జమ చేసింది. డ్వాక్రా మహిళలకు, రైతులకు వడ్డీలేని రుణాలు అందించింది. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత లాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.2,250 పింఛను అందిస్తోంది. 30.76 లక్షల మందికి నివాస స్థల పట్టాలు ఇచ్చి, 28 లక్షల మందికి ఇళ్లు కట్టించే బృహత్తర కార్యక్రమానికి గత నెల 25న శ్రీకారం చుట్టింది. పట్టాల పంపిణీతో ఈ ఏడాది పల్లెల్లో ముందే సంక్రాంతి కళ సంతరించుకుంది. వర్షాలు పడటంతో పంటలు బాగా పండుతున్నాయి. కూలీలకు చేతి నిండా పని లభిస్తోంది. డబ్బు చేతికి అందినందున ప్రతి కుటుంబం ఉన్నంతలో ఆనందంగా సంక్రాంతి జరుపుకుంటోంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సూర్యారావుపేటలో భోగి మంట వద్ద యువతుల సందడి భోగి మంటలతో కొత్త వెలుగులు పెద్దల పండుగ, కనుమ నేపథ్యంలో రంగవల్లులతో ఇళ్లు నూతన శోభ సంతరించుకున్నాయి. భోగభాగ్యాలు పంచే భోగి పండుగ సందర్భంగా తెల్లవారుజామునే ప్రతి గడప ముంగిటా భోగి మంటలు వేయడంతో పల్లెల్లో మబ్బులోనే వెలుగులు చిమ్మాయి. పిల్లల తలపై రేగి పండ్లు, చిల్లర నాణేలను పోసి ముత్తయిదువులు దీవించారు. ఈ ఏడాది ఉద్యోగులకు సంక్రాంతి భాగా కలిసొచ్చింది. దాదాపు వారం రోజులు సెలవు లభించినట్లయింది. ఇంటింటా ఘుమఘుమలు గ్రామ వీధుల్లో పిండి వంటలు ఘుమఘుమలు వెదజల్లుతున్నాయి. అరిసెలు, లడ్డూ, కర్జికాయలు, గారెలు, సున్నుండలు, బొబ్బట్లు, కాజాలు, పూతరేకులు, లడ్డూ, లాంటి రకరకాల పిండి వంటలు సిద్ధం చేస్తున్నారు. వ్యాపారుల మోముల్లో సంక్రాంతి జోష్ వస్త్ర, కిరాణా దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. తెలుగువారికి ఇదే పెద్దపండుగ కావడంతో ఆడపడుచులకు, అల్లుళ్లకు దుస్తులు పెట్టి సత్కరించే సంప్రదాయం ఉంది. దీంతో ఈ ఏడాది ఊహించిన దానికంటే రెట్టింపు వ్యాపారం జరుగుతుండటం పట్ల వస్త్ర వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం సంక్రాంతి పర్వదినం సందర్భంగా గురువారం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే దీనిని మకర సంక్రాంతి అని అంటారు. అనగా సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే శుభప్రదమైన రోజని అర్థం. ఈ సందర్భంగా పెద్దలకు దుస్తులు పెట్టుకుని తర్పణాలు వదిలేందుకు పల్లె జనం సంప్రదాయబద్ధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఊరూరా సందడే సందడి ► రాష్ట్రంలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. ఇంటింటా బంధు మిత్రుల కోలాహలం కనిపిస్తోంది. దేవతా మూర్తుల ఊరేగింపులు, ముగ్గుల పోటీలు, కోలాటాలు, ఆటల పోటీలతో ఎటు చూసినా సందడి నెలకొంది. గుంటూరు రూరల్ మండలంలోని చల్లావారిపాలెంలో హోమాలు, ప్రత్యేక పూజల మధ్య పుట్టలమ్మతల్లి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ► పెదకూరపాడు మండలం బలుసుపాడులో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆధ్వర్యంలో మన ఊరు–మన సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు తరలివచ్చారు. నెహ్రూనగర్లో కర్రసాము, కోలాటం, గంగిరెద్దుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ► ‘ఓలేటి’ ఇంటి పేరు ఉన్న 30 మంది కుటుంబ సభ్యులు గుంటూరు పోస్టల్కాలనీలో ఓలేటి పున్నమ్మ–అప్పయ్య చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం భోగి, సంక్రాంతి సంబరాలను జరుపుకొన్నారు. ► రాయలసీమ జిల్లాలు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు గ్రామాల్లో బండలాగుడు, ఎడ్ల బండ్ల పందేలు నిర్వహించారు. కలర్లు, రంగు పేపర్లు, బెలూన్లు, మెడ గంటలు, ప్రభలతో అలంకరించి మెరవణి (ఊరేగింపు)కి సిద్ధమయ్యారు. చిత్తూరు జిల్లాలో పొంగళ్ల నైవేద్యం సమర్పించారు. విశాఖ జిల్లాలో ఈ ఏడాది గిరిజనులు పెద్ద సంఖ్యలో సంక్రాంతిని జరుపుకుంటున్నారు. నెల్లూరులో పెన్నానది తీరంలో గొబ్బెమ్మల నిమజ్జనానికి మహిళలు సిద్ధమవుతున్నారు. గోదావరి జిల్లాల్లో పందేల జోరు ► తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అంగరంగ వైభవంగా సాగుతోంది. ఆట పాటలతో గ్రామాల్లో సంబరాలు జరుపుకుంటున్నారు. కోడి పందేలను చూసేందుకు వివిధ నగరాల్లో స్థిరపడిన వారు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులూ పాల్గొన్నారు. బరుల వద్ద వాహనాలు పెద్ద సంఖ్యలో క్యూ కట్టాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని మహంకాళీ ఆలయాల్లో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అత్తిలిలో కావిడి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. లక్షలాది మంది రైతులు చేతికందిన పంటను ఒబ్బిడి చేసుకుని సంప్రదాయబద్ధంగా కనుమ పండుగ జరుపుకొనేందుకు సిద్ధమవుతున్నారు. స్వీట్స్ ఆర్డర్లు బాగా పెరిగాయి సంక్రాంతి నేపథ్యంలో స్వీట్స్ విక్రయాలు భారీగా పెరిగాయి. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, వైజాగ్, గుంటూరు, చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద సంస్థలతో పాటు వ్యక్తిగత ఆర్డర్లు బాగా వచ్చాయి. ఇళ్లలో చేసుకునే తీరిక లేనివారు, అలాగే పట్టణాల నుంచి వచ్చే బంధువుల కోసం సంప్రదాయ పిండి వంటలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. – పోలిశెట్టి మల్లిబాబు, సురుచి ఫుడ్స్ అధినేత, తాపేశ్వరం, తూర్పుగోదావరి జిల్లా వ్యాపారాలకు సంక్రాంతి శోభ వస్త్ర వ్యాపారాన్ని కరోనా ఈ ఏడాది దారుణంగా దెబ్బతీసింది. చాలా రోజుల తర్వాత సంక్రాంతి రూపంలో కొత్త శోభ చేకూరింది. ఈ సంక్రాంతి పండుగ కొనుగోళ్లతో మా వస్త్ర వ్యాపారులకు ఊరట లభించింది. పెళ్లి ముహూర్తాలు ముగిసిన తర్వాత రావడంతో భారీగా కాకపోయినా ఆశించిన స్థాయిలో వ్యాపారం సాగింది. మొత్తం మీద మా వస్త్ర వ్యాపారులకు ఈ పండుగ కొంచెం ఊపిరి పీల్చుకునేలా చేసింది. – బచ్చు వెంకట ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఏపీ టెక్స్టైల్ ఫెడరేషన్, పోకూరి గంగా ఎస్ వెంకట రమేష్, విజయవాడ వస్త్రలత వ్యాపారుల సంఘం ఇది జగనన్న సంక్రాంతి కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన మా కుటుంబం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. ఈ క్రమంలో అమ్మఒడి డబ్బులు అందడం కొండంత సంబరం నింపింది. స్కూల్ ఫీజుకు సగం డబ్బులు పోగా, మిగతా సొమ్ముతో కొత్త దుస్తులు కొనుక్కున్నాం. అందరి లాగే స్వీట్లు చేసుకుని పండుగ జరుపుకుంటున్నాం. ముఖ్యమంత్రి జగనన్న వల్లే మాకు ఈ ఆనందం కలుగుతోంది. అందువల్ల ఈ పండుగను జగనన్న సంక్రాంతిగా జరుపుకుంటున్నాం. – ఈటీ గజలక్ష్మి, తిరుపతి, చిత్తూరు జిల్లా ఆనందకర సంక్రాంతి ప్రతి కుటుంబానికి నాలుగైదు ప్రభుత్వ పథకాలు అందడం వల్ల ఈ ఏడాది మాతోపాటు అందరూ సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకుంటున్నారు. నాకు వృద్ధాప్య పింఛను వస్తోంది. వైఎస్సార్ రైతు భరోసా కింద డబ్బు అందింది. నా భార్య లక్ష్మికి వైఎస్సార్ చేయూత కింద సాయం అందింది. మా ఇద్దరు కుమారుల్లో ఒకరికి ఇంటి స్థలం వచ్చింది. నా భార్యతోపాటు కోడళ్లకు డ్వాక్రా ద్వారా రుణ మాఫీ ప్రయోజనం లభించింది. ఈ ఆనందకర సంక్రాంతికి మనసున్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి ఉండటమే కారణం. – పూడి అప్పారావు, మాకవరపాలెం మండలం, విశాఖపట్నం జిల్లా. -
లక్ష పిడకలతో 'భోగి'
వీధివీధినా వెలిగే భోగి మంటల్లో ఎన్ని నులివెచ్చని జ్ఞాపకాలు దాగుంటాయో కదా. కర్రల వేట నుంచి బోగి రాత్రి జాగారం వరకు చేసిన పనులు, పోగు చేసిన అనుభూతులు గుండె గదిలో శాశ్వతంగా నిలిచిపోయి ఉంటాయి. కానీ నేటి తరం అలాంటి జ్ఞాపకాలు మూటగట్టుకోవడంలో విఫలమవుతోంది. కృత్రిమ రీతిలో పండగలు నిర్వహిస్తూ రెండు ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేయడానికి మాత్రమే పరిమితమవుతోంది. కలిసికట్టుగా పండగ చేసుకోవడంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించలేకపోతోంది. మురపాక వాసులు మళ్లీ ఆ నాటి సంప్రదాయానికి జీవం పోస్తున్నారు. లక్ష పిడకలు తయారు చేసి బోగి చేయడానికి పూనుకుంటున్నారు. సలక్షణమైన ఈ ఆలోచనకు స్థానికులూ సై అంటున్నారు. సాక్షి, లావేరు(శ్రీకాకుళం): సంకురాతిరి వచ్చేస్తోంది. కానీ సందడి మాత్రం కొద్దిగానే కనిపిస్తోంది. పాశ్చాత్య మోజులో పడి మన సంసృతి, సంప్రదాయాలు, పండగలు, ఆచారాలను చాలా మంది మరిచిపోతున్నారు. నానాటికీ అంతరించిపోతున్న ఆచారాలను బతికించాలనే తలంపుతో మురపాక గ్రామంలో వినూత్నంగా లక్ష ఒక్క బోగి పిడకల పండగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మురపాక గ్రామంలోని సీతారామాలయ, ఉమానరేంద్రస్వామి ఆలయ కమిటీలు, వివేకానంద యూత్ సొసైటీ, అంబేడ్కర్ యూత్ సొసై టీ, శ్రీకృష్ణ యాదవ సంఘం సభ్యులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్థానికుల నుంచి కూ డా మంచి స్పందన కనిపిస్తోంది. గ్రామంలో ఎవరైతే ఎక్కువ బోడి పిడకలను తయారు చేస్తారో వారికి బోగి పండగ రోజు ప్రత్యేక బహుమతులు ఇస్తామని గ్రామంలో ప్రకటనలు జారీ చేయడం, ర్యాలీలు చేసి ప్రజలకు అవగాహన కల్పించడం కూడా చేశారు. దీంతో గ్రామంలోని మహిళలు, పిల్లలు, వృద్ధులు, పెద్దలు, రైతులు, యువకులు చాలా మంది గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొని బహుమతుల కోసం బోగి పిడకలు తయారు చేస్తున్నారు. చిన్నారులు అయితే ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రతి రోజూ గ్రామంలో ఆవుపేడను సేకరించి వాటితో పిడకలు తయారు చేయడం చేస్తున్నారు. భోగి పండగ రోజు ఆవుపేడతో తయారుచేసిన పిడకలను కాల్చడం వలన పాజిటివ్ వైబ్రేషన్లు వస్తాయని అంటున్నారు. మంచి స్పందన వస్తోంది కనుమరుగైపోతున్న మన విశిష్టతల గురించి నేటి తరానికి తెలియజేయడం కోసం మురపాకలో లక్ష ఒక్క బోగి పిడకల పండగ కార్యక్రమం చేపట్టాం. కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. గ్రామంలో పిల్లలు, పెద్దలు, మహిళలు, యువత అందరూ బోడి పిడకలు తయారు చేస్తున్నారు. – ప్రగడ శ్రీనివాసరావు, సీతారామాలయం కమిటీ సభ్యుడు, మురపాక గ్రామం మంచి పని చేస్తున్నారు సమైక్యత, సదాచారం, సంతోషంతో పాటు మంచి పవిత్ర భావాలను పరిరక్షించి సంస్కృతిని కాపాడడమే మన పండగల పరమార్థం. కానీ నేటి తరానికి ఆ విలువలు తెలీడం లేదు. ఇలాంటి తరుణంలో ఈ కార్యక్రమం చేయడం మంచి పరిణామం. – తేనేల మంగయ్యనాయుడు, రిటైర్డు హెచ్ఎం, మురపాక గ్రామం సంప్రదాయాలను బతికంచడం కోసమే.. పాశ్చాత్య మోజులో పడి మన సంస్కృతీ, సంప్రదాయాలను మర్చిపోతున్నాం. వాటికి మళ్లీ జీవం పోయాలనే తలంపుతోనే ఈ కార్యక్రమం తలపెట్టాం. ఎక్కువ పిడకలు తయారు చేసిన వారికి బహుమతులు కూడా ఇస్తాం. – బాలి శ్రీనివాసనాయుడు, వివేకానంద యూత్ సొసైటీ అధ్యక్షుడు, మురపాక గ్రామం -
400 అడుగుల భోగి పిడకల దండ
సాక్షి, అమలాపురం: సంక్రాంతి పండగకు భోగి పిడకల దండలు వేయడానికి చిన్నారులు పోటీపడుతుంటారు. ఎంత పెద్ద దండ వేస్తే అంత గొప్పగా చెప్తుంటారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం సమనస పంచాయతీ పరిధిలో రంగాపురంలో విశ్రాంత ఉపా«ధ్యాయుడు భూపతిరాజు విశ్వనాథరాజు కోడలు శ్రీరామసత్య 400 అడుగుల భోగి పిడకల దండ తయారు చేశారు. విశ్వనాథరాజు ఇంట్లోని గోమయం (ఆవు పేడ)తో ఈ దండను తయారు చేశారు. భోగి మంటలు వేయడంలో కొన్ని సైన్స్ సంబంధించిన అంశాలు ఉన్నాయని విశ్వనాథరాజు తెలిపారు. దేశీయ గోమయం పిడకలను కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుందని సూక్ష్మ క్రిములు నశించి పాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుందని, ఈ గాలిని పీల్చడం ఆరోగ్యానికి మంచిందన్నారు. రంగాపురంలో తొలిసారిగా చేసిన దండను చూడటానికి పలు గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు. అంతరించిపోతున్న సాంప్రదాయాన్ని ఈ తరం పిల్లలకు తెలియజేయాలని ఈ దండను చేశామన్నారు. 14 తేదీన భోగి పండగ రోజున పూజలు చేసి ఈ దండను భోగి మంటలో వేస్తామని సత్య తెలిపారు. -
మా ఇంట్లో భోగిపళ్లు
భోగి పండగ నాడు పిల్లలకు భోగి పండ్లు (రేగి పండ్లు) పోస్తారు. పిల్లలకు దిష్టి దోషం పోవడానికి తెలుగువారు పాటించే ఆచారమిది. అయితే అప్పట్లోనూ, ఇప్పట్లోనూ ఈ ఆచారం ఒకేలా ఉందా? ఓ జ్ఞాపకం చిన్నప్పటినుంచి భోగి అంటే ఎందుకో మహా ఇష్టం. పొద్దున్నే వెచ్చగా భోగిమంటలు వేసుకోవడం, ఆ మంటల్లో వేయడానికి పాత విరిగిపోయిన కిటికీ తలుపులు, మంచం కోళ్లు, నూనెతో తడిపిన పాత బట్టలు తీసుకువెళ్లేవాళ్లం. మంచి చలిలో, తెల్లారని ఆ చీకటిలో ఎర్రటి మంట లేచి వెచ్చదనం ఇస్తుంటే ఆ ఆనందమే వేరుగా ఉండేది. మా ఇరుగుపొరుగు కొందరు భోగిమంటల్లో తేగలు కాల్చుకుని తినేవారు. మేం మాత్రం అది అయ్యాక శుభ్రంగా నలుగు పెట్టుకుని స్నానం చేసి, కొత్తబట్టలేసుకుని, దేవుడికి దణ్ణం పెట్టుకుని మామ్మ చేసిన వేడివేడి కొత్తబియ్యం పొంగలిలో ఆరారగా ఆవునెయ్యి వేసుకుని బాదం ఆకుల్లో పెట్టుకుని ఉప్ఫు.. ఉఫ్పు.. అంటూ ఊదుకుంటూ తినేవాళ్లం. సాయంత్రం అయ్యేసరికి మా ముగ్గురికీ భోగిపళ్లు పోసేవారు. అందుకోసం పేరంటం పిలిచేవారు. కొంతమంది ఇళ్లకు వెళ్లి నన్నే చెప్పుకోమనేవారు. నేను నా స్నేహితుల ఇళ్లకు వెళ్లి ‘‘మరే, సాయంత్రం నాకు భోగిపళ్లు పోస్తారు. నువ్వు తప్పకుండా రావాలి’’ అంటూ సిగ్గుపడేవాణ్ణి. మా అక్కలు కూడా వాళ్ల ఫ్రెండ్సుకు చెప్పుకునేవాళ్లు. వడ్డేశ్వరం నుంచి రకరకాల బంతిపూలు, చేమంతి పూలు మామిడి మండలు తెచ్చిపడేసేవాడు మా సీను బాబాయి. తరాలుగా మా ఇంటిలో పని చేస్తున్న శివమ్మ, సుబ్బారావు, శేషమ్మ పురికొసకు మామిడి మండలు గుచ్చి, గుమ్మాలకు తోరణాల్లా కట్టేవాళ్లు. మా తాతయ్య రెండు మానికల రేగుపళ్లు కొని పడేసేవాడు. భోగిపళ్లలో కలిపేందుకు పూల రెక్కలు, చిల్లర డబ్బులు మేం ముగ్గురం పోటీలు పడుతూ సిద్ధం చేసేవాళ్లం. ఈ లోపు భోగి పళ్ల కోసం తెచ్చిన రేగిపళ్లను మెల్లగా గుటుకూగుటుకూ మింVó సేవాణ్ణి, గింజలు కనపడకుండా. పళ్లు పులిసిపోతాయర్రా... జాగర్త... అని పెద్దమ్మమ్మ బోసినోటిని నొక్కుకుంటూ చెప్పినా విననట్టు నటించేవాణ్ణి. రేగిపళ్ల గింజలు మింగేస్తున్నానని మా అక్కలు కనిపెట్టి నన్ను బెదిరించేవాళ్లు, అవి కడుపులోకెళ్లి చెట్లవుతాయంటూ. అయితే అప్పటికే ఒకసారి వేపపండు గింజ మింగేసి, ఇట్లాగే ఎవరో నన్ను బెదిరించటం, కడుపులో వేప చెట్టు మొలిస్తే ఆ చేదు ఎట్లా భరించాలిరా నాయనా అని నేను విపరీతంగా భయపడిపోయి, నాలో నేనే దిగులుగా ఉండటం చూసి మా నాన్న ‘‘ఓరి పిచ్చోడా... విత్తనం మొలకెత్తాలంటే గాలి, నీరు, ఎండ ఉండాలి. అది పెరగాలం టే మట్టి కావాలి కదా... నీ బొజ్జలో అవన్నీ ఉన్నాయా మరి?’’ అని అడిగి నేను భయం వదిలిపెట్టి ధైర్యంగా లేవని చెప్పాక ‘‘ఒకటి రెండు గింజలు పొరపాటున మింగినా ఏం కాదు, మర్నాడు అవే బయటికి వచ్చేస్తాయి’’ అని ఏకంగా అప్పుడే నాకు సైన్స్ పాఠం చెప్పేసి ఉండటం వల్ల నేను లెక్క చేయలేదసలు. సాయంత్రం కాగానే ముఖం కాళ్లూ చేతులూ కడిగి మమ్మల్ని ముగ్గురినీ కుర్చీల్లో కూచోబెట్టేవాళ్లు. హారతి పళ్లెం, అక్షింతలు సిద్ధంగా ఉండేవి. పేరంటాళ్లు మెల్లగా వస్తుండేవాళ్లు. వరండా సగం నిండిందనిపించగానే మా సాంబక్కాయమ్మమ్మ మా అమ్మని, మామ్మని ‘‘ఇంకా చూస్తారేం, భోగిపళ్ల బేసిను తీసుకురండి’’ అంటూ గాఠిగా ఓ కేక పెట్టేది. మామ్మ అమ్మ చేతికి రేగుపళ్లు, బంతిపూల రెక్కలు, చిల్లర డబ్బులు వేసి కలిపి ఉంచిన బేసినిచ్చేది. అమ్మ అది తీసుకుని వచ్చేది. ముందు మామ్మ, తాతయ్య, అమ్మ, ప్రభాతత్త మూడేసి సార్లు మా ముగ్గురికీ భోగి పళ్లు పోసేవాళ్లు. మా సాంబక్కాయమ్మమ్మ, బాబాయిలు అందరూ పోసిన తర్వాత పేరంటాళ్ల వంతొచ్చేది. ఎదురింటి శారదాంబ, మా బుల్లిమామ్మ, కిష్టారావు పంతులు పెళ్లాం, ఇంకొందరు వచ్చి భోగిపళ్లు పోసి చేతిలో రెండేసో ఐదేసో రూపాయలు పెట్టేవాళ్లు. అప్పట్లో అవే గొప్ప. వాళ్లు అట్లా భోగి పళ్లు పోసేటప్పుడు మా నాన్న తన పాత బ్లాక్ అండ్ వైట్ కెమెరాతో ఫొటోలు తీసేవాడు. తల మీది నుంచి ముఖం మీదికి జారుతున్న పూల రెక్క లను తుడుచుకుంటున్నట్టుగా నేను మెల్లగా చిల్లర డబ్బులని చేతికి చిక్కించుకుని చొక్కా జేబులోకి తోసేవాణ్ణి. అందరూ భోగి పళ్లు పోసిన తర్వాత హారతులిచ్చేవాళ్లు. ‘పిల్లలకి హారతిచ్చేది కర్పూరంతో కాదమ్మా, నూనెతో తడిపిన ఒత్తులతో ఇవ్వాలి’ అనేది మామ్మ. పేరంటం అయిపోయి అందరూ ఇళ్లకు వెళ్లేటప్పుడు నానబెట్టిన సెనగలు, పండు, తాంబూలం, రేగు పళ్లు కవర్లలో పోసి ఇచ్చేది ప్రభాతత్త. అంతా అయిపోయాక శేషమ్మ చేత దిష్టి తీయించేది సాంబక్కాయమ్మమ్మ. ఆ పళ్లు, పూలు, చిల్లర డబ్బులు కాళ్ల కింద పడకుండా జాగ్రత్తగా పోగు చేసి మూట కట్టుకుని ఇంటికి తీసుకెళ్లేది శేషమ్మ. ఇవన్నీ దాదాపు ముప్ఫై నలభై ఏళ్ల క్రితం సంగతులు. ఇప్పుడు నేను మా పిల్లలకు భోగి పళ్లు పోయాలంటే అర కిలోనో కిలోనో రేగి పళ్లు కొనాలంటే గుండె గుభేలుమంటుంది. హైదరాబాదులో ఉండే మాకు మామూలు రోజుల్లోనే పావు కిలో ముప్ఫై నలభైకి అమ్మేవాళ్లు, భోగికి రెండు మూడు రోజుల ముందు నుంచే కేజీ రెండు మూడొందలు పైనే పెట్టాలి. అవీ అంత నాణ్యంగా ఏమీ ఉండవు. అయినా తినేవేం కాదు, తలమీది నుంచి పోసేవే కదా అని సరిపెట్టుకోవటమే. ఇక తమలపాకులు, వక్కలు, అరటిపళ్లు, చిల్లర పైసలు మామూలే. పేరంటానికి పిలవాలంటే ఇంట్లో వాళ్లంతో కలిపి పట్టుమని పదిమంది కూడా కారు. అయినా వాళ్లతోనే ‘‘మన ఇంటి ఆచారం’’ అంటూ సంక్రాంతి రోజున అమ్మ మా చేత భోగి పళ్లు పోయిస్తుంది. చిల్లర పైసలంటే రూపాయి, రెండు రూపాయల బిళ్లలే తప్ప పావలాలూ, అర్ధ రూపాయిలూ ఎక్కడ, అవి కనిపించడం మానేసి చాలారోజులే అయిందిగా... పూలు, పళ్లు ఎత్తుకుని తీసుకువెళ్లే వాళ్లెవరున్నారు, అన్నిటినీ మా ఆవిడే ఎత్తి డస్ట్బిన్లో పోయకూడదంటే చెట్లల్లో పోసి వస్తుంటుంది. ఏం చేస్తాం అంతా పట్నవాసం కదా మరి! – బాచి -
పల్లె మేలుకునే వేళ..!
పల్లె మేలుకునే వేళయ్యింది. భోగి మంటల వెలుతురులో తన వైభవాన్ని తిరిగి చూసుకునేందుకు సిద్ధమైంది. నయనాందకరమైన రంగు, రంగుల రంగువళ్లులు.. వేకువజామునే వీనుల విందుగా వినిపించే హరిదాసుల సంకీర్తలు.. జంగమదేవరల సిద్ధేశాల ఘంటారావం.. డూడూ బసవన్నల శోభాయమాన అలంకారం.. కొత్త అల్లుళ్లు, బంధువులతో గ్రామీణ ప్రాంతాలు సంక్రాంతి పండగకు ముస్తాబయ్యాయి. అచ్చతెలుగుదనం ఉట్టిపడే పెద్ద పండగకు సుదూర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వస్తున్న వారితో పల్లెలు కళకళలాడుతున్నాయి. సాక్షి, అమరావతి: రాష్ట్రం సంక్రాంతి పండుగకు ముస్తాబైంది. ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాలు, వెళ్లిన వారంతా స్వస్థలాలకు చేరుకుంటుండటంతో పండుగ ముందే వచ్చిందా అన్న చందంగా పల్లెలు కళకళలాడుతున్నాయి. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగలను ఆనందంతో జరుకునేందుకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేసేందుకు జనం మార్కెట్లకు ఎగబడటంతో దుకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి. కొత్త ఆలోచనలు చిగురించాలి... భోగభాగ్యాల భోగి..సాంప్రదాయాల సంక్రాంతి..కష్టాలను తీర్చే కనుమ పండుగల సమయంలో ప్రజలు సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారు. సూర్యోదయం వేళ ప్రజలంతా చలిమంటలు వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తమలోని పాత ఆలోచనలు అగ్నికి ఆహుతై కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్నిదేవున్ని వేడుకుంటూ, ఇందుకు గుర్తుగా ఇళ్లల్లో పాత చెక్క సామగ్రి బోగిమంటల్లో వేస్తుంటారు. భోగి రోజునే చిన్నారులపై రేగిపండ్లు, చిల్లరనాణేలను తలపై పోసి ముత్తయిదువులు దీవించడం విశేషం. ముత్యాల్లాంటి ముగ్గులు.. లక్ష్మీదేవి ప్రతీకగా భావించే రంగవల్లులు సంక్రాంతి వేళ ఇళ్లముందు కొలువుదీరుతుంటాయి. కల్లాపి జల్లి విభిన్న ఆకృతుల్లో పండగకు స్వాగతం పలుకుతూ ముగ్గులు వేస్తుంటారు. పూలతో అలంకరించి గొబ్బెమ్మలను పెట్టి భక్తిపాటలను ఆలపిస్తారు. పుణ్యప్రదమైన సంక్రాంతి... ధనురాశి నుంచి మకరరాశిలోకి సూర్యుడు ప్రవేశించిన పర్వదినమే మకర సంక్రమణంగా పెద్దలు చెబుతారు. ధాన్యరాసులు రైతన్న ఇంటికి చేరి పాడిపంటలతో వెలుగులను నింపేది ఈ పెద్దపండుగ. పలు రకాల పిండివంటలను చేసి సూర్యభగవానికి నివేదిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కాడెద్దులకు పూజలు చేస్తారు. నూతన వస్త్రాలను కొనుగోలుచేసి పెద్దలకు చూపించడం ఆనవాయితీగా వస్తోంది. అలరించే హరిదాసుల కీర్తనలు హరిలోరంగ హరి అంటూ హరిదాసుల కంచుగజ్జెలు ఘల్లుఘల్లుమనగ చిందులు తొక్కుతూ చిడతలు, తలపై రాగి పాత్రలతో హరిదాసులు ప్రత్యక్షమవుతారు. మరోవైపు జంగమదేవరలు, బుడబుక్కలదొరలు ఇంటింటికీ తిరుగుతూ పెద్దలను కీర్తిస్తుంటారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా నృత్యాలు చేయిస్తారు. స్నేహానికి చిహ్నం నేస్తరికం మిత్తమ్మ.. మొఖర.. వరిపండు.. గాదె.. ఇవేవో కొత్త పదాల్లా ఉన్నాయి కదూ.. అదేం కాదండి.. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంజిల్లా ప్రజల స్నేహానికి ప్రతీక పదాలు. వేరే కులానికి చెందిన అమ్మ కాని అమ్మలను మిత్తమ్మ అని, బావ వరుసయ్యే వ్యక్తులను మొఖర, మహిళల్లో వదినె వరుసయ్యే వారిని వరిపండు, గాదె అంటూ ఆప్యాయతతో పిలుచుకుంటారు. ఇకపోతే నేస్తరికంగా దైవసాక్షిగా కట్టుకుని, జీవితాంతం నేస్తం అంటూ పిలుచుకుంటారు. వీరంతా సంక్రాంతికి ఆతిధ్యం ఇవ్వడం.. వస్త్రాలు, దుస్తులు ఇచ్చిపుచ్చుకోవడం చేస్తుంటారు. ప్రత్యేక వంటలను వండి భోజనాలకు పిలుచుకుంటారు. ఆనందాన్నిచ్చే పండగ ఆరోజుల్లో సంక్రాంతి అంటే ఇంట్లో ఒక పండుగ వాతావరణంలా ఉండేది..పెద్దపండుగ వచ్చిందంటే ఆ నెలంతా ఇంట్లో పండుగలా ఉండేది. ఉమ్మడికుటుంబాల వ్యవస్థ నుంచి ఉద్యోగ, ఉపాది దృష్యా ఇప్పుడు ఎవరికివారే యమునాతీరే అన్న చందంగా మారింది. సెల్ఫోన్ల ప్రభావం పండుగల మీద పడింది. ఆ నాటి ఆప్యాయ పలకరింపులు నేడు సెల్ఫోన్లకే పరిమితమైయ్యాయి. బోగి బోగభాగ్యాలను ప్రసాదిస్తుంది. రైతాంగానికి, ప్రజానీకానికి ఎంతో ఆనందాన్నిచ్చే పండుగ. – తెన్నేటి నర్సింగరావు, జ్యోతిష్యుడు -
తెలుగు లోగిళ్లలో వైభవంగా భోగి పండుగ
సాక్షి, అమరావతి/హైదరాబాద్: సకల భోగభాగ్యాలను పంచే సంక్రాంతి వచ్చేసింది. రాష్ట్రంలో పల్లెలు, పట్నాలు భోగి మంటల వేడితో పండుగకు ఆహ్వానం పలుకుతున్నాయి. అహం కాలిపోయి, ఆత్మశుద్ధి కావాలని, చలి ఆగిపోయి ఆనందం వెల్లివిరియాలని కోరుతూ ప్రజలు వేకువజామున భోగి మంటలు వేశారు. యువత కేరింతలు కొడుతూ సందడి చేశారు. తమ కష్టాలు, బాధల్ని అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ సుఖసంతోషాలు ఇమ్మంటూ భోగి మంటల చుట్టూ తిరుగుతూ తమ ఆనందాల్ని పంచుకుంటున్నారు తెలుగు ప్రజలు. సూర్యుడు దక్షిణాయానంలో ఉండే చివరి రోజు భోగి. ఈ రోజు చలి తారస్థాయిలో ఉంటుంది. అందుకే భోగిమంటలు వేసుకోమని పెద్దలు సూచించారు. భోగిపండుగ రోజు పొద్దున్నే ఇంట్లోనూ, చుట్టుపక్కలా ఉన్న పనికిరాని, విరిగిపోయిన కలప వస్తువులన్నిటినీ మంటల్లో వేసి, వెచ్చగా చలిమంట వేసుకుంటారు. దీంతో వాతావరణంలో అధిక చలిమూలంగా ప్రబలి ఉండే పురుగూపుట్రా ఆ మంటల వేడికి నశించిపోతాయి. భోగిమంటలకు ఆవుపేడతో చేసిన పిడకలను, ఆ మంటలను బాగా రగిలించేందుకు ఆవునేతిని వాడటం ఉత్తమం. అలా చేయడం వల్ల వాతావరణంలోని కాలుష్యం తొలగి, గాలి శుభ్రపడుతుందని పెద్దల నమ్మకం. తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ వైభవంగా జరుపుకుంటున్నారు. పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా భోగిమంటలలో, రంగురంగుల ముగ్గులతో కళకళలాడుతున్నాయి. తెల్లవారుజామునే పిల్లలు, పెద్దలు, మహిళలు వీధుల్లోకి వచ్చి భోగిమంటలు వేసి వేడుక చేసుకున్నారు. చిత్తూరు జిల్లా నగిరిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా కుటుంబసభ్యులతో కలసి తన నివాసంలో భోగి మంటలు వేశారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతి సంక్రాంతి శోభను సంతరించుకుంది. తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా భోగి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కాకినాడ, రాజమండ్రి, అమలాపురంలో తెల్లవారుజామునే వీధుల్లో భోగిమంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. కులమతాలకు అతీతంగా అందరూ కలసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. అందరి కష్టాలు భోగిమంటల్లో కాలిపోయి, సుఖశాంతులు చేకూరాలని కోరుకున్నారు. అందమైన ముగ్గులతో వీధులు కళకళలాడాయి. పిల్లలకు భోగిపళ్లు పోసి సకల ఆరోగ్యసౌభాగ్యాలు కలగాలని ఆక్షాంచించారు. కుల,మతాలకు అతీతంగా.. కుల,మతాలకు అతీతంగా రాజమండ్రి పట్టణంలో భోగి సంబరాలు జరిగాయి. అజాద్ చౌక్ లో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేసి సందడి చేశారు కాలనీ వాసులు . తెలుగు సంస్కృతిలో భాగంగా జరుపుకునే భోగి పండుగలో పాల్గొనడం..చాలా ఆనందాన్ని ఇచ్చిందంటున్నారు ముస్లిం సోదరులు. పశ్చిమగోదావరి జిల్లాలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏలూరు, భీమవరం ప్రాంతాలతో పాటు గ్రామాల్లోనూ తెల్లవారు జామునే భోగిమంటలు వేశారు. రంగురంగుల ముగ్గులతో వీధులన్నీ అందంగా ముస్తాబయ్యాయి. ఏలూరులో భోగి సందర్భంగా మహిళలు కోలాటాలు, గంగిరెద్దుల ఆటలతో సందడి సందడిగా మారింది. సంక్రాంతి పండుగ ఉద్దేశాన్ని అందరికీ వివరించేలా పాడిపంటలు, గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. పాయకరావు పేటలో తెల్లవారుజామున భోగిమంటలు వేశారు. వీధులన్నీ భోగిమంటలతో కళకళలాడాయి. విశాఖ నగరంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భోగిమంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. తెలంగాణలోనూ.. తెలంగాణలో భోగి సంబరాలు సందడిగా సాగుతున్నాయి. హైదరాబాద్లో తెల్లవారు జామున భోగిమంటలు వేసి సందడి చేశారు నగరవాసులు. పాతవస్తువులను భోగిమంటల్లో వేసి కష్టాలు కూడా ఆ మంటల్లో కాలిపోవాలని , అన్నీ శుభాలే కలగాలని ఆకాంక్షించారు. గ్రామాల్లోనూ భోగి శోభ సంతరించుకుంది. -
నాటు కోడి కోసం వెళ్లి..
నెల్లూరు(వేదాయపాళెం): వారు ముగ్గురు ప్రాణ స్నేహితులు.. వివిధ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. భోగి రోజున నాటు కోడి తిందామనుకున్నారు. కొనుగోలు చేసేందుకు వెళ్లగా అక్కడ ధరలు అధికంగా ఉండటంతో తిరిగి ఇంటికి బయలుదేరారు. ఇంటికి చేరే లోపే వారిలో ఇద్దరిని బస్సు రూపంలో మృత్యువు కబళించింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నెల్లూరులోని జాకీర్హుస్సేన్నగర్ న్యూ కాలనీకి చెందిన పార్వతి వెంకటేశ్వర్లు (25) డెకరేషన్ కూలీగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మేకల సుబ్రహ్మణ్యం (37), పల్లిపాటి సుబ్రహ్మణ్యం పెయింట్ పనులు చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున ముగ్గురు నాటు కోడి కోసం మూడోమైలు ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ధరలు అధికంగా ఉండటంతో కొనుగోలు చేయకుండా తిరిగి ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో నెల్లూరు రూరల్ మండల పరిధిలోని దీన్దయాళ్ నగర్ క్రాస్రోడ్డు వద్ద విజయవాడ వైపు నుంచి గూడూరు వైపు వెళుతున్న కర్నాటక రాష్ట్రానికి చెందిన ట్రావెల్ బస్సు పొగమంచు దట్టంగా అలుముకుని ఉండటంతో ముందు వెళుతున్న మోటర్బైక్ను ఢీకొంది. ప్రమాదంలో పార్వతి వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతువాత పడ్డాడు. మేకల సుబ్రహ్మణ్యంను నారాయణ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పల్లిపాటి సుబ్రహ్మణ్యం తీవ్ర గాయాలపాలై నారాయణలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి కారణమైన ట్రావెల్ బస్సును స్థానికులు ఆగ్రహంతో ప్రయాణికులను కిందకు దించి నిప్పంటించారు. బస్సు పూర్తిగా దగ్ధమైంది. నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. రూరల్ ఎస్సై శేఖర్బాబు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ గ్రామాల్లో భోగి పండగ ఉండదు
శ్రీకాకుళం, నరసన్నపేట రూరల్ : భోగ భాగ్యాలకు నెలవైన భోగి పండగ అన్ని ప్రాంతాల్లోనూ జరుపుకుంటారు. మండలం లోని కొన్ని గ్రామాల్లో ప్రజలు మాత్రం ఈ పండగకు దూరంగా ఉంటున్నారు. పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ లింగా లపాడు, చింతువానిపేట, బసివలస, యారబాడు, వీఎన్పు రం గ్రామాల్లో 50 ఏళ్లుగా ఈ పండగ చేసుకోవడంలేదు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో యూత్ సభ్యులు పలుమార్లు ముందుకు రాగా గ్రామపెద్దలు అడ్డు చెప్పడంతో ఈ పండగను నామమాత్రంగానే చేసుకుంటున్నారు. ఇదీ కథ..! లింగాలపాడు, చింతువానిపేట గ్రామాల్లో ఒకసారి భోగి మంట వేశారంట. ఆ మంటలో పిల్లి పడి మరణించిందంట. దీన్ని అపశకునంగా భావించి అప్పట్నుంచి భోగి మంట నిషేధించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఒకట్రెండు సార్లు భోగి మంట వేసేందుకు గ్రామ యువకులు ప్రయత్నించగా కొందరు రోగాల బారిన పడినట్లు తెలిపారు. -
ఇంటింటా సంక్రాంతి
-
భోగి పండగ సందడి షురూ..
-
‘పుంజు’కుంటున్న బరులు
పందేలకు సై.. కేసులకూ రె‘ఢీ’ పందేల రాయుళ్ల బరితెగింపు అడ్డుకుంటాం: పోలీసులు గతం కంటే తగ్గిన హడావుడి భోగి రోజు అనధికారిక అనుమతులొస్తాయని ఆశలు సాక్షి ప్రతినిధి, ఏలూరు: సుప్రీంకోర్టు ఆదేశాలు, హైకోర్టు ఉత్తర్వులు, పోలీసుల ఆంక్షలు ఎలా ఉన్నా ‘పశ్చిమా’న సంక్రాంతికి పందెం కోడి సై అంటోంది. భోగి పండుగ నుంచి కనుమ వరకు మూడు రోజులపాటు నిరంతరాయంగా పందేలు సాగించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మునుపటి కంటే హడావుడి బాగా తగ్గినా పండుగ రోజుల్లోనైనా భారీగా నిర్వహించాలని పందేల రాయుళ్లు పట్టుదలతో ఉన్నారు. పోలీసు కేసులనైనా ఎదుర్కొనేందుకు రెడీ అవుతున్నారు. కోడిపందేల అనుమతుల విషయమై హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన బీజేపీ నేత కనుమూరి రామకృష్ణంరాజు మంగళవారం భీమవరంలో లాంఛనంగా కోడి పందేలను ప్రారంభించారు. సుముహూర్తం చూసుకుని మరీ ఆయన రెండు పందెం కోళ్లను బరిలోకి దింపి జిల్లాలో పందేలకు శ్రీకారం చుట్టినట్టు ప్రకటించారు. అయితే కోళ్లకు కత్తులు కట్టకుండా డింకీ పందేలను ఆడించారు. అదేవిధంగా ఏలూరులో జరిగిన సంక్రాంతి సంబ రాల్లో ఎంపీ మాగంటి బాబు కూడా కోళ్లను చేతబట్టుకుని పందేలకు సై అనిపించారు. నిశిరాత్రి మొదలైన బరుల సందడి పందేల నిర్వహణకు మంగళవారం రాత్రి నుంచి బరులు సిద్ధం చేస్తున్నారు. డెల్టాలో ప్రధానంగా వెంప, భీమవరంలో ఆశ్రమం తోట, లోసరి, ఐ.భీమవరం, సీసలి, మహదేవపట్నం తదితర ప్రాంతాల్లో పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిలో భీమవరం ప్రకృతి ఆశ్రమం, ఐ.భీమవరం, వెంప అత్యంత ఖరీదైన పందేలకు పెట్టింది పేరు. ఇక్కడి పోటీలను తిలకించేందుకు సినీస్టార్లు, రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి రాజకీయ ప్రముఖులు వస్తుంటారు. ఈ మూడు ప్రాంతాల్లో బుధవారం నుంచి రాత్రింబవళ్లు పోటీలు ఖాయమని నిర్వాహకులు చెబుతున్నారు. ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం, పంగిడిగూడెం శివారు, నారాయణపురం గ్రామాలు, నల్లజర్ల మండల కేంద్రం, తాడేపల్లిగూడెం మెట్టమీద బరులు సిద్ధం చేస్తున్నారు. నిడదవోలు సమీపంలో 14 బరులు, మొగల్తూరు, వెంప, కాళీపట్నంలోనూ, జంగారెడ్డిగూడెంలో శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం పట్టణం, కొవ్వూరు నియోజకవర్గంలోని తోగుమ్మి, తాళ్లపూడి, పెద్దేవం, చిక్కాల, మీనానగరం, బ్రాహ్మణగూడెం, మార్కొండపాడుల్లో బరులు సిద్ధమయ్యాయి. జిల్లాలోనే అత్యధికంగా ఉంగుటూరు నియోజకవర్గంలో 17 చోట్ల బరులు సిద్ధం చేశారు. ఏలూరు సమీపంలోని పెదపాడు మండలం పాత పెదపాడు, దెందులూరు మండలం పెరుగుగూడెంలో బరులు సిద్ధమవుతున్నాయి. మొత్తంగా చూస్తే జిల్లాలో మెట్ట ప్రాంతం కంటే డెల్టాలోనే కోడిపందేల హడావుడి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లు పందేల రాయుళ్లు బరులు సిద్ధం చేస్తుంటే జిల్లా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా పందేలు జరిగే ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు పెంచి జూదరులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కోళ్లకు కత్తులు కట్టేవారిని, గతంలో కోడిపందేల కేసులున్నవారిని అదుపులోకి తీసుకుంటున్నారు. కోళ్లకు కత్తులు కట్టకుండా ఆడించినా అంగీకరించేదిలేదని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే చెక్పోస్టులు పెట్టి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. కృష్ణాకు తరలుతున్న పందెం రాయుళ్లు మునుపెన్నడూ లేని విధంగా జిల్లాలో కోడిపందేలపై పోలీసులు కొరడా ఝుళిపిస్తుండటంతో చాలామంది పందేల రాయుళ్లు కృష్ణాజిల్లాకు తరలిపోతున్నారు. అక్కడ పోలీస్ యాక్షన్ ఇంత సీరియస్గా లేకపోవడంతో రూ.లక్షల్లో పందేలు కాసేవారు కృష్ణాకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. -
జనవోలు మల్లన్న జాతర వైభవంగా
వర్ధన్నపేట రూరల్, న్యూస్లైన్ : వర్ధన్నపేట మండలంలోని ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి ఆలయం సోమవారం భక్తజనంతో పోటెత్తింది. జాతర, బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భోగి పండుగ సందర్భంగా సోమవారం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. జాతర రెండో రోజున తెల్లవారుజాము నుంచి స్వామికి నూతన వస్త్రాలంకరణ, తోరణబంధనం, విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, ధ్వజారోహణ, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహానివేదన, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ గావిం చారు. ఆలయ ప్రాంగణంలో తోరణాలు కట్టి పసుపు, కుంకుమతో స్వామివారిని అభిషేకించారు. ఆలయ పూజారి నందనం శివరాజయ్య ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు బియ్యం, బండారి(పసుపు), కుడుకలతో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తులు బోనాలు తలపై పెట్టుకుని గుడిచుట్టూ ప్రదక్షిణలు చేశారు. క్యూలో భక్తుల మల్లన్నను దర్శించుకోవడానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చొని స్వా మివారిని దర్శించుకున్నారు. పాడిపంటలు, పిల్లాపాపల ను సల్లంగ చూడాలని ముడుపులు కట్టారు. అలాగే ఆల య ప్రాంగణంలోని వివిధ దేవతామూర్తుల విగ్రహాల వద్ద పూజలు చేశారు. నైవేద్యంతో బోనం వండి ఎల్లమ్మ ఆల య ఆవరణలో వేప ఆకులతో బోనాలను తలపై పెట్టుకొని భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. జాతర వద్ద భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, వరంగల్ ఏవీవీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం కోఆర్డినేటర్ కె.శ్రీనివాస్ ఆధ్వర్యం లో 50 మంది వలంటీర్లు సేవలు అందించారు. వారం రోజుల పాటు సేవలు అందించనున్నట్లు ఆయన తెలిపారు. మల్లన్నను దర్శించుకున్న ప్రముఖులు ఎంపీ సిరిసిల్ల రాజయ్య, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు, డీఎంహెచ్ఓ సాంబశివరావు, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, దాస్యం వినయ్భాస్కర్, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, వరదరాజేశ్వర్రావు, మార్నేని రవీందర్రావు, రాజయ్యయాదవ్ మల్లికార్జునస్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన అర్బన్ ఎస్పీ జాతర సందర్భంగా భద్రతా ఏర్పాట్లను అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మామునూరు డీఎస్పీ సురేష్కుమార్కు పలు సూచనలు చేశా రు. వాహనాల పార్కింగ్ నిర్వహణపై జాగ్రత్తగా వ్యవహరించాలని, జాతర సజావుగా ముగిసేలా చూ డాలని సిబ్బందిని ఆదేశించారు. దేదీప్యమానంగా దేవాలయం బ్రహ్మోత్సవాల సందర్భంగా మల్లన్న ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. భారీ సంఖ్యలో వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. నేటి కార్యక్రమాలు మకర సంక్రాంతి సందర్భంగా ఆలయంలో మహన్యాస ఏకాదశ రుద్రాభిషేకం, మహానివేదన, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం, రాత్రి ఎడ్ల బండ్ల ప్రభలతో ఆలయం చుట్టూ ప్రదర్శనలు నిర్వహించనున్నారు. సోమవారం 50వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ చైర్మన్ వడిచర్ల శ్రీనివాస్, ఈఓ శేషుభారతి తెలిపారు. -
పల్లె.. సంబరాల ముల్లె
మెతుకుసీమలో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. భూమి పుత్రులు పంటల రాకతో, పిల్లలు గాలి పటాల ఆటలతో, మహిళలు నోములు వ్రతాలతో, పెద్దలు కుటుంబమంతా కలిసిన ఆనందంతో వేడుకను జరుపుకుంటున్నారు. అమ్మాయిలు రంగుల ముగ్గులతో స్వాగతం పలుకుతున్నారు. నువ్వులు, పలుకులు, పుట్నాలు, పేలాలు, బెల్లం మెళవింపుతో తయారు చేసిన ముద్దలు ఘుమఘుమలాడుతున్నాయి. సకినాలు, అరిసెలు, కుడుములు మొదలగు పిండి వంటల రుచులు నోరూరిస్తున్నాయి. నవధాన్యాలు పేర్చి మధ్యలో పిడకలపై మట్టిగురిగిలో పాలు, బియ్యం పోసి పొంగించే వైవిధ్య సంబరం ప్రారంభమైంది. దోషాలు తొలగి సిరి సంపదలు జీవితాల్లో ఉప్పొంగాలనే ఎన్నో అశలతో ప్రజలు సంక్రాంతిని ఆహ్వానిస్తున్నారు. ఉద్యోగ, వ్యాపార, విద్యారీత్యా విభిన్న ప్రాంతాల్లో నివసిస్తున్న వారెందరో కని పెంచిన పల్లెలకు, పట్టణాలకు వచ్చేశారు. ఆకాశం గాలి పటాల జోరుతో కళకళలాడుతోంది. ఇంటికి చేరి సందడి చేస్తూ.. ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన ప్రణతిసుధ, శ్రావణి పండుగ కోసం చేగుంటలోని తమ ఇంటికి చేరుకున్నారు. పండుగతోపాటు సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. పుస్తకాలతో నిత్యం కుస్తీ పడే వీరు ఇంటి పని లో తల్లికి ఆసారాగా ఉంటున్నారు. చేగుంట ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మురళికి ముగ్గురు కూతుళ్లు. పెద్దకూతురు ప్రణతిసుధ ఆదిలాబాద్లో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. రెండో కూతురు శ్రావణి హైదరాబాద్లో ఎంబీబీఎస్ కోసం లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకుంటుంది. పండుగ సంబరాల కోసం వీరిద్దరు ఇంటికి చేరుకున్నారు. ప్రణతి అమ్మ వాణిశ్రీకి పిండివంటలు చేయడంలో సహకరిస్తుండగా శ్రావణి తన చిన్నారి చెల్లికి చిట్టి పొట్టి నీతికథలు చెబుతుంది. ఉన్నత చదువుల కోసం దూరప్రాంతాలకు వెళ్లిన తమ పిల్లలు ఇంటికి చేరడంతో సందడిగా ఉందని తల్లిదండ్రులు వాణి,మురళి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘సకినాలు’ బహుత్ అచ్చాహై.. సకినాలు టేస్టు బహుత్ అచ్చాహై.. అంటూ సంతోషం వ్యక్తం చేసింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాయ్బరేలి జిల్లా అడోభర్ గ్రామానికి చెందిన విద్య. గోదావరి సుజల స్రవంతి పైపులైన్ నిర్మాణం పనులు నిర్వహిం చేందుకు ఏడాది కిందట నంగునూరు మండలం పాలమాకులకు వచ్చి స్థిరపడ్డారు అనూజ్, విద్య దంపతులు. వీరు ఉంటున్న ప్రాంతంలో అందరూ ప్రత్యేక వంటకాలు చేస్తుండగా ఈమె కూడా వాటి తయారీని తెలుసుకుని తమ పిల్లలకు చేసి పెడుతున్నారు. అప్పాలు, చెగోడీలు, సకినాలు, బెల్లంనువ్వుల ముద్దలు చేస్తుంది. సంక్రాంతి పండుగను ఇక్కడ బాగా చేస్తారని తెలిపింది. తమ పిల్లలు సింకు, కీర్తనలతో కలిసి ఉదయం ఇంటి ముందు ముగ్గు వేసి గొబ్బెమ్మలు పెట్టినట్టు చెబుతుంది విద్య. ఇక్కడి సంప్రదాయం తమకు బాగా నచ్చిందని చెబుతుంది ఆమె.