Bike riding
-
Viral Video: బైక్ నడిపేటప్పుడు కాళ్ళు అందకపోతే ఏం చేయాలి?
బైక్పై డ్రైవింగ్ అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. కార్లు, బస్సుల్లో ప్రయాణించినా.. బండిపై వెళ్లడం అదో సరాదాగా అస్తుంది. చిన్న దూరాలకే కాకుండా లాంగ్ డ్రైవింగ్లకు సైతం బైక్ రైడ్కే నేటి యువత సై అంటున్నారు. నేటి కాలంలో అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేకుండా అందరూ టూవీలర్పై రయ్మంటూ వెళ్తున్నారు. అయితే బండి నడపాలంటే కచ్చితంగా మేజర్ అయి ఉండి, డ్రైవింగ్ వచ్చి ఉండాలన్న విషయం తెలిసిందే. అంతేగాక వాహనాన్ని బ్యాలెన్స్ చేయడం కూడా రావాలి. కానీ.. బండి నడిపే సమయంలో రెండు కాళ్లు సరిగా కింద అందకపోయినా బైక్పై ఎంచక్కా వెళ్లిపోవచ్చని. మీకు తెలుసా?.తాజాగా ఇలాంటి ఓ వీడియో నెటిజన్ల కంటపడింది.. ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ.. బైక్ అంత పొడవున్న ఓ యువతి.. రహదారిపై దర్జాగా స్పోర్ట్స్ బైక్ డ్రైవ్ చేస్తూ వెళుతుంది. అయితే ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో ఆమెకు కాళ్లు అందక బండి ఆపేందుకు కష్టమవుతుంది. దీంతో తెలివిగా సిగ్నల్కు ముందే ఒకవైపుకు కాళ్లు తీసి చాలా స్టైల్గా టూవీలర్ ఆపింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్గా మారింది.బైక్ నడిపేటప్పుడు కాళ్ళు అందకపోతే ఏం చేయాలి?pic.twitter.com/mW5nzBgAcu— వై.ఎస్.కాంత్ (@yskanth) August 15, 2024 దీనిని చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తూనే.. అలా డ్రైవ్ చేయడం ప్రమాదకరమని సూచిస్తున్నారు. అన్నట్లు ఈ వీడియోలో యువతి చేసినట్లు మీరేమైనా ప్రయత్నించేరూ.. అలాంటి సాహసాలు మాత్రం చేయకండి.. ఇంకో విషయం.. బండిపై వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం మర్చిపోకండి. -
క్వీన్ రైడర్స్
‘మేఘాలలో తేలిపొమ్మన్నది.. తూఫానులా రేగిపొమ్మన్నది.. అబ్బాయితో సాగుతూ చిలిపి మదీ’ అంటూ మార్చేసి పాడేసే టైమ్ వచ్చేసింది. ఒకప్పుడు కింగ్స్కి మాత్రమే పరిమితమైన బైకింగ్ ఇప్పుడు క్వీన్స్కి కిరీటాలు అలంకరించేస్తోంది. ఈ క్రమంలో నగరానికి చెందిన నలుగురు మహిళల బృందం కూడా ఒక రేర్ రైడ్తో సిటీలో టాక్ ఆఫ్ ద బైకింగ్ క్లబ్గా మారారు. సొంత బైక్లపై పలు ప్రాంతాలను చుట్టేస్తూ..ప్రపంచంలోనే ఎత్తైన రోడ్లపై ప్రయాణంలఢాక్లోని ఉమ్లింగ్లా పాస్లో సాహస యాత్ర విభిన్న రంగాలకు చెందిన మహిళల్ని ఒకే బాట పట్టిస్తోంది బైక్ రైడింగ్. అలా వేర్వేరు రంగాలకు చెందిన నలుగురు నగర మహిళలు బైకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో తాజాగా లఢాక్లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఉమ్లింగ్లా పాస్ను అధిరోహించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ వారిని పలకరించినప్పుడు తమ రైడింగ్ అనుభవాలు పంచుకున్నారు.. ఆ వివరాలు...సొంతంగా కొనుక్కున్న బైక్తో.. జూబ్లీíß గత కొంత కాలంగా బైక్ రైడింగ్ అలవాటైంది. మన ఇంట్రెస్ట్ కోసం పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకూడదని గూగుల్లో పనిచేసి, ఆన్లైన్ బిజినెస్.. ద్వారా రూ.1.50 లక్షలు సంపాదించి సొంతంగా యమహా ఆర్15 వి2 బైక్ కొన్నాను. గతంలో షార్ట్ రైడ్స్కి కొన్నిసార్లు వెళ్లాను. అయితే బైకర్ణీలో చేరాక లాంగ్ రైడ్స్ మీద ఆసక్తి బాగా పెరిగింది. ఉమింగ్లా పాస్ రైడ్ అనుకున్నప్పుడు గతంలో ఎన్నడూ అంత లాంగ్వ్కి వెళ్లకపోవడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయేమో అనే భయం ఉండేది. కానీ.. గ్రూప్లో వెళ్లాం కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప పెద్దగా ఏమీ ఫేస్ చేయలేదు. మైనస్ డిగ్రీస్ చలిలో మా టార్గెట్ రీచ్ అవడం అద్భుతమైన థ్రిల్లింగ్ ఇచ్చింది. – గీతిక పోలిశెట్టి (28), ఫ్యాషన్ డిజైనర్బైక్ రైడింగ్ ఇష్టం.. మేం ఎల్బీనగర్ లో ఉంటాం. చిన్నప్పటి నుంచీ బైక్ రైడింగ్ ఇష్టం. మా తాతయ్యకు లూనా ఉండేది. నేను వెనక ఎక్కేదాన్ని. ఆ తర్వాత మా నాన్నకి హోండా సీడీ 100 ఉండేది. ఆ బైక్ నేను డ్రైవ్ చేశాను. అందుకే నేను వాడిన నా ఫస్ట్ బైక్ జావా 42.. ఇప్పుడు బీఎండబ్ల్యూ జి3 10ఆర్ ఉంది. దీన్ని కేవలం లాంగ్ రైడ్స్కి వినియోగిస్తుంటాను. కర్ణాటక, హైదరాబాద్ టూ కన్యాకుమారి.. ఇలా టూర్స్ వెళ్లొచ్చాను. తొలి దశలో ఇంట్లో వాళ్లు కొంచెం భయపడ్డారు కానీ..ఇప్పుడు ఫుల్ కాని్ఫడెంట్గా ఉన్నారు. వీలైనంత వరకూ బైక్ రైడ్ ద్వారా మంచి మంచి ప్రదేశాలు చుట్టిరావాలని ఆశిస్తున్నాను. దీని తర్వాత నేపాల్, టిబెట్ రైడ్ కి వెళ్లాలనేది ప్లాన్.. –సుష్మితారెడ్డి (27), బిజినెస్ ఎనలిస్ట్డ్రీమ్ రైడ్ అదే..మేం మోకిలాలో నివసిస్తున్నాం. మొదట నేను యమహా ఆర్ఎక్స్ 100 నడిపేదాన్ని. ఆ తర్వాత నా సొంత బైక్ అంటే బెనల్లీ టీఎన్టీ 25, ప్రస్తుతం బీఎండబ్ల్యూ జి310ఆర్ నడిపిస్తున్నాను. ఏడేళ్లలో సిక్కిం, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలకు వెళ్లాం. ఎన్ని లాంగ్ రైడ్స్ వేసినా ఉమింగ్లా పాస్కు రైడ్ అనేది ఒక మరచిపోలేని అనుభూతిని అందించింది. మైనస్ డిగ్రీల వాతావరణం అలవాటు లేక కొంత ఇబ్బంది పడ్డాం. బైక్ స్కిడ్ అయి పడిపోవడం.. వంటి కొన్ని సంఘటనలు జరిగాయి. అయితే థాంక్ ఫుల్లీ.. ఎవరికీ ఏమీ కాలేదు. టిబెట్, భూటాన్, వియత్నాం.. రూట్ కవర్ చేయాలనేది డ్రీమ్ రైడ్. – సుష్మారెడ్డి (42), బిజినెస్ ఎనలిస్ట్ఫిజికల్లీ ఫిట్.. మేం నేరేడ్ మెట్లో ఉంటాం. డిగ్రీ పూర్తి చేశాక 2017లో రైడింగ్ స్టార్ట్ చేశాను. మా నాన్నగారి ఓల్డ్ మోడల్ ఎలక్ట్రా 350 (రాయల్ ఎన్ఫీల్డ్) నడిపేదాన్ని. ఆ తర్వాత నా సొంతంగా థండర్బోల్ట్ 350ఎస్ కొనుక్కున్నా. తొలిరైడ్ 1700 కి.మీ నడిపించాను. వేల కిమీ లాంగ్ రైడ్స్ చేశాను. ఒక మహిళా రైడర్గా నాకున్న పరిధులు, పరిమితుల ప్రకారం.. పూర్తి ప్రణాళికా బద్ధంగా రైడ్స్కి వెళ్తుంటాను. ఎక్కడికి వెళ్లినా సాయంత్రం లోపు రైడ్ కంప్లీట్ చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటాను. అలాగే ఒక ఫిట్నెస్ ఫ్రీక్గా బైక్ పడినా సులభంగా లేపగలిగినæ ఫిట్నెస్ ఉండాలి. అందుకే లేహ్ లడక్కు వెళ్లిన ప్రతి ఒక్కరికీ అనుభవంలోకి వచ్చే అల్టిట్యూడ్ మౌంటైన్ సిక్నెస్ రాలేదంటే...అందుకు కారణం నేను అనుసరించే సీరియస్ ఫిట్నెస్ రొటీన్ అని చెప్పగలను. –అనీషా ఫాతిమా లతీఫ్ (28), వృత్తి జిమ్ యజమాని -
సోలోగా.. జాలీగా
చేతిలో పాస్పోర్టు.. బ్యాగులో మూడు, నాలుగు డ్రెస్సులు, అవసరమైన డబ్బులు.. అంతే.. విమానం ఎక్కేయడం, విదేశాలకు చెక్కేయడమే. ముందుగా వీసా అవసరం లేకుండా వెళ్లగలిగే దేశాలను చుట్టేసి వచ్చేయడమే. ఇది సోలో టూరిస్టుల నయా ట్రెండ్. అదీ గ్రేటర్ హైదరాబాద్ నగరవాసుల్లో మరింత ఎక్కువగా కనిపిస్తోంది. నిమిషం తీరికలేని హడావుడి జీవితంలో కాస్త ఉపశమనం పొందేందుకు విదేశాల బాటపడుతున్నారు. వివిధ దేశాలకు చెందిన పర్యాటక సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీలు రకరకాల టూరిస్టు ప్యాకేజీలు, రాయితీలతో హైదరాబాదీలను ఆకట్టుకుంటున్నాయి. ..: సాక్షి, హైదరాబాద్ :..సోలో టూర్లో ఇలా..సోలో టూరిస్టులు చాలా వరకు డమ్మీ హోటల్ బుకింగ్లతో ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటారు. వెళ్లిన దేశాల్లో డార్మిటరీలు, హాస్టల్ సదుపాయం ఉన్నచోట రాత్రి బస చేస్తారు. చిన్న హోటళ్లలో భోజనం చేస్తారు. వీటన్నింటి వల్ల ఖర్చు చాలా వరకు తగ్గుతుంది.⇒ ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లాల్సివచ్చినప్పుడు.. రాత్రి పూట రైళ్లలో ప్రయాణం చేయడం వల్ల ఎక్కడో ఒకచోట బసచేయాల్సిన అవసరం కూడా ఉండదు. విమాన చార్జీలు, స్థానిక రవాణా చార్జీలు మాత్రమే సోలో టూరిస్టుల బడ్జెట్లో ఎక్కువ ఖర్చు కింద లెక్క.⇒లగేజీ తక్కువే. దీంతో ప్రత్యేకంగా హోటల్లోనే ఉండాలనే ఇబ్బంది కూడా ఉండదు.వీసాలు సులువుగా వస్తుండటంతో..శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు సుమారు 15 వేల మంది వివిధ దేశాలకు వెళుతుండగా..అందులో 60శాతం వరకు ‘సోలో టూరిస్టులే’ ఉంటున్నట్లు టూర్ ఆపరేటర్లు చెప్తున్నారు. గోవా, జైపూర్, కశ్మీర్ వంటి పర్యాటక, వినోద ప్రాంతాలకు వెళ్లినట్టుగానే.. ఇప్పుడు సిటీ టూరిస్టులు విదేశీ టూర్లకు వెళ్తున్నారని అంటున్నారు. కోవిడ్ అనంతరం పరిస్థితుల్లో మార్పు వచ్చిందని.. చాలా దేశాలు పర్యాటకులను ఆకట్టుకునేందుకు ‘వీసా ఆన్ అరైవల్, ఫ్రీ వీసా’ వంటివి అందిస్తున్నాయని చెప్తున్నారు.సర్క్యూట్ టూర్లుసాధారణంగా నగర పర్యాటకులు దుబాయ్, సింగపూర్ పర్యటనలకు ఎక్కువగా వెళ్తారు. ఇంటిల్లిపాది కలిసి ఏదో ఒక దేశంలో పర్యటిస్తారు. ఈ మేరకు టూరిస్టు సంస్థలు వీసాతో కలిపి టూర్ ప్యాకేజీలు అందజేస్తాయి. ఇలా నలుగురు కుటుంబ సభ్యులు కలిసి వెళ్లినప్పుడు ఒకటి కంటే ఎక్కువ దేశాల్లో పర్యటించడం కష్టమే. ఫ్యామిలీగా వెళ్లే టూర్లు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర యూరప్ దేశాలకు ఎక్కువ. కానీ సోలో టూర్లు వీటికి పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. సోలో టూరిస్టులు ఒకసారి ఇంటి నుంచి బయలుదేరితే మూడు, నాలుగు దేశాల్లో పర్యటించేలా ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు.ప్రస్తుతం మలేసియా, థాయ్లాండ్, శ్రీలంక, మాల్దీవులు, నేపాల్ ఉచిత వీసా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. దీంతో ఎక్కువ మంది ఈ దేశాల్లో పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సింగపూర్కు ఈ–వీసా సదుపాయం ఉంది. దీంతో చాలా మంది సింగపూర్కు ఈ–వీసాపై వెళ్లి అక్కడి నుంచి మలేసియా, థాయ్లాండ్లనూ చుట్టి వచ్చేస్తున్నారు. ఇక ఇండోనేషియా, కంబోడియా, వియత్నాం తదితర దేశాలు వీసా ఆన్ అరైవల్ సదుపాయం అందిస్తున్నాయి. సోలో టూరిస్టులు ఈ దేశాలకు కూడా ఎక్కువగా వెళ్తున్నట్లు పర్యాటక సంస్థలు చెప్తున్నాయి. కంబోడియాలోని పల్లవుల నాటి అంగ్కోర్వాట్ దేవాలయం, ఇండోనేషియాలోని బాలి, జావా, సుమత్రా తదితర ద్వీపాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయని అంటున్నాయి.వియత్నాంలో బైక్ రైడింగ్సిటీ టూరిస్టులను కొంత కాలం నుంచి విశేషంగా ఆకట్టుకుంటున్న మరో పర్యాటక దేశం వియత్నాం. తక్కువ విమానచార్జీలతో ఈ చిన్న దీవుల దేశంలో పర్యటించవచ్చు. ఇండోనేషియాలోని బాలి బీచ్ కల్చర్ పర్యాటకులను ఆకట్టుకుంటుండగా.. వియత్నాంలో బైక్ రైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్లిన పర్యాటకులు అద్దె బైక్లపై ఉత్తరం నుంచి దక్షిణం వరకు రైడ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ‘వియత్నాం చిన్న దేశం. ఉత్తరం నుంచి దక్షిణం వరకు 2,000 కిలోమీటర్లలోపే ఉంటుంది.బైక్పై ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది’’ అని నగరానికి చెందిన టూరిస్టు సుబ్బారెడ్డి తెలిపారు. దేశ, విదేశాలకు చెందిన టూరిస్టులు బైక్ రైడింగ్ కోసం వియత్నాంకు వస్తారని చెప్పారు. ఇక తక్కువ బడ్జెట్లో సందర్శించే సదుపాయమున్న మరో దేశం ఫిలిప్పీన్స్. దీవుల సముదాయమైన ఈ దేశంలో పర్యటించడం హైదరాబాద్ నుంచి గోవా ట్రిప్పు కోసం వెళ్లినట్లుగానే సింపుల్గా ఉంటుంది. వీసా ఆన్ అరైవల్, ఈ–వీసా సదుపాయాలున్న తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాలకు కూడా సిటీ పర్యాటకులు వెళ్తున్నారు.వేర్వేరు దేశాలకు వెళ్తూ ఉంటా..2013 నుంచీ విదేశాల్లో పర్యటిస్తున్నాను. ఇప్పటివరకు 65 దేశాలు తిరిగాను. విదేశాల్లో విభిన్నమైన, వైవిధ్యమైన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానం, ఆహార అలవాట్లు వంటివి తెలుసుకోవడం, పరిశీలించడం నాకెంతో ఇష్టం. ఎక్కడికెళ్లినా అక్కడి ప్రజలతో మమేకమవుతాను. పర్యాటక ప్రదేశాలను సందర్శించడం కంటే అక్కడి ప్రజలను కలిసేందుకే ఇష్టపడతాను. – సుబ్బారెడ్డి, రెగ్యులర్ టూరిస్ట్2 నెలలకోసారి మలేసియా వెళ్తా..కనీసం రెండు, మూడు నెలలకు ఒకసారి మలేసియాకు వెళ్తాను.ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తాను. అక్కడి తెలుగు సంఘాల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లలో పిల్లలకు తెలుగు బోధిస్తాను.దాంతో మలేసియాతో ఒక అనుబంధం ఏర్పడింది. – రాఘవాచార్య, టీచర్ఇదీ రాకపోకల లెక్క (సుమారుగా)..⇒ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు రాకపోకలు సాగించే ప్రయాణికులు 65,000 నుంచి 70,000⇒ అందులో దేశీయ ప్రయాణికులు 55,000⇒ అంతర్జాతీయ ప్రయాణికులు దాదాపు 15,000⇒ సోలో టూరిస్టులు 7,000 నుంచి 9,000 -
Bike Mileage Tips: మీ బైక్ మైలేజ్ ఇవ్వట్లేదా.. ఇవి పాటించాల్సిందే..
మోటార్ బైక్ కొత్తదైనా చాలామంది మైలేజ్ ఇవ్వడం లేదని ఆందోళన చెందుతుంటారు. అయితే బైక్ నడుపుతున్నపుడు కొన్ని తప్పులు చేయడం వల్ల మైలేజ్ తగ్గుందని నిపుణులు చెబుతున్నారు. బైక్ మైలేజ్ పెరగాలంటే ఈ కింది విషయాలపై జాగ్రత్త తీసుకోవాలంటున్నారు. గేర్ మార్చకపోవడం బైక్ నడుపుతున్నపుడు బైక్ వేగానికి తగ్గట్టుగా గేర్ మార్చడం చాలా ముఖ్యం. మెయిన్ రోడ్డు(పెద్ద రోడ్లు, రహదారులు)పై అధిక వేగంతో బైక్ను స్థిరవేగంతో నడపాలంటే ఎక్కువ గేర్లో ఉండాలి. దీనివల్ల ఇంజిన్పై పెద్దగా ఒత్తిడి ఉండదు. దాంతో మంచి మైలేజ్ ఇస్తుంది. తక్కువ వేగంతో నడపాల్సి వస్తే రెండు లేదు మూడో గేర్లో బైక్ను నడపాలి. ఇలా చేయడం వల్ల బైక్ తక్కువ వేగంలో ఆగదు. ఎప్పుడూ కాలు బ్రేక్ పైనే.. బైక్ నడుపుతున్నపుడు చాలా మంది బ్రేక్పై కాలు ఉంచుతారు. అయితే బ్రేక్పై కాలు ఉంచి డ్రైవింగ్ చేయడం చెడ్డ అలవాటేం కాదు. ఇది వెంటనే బ్రేక్ వేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రతిసారి బ్రేక్లపై ఒత్తిడి ఉంచితే స్వేచ్ఛగా ముందుకు కదలదు. ఇలా చేయడం వల్ల బైక్ నడపడానికి ఎక్కువ యాక్సిలేటర్ ఇవ్వాలి. దాంతో కొంత మైలేజ్పై ప్రభావంపడే అవకాశం ఉంది. అలా అని బ్రేక్ వాడకూడదని కాదు. అనవసరమైన సందర్భాల్లోనూ బ్రేక్ వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి: యాప్ల కొనుగోళ్లకు కంపెనీల పన్నాగం.. ఎలా మోసం చేస్తున్నారంటే.. తక్కువ గాలి.. టైర్లలో తక్కువగా గాలి ఉండటం వల్ల బైక్ మైలేజ్ క్షీణిస్తుంది. మెరుగైన మైలేజీ కోసం టైర్లో సరిపడా గాలి ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని పెట్రోల్ పంపులు ఎయిర్ ప్రెజర్ మెషీన్ సదుపాయాన్ని కలిగి ఉంటున్నాయి. దాంతో ఉచితంగానే టైర్ల్లో గాలి చెక్ చేసుకోవచ్చు. -
ప్రాణం తీసిన ర్యాష్ డ్రైవింగ్! క్షణకాలంలో ఇద్దరూ..
కరీంనగర్: అజాగ్రత్తగా బైక్లు నడపడంతో ఎదురెదురుగా ఢీకొని వేల్పుల అవినాశ్కుమార్(16), పూరెళ్ల అభిలాశ్(18) దుర్మర ణం చెందారు. మిత్రులతో సర్కస్ తిలకించేందుకు వెళ్లిన వీరిద్దరూ అనూహ్యంగా మృతిచెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ప్రమాదం శుక్రవారం అర్ధరాత్రి పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లోకపేటలో చోటుచేసుకుంది. జూలపల్లి ఎస్సై వెంటకృష్ణ కథనం ప్రకారం.. జూలపల్లి మండలం కాచాపూ ర్కు చెందిన అవినాశ్కుమార్, పెద్దపల్లికి చెందిన అభిలాశ్, వేల్పుల రమేశ్, పంబాల మనోజ్, దాడి రామ్చరణ్, కొలిపార రాంచరణ్ మిత్రులు. ఎలిగేడు మండలం ముప్పిరితోటలో ప్రదర్శిస్తున్న సర్కస్ చూసేందుకు ఈ ఆరుగురు మిత్రులు రెండు బైక్లపై రాత్రి బయలుదేరి వెళ్లారు. సర్కస్ తిలకించాక అవే బైక్లపై ఇంటిదారి పట్టారు. ఈక్రమంలో ఎలిగేడు మండలం లోకపేట శివా రులోని వంతెన వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ఓ బైక్ అవినాశ్కుమార్, అభిలాశ్ బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో అవినాశ్కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. అభిలాశ్ను హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. వీరిని ఢీకొ న్న మరోబైక్ నడుపుతున్న ముప్పిరితోటకు చెందిన మాదారపు వెంకట్రావు తీవ్రంగా గాయపడగా, కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఇతడి పరిస్థితి విషమంగా ఉంది. మిగతా స్నేహితులు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అవినాశ్ తండ్రి మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రెండు కుటుంబాల్లో తీరని విషాదం.. పెద్దపల్లికి చెందిన పూరెళ్ల శ్రీనివాస్ – కవిత దంపతుల చిన్నకుమారుడు అభిలాశ్. వీరిది నిరుపేద కుటుంబం. అభిలాశ్ ఇంటర్పూర్తి చేశాడు. స్నేహితులతో సర్కస్ చూసేందుకు వెళ్లి వస్తూ మృతిచెందడంతో కుటుంబసభ్యులు విలపిస్తున్నారు. జూలపల్లి మండలం కాచాపూర్కు చెందిన అవినాశ్ కుమార్ పెద్దాపూర్ ఆదర్శ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. చిన్నతనంలోనే తల్లి మృతి చెందింది. తండ్రి మల్లేశం అన్నీ తానై చదివిస్తున్నాడు. మిత్రులతో కలిసి సర్కస్ చూసేందుకు వెళ్లి కానరాని లోకాలకు వెళ్లడంతో తండ్రి కన్నీరుమున్నీరవుతున్నాడు. ఇవి చదవండి: అనుమానాస్పదస్థితిలో యువకుడి విషాదం! -
హీరో అజిత్ కుమార్ కొత్త వెంచర్ - బైక్ రైడర్లకు పండగే..
తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో పరిచయం అవసరం లేని పేరు హీరో 'అజిత్ కుమార్'. సినిమాల్లో బిజీగా ఉంటూ సమయం దొరికినప్పుడు ఖరీదైన బైకులపై రైడింగ్ చేస్తూ ఉంటాడు. కాగా ఈయన తాజాగా 'వీనస్ మోటార్ సైకిల్ టూర్స్' (Venus Motor Cycle Tours) అనే సంస్థ స్టార్ట్ చేసాడు. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బైక్ రేసింగ్ మీద ఎక్కువ ఆసక్తి ఉన్న అజిత్ ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ సంస్థ స్థాపించాడు. ఇది కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా UAE, ఒమన్, థాయిలాండ్, న్యూజిలాండ్ దేశాల్లో కూడా సేవలను అందించనుంది. గతంలో చెప్పిన విధంగానే అజిత్ మోటార్ సైకిల్ టూర్స్ ప్రారంభించాడు. ఈ సంస్థ వివిధ ప్రాంతాల్లో రైడింగ్ చేసేవారికి సహాయం చేస్తుంది. కావున రైడర్లు దీని ద్వారా ప్రపంచంలోనే అందమైన ప్రాంతాల్లో పర్యటించవచ్చు. సంస్థ వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త కార్లు - కియా నుంచి లాంబోర్గినీ వరకు.. బైకులు అద్దెకు తీసుకోవడం, అవసరమైన అంతర్జాతీయ అనుమతులను, కావాల్సిన డాక్యుమెంట్స్ పొందటానికి ఇది సాయం చేస్తుంది. ఈ నెల 23 నుంచి బైక్ టూరింగ్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. బైక్ రైడింగ్ వెళ్లాలనుకునే వారి కోసం ఫోన్ నెంబర్, సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని కూడా ట్వీట్లో షేర్ చేసిన ఫొటోలో వెల్లడించారు. Ajith sir's @VenusMotoTours now launched. Our best wishes and congratulations for the successful venture. | #AK #Ajith #Ajithkumar | #VidaaMuyarchi | pic.twitter.com/BK4vxVK412 — Ajith | Dark Devil (@ajithFC) October 5, 2023 -
మీరెప్పుడూ చూడని గ్రేట్ ఖలీ రైడింగ్ వీడియో.. ఓ లుక్కేసుకోండి!
Khali Royal Enfield Riding: బాక్సింగ్ గురించి తెలిసినవారికి ప్రత్యేకంగా 'గ్రేట్ ఖలీ' (Great Khali) గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రెజ్లింగ్ అరేనాలో పాల్గొన్న భారతీయ ప్రముఖులలో ఒకరిగా నిలిచిన ఈయన రిటైర్ అయిన తరువాత ఇండియాకి తిరిగి వచ్చేసాడు. అప్పటి నుంచి కొన్ని టీవీ యాడ్స్లో నటించడం, 2015లో పంజాబ్లో కాంటినెంటల్ రెజ్లింగ్ స్కూల్ ప్రారంభించడం వంటివి చేసి కాలం గడుపుతున్నారు. ఇటీవల ఖలీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇన్స్టాగ్రామ్ వేదికగా విడుదలైన ఒక వీడియోలో ఖలీ 'రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్' నడపడం చూడవచ్చు. ఈ సంఘటన చూడటానికి బొమ్మ బైకుపై ఆజానుబాహుడున్నట్లు అనిపిస్తుంది. ఈ వీడియోకు ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు. అత్యంత బరువైన బైకుల్లో ఒకటైన బుల్లెట్ ఖలీ ముందు చిన్న బైకుగా మారిపోయింది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇప్పటికే లక్షల మంది దీనిని లైక్ చేశారు. కొంత మంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఖలీ బైకుని రైడ్ చేస్తూ కనిపించడం ఇదే మొదటిసారి కాదు, గతంలో ఇంటర్సెప్టర్ 650, బుల్లెట్, హీరో స్ప్లెండర్, బజాజ్ పల్సర్ వంటి వాటిని రైడ్ చేస్తూ కూడా కనిపించాడు. ఇదీ చదవండి: ఏం ఐడియా గురూ! డ్రైవర్ క్రియేటివిటీకి ఫిదా అవుతున్న ప్యాసింజర్లు.. నిజానికి ఖలీ ఎత్తు 7 అడుగుల కంటే ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఏ బైకైనా అతని పరిణామంతో పోలిస్తే మరగుజ్జు మాదిరిగా కనిపిస్తుంది. బైకులు మాత్రమే కాకుండా ఆయన వద్ద టయోటా ఫార్చ్యూనర్, టయోటా గ్లాంజా వంటి కార్లను కలిగి ఉన్నప్పటికీ.. అతని పరిమాణానికి అనుకూలంగా కస్టమైజ్ చేసినట్లు సమాచారం. View this post on Instagram A post shared by The Great Khali (@thegreatkhali) -
బుల్లెట్టు బండెక్కి బైక్ రైడింగ్.. హిజాబ్ రైడర్ స్టోరీ ఇదే
ఇట్టే వస్తే రానీ వెంటా,నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా,డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ అందాల దునియానే సూపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ.. పాడుతూ, డ్యాన్స్ చేస్తూ, బైక్ ఎక్కే రోజుల నుంచి గేర్ల్మీద గేర్లు మార్చుకుంటూ రయ్యన దూసుకెళ్తున్నారు నేటి తరం అమ్మాయిలు. సెల్ఫ్తో బండిని స్టార్ట్చేసి సూదూర ప్రాంతాలకు సోలోగా రైడ్ చేస్తూ దునియాని చుట్టేస్తూ ఆస్వాదిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రీతిలో రైడింగ్ చేస్తుంటే... మరింత ప్రత్యేకంగా హిజాబ్ ధరించి జాతీయ రహదారులే కాదండోయే దేశాలు దాటి మక్కా దాక బుల్లెట్ మీదే వెళ్తానంటోంది ముఫ్పై ఏళ్ల నూర్ బీ. చెన్నైలోని పల్లవరానికి చెందిన అమ్మాయి నూర్బీ. సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి. ఇది చేయకు! అది చేయకు! అలా ఉండకు! ఇలా ఉండాలి! అంటూ ఎన్నో నిబంధనలు. అడుగు తీసి అడుగు వేయాలంటే ఆలోచించాలి. అయినా నూర్ బీకి మాత్రం బైక్ నడపడం అంటే ఎంతో ఇష్టం. ఆ ఇంట్లో అమ్మాయిలు బైక్లు అస్సలు నడపకూడదు. అయినా తన ఇష్టాన్ని మాత్రం వదులుకోలేదు. కాలేజీలో ఉండగానే మోటర్ సైకిల్ కొనుక్కోవాలనుకునేది. చదువు పూర్తయ్యాక బెంగళూరులోని ఐటీ కంపెనీలో హెచ్ఆర్ ఉద్యోగం వచ్చింది. నెలనెలా వచ్చే జీతంలో కొంత మొత్తాన్ని బండి కొనుక్కోవడానికి దాచుకునేది. ఇలా జమ చేసిన డబ్బులతో 2021లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్ను కొనుక్కుంది. బండి కొన్న వెంటనే ఉద్యోగం మానేసి రైడింగ్ షురూ చేసింది. ఫస్ట్ రైడ్... ఎన్నాళ్లుగానో వేచిచూస్తోన్న క్షణాలు వచ్చేశాయి. వెంటనే రైడింగ్కు ప్రణాళిక రూపొందించుకుంది నూర్. 2021 నవంబర్ 14 తొలి రైడింగ్ గేర్ను స్టార్ట్ చేసింది. ఈ రైడ్ గురించి కుటుంబ సభ్యులకు చెప్పలేదు. బెంగళూరు నుంచి మహారాష్ట్ర, డామన్ డయ్యూ, గుజరాత్, రాజస్థాన్ మీదుగా ఢిల్లీ చేరుకుంది. తల్లిదండ్రులకు చెప్పకుండా రహస్యంగా ఉంచినప్పటికీ మహారాష్ట్రలోని లోనావాలకు చేరుకునేటప్పటికి విషయం ఇంట్లో వాళ్లకు తెలిసింది. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు నూర్. ఐదున్నర అడుగుల ఎత్తున్న నూర్.. హిజాబ్ ధరించి బుల్లెట్ బండి మీద డుగ్గు డుగ్గు అని వెళ్తుంటే ఆమెను అంతా ఆసక్తిగా చూసేవారు. ఆ చూపులు నూర్కు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చేవి. ఈసడింపులు, యాక్సిడెంట్ ఎదురైనప్పటికీ... ప్రపంచం రోజురోజుకీ అప్డేట్ అవుతున్నప్పటికీ కొంతమంది ఇంకా ‘అమ్మాయి ఏంటీ ఇలా చేస్తోంది? ఇదేం విడ్డూరం?’ అని నోరు వెళ్లబెట్టిన వాళ్ల ఈసడింపులు నూర్కూ ఎదురయ్యాయి. అయినప్పటికీ రోడ్డు మీద గేర్లు మారుస్తూపోతూనే ఉంది. తన రైడ్ను ఎక్కడా ఆపలేదు. ఇదే దూకుడుతో... ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ప్రయాణిస్తూ నేపాల్కు వెళ్లాలనుకుంది. బిహార్ సరిహద్దులోకి రాగానే చిన్న యాక్సిడెంట్ జరిగి రైడింగ్ను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. అప్పుడు తన మోటర్ సైకిల్ను ట్రైన్లో చెన్నై పంపించాల్సిన పరిస్థితి. చాలా బాధ వేసింది. అయినా తప్పలేదు. 2022 మేలో యాక్సిడెంట్ అయితే జూలైలో కోలుకుని బెంగళూరు వచ్చేసింది. ఇంక బండిని అమ్మేయమని అంతా చెప్పారు. అయినప్పటికీ నూర్ రైడింగ్ అపలేదు. జాతీయ రహదారులేగాక అంతర్జాతీయ రహదారులపై రైడింగ్ చేస్తానూ అంటోంది. వచ్చే సంవత్సరం బెంగళూరు నుంచి మక్కా, సౌదీ అరేబియా కూడా వెళ్తానని చెబుతోంది. మనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకోవాలి... ‘‘నేను నోమాడ్ హిజాబీ రైడర్ని. దక్షిణ భారత దేశం నుంచి తొలి సోలోరైడర్ని నేనే అవుతాను. ఉత్తర భారతదేశంలోని గురుద్వారాలు, గుళ్లు, ఆశ్రమవాసులు నా మతం వేరైనప్పటికీ ప్రేమగా భోజన, వసతి సదుపాయాలను కల్పించేవారు. కొన్ని సేఫ్టీరూల్స్ పాటిస్తే తక్కువ బడ్జెట్లో ట్రిప్స్ను విజయవంతంగా పూర్తిచేయవచ్చు. సాయంత్రం ఐదు తరువాత ఎటువంటి రైడింగ్ చేయను. తెలియని వ్యక్తులతో అస్సలు మాట్లాడను.పెట్రోల్ బంకులు, ప్రార్థనా స్థలాలు, ఆశ్రమాల్లో రాత్రుళ్లు బస చేస్తూ, ఉదయం రైడింగ్ చేస్తున్నాను. ఈ స్పీడుతో మక్కాను చేరుకుంటాను ’’అని నూర్బీ ధీమా వ్యక్తం చేస్తోంది. -
బీఎండబ్ల్యూ అంటే... బ్యూటీఫుల్ మంజు వారియర్!
అందాల కథానాయిక మంజు వారియర్కు బైక్ రైడింగ్ సాహసాలు అంటే ఇష్టం. తాజాగా ఒక అడవిలో తన బీఎండబ్ల్యూ బైక్ రైడింగ్కు సంబంధించిన ఫోటోలను ‘యూ గాట్ ఇట్ గర్ల్’ కాప్షన్తో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే వైరల్ అయ్యాయి. సెలబ్రిటీ–నాన్ సెలబ్రిటీ అనే తేడా లేకుండా మంజు వారియర్ను ప్రశంసలతో ముంచెత్తారు. ‘ఐరన్ గర్ల్ ఆఫ్ సౌత్ ఇండియా’ ‘వావ్ అమేజింగ్. కీప్ ఇట్ అప్’లాంటి ప్రశంసల మాట ఎలా ఉన్నా, కొద్దిమంది మాత్రం మంజూకు జాగ్రత్తలు కూడా చెప్పారు. ‘నేను కూడా రైడర్ని. మీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఫుల్ఫేస్ హెల్మెట్ ధరించండి’ అని శ్రీరామ్గోపాలక్రిష్ణన్ అనే యాజర్ సలహా ఇచ్చారు. మరి కొందరు ఫారెస్ట్ ఏరియాలో ఎలాంటి రైడింగ్ బూట్స్ ధరించాలనే దాని గురించి చెప్పారు. బైక్ రైడింగ్లో మంజు వారియర్కు హీరో అజిత్ స్ఫూర్తి. ఆయనతో కలిసి బైక్ రైడింగ్ చేస్తుంటుంది. -
'వరల్డ్కప్ ఉంది.. ప్లీజ్ ఇలాంటి రిస్క్లు వద్దు!'
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం తన కొత్త బీఎండబ్ల్యూ స్పోర్ట్స్బైక్పై లాహోర్ వీధుల్లో చక్కర్లు కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోనూ బాబర్ ఆజం స్వయంగా ట్విటర్లో షేర్ చేస్తూ.. Ready, Set, Go.. అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక బాబర్ హెల్మెట్ సహా అన్ని సేఫ్టీ రూల్స్ పాటిస్తూ రోడ్డు మీద బైక్ రైడింగ్ చేసినప్పటికి అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. కారణం.. ''మనం ఎంతమంచిగా వెళ్లినా టైం బాగాలేకపోతే ఏమైనా జరగొచ్చు'' అంటూ కామెంట్ చేశారు. గతేడాది టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఘోర కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదంతో తీవ్రంగా గాయపడిన పంత్ కోలుకున్నప్పటికి తొమ్మిది నెలల పాటు క్రికెట్కు దూరమయ్యాడు. ఇప్పటికే ఐపీఎల్తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ సహా ఆసియా కప్కు దూరమయ్యాడు. వన్డే వరల్డ్కప్ ఆడేది కూడా అనుమానంగానే ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాబర్ ఆజం బైక్ రైడింగ్ను పాక్ అభిమానులు సీరియస్గా తీసుకున్నారు. ''అసలే ఆసియా కప్, వన్డే వరల్డ్కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలున్నాయి. ఈ సమయంలో ఇలాంటి రిస్క్లు వద్దు''.. మరో ఐదు నెలల్లో వరల్డ్కప్ ఉంటే ఇలాంటి రిస్క్లు చేస్తున్నాడు.. బాబర్ను వెంటనే కెప్టెన్సీ నుంచి తీసేయడం మంచిది'' అంటూ పోస్టులు పెట్టారు. Ready, set, GO! 🏍️ pic.twitter.com/BvwwiFuVCG — Babar Azam (@babarazam258) May 24, 2023 You are very precious bhai, please don’t ride a bike 🙏🏼❤️ — Khalid Minhas, MD FACC (@minhaskh) May 24, 2023 No more bikes till the World Cup, please. No risks, skipper 🙏🏼♥️ — Farid Khan (@_FaridKhan) May 24, 2023 We have a World Cup to play in 5 months and Babar is doing such dangerous activities? Remove him from captaincy please, irresponsible. https://t.co/dAk7WcDj7M — f (@fas___m) May 24, 2023 చదవండి: మే 28న తేలనున్న ఆసియాకప్ భవితవ్యం! 'కింగ్' కోహ్లి రికార్డు.. ఆసియా ఖండం నుంచి ఒకే ఒక్కడు -
కొత్త బిజినెస్ ప్రారంభించిన స్టార్ హీరో అజిత్
తాను, తన ప్రపంచం అన్నట్టుగా జీవన విధానాన్ని మలుచుకున్న నటుడు అజిత్. ఈయన నటనతో పాటు ఫొటోగ్రఫీ, బైక్, కార్ రేసింగ్, చిన్న చిన్న డ్రోన్లు రూపొందించడం వంటి విషయాలపై ఆసక్తి కనబరుస్తుంటారన్న విషయం తెలిసిందే. ఆ మధ్య బైక్ పయనంతో దేశంలోని ప్రధాన నగరాలను చుట్టొచ్చారు. తాజాగా భూటాన్, నేపాల్ నగరాల్లో బైక్ విహార యాత్ర ముగించుకుని చైన్నెకి తిరిగొచ్చారు. కాగా అనుహ్యంగా ఆయన సోమవారం మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో తాను చాలాకాలం తనకు నచ్చిన జీవితాన్ని అనుభవిస్తున్నానన్నారు. జీవితం ఒక అందమైన ప్రయాణమని.. అందులోని మలుపులు, తెరిచిన మార్గాలను అనుభవించండి అని పేర్కొన్నారు. తన స్వదేశీ, విదేశీ బైక్ రైడింగ్ విహార యాత్రను ఇప్పుడు ఒక వృత్తిగా మార్చే ప్రయత్నం చేశానన్నారు. ఏకే మోటో రైడ్ పేరుతో మోటార్ సైకిల్ విహార యాత్ర సంస్థను ప్రారంభించినట్లు తెలిపారు. దీని ద్వారా భారత దేశంలోని ప్రకృతి అందాలను, అంతర్జాతీయ రోడ్లపై ప్రయాణం చేయాలన్న ఆసక్తిని కనబరచేవారికి ఏకే మోటో రైడ్ సంస్థ విహార పయనం నేర్చుకోవడానికి సహకరిస్తుందన్నారు. అలాంటి వారికి తగిన భద్రతతో పాటు సౌకర్యవంతమైన మోటార్ బైక్లను సమకూర్చడం జరుగుతుందన్నారు. అదే విధంగా అనుభవం కలిగిన మోటార్ బైక్ రైడర్స్ను సమకూర్చడం జరుగుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
Women’s Day 2023: మహిళల కోసం జావా యెజ్డీ ముందడుగు
భారతదేశంలో ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని చాలా ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆటోమోటివ్ బ్రాండ్ 'జావా యెజ్డీ మోటార్ మోటార్సైకిల్స్' మహిళల కోసం బైక్ రైడ్ ప్రారంభించింది. 2023 మార్చి 5న దేశంలోని మహిళా రైడర్ల స్ఫూర్తిని పురస్కరించుకుని ఢిల్లీ, బెంగళూరు, పూణే, చెన్నై, గౌహతి వంటి నగరాల్లో రైడింగ్ ప్రారంభించింది. ఈ రైడింగ్లో సుమారు 150 మంది మహిళా రైడర్లు పాల్గొన్నారు. ఈ రైడ్లలో పాల్గొన్న మహిళలు సమాజంలోని అణగారిన వర్గాల మహిళల ఋతుక్రమ పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడంలో సహాయపడ్డారు. కంపెనీ నిర్వహించిన ఢిల్లీ రైడ్లో ప్రముఖ ర్యాలీ రైడర్ 'గరిమా అవతార్' పాల్గొన్నారు. ఈ రైడ్లో ఆమె పాల్గొనడం వల్ల తోటి మహిళలు కూడా చాలా ఉత్సాహాన్ని కనపరిచాడు. ఈ రైడ్స్ బ్రాండ్ డీలర్షిప్ల నుండి ప్రారంభమయ్యాయి. అంతే కాకుండా సామాజిక కార్యక్రమాలు, రిఫ్రెష్మెంట్ల కోసం అనేక స్టాప్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ రైడ్లలో పాల్గొన్న రైడర్లు వెనుకబడిన ప్రాంతాల్లోని మహిళలకు ఫుడ్ ప్యాకెట్లు, శానిటరీ నాప్కిన్లను పంపిణీ చేశారు. (ఇదీ చదవండి: బాలీవుడ్ బ్యూటీ 'హ్యుమా ఖురేషి' కొత్త లగ్జరీ కారు: ధర ఎంతంటే?) ఈ సందర్భంగా జావా యెజ్డీ మోటార్సైకిల్స్ సీఈఓ 'ఆశిష్ సింగ్ జోషి' మాట్లాడుతూ.. కంపెనీ బైకులపై మహిళకు అనుభూతి పెరుగుతోందని, మహిళా రైడింగ్ వంటి వాటిని ప్రోత్సహించడంలో మేము ముందుంటామని, వివిధ మహిళా సంక్షేమ అంశాలపై అవగాహన కల్పించడంలో తప్పకుండా ముందుకు వస్తామని అన్నారు. -
గుం‘టూరు’ వచ్చిన ప్రపంచ పర్యాటకురాలు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రపంచ పర్యటనలో ఉన్న ఇటలీ దేశస్తురాలు ఎలీనా ఎగ్జీనా సోమవారం గుంటూరు నగరానికి వచ్చారు. గత మూడున్నరేళ్లుగా బైక్పై 28 దేశాలను సందర్శించిన ఆమె ప్రస్తుతం భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా చెన్నై నుంచి వైజాగ్ వెళ్తూ మార్గ మధ్యలో గుంటూరు పండరీపురంలోని పులుగు దీపక్ నీట్, జేఈఈ ఉచిత శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ శిక్షణ పొందుతున్న విద్యారి్థనులతో మమేకమై మహిళా సాధికారతపై మాట్లాడారు. విద్యారి్థనులు విద్యావంతులుగా ఆకాశమే హద్దుగా ఎదగాలని సూచించారు. తన పర్యటన విశేషాలను వివరిస్తూ బైక్పై మూడున్నరేళ్ల క్రితం మొదలైన తన ప్రపంచ యాత్ర ఇప్పటికి 28 దేశాల్లో ఎక్కడా ఒక్క హోటల్లో బస చేయకుండా, నిరంతరం కొనసాగడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. విభిన్న సంస్కృతులు, భిన్నమైన ప్రదేశాలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని చెప్పారు. ఈసందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చారు. ఎలీనాను సత్కరించిన శిక్షణా కేంద్ర నిర్వాహకుడు పులుగు దీపక్ భారతదేశ గొప్పతనాన్ని వివరించే స్పేస్ సైన్స్ పుస్తకాన్ని బహూకరించారు. గుంటూరులో తనకు లభించిన ఆదరణ, ఆతీ్మయ స్వాగతంపై ఎలీనా ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
బైక్ నడుపుతూ బీర్ తాగిన యువకుడు.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు
లక్నో: ఓ యువకుడు అతిగా ప్రవర్తించాడు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడుపుతూ బీర్ తాగాడు. రహదారిపై ఇతడు చేసిన చేష్టలను స్నేహితులే వీడియో తీశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో రంగంలోకి దిగిన ఉత్తర ప్రదేశ్ గాజియాబాద్ పోలీసులు యువకుడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. రూ.31,000 చలనా విధించారు. హెల్మెట్ ధరించకపోగా బైక్ నడుపుతూ మద్యం సేవించినందుకు ఇంత భారీమొత్తంలో జరిమానా వేశారు. ఇందుకు సంబంధించిన చలానాను సోషల్ మీడియాలో షేర్ చేశారు. #Ghaziabad DME पर बीयर पीकर रील रिकॉर्ड करने वाले इस सूरमा ने तो @Gzbtrafficpol की चालानी कार्यवाई की पोल खोल दी, DME पर 2 व्हीलर नही जा सकते यहाँ तो पूरी शूटिंग जारी है। मसूरी थाना क्षेत्र है। @ghaziabadpolice @uptrafficpolice @sharadsharma1 @bstvlive @DCPRuralGZB pic.twitter.com/Mvbj2sFZ2H — Lokesh Rai 🇮🇳 (@lokeshRlive) January 20, 2023 చదవండి: రష్యా నుంచి గోవా వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు -
విశాఖలో పట్టపగలే రెచ్చిపోయిన రొమాంటిక్ జంట.. రెండు గంటల్లోనే!
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ప్లాంట్ టౌన్షిప్ రహదారిలో ఓ జంట పట్టపగలు రొమాన్స్ చేస్తూ కెమెరాకు చిక్చిన విషయం తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ యువకుడు మరో యువతిని బైక్ ట్యాంక్పై కూర్చొపెట్టుకుని రయ్రయ్ అంటూ దూసుకుపోయారు. ఈ దృశ్యాలను పక్కనే కారులో వెళ్తున్న వ్యక్తులు వీడియో తీశారు. దీంతో పట్టపగలు బరితెగించిన ఈ యువజంట వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ ఈ సంఘటనను సీరియస్గా తీసుకున్నారు. తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని ఆదేశించారు. దీంతో గాజువాక సమీప ప్రాంతాలకు చెందిన బైక్ నడిపిన అజయ్ కుమార్, యువతిని సంఘటన జరిగిన రెండు గంటల్లోనే అరెస్ట్ చేసినట్లు స్టీల్ ప్లాంట్ సీఐ వి శ్రీనివాస్రావు తెలిపారు. యువకుడి బైక్ సీజ్ చేశామని, న్యూసెన్స్, ర్యాష్ డ్రైవింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. చదవండి: Video: ‘తప్పతాగి వేధింపులు.. నడిరోడ్డుపై చెప్పుతో దంచికొట్టింది’ -
రికార్డు బ్రేక్ ‘వీలీ’ స్టంట్
రోడ్డుపై బైక్లతో కుర్రకారు చేసే విన్యాసాలను మనలో చాలా మంది చూసే ఉంటాం.. బండిని మెలికలు తిప్పుతూ పోనీయడం.. ముందు చక్రాన్ని పైకి లేపి యాక్సిలేటర్ను రెయిజ్ చూస్తూ దూసుకుపోవడం, అత్యంత వేగంగా బండిని నడుపుకుంటూ వచ్చి వెనుక చక్రం పైకి లేచేలా ఒక్కసారిగా బ్రేక్ వేయడం... బండిని ఉన్నచోటనే గుండ్రంగా తిప్పడం వంటి స్టంట్లను మీరు చూసే ఉంటారు. కానీ లిథువేనియాకు చెందిన అరునస్ గిబేజా అనే స్టంట్ రైడర్ వీటన్నింటికన్నా క్లిష్టమైన ఓ విన్యాసాన్ని చేసి చూపించి సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించాడు. ఇంతకీ అతను చేసిన స్టంట్ ఏమిటంటే... బండిని కేవలం వెనుక చక్రంపై నడపడమే (వీలీ) కాకుండా హ్యాండిల్ను వదిలేసి ఏకంగా అర కిలోమీటర్కుపైగా దూరం (580 మీటర్ల 81 సెంటీమీటర్లు) దూసుకెళ్లాడు. తద్వారా 2019లో భారత్కు చెందిన రోహితేశ్ ఉపాధ్యాయ్ అనే యువకుడు సుమారు 566 మీటర్ల దూరంపాటు ఇదే రకంగా బండి నడిపి నమోదు చేసిన గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టాడు. -
Viral Video: భర్తను వెనకాల కూర్చొబెట్టుకొని బండి నడిపిన బామ్మ..
బైక్ రైడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. బైక్ అంటే చాలు కుర్రాళ్లు ఎగిరి గంతులేస్తారు. ఒకప్పుడు మగవారే బైక్లు, కారులు నడిపేవారు. అమ్మాయిలు అసలు రైడింగ్ జోలికి వెళ్లేవారు కాదు. కానీ రాను రాను పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. యువతులు, మహిళలు కూడా అన్ని వాహనాలను డ్రైవ్ చేస్తున్నారు. తాజాగా వయసు పైబడిన పెద్దావిడ బండి నడిపి వావ్ అనిపించింది. అంతేగాక వెనుక సీట్లో తాతను కూర్చోబెట్టి బామ్మ డ్రైవ్ చేయడం మరింత స్పెషల్గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. వీడియోలో సుమారు 60 ఏళ్లు ఉన్న ఓ పెద్దావిడ ఎంతో ఉత్సాహంగా, చలాకీగా ద్విచక్ర వాహనం నడిపింది. భర్తను వెనకాల కూర్చొబెట్టుకొని రోడ్డుపై రయ్ రయ్ అంటూ వెళ్లింది. బామ్మ చక్కగా చీరకట్టుకొని ఉండగా తాత తెల్లటి చొక్కా, పంచె కట్టుకొని కనిపించాడు. దీంతో మాములు బామ్మ కాస్తా బైక్ బామ్మగా మారిపోయింది. ఎలాంటి భయం, బెరుకు లేకుండా బండి నడిపి.. యువకులకు తాను ఎంత మాత్రం తీసిపోనని రుజువు చేసింది. దీనిని వెనకాల వస్తున్న వారు వీడియో తీశారు. సుస్మితా డోరా అనే యువతి తన ఇన్స్టాగ్రామ్లో పోస్టుచేసింది. బామ్మ డ్రైవింగ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘ఈ వయసులో బండి నడపడటం గ్రేట్..చూడటానికి ఎంతో అందంగా ఉంది. నీ డ్రైవింగ్కు తిరుగు లేదు’ అంటూ ప్రశంసిస్తున్నారు. కపుల్ గోల్స్ క్యాప్షన్తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ.. బండి నెంబర్ ప్లేట్ చూస్తుంటే తమిళనాడుకు చెందినదిగా తెలుస్తోంది. View this post on Instagram A post shared by Susmita Dora (@the_aspiring_seed) -
Bengaluru: రైడ్ ఫర్ ఎ కాజ్! రైడింగ్తోనే సేవ.. ఆ ఊరిలో వెలుగులు నింపింది!
కొంతమంది దేశం కోసం తమ ప్రాణాలు అర్పించేందుకు రాత్రనక పగలనకా ప్రాణాలొడ్డి పోరాడుతున్నారు. వారు అక్కడ నిద్రాహారాలు మాని, కుటుంబ సంతోషాలను త్యాగం చేయబట్టి మనం ఇంత సురక్షితంగా జీవించగలుగుతున్నాము... అని ఎందరికి తెలుసు? ఒకవేళ తెలిసినా ఒక నిట్టూర్పు విడవడం తప్ప ఏమైనా చేయగలుగుతున్నామా? అయితే బెంగళూరుకు చెందిన హర్షిణి అలా కాదు... వారికోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుని ఏకంగా ఓ ఎన్జీవోను ఏర్పాటు చేసింది. మహిళా బైక్ రైడర్స్తో కలిసి ఈవెంట్స్ నిర్వహిస్తూ సమకూరిన నిధులతో జవాన్ల కుటుంబాల అవసరాలు తీరుస్తోంది. హర్షిణి వెంకటేష్కు చిన్నప్పటినుంచి ఇతరులకు సాయం చేయలన్న ఆలోచనలు ఎక్కువ. కాలేజీ రోజుల్లో పాకెట్ మనీతో బట్టలు, కార్డ్స్ మీద ప్రింట్స్ డిజైన్ చేయడం, పుట్టగొడుగుల పెంపకం వంటివి చేపట్టి వాటిద్వారా వచ్చిన ఆదాయంతో ఇతరులకు సాయం చేసేది. 1998లో హర్షిణికి పెళ్లి అవ్వడం, వెంటవెంటనే ఇద్దరు కొడుకులు పుట్టడంతో తన సమయం అంతా ఇంటిని చక్కదిద్దుకోవడం, పిల్లల పెంపకంతో సరిపోయింది. కొంతకాలానికి భర్త ప్రోత్సాహంతో ముంబై వెళ్లి బేకింగ్, చాక్లెట్ తయారీ కోర్సులు చేసింది. కోర్సు పూర్తయ్యాక సొంతంగా చాక్లెట్, కేక్లు తయారు చేయడం మొదలు పెట్టింది. ప్రారంభంలో పదికేజీల ఆర్డర్లు ఉండేవి. ఏడాది తరువాత వంద కేజీల ఆర్డర్లు ఇచ్చే స్థాయికి హర్షిణి వ్యాపారం విస్తరించింది. అయితే బేకింగ్ కు కావాల్సిన పదార్థాల నుంచి మార్కెటింగ్, సప్లై వరకు అన్నీ తనే చూసుకోవడం కష్టంగా అనిపించేది. ఇదే సమయంలో ముంబైలో జరిగిన మాస్టర్ షెఫ్ కార్యక్రమానికి బెంగళూరు నుంచి రెండు వేల మందిలో హర్షిణి సెలెక్ట్ అయ్యింది. కానీ కొన్ని కారణాల వల్ల దానిని మధ్యలోనే వదిలేసింది. ఇదే సమయంలో అంధ విద్యార్థులు చదివే ఓ స్కూలు గురించి తెలిసింది. దీంతో అక్కడికి వెళ్లి విద్యార్థులతో కొంత సమయం గడపడం, వారికి కావాల్సిన సాయాన్ని అందిస్తూ సామాజిక సేవను ప్రారంభించింది. రైడింగ్తోనే సేవ పెళ్లి అయిన తరువాత బండి నడపాలన్న ఆసక్తితో హర్షిణి టూవీలర్ నడపడం నేర్చుకుంది. 2017లో ఓ మహిళా రైడర్స్ ఈవెంట్ జరుగుతుందని తెలిసి, రైడింగ్ను బాగా సాధన చేసి చీరకట్టులో బైక్ ర్యాలీలో పాల్గొంది. అప్పుడు హర్షిణి రైడ్ చేస్తోన్న ఫోటోతో సహా ఓ వార్తా పత్రిక మొదటి పేజీలో కథనాన్ని ప్రచురించింది. దానికి లభించిన ప్రోత్సాహంతో రైడింగ్తోనే సామాజిక సేవాకార్యక్రమాలు చేయాలనుకుంది. ఇండియన్ ఆర్మీ దేశానికి, సమాజానికి ఎంతో సాయం చేస్తోంది. కానీ మనం ఆర్మీకి తిరిగిచ్చింది చాలా తక్కువే. అందుకే వాళ్ల కుటుంబ సభ్యులకు ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. అమర జవాన్ల్ల కుటుంబాల్లో కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ, చికిత్సకు డబ్బులు సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసి, వారికోసం విరాళాలు సేకరించేందుకు ‘షీ ఫర్ సొసైటీ, రైడ్ ఫర్ ఏ కాజ్’ పేరిట ఎన్జీవోను ప్రారంభించింది. ఫేస్బుక్ ద్వారా మహిళా బైకర్స్ అందర్ని ఒకచోటకు చేర్చి బైక్ రైడింగ్ ఈవెంట్ను ఏర్పాటు చేసింది. ఆ ఈవెంట్ ద్వారా వచ్చిన డబ్బును అవసరంలో ఉన్న ఆర్మీ కుటుంబాలకు ఇచ్చింది. ఈవెంట్ విజయవంతమవడంతో తర్వాత కూడా బైక్ రైడ్ ఈవెంట్స్ నిర్వహిస్తూ వచ్చిన విరాళాలతో అవసరం అయిన వారికి సాయం చేయడం కొనసాగించింది. ఊరిలో వెలుగులు నింపింది బెంగళూరుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలార్ అనే గ్రామానికి ఎలక్ట్రిసిటీ సదుపాయం సరిగా లేదు. ఐదువేలమంది జనాభా ఉన్న ఈ గ్రామంలో ఆర్మీలో పనిచేసిన నాలుగు తరాలకు చెందిన కుటుంబాలు ఉన్నాయి. అయినా వీళ్లకి సరైన విద్యుత్ సౌకర్యం అందుబాటులో లేదు. వీరికి విద్యుత్ను అందించేందుకు మూడువందల మంది మహిళా రైడర్స్తో కలిసి బెంగళూరు నుంచి కోలార్కు ర్యాలీ నిర్వహించింది. అందుకు స్పందనగా మాజీ సైనికులు వందమంది కలిసి సోలార్ కిట్లను బహుమతిగా ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఆ గ్రామంలో ఎలక్ట్రిసిటి నిరంతరాయంగా అందుతోంది. పిల్లలు నేర్చుకోవడానికి ఉచితంగా శిక్షణ ఇచ్చే రెండు కంప్యూటర్ సెంటర్స్ను ఏర్పాటుచేసింది. భవిష్యత్లో మరిన్ని నిధులు సేకరించి బెంగళూరులోనేగాక, మైసూర్, థార్వాడ్లలో కూడా తన సేవలను విస్తరించనున్నట్లు హర్షిణి చెబుతోంది. చదవండి: Shweta Gaonkar: కొబ్బరి కల్లు గీసే శ్వేత.. ఏడాదికి మూడున్నర లక్షల ఆదాయం! బీటెక్ వద్దనుకుని.. -
Sakshi Cartoon: నాలుగేళ్లలోపు పిల్లలకు హెల్మెట్ తప్పనిసరి!
-
Bheemla Nayak: పవన్ కల్యాణ్ బైక్ రైడ్.. వీడియో వైరల్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్గా వస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వ వహించగా తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే – మాటలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిత్రాన్ని జనవరి 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ ఇటీవల వికారాబాద్ అడవుల్లో ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటికి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వారం రోజుల్లో పెండింగ్లో ఉన్న పార్ట్ షూటింగ్ పూర్తవుతుంది. అయితే షూటింగ్ మధ్యలో రోడ్ పై ‘భీమ్లా నాయక్’ బైక్ రైడ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖాకీ యూనిఫాంలో పవన్ బుల్లెట్ నడుపుతున్న వీడియోను పవర్ స్టార్ అభిమానులు షేర్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తుంటే.. రానా ఇందులో రిటైర్డ్ మిలటరీ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఇద్దరు వ్యక్తుల ఇగోలు హర్ట్ అయినప్పుడు వారెలా రియాక్ట్ అయ్యారనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుంది. 👊⭐️🔥💕pic.twitter.com/tbNduyERPu — 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) December 17, 2021 -
బైక్, లద్ధాక్.. ఓ జంట
నిత్యం బైక్లపైనే తిరిగే ఉద్యోగం కావడమేమో గానీ.. ఆ యువకుడు బైక్ రైడింగ్పై ఆసక్తి పెంచుకున్నాడు.. అందుకు సంబంధించి వీడియోలను యూట్యూబ్లో చూడటం మొదలెట్టాడు. అలా రాష్ట్రం నుంచి బైక్ రైడింగ్ చేసే సుమారు 20 మంది వ్లాగ్లను యూట్యూబ్లో గమనిస్తూ వచ్చాడు. అయితే వారంతా ఒంటరిగానే బైక్ రైడింగ్ చేస్తున్నారు. ఏపీ నుంచి దాదాపు 12 మంది లద్ధాక్ ఒంటరిగానే వెళ్లొచ్చారు. ఈ నేపథ్యంలో తను భార్యతో కలిసి వెళితే ఎలా ఉంటుందన్న ఆలోచన అతనికి వచ్చింది.. వెంటనే భార్యకు ఆ విషయం చెప్పాడు. మొదట ఒకింత భయపడ్డా.. భర్త ఉత్సాహానికి ముచ్చట పడుతూ ఓకే చెప్పేసింది.. లద్ధాక్ వెళ్లొచ్చింది. పలమనేరు: మండలంలోని అప్పినపల్లెకు చెందిన రంపాల రమేష్ అదే మండలంలోని ఓ ప్రైవేట్ డె యిరీలో ఐటీ సలహాదారు. అతని భార్య తులసీకుమారి గృహిణి. వీరికి ఇద్దరు పిల్లలు. వీరు గత నెల రెండో తేదీన తమ యమహా ఎఫ్జీఎస్ వీ3 బైక్ పై తమ సాహస యాత్రను ప్రారంభించారు. పలమనేరు నుంచి హైదరాబాద్, నాగ్పూర్, ఝాన్సీ, గ్వాలియర్, ఢిల్లీ, పానిపట్, అంబాలా, పతన్కోట్, జమ్మూ, పత్నిటాప్, సింథన్టాప్, అనంత్నాగ్, శ్రీనగర్, దాల్ సరస్సు, కార్గిల్, లేహ్, వారిల్లాపాస్, చెంగాలాటాప్, లద్ధాక్ దాకా ప్రయాణం సాగించారు. మార్గం మధ్యలోని పుణ్య స్థలాలు, చారిత్రక కట్టడాలు, దేవాలయాలను సందర్శిస్తూ వెళ్లారు. అక్కడి నుంచే కష్టాలు జమ్మూ బోర్డర్ వరకూ వీరి ప్రయాణం సాఫీగానే సాగినా.. అక్కడి నుంచి కష్టాలు మొదలయ్యాయి. విపరీతమైన చలి వాతావరణం, కొండ మార్గాలు, లోయలు, సముద్ర మట్టానికి 982 అడుగుల ఎత్తు లో ప్రయాణం.. అయినా పట్టువదలకుండా తమ ప్రయాణాన్ని సాగించి ఎట్టకేలకు లద్ధాక్ చేరారు. అక్కడి ప్రజలు వీరిపై ఎంతో ప్రేమాభిమానాలు చూపారు. అక్కడ లాడ్జిలు, హోటళ్ల వంటివి ఉండ వు. స్థానికులే ప్రయాణికులకు తమ ఇళ్లల్లో ఆతిథ్యం ఇస్తారు. అలాగే ఈ జంటకు కూడా ఆశ్రయం ఇచ్చి తమను కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారని రమేష్ దంపతులు చెప్పారు. ఆ తర్వాత అక్కడ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. తమ యాత్రలోని రోజువారి విశేషాలను ‘రమేష్ రంపాల ఫస్ట్ కపుల్ రైడర్ ఫ్రం చిత్తూరు’ అనే వ్లాగ్లో పోస్ట్ చేస్తూ వచ్చారు. తమ యాత్రను విజయవంతంగా ముగించుకుని ఆదివారం వీరు స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ ప్రయాణంలో వీరికి రూ.2 లక్షల దాకా ఖర్చు చేశారు. లడక్ వెళ్లి రావడానికి వీరికి 37 రోజుల సమయం పట్టింది. మొత్తం 11,500 కి.మీ ప్రయాణించారు. గ్రామస్తుల సత్కారం ఈ జంట లద్ధాక్కు బైక్పై వెళ్లి వస్తున్నారని తెలిసి అప్పినపల్లె్ల గ్రామస్తులు ఆలయంలో వీరి పేరున ప్ర త్యేక పూజలు చేయించారు. అనంతరం రమేష్, తులసీకుమారి జంటను సన్మానించారు. పలమనేరు నియోజకవర్గానికి మంచి పేరు తెచ్చారంటూ స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ వీరికి అభినందనలు తెలిపా రు. ఇండియా–పాక్ సరిహద్దుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఒకింత ఆందోళన చెందామని, అక్క డి ప్రజలు ప్రేమానురాగాలు చూపినట్టు తెలిపారు. ఈ యాత్ర ద్వారా భిన్నత్వంలో ఏకత్వాన్ని చూసిన ట్టు రమేష్, తులసీకుమారి దంపతులు చెప్పారు. -
బైక్ నడిపితే ఈ విడ్డూరం ఏంటమ్మా! అని నోరెళ్ల బెడతారు
అబ్బాయిలకు తామేమీ తీసిపోమంటున్నారు నేటి యువతులు. ఈ కోవలోనే ముంబైకి చెందిన విశాఖ మరో అడుగు ముందుకేసి బైక్ రైడింగ్లో అబ్బాయిలతో పోటీపడుతోంది. దీంతో ఆమెను అందరూ ‘రైడర్గర్ల్ విశాఖ’ అని ముద్దుగా పిలుస్తున్నారు. దేశంలోనే తొలి మహిళ ‘మోటో వ్లాగర్’ అయిన విశాఖ కొత్త కొత్త ప్రదేశాలకు బైక్మీద వెళ్తూ వీడియోలు తీసి తన యూ ట్యూబ్ చానల్లో అప్లోడ్ చేస్తూ.. సోషల్ మీడియాలో లక్షలమంది ఫాలోవర్స్తో దూసుకుపోతోంది. రైడర్ గార్ల్ విశాఖ అసలు పేరు విశాఖ ఫుల్సుంగి. ముంబైలో పుట్టి పెరిగిన 27 ఏళ్ల విశాఖ పదేళ్లకే సైకిల్ తొక్కడం నేర్చుకుంది. 12 ఏళ్లకు స్కూటర్ నడిపింది. తన స్నేహితుల్లో ఎక్కువమంది అబ్బాయిలే ఉండడంతో వాళ్లతో కలిసి తిరుగుతూ బైక్ నడపడం కూడా నేర్చుకుంది. పద్నాలుగేళ్లు వచ్చేటప్పటికి హీరో హోండా ప్యాషన్ బైక్ను నడిపింది. చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తూనే... కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో.. పదోతరగతి పాసైన తరువాత విశాఖ ముంబైలోని ఓ బేకరీలో నెలకు రెండు వేల రూపాయలు జీతంతో క్యాషియర్గా చేరింది. కారణాంతరాల వల్ల 15 రోజులకే ఆ జాబ్ మానేసింది. తరువాత షాపింగ్ మాల్స్ దగ్గర ఉండి, పాంప్లెట్స్ పంచటం, వివిధ రకాల ఈవెంట్స్లో రోజువారి కూలీగా పనిచేయటం వంటి వాటితో సంపాదించిన దాన్లోనే కొద్ది డబ్బు దాచుకుంది. వాటికి పుస్తెలతాడు తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బులు జతచేసి, 2015లో బైక్ కొనుక్కుంది. ఆ బైక్కు కాశిష్ అని పేరుపెట్టుకుంది. View this post on Instagram A post shared by Vishakha Fulsunge || India🇮🇳 (@ridergirlvishakha) చిన్నచిన్న జాబ్లు చేస్తూనే ఇంటర్నేషనల్ బిజినెస్, మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్లో ఎంబీఏ పూర్తిచేసింది. ఆ తరువాత నుంచి తనెంతో ఇష్టమైన బైక్ రేసింగ్లలో పాల్గొనేది. ఈ క్రమంలోనే ఇండియాలో మోటోవ్లాగింగ్ చేసేవారు ఎవరూ లేరని లె లుసుకుని మోటో వ్లాగింగ్ చేయాలనుకుంది. 2017లో సొంత యూట్యూబ్ చానల్ను ప్రారంభించింది. రోజూ ఏదోఒక ప్రాంతానికి తన బైక్ మీద వెళ్తూ.. వీడియోలు తీసి, తరువాత వాటిని ఎడిట్ చేసి యూట్యూబ్ చానల్లో అప్లోడ్ చేసేది. తొలిసారి అమ్మాయి రైడింగ్ వీడియోలు పోస్టుచేయడంతో చాలామంది నెటిజన్లు ఆమె వీడియోలను ఆసక్తిగా చూసేవారు. క్రమంగా వీడియోలు పెరగడంతో ఫాలోవర్స్ సంఖ్య ఎనిమిదిన్నర లక్షలకు చేరింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డులు బంగాళాఖాతం దాటి అండమాన్ దీవుల వరకు ప్రయాణించిన విశాఖ.. మూడుసార్లు లడఖ్, స్పితి, రాజస్థాన్, కన్యాకుమారి, కేరళ, రామేశ్వరం, గోవా, గుజరాత్, ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్రలలోని పలుప్రాంతాలను పర్యటించింది. నర్మదా నదీ పరివాహక ప్రాంతం మొత్తాన్ని ఎనిమిదిరోజుల్లో చుట్టి వచ్చింది. రైడర్ గార్ల్ విశాఖ అని సరిపెట్టుకోకుండా, రెండు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులను సొంతం చేసుకుంది. విశాఖ మాట్లాడుతూ..‘‘అబ్బాయిలు మాత్రమే నడిపే బైక్లను అమ్మాయి నడపడం చూస్తే.. ఈ విడ్డూరం ఏంటమ్మా! అని నోరెళ్ల బెడతారు. అటువంటి పరిస్థితుల నుంచి ‘రైడర్గర్ల్ విశాఖ’గా ఎదిగాను. లడఖ్ వెళ్లిన అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేను. రైడింగ్ చేసేటప్పుడు వివిధ రకాల వాతావరణాలను ప్రత్యక్షంగా చూడగలిగాను. ఒంటరిగా బైక్ నడిపే నాకు కొన్నిసార్లు వసతి సదుపాయం కూడా దొరికేది కాదు. నేను ప్రయాణించే రహదారులు, కొండలలో టాయిలెట్స్ ఉండవు. రాత్రిపూట రైడింగ్ అంత సురక్షితం కాదు, అందుకే రైడింగ్ చేసే సమయంలో కండీషన్లో ఉన్న రైడింగ్ గేర్, కొద్దిపాటి ఎమర్జన్సీ మనీ, నా బ్లడ్ గ్రూపును బైక్ మీద రాయడం, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబరును మొబైల్ స్క్రీన్ మీద ఉంచుకోవడం, ట్రాకింగ్ యాక్సిడెంట్ డివైజ్ను నాతో ఉంచుకుంటూ.. నాలుగేళ్లుగా మోటోవ్లాగర్గా కొనసాగుతున్నాను’’ అని చెప్పింది. ఆమె మాటలు వింటుంటే అమ్మాయిలు అనుకుంటే ఏదైనా సాధించగలరు అని అర్థం అవుతోంది. చదవండి: 27 ఏళ్ల వైవాహిక జీవితాన్ని ముగిస్తున్నాం: బిల్గేట్స్ -
పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన బాలీవుడ్ హీరో
ముంబై : బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. వాలెంటైన్స్ డే సందర్భంగా వివేక్ భార్య ఆయనకు ఓ బైక్ని బహుమతిగా ఇచ్చింది. దీంతో అదే రోజు శ్రీమతిని బైక్పై ఎక్కించుకొని ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా వివేక్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. అయితే వివేక్ హెల్మెట్ ధరించకపోవడంతో ఇది కాస్తా పోలీసుల దృష్టికి చేరింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా హీరో వివేక్పై ముంబై పోలీసులు కేసు నమోదు చేసి చలానా విధించారు. అంతేకాకుండా కరోనా సమయంలో మాస్క్ ధరించనందున ఎఫైఐఆర్ నమోదు చేశారు. మహారాష్ట్రలోగత కొన్ని రోజులుగా కరోనా విజృంభిస్తుండంతో అధికారులు నిబంధనలను కఠినతరం చేశారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం వంటి నిబంధనల్ని పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వివేక్ చివరగా ప్రధానమంత్రి మోదీ బయోపిక్లో కనిపించారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. చదవండి : (వివేక్ ఒబెరాయ్ భార్యకు నోటీసులు!) (‘దిశా.. యమ హాట్గా ఉన్నావ్’) View this post on Instagram A post shared by Vivek Oberoi (@vivekoberoi) -
జనాన్ని హడలెత్తిస్తున్న బైక్ వీరుడి జులాయి వేషాలు
సాక్షి, చిత్తూరు: జాతీయ రహదారిపై ఓ యువకుడు వారం రోజులుగా బైక్తో సర్కస్ ఫీట్లు చేస్తూ రోడ్డుపై వెళ్లే వాళ్లని హడలెత్తిస్తున్నాడు. శాంతిపురం– రాజుపేటరోడ్డు మార్గంలో పాత యమహా బైకుతో చెలరేగిపోతున్నాడు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ యువకుడు తన నైపుణ్య ప్రదర్శనకు దిగుతున్నాడు. వేగంగా బైకు నడుపుతూ ముందు చక్రాన్ని గాల్లోకి లేపి వంద మీటర్ల వరకూ దూసుకెళుతున్నాడు. (అన్నాతమ్ముళ్ల గొడవ.. కింద పడేసి) వాహనాల రద్దీ సమయంలో వాటి మధ్య నుంచి అడ్డదిడ్డంగా బైకును చాకచక్యంగా నడుపుతున్నాడు. దీంతో చూసే వారు భయంతో హడలి చస్తున్నారు. అరిచి గోల చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అంతే వేగంతో క్షణాల్లో మాయం అవుతున్నాడు. సమాచారం అందుకున్న రాళ్లబూదుగూరు పోలీసులు రోడ్డుపై నిఘా పెట్టి బైకు వీరున్ని గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. -
మైనర్ కాదు.. మోనార్క్!
సాక్షి, శ్రీకాకుళం : నగరంలో గత రెండేళ్లుగా వాహనాలు రయ్ మంటూ దూసుకుపోతున్నాయి. పలు ద్విచక్ర వాహన ఉత్పత్తిదారులు యువతను ఆకట్టుకునేలా వాహనాలను రూపొందిస్తుండటంతో వీరి వేగానికి అదుపు లేకుండా పోతోంది. తల్లిదండ్రులు కూడా ఏమాత్రం ఆలోచించకుండా తమ పిల్లలకు వాహనాలు కొనుగోలు చేయడమో, ఉన్న వాహనాలను పిల్లలకు ఇవ్వడమో చేస్తున్నారు. పోలీసులు ఎన్నో హెచ్చరికలు చేస్తున్నా యువత, తల్లిదండ్రులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం వాహనాలు నడుపుతున్న యువతలో 80 శాతం మందికి లైసెన్స్లే లేవనడంలో అతిశయోక్తి కాదు. లైసెన్స్లు ఉన్నా వాహనాలకు ఇన్సూరెన్స్ లేకపోవడమో, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోవడమో జరుగుతున్నాయి. మరోవైపు మైనర్లు వాహనాలు నడుపుతుండడం వల్ల వారికో.. ఎదురుగా వస్తున్న వారికో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ మైనర్లలో, తల్లిదండ్రుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. నిబంధనలకు అనుగుణంగా రోడ్లు ఎక్కాల్సిన వాహనాలు అందుకు విరుద్ధంగా తిరుగుతున్నాయి. ఇలా నిబంధనలు అతిక్రమించి, పోలీసులకు చిక్కినపుడు సిఫార్సుల ద్వారానో, జరిమానా చెల్లించో వాటి నుంచి బయటపడి మళ్లీ రోడ్లపై యథేచ్చగా తిరుగుతున్నారు. పోలీసులు కూడా ఇటువంటి వారికి జరిమానా విధిస్తున్నారే తప్ప, ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం లేదు. ఇటువంటి సున్నితమైన సమస్యలపై మైనర్లు, తల్లిదండ్రులను చైతన్య పరచాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఇటీవలే వారికి తరచూ కౌన్సిలింగ్ నిర్వహించి విడిచి పెడుతున్నారు. అయినా మార్పు రావడం లేదు. శ్రీకాకుళం నగరంలో పలు రోడ్లు ఇరుకుగా ఉండడం అందరికీ తెలిసింది. ఇటువంటి ప్రాంతాల్లో మైనర్లు అతి వేగాన్ని ప్రదర్శించి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా ఇటువంటి వాటిని అరికట్టాల్సిన అవసరం ఉందని పట్టణవాసులు కోరుతున్నారు. -
రేసుల మోజుతో బైక్ల చోరీ
సుల్తాన్బజార్: బైక్ రైడింగ్పై మోజుతో ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న ఓ యువకుడిని సుల్తాన్బజార్ పోలీసులు అరెస్ట్ చేసి అతడి నుంచి రూ. 15.20 లక్షల విలువైన 12 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం సుల్తాన్బజార్ పోలీసుస్టేషన్లో ఈస్ట్జోన్ అదనపు డీసీపీ గోవింద్రెడ్డి, సుల్తాన్బజార్ ఏసీపీ దేవేందర్, ఇన్స్పెక్టర్ సుబ్బరామిరెడ్డి, డీఐ లక్ష్మణ్తో కలిసి వివరాలు వెల్లడించారు. మౌలాలీకి చెందిన మహ్మద్ మహ్మద్ అబ్దుల్ అబుబకార్ అష్రాఫి అలియాస్ అషు పని లేకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. బైక్ రైడింగ్ మోజుతో అతను నగరంలోని వివిధ పోలీసుస్టేషన్ల పరిధిలోని విలువైన బైక్లు చోరీ చేస్తూ వాటిపై నెక్లెస్ రోడ్లో రేసింగ్లకు పాల్పడుతూ సోషల్మీడియాలో అప్లోడ్ చేసేవాడు. చోరీ చేసిన బైక్లో పెట్రోల్ అయితే అక్కడే దానిని వదిలేసి మరో బైక్ను చోరీ చేసేవాడు. గురువారం రాంకోఠిలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సుల్తాన్బజార్ పోలీసులు పల్సర్పై వస్తున్న అష్రాఫీపై అనుమానంతో అతడిని అడ్డుకున్నారు. వాహనానికి ధృవపత్రాలు లేకపోవడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. నిందితుడిపై మల్కాజ్గిరి, గోల్కొండ, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో 15 కేసులు ఉన్నట్లు తెలిపారు. మల్కాజ్గిరి పరిధిలో బంగారు అభరణల చోరీ కేసు నమోదై ఉంది. రెండు సార్లు పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లివచ్చినా పాతపంథానే అనుసరిస్తూ పోలీసులకు చిక్కాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి నుంచి 12 బైక్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. డీసీపీ రమేశ్ పర్యవేక్షణలో డీఎస్ఐ నరేశ్కుమార్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
బండెనక బండి.. ఫుట్పాత్ నిండి..
హైదరాబాద్ :నగరంలో ట్రాఫిక్జాం కష్టాలకు ఈ చిత్రాలే నిదర్శనం. బండెనక బండి.. పుట్ఫాత్పై వరుసగా నిండి.. ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చేందుకు ద్విచక్రవాహనదారులు అష్టకష్టాలు పడ్డారు. సోమవారం మూసాపేట్ ప్లైఓవర్ వద్ద ట్రాఫిక్ జాం కావడంతో ద్విచక్ర వాహనదారులు పక్కనున్న ఫుట్పాత్పైకి ఎక్కి వెళ్లాలనుకున్నారు. ఇలా ఫుట్పాత్పైకి వందలాది వాహనాలు వచ్చాయి. కొద్దిదూరం వెళ్లాక రోడ్డు ఖాళీగా కనిపించడంతో కిందికి దిగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.– ఫొటోలు: నోముల రాజేష్రెడ్డి -
జకార్తా జిగేల్...
ఒక దీవి... 2 వేదికలు...45 దేశాలు... 40 క్రీడాంశాలు 11000 అథ్లెట్లు... లక్షల్లో వీక్షకులు...15 రోజుల ఏషియాడ్ ‘షో’కు తెరపడింది. ఆరంభానికి తీసిపోని విధంగా ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బాలీవుడ్ చిత్రగీతాలు వేదికపై హైలైట్ అయ్యాయి. వేడుకకే శోభ తెచ్చాయి. ఇండోనేసియాలో రెండోసారీ ఆసియా క్రీడలు సూపర్ హిట్టయ్యాయి. జకార్తా: ఆటలు ఆగాయి. పాటలు సాగాయి. మిరుమిట్లు మిన్నంటాయి. వెలుగులు వెన్నెలనే పరిచాయి. ఆరంభం అదిరినట్లే... ముగింపు శోభ కనువిందు చేసింది. మొత్తానికి వేడుక ముగిసింది. వేదిక మురిసింది. అథ్లెట్లకు, అధికారులకు ఆతిథ్య ఇండోనేసియా బరువెక్కిన హృదయంతో వీడ్కోలు పలికింది. పతకాలు గెలిచిన అథ్లెట్లంతా గర్వంగా జకార్తాను వీడితే... పోరాడిన అథ్లెట్లు మళ్లీ లక్ష్యంపై స్ఫూర్తితో ముందుకు సాగారు. ఈ క్రీడల చివరిరోజు ఆదివారం మిక్స్డ్ ట్రయాథ్లాన్ ఈవెంట్ జరిగింది. జపాన్ బృందం ఈ గేమ్స్ చివరి స్వర్ణాన్ని సాధించింది. ఆటలేమో చూడలేదు కానీ! ఇండోనేసియా వాసులు ఇక్కడి ‘గెలోరా బంగ్ కర్నో’ స్టేడియంలో జరిగిన ఆటల్ని పట్టించుకోలేదు. ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడాంశాలు ఇక్కడే జరిగినా... ఎందుకనో అంతగా ఆసక్తి కనబరచలేదు. అయితే వినోదాన్ని పంచే ముగింపు ఉత్సవానికి మాత్రం ఎగబడ్డారు. దీంతో 76 వేల సీట్ల సామర్థ్యం ఉన్న గెలోరా వేదిక ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. రెండు గంటల పాటు సాగిన ఈ ముగింపు వేడుకల్ని వారంతా తనివితీరా ఆస్వాదించారు. ముఖ్యంగా ఇండోనేసియా వారికి బాలీవుడ్ చిత్రాలన్నా, స్టార్లన్నా ఎక్కడలేని క్రేజ్. అందుకేనేమో సిద్ధార్థ్ స్లాథియా, డెనద పాడిన ‘కోయి మిల్ గయా’, ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘జై హో’ పాటలకు జేజేలు పలికారు. స్టేడియంపై ఆకాశ వీధిలో బాణసంచా వెలుగులు మిరుమిట్లు గొలిపాయి. ఆసియా స్ఫూర్తిని చాటేలా భారత్, చైనా, ఉభయ కొరియాలకు చెందిన కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మార్చ్పాస్ట్లో హాకీ ప్లేయర్ రాణి రాంపాల్ త్రివర్ణ పతా కంతో భారత జట్టును నడిపించింది. రెండువారాల క్రితం ఆరంభోత్సవంలో ఇండోనేసియా అధ్యక్షుడు జొకొ విడోడో బైక్ స్టంట్తో వేదికకు విచ్చేయగా... ఈసారి వీడియో సందేశంతో వచ్చారు. క్రీడాప్రపం చాన్ని ఉర్రూతలూగించిన ఈ గేమ్స్ను ఆస్వా దించిన వారికి ఆయన అభినందనలు తెలి పారు. ఈ వేడుకల్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్, ఆసియా ఒలింపిక్స్ కౌన్సిల్ చీఫ్ అహ్మద్ అల్ ఫహాద్ స్టేడియంలోని వీఐపీ గ్యాలరీ నుంచి ప్రత్య క్షంగా వీక్షించారు. 2022 ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్జౌ నగరంలో జరుగుతాయి. ఈ ఆసియా క్రీడల్లో 45 దేశాలు పాల్గొనగా... 37 దేశాలు కనీసం కాంస్య పతకాన్ని సాధించాయి. శ్రీలంక, పాలస్తీనా, ఈస్ట్ తిమోర్, బంగ్లాదేశ్, మాల్దీవులు, భూటాన్, బ్రూనై దేశాలు రిక్తహస్తాలతో వెనుదిరిగాయి. -
బైక్ నడిపితే ఆ కిక్కే వేరు
అదిరిపోయే ఫీచర్లు.. మైమరపించే డిజైన్లు.. ఎన్నెన్నో కొత్త మోడళ్లు.. కిక్ కొట్టి బైక్ను స్టార్ట్ చేసే రోజుల నుంచి ఆటో స్టార్ట్ వరకూ వచ్చేశాం.. ఈ క్రమంలోనే టాప్గేర్లో ఒక్క రైడ్లో దూసుకుపోవాలనే తపన ఎవరికి ఉండదు? కాలేజీలో చేరిన కుర్రకారు నుంచి రిటైర్డ్ అయిన సీనియర్ సిటిజన్ వరకు, ఉద్యోగానికి వెళ్లే మహిళ నుంచి ఇంటిలో ఉండే గృహిణి వరకు.. ఒకే ఒక్కసారి బైక్రైడ్ చేస్తే బాగుండనిపిస్తుంది. పక్క సందులోని పచారీ కొట్టులో సామాను తేవడం.. స్కూల్ నుంచి పిల్లలను తీసుకురావడం కోసమో బండి నడపాలనిపిస్తుంది. ఇవన్నీ చేయాలంటే ముందు సొంతంగా బైక్ ఉండాలి. ఏ బైక్ కోనాలో ఇక్కడ ఒక లుక్కేద్దాం.. గుంటూరు, తుళ్లూరు: మధ్య తరగతి ప్రజలకు ఒకప్పుడు బైక్ అనేది కల అయితే, నేడు కారు డ్రీమ్గా మారిపోయింది. అయినాగానీ పట్టణాల్లో కార్లున్న వారికి బైక్లు కూడా తప్పకుండా ఉంటున్నాయి. ఎందుకంటే చిన్న రోడ్లలోనూ బైకులపై దూసుకుపోవచ్చు. పార్కింగ్ సమస్య ఉండదు. నిర్వహణ ఖర్చు కూడా తక్కువే. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లేందుకు కారు, దగ్గర ప్రాంతాలకు వెళ్లేందుకు బైక్ వాడకం అనేది ఎక్కువ మంది చేస్తున్న పని. ఏ విధంగా చూసుకున్నా బైకులకు మన దేశంలో చాలా డిమాండ్ ఉంది. అయితే పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఒకే రకం బైకులు, పెద్దలు, యువకులకు, స్త్రీలకు ఒకే రకమైన బైకులు సరిపడవు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన బైక్ సరిపోలుతుంది. తరచుగా వాడతారా? బైకు కొనాలంటే తక్కువలో తక్కువ రూ.50 వేలు వెచ్చించాల్సి ఉంటుంది. అంత ఖర్చు చేసే ముందు కీలక విషయాలు తెలుసుకోవడం అవసరం. ఉదాహరణకు ఏ లక్ష్యంలో కొంటున్నారనే దానిపై స్పష్టత ఉండాలి. రోజూ పరిమిత దూరం, మధ్యస్థ దూరం వెళ్లే వారు 125 సీసీ, అంతకంటే ఎక్కువ సీసీ బైకులను తీసుకున్నా పెద్దగా నిర్వహణ భారం ఉండదు. అదే పట్టణంలో ప్రతి రోజూ 50 కిలో మీటర్లకు మించి దూరం ప్రయాణించే వారికి నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండే బైక్ అనువైనది. ప్రతి 2వేలు కిలో మీటర్లకు ఇంజిన్ అయిల్ మార్చుకోవడం తప్పనిసరి. అదే సమయంలో ప్రతి 4వేలు కిలోమీటర్లకు ఇంజిన్ వాల్వ్ అడ్జస్ట్మెంట్, అవసరమైతే ఎయిర్ ఫిల్టర్ మార్చుకోవడం.. ఇలా బైక్ కండీషన్ మంచిగా ఉండాలనుకుంటే కొంత ఖర్చు చేయక తప్పదు. అందుకే ఎక్కువ దూరం ప్రయాణించే వారు నిర్వహణ ఖర్చు తక్కువ ఉన్న వాటిని తీసుకోవడం నయం. అందుకే నిర్వహణ ఖర్చు తక్కువ ఉండాలా? మైలేజీ కావా లా..? అనేదాన్ని ఎంపిక చేసుకోవాలి. బైక్ – స్కూటర్.. బైక్, స్కూటర్ ఈ రెండు రకాల వాహనాలపై కూర్చునే విధానం వేర్వేరుగా ఉంటుంది. బైకులను హ్యాండిల్ చేయడం స్కూటర్ల కంటే తేలిక. బైకులలో అయితే గేర్లు ఉంటాయి. స్కూటర్లు గేర్ లెస్, పైగా వీటిపై కాళ్లు ముందు పెట్లుకోవాల్సి ఉంటుంది. కనుక హ్యాండ్లింగ్ విషయంలో బైకులంత సౌకర్యంగా ఉండవు. అయితే స్కూటర్లపై ముందు భాగంలో లగేజ్ పెట్టుకునేందుకు, సీటు కింద స్టోరేజీ, హైట్ తక్కువగా ఉండడం వల్ల స్త్రీలకు సౌకర్యంగా ఉండటం, ట్రాఫిక్లో తరచూ గేర్లు మార్చడం అసౌకర్యంగా భావించే వారికి, ముఖ్యంగా మహిళలకు స్కూటర్లు అనువుగా ఉంటాయి. సీటింగ్ పోర్షన్.. అదే సమయంలో దూరం ప్రయాణించే వారు సీటింగ్ పోర్షన్ విషయంపై చాలా శ్రద్ధ పెట్టాలి. మీ బాడీ తీరు, బైక్ షేప్ ఈ రెండింటీకీ మ్యాచ్ అవతున్నాయా, షాక్ అబ్జార్బర్స్ మంచి శక్తివంతమైనవి ఉన్నాయా అన్నది చూసుకోవాలి. లేకుంటే వెన్నుపూస డిస్కులు దెబ్బతిని భవిష్యత్తులో తీవ్ర సమస్యల బారిప పడతారు. నిజానికి చాలా మంది షాక్ అబ్జార్బర్ల అంశాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ ఇది సరైనది కాదు. వాహనం బరువు.. కొనే ముందు బైక్ బరువు చూసుకోవాలి. ఎందుకంటే బరువును బట్టే ఆ బైక్ను మీరు హ్యాండిల్ చేయగలరా..లేదా? అన్న విషయం తెలుస్తుంది. మగవారికైతే బరువు అటూ, ఇటూ అయినా పెద్దగా ఇబ్బంది పడరు. అదే స్త్రీల విషయానికొస్తే వారు ఎక్కువ బరువున్న బైక్లను హ్యాండిల్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. ట్యాక్స్ను తెలుసుకోవాలి.. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు వాహన విలువ ఎంత వేశారు, సేల్ ట్యాక్స్, జీఎస్టీ వంటి వాటిని జాగ్రత్తగా గమనించాలి. ప్రతి షోరూంలోనూ డీలర్స్ విధిగా నోటీస్ బోర్డు పెట్టాలి. వాటిని నిశితంగా పరిశీలించి డీలర్స్తో చర్చించి ట్యాక్స్ విషయంలో అనుమానం వస్తే వెంటనే సంబంధిత అధికారికి ఫిర్యాదు చేయాలి. అంతేకాకుండా టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ వాహనాలకు జీపీఎస్ విధానం ఉన్న వాటిని కొనుగోలు చేస్తే వాహన చోదకుడికి భద్రత ఉంటుంది. –వేమూరు బాలకృష్ణ, మోటార్ వేహికిల్ ఇన్చార్జి, మంగళగిరి మైలేజీ ముఖ్యమా..? తక్కువ దూరం తిరిగే వారు ఎక్కువ మైలేజీ వచ్చే బైక్లను ఎంపిక చేసుకోవడం సరికాదన్నది నిపుణుల సూచన. ఒక లీటరు పెట్రోల్కు 40 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందనుకోండి. మరో బైక్ 50 కిలోమీటర్లు ఇస్తుందనుకుందాం. నెలకు 900 కిలోమీటర్లు ప్రయాణించే వ్యక్తికి 40 కిలోమీటర్ల మైలేజీ వచ్చే బైకుకు నెలకు 22.5 లీటర్ల పెట్రోల్ ఖర్చు అవుతుంది. అదే 50 కిలోమీటర్ల మైలేజీనిచ్చే బైక్కు 18 లీటర్ల పెట్రోల్ ఖర్చు అవుతుంది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ సుమారు రూ.80 ఉంది. ఈ లెక్కన చూస్తే 40 కిలోమీటర్ల మైలేజీనిచ్చే బైక్లకు నెలకు రూ.360 అదనంగా ఖర్చు అవుతుంది. ఇక్కడ ఈ స్వల్ప మొత్తాన్ని చూడటం కంటే ఇతర ఫీచర్లు ఎందులో బావున్నాయన్నదే చూడాలి. ఎవరికి.. ఏ బైక్? క్రూయిజర్లు: ఈ బైక్లపై కూర్చున్నప్పుడు కాళ్లు ముందుకు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఛాతీకి సమాంతరంగా, ఛాతికి కంటే ఎత్తులో హ్యాండిల్స్ ఉంటాయి. రాయల్ ఎన్ఫీల్డ్ థండర్ బర్డ్ వంటివి. స్పోర్ట్స్ బైక్స్: ఈ బైక్లకు హ్యాండిల్ బార్ ఛాతీ కంటే దిగువ భాగంలో ఉంటాయి. కాళ్లు వెనక్కి పెట్టుకోవాల్సి ఉంటుంది. ముందుకు వంగి బోర్లా పడుకున్న మాదిరిగా బైక్స్ను నడపాల్సి ఉంటుంది. చాలా వేగంగా వెళ్లేందుకు, సడెన్గా డ్రైవింగ్ డైరక్షన్ మార్చుకునేందుకు, షార్స్ కార్నర్స్కు అవి అనుకూలంగా ఉంటాయి. యమహా ఆర్15, కవాసకి నింజా 300 బైక్స్ వంటివి. టూరర్: వీటిలో కూర్చునే సీట్ క్రూయిజర్, స్పోర్ట్ బైక్ల తీరుకు మధ్యస్థంగా ఉంటుంది. దూర ప్రయాణలు కోరుకునే వారికి అనువైనది. యమహా ఫేజర్, హీరో కరిజ్మా వంటివి. కమ్యూటర్ బైక్స్: నిటారుగా కూర్చుని నడిపే బైక్స్ ఇవి. స్వల్ప దూరం, ట్రాఫిక్లో ప్రయాణాలకు అనువైనవి. 100 సీసీ బైక్స్. -
షాక్ తిన్నారు.. వద్దన్నారు..
సాహసాల చరిత్రలోసిటీ బైకర్లు మరో కొత్త అధ్యాయం లిఖించారు. అత్యంత క్లిష్టమైనవాతావరణంలో మంచుకొండల్లో దూసుకెళ్లి కొత్త ట్రెండ్ సృష్టించారు. సిటీకి చెందిన ముగ్గురు బైకర్లు ప్లాన్ చేసిన ఈ యాత్రలో మరో ముగ్గురు ఢిల్లీ బైకర్స్ కూడాపాల్గొన్నారు. ఫిబ్రవరి నెలాఖరు నుంచి మార్చి నెల ప్రారంభం వరకు కొనసాగిన వీరి రైడ్విజయవంతంగాముగిసింది. సిటీ బై‘కింగ్స్’ జెండా ఎగసింది. సాక్షి, సిటీబ్యూరో: హిమాలయ పర్వత సానువుల మీదుగా సాగే లేహ్ లడఖ్ సాహసయాత్ర సిటీ బైకర్స్ అప్పుడప్పుడు చేసేదే. అయితే ఈసారి సిటీ బైకర్లు చేసిన అదే యాత్ర ఎందుకు ప్రత్యేకమైందంటే..? ఫిబ్రవరిలో ఈ సాహస యాత్ర చేయడమే ఇందుకు కారణం. మండే ఎండల కాలంలోనే అక్కడ హిమపాతాన్ని తట్టుకోవడం కష్టం. అలాంటిది 5 డిగ్రీల నుంచి మైనస్ 24 డిగ్రీల టెంపరేచర్ ఉండే సమయంలో ఈ యాత్రను సుసాధ్యం చేసి సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు నగరానికి చెందిన పృదు మెహతా(38), కుశాల్ టక్కర్ (33), విజయ్ పటేల్(46).. ఢిల్లీకి చెందిన మనీష్ దాలి(38), అక్షయ్ జైన్(29), దీపక్ గుప్తా(38). శరీరాన్ని చురకత్తుల్లా కోసే మంచుగాలులు, ప్రమాదకరమైన మలుపులు, మంచుతో నిండిపోయిన రహదారుల మీదుగా అభిరుచి, ఆత్మ విశ్వాసం తోడుగా వీరి జర్నీ సాగింది. దాదాపు 20 రోజుల క్రితం యాత్రను ముగించుకొని ఢిల్లీకి, అక్కడి నుంచి హైదరాబాద్కు చేరుకున్న ఈ బృందం ‘సాక్షి’తో పంచుకున్న రైడ్ విశేషాలివీ... షాక్ తిన్నారు.. వద్దన్నారు.. ఈ సమయంలో అక్కడి కొండల్లో ఆర్మీ పెట్రోలింగ్ కూడా ఉండదు. ఆ మంచు కొండల్లో ఇరుక్కుంటే దిక్కుమొక్కు లేని పరిస్థితి. అందుకే ఈ ఆలోచన పంచుకున్నప్పుడు మా బంధుమిత్రులు షాక్ అయ్యారు. ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు కదా.. వద్దులే అన్నారు. అయినా సరే.. మేం చేయగలం అనుకున్నాం. అయితే గుడ్డిగా వెళ్లిపోకుండా ముందస్తు జాగ్రత్తలన్నీ తీసుకున్నాం. దీని కోసం ఒక బ్యాకప్ వెహికల్ ఏర్పాటు చేసుకున్నాం. దీనిలో లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్, ఫైర్ ఉడ్, కిరోసిన్, స్టవ్, టెంపరెరీ టెంట్స్, సిలిండర్, రెడీమేడ్ పుడ్.. ఇలా అన్నీ తీసుకెళ్లాం. ఆరుగురు రైడర్స్లో ఇద్దర్ని స్టాండ్బైగా ఉంచాం. ప్రయాణం సాగిందిలా... దీనికి ఎక్స్ట్రీమ్ వింటర్ లఢఖ్ రైడ్ అని పేరు పెట్టాం. ఇప్పటి వరకు ఎవరూ చేయని ఈ యాత్రను మేం ఫిబ్రవరి 24న ప్రారంభించాం. ముందు ఢిల్లీ చేరుకున్నాం. లేహ్ లఢఖ్ వరకు ఈ టైమ్లో ఫ్లైట్ తప్ప.. మరే రూట్ ఉండదు. పర్వతాలను క్రాస్ చేస్తూ వెళ్లాలి. అదొక్కటే మార్గం. ఢిల్లీ నుంచి లేహ్ దాకా విమానంలో ప్రయాణించాం. జమ్మూకశ్మీర్లోని హైడిజర్ట్ సిటీ లేహ్కు చేరుకొని, అక్కడ ఓ రోజు బస చేశాక హాన్లే గ్రామానికి మా రోడ్ రైడ్ స్టార్ట్ చేశాం. అక్కడ ఉష్ణోగ్రత మైనస్ 8 డిగ్రీలుగా ఉంది. విపరీతమైన ఎదురు గాలుల మధ్య, దాదాపు 10గంటల పాటు నిర్విరామంగా ప్రయాణించి 250 కిలోమీటర్ల దూరంలోని చైనా బోర్డర్కు దగ్గర్లోని ఆ గ్రామానికి 26న చేరుకున్నాం. హాన్లేలో రెండ్రోజులు కళ్లు తిప్పుకోనివ్వని ల్యాండ్ స్కేప్స్ మధ్య గడిపి హాన్లే అబ్సర్వేటరీ, మోనాస్టరీలు సందర్శించాం. స్థానికంగా ఉన్న కొన్ని ప్రాంతాలను చూశాం. అదే వాతావరణ పరిస్థితుల్లో తిరుగు ప్రయాణం ప్రారంభించాం. లేహ్కి 220 కి.మీ దూరంలోని కార్గిల్ వైపుగా రైడ్ స్టార్ట్ చేసి, ఫోట్యులా పాస్, నామిక్లా పాస్ అనే రెండు ఎత్తయిన శిఖరాలను దాటుకుంటూ సాగిపోయాం. దారిలో కొన్ని కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ప్యాంగాగ్ లేక్ ఎదురైంది. అది మైనస్ 22 డిగ్రీల చలికి మొత్తం ఘనీభవించి పోయింది. మంచుతో కప్పబడిపోయిన ఆ లేక్ మీద రైడ్ వర్ణించలేని అనుభూతి. అయితే అది కూడా బాగా ప్రమాదకరమైనదే. అసలు అక్కడ లేక్ ఉండేదంటే నమ్మలేం.. అలా ఉంటుంది. ఆ ప్రాంతంలో చలిని తట్టుకోవచ్చు.. కానీ ఎముకల్ని అమాంతం కోసేస్తున్నట్టు ఉండే చలిగాలులను తట్టుకోలేం. మార్చి 1న ద్రాస్ చేరుకున్నాం. ఆ ప్రాంతం మొత్తం ఒక మంచుదుప్పటి కింద దాక్కుని ఉంది. కనుచూపుమేర తెల్లదనమే. మనుషులు ఉండే ప్రపంచపు రెండో అత్యంత చల్లని ప్రాంతం అది. అక్కడ తినడానికి ఏమీ దొరకలేదు. మ్యాగీ లాంటివి వండుకుని తిన్నాం. దారిలో భారతీయ సైన్యం నిర్మించిన ద్రాస్ వార్ మెమోరియల్ నిర్మాణాన్ని సందర్శించాం. ఏంటీ రైడ్ స్పెషల్? లేహ్ లఢఖ్కు బైక్ రైడ్స్ను సిటీ రైడర్స్ బాగా ఇష్టపడతారు. అయితే అలా వెళ్లే వారంతా మే చివరి నుంచి అక్టోబర్ వరకు మాత్రమే ఎంచుకుంటారు. ఎందుకంటే ఆ తర్వాత లేహ్ లఢఖ్కు ఉన్న రెండు ప్రధాన దారులు మంచుమయంగా మారిపోతాయి. అసలు ఫిబ్రవరి నెలలో ఆ ప్రాంతానికి రైడ్ అనేది కనీసం ఊహించ లేనిదనే చెప్పాలి. అందుకే వీరి రైడ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది బైకర్స్ కమ్యూనిటీ అయింది. కష్టమైన రైడ్... స్వల్ప పరిమాణంలోని ఆహారంతోనే ఇదంతా సాగించాం. ఇది చాలా కష్టమైన రైడ్. ఈ సీజన్లో గ్రామాలు ఉంటాయి. కానీ జనం బాగా పలచగా మాత్రమే ఉంటారు. స్వల్ప పరిమాణంలో మాత్రమే ఫుడ్ లభ్యమవుతుంది. తక్కువ ఆక్సిజన్ స్థాయిల వల్ల ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైంది. హై యాటిట్యూడ్ సిక్నెస్ తీవ్రమైన సమస్యతో ఎదుర్కోవాల్సి వచ్చింది. మా చూపు కూడా బాగా మందగించింది. రోడ్డును స్పష్టంగా చూడలేకపోయాం. – పృదు మెహతా, బైకర్ -
రైడర్గా రైజ్..తెరపై క్రేజ్
చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి. నటుడు కావాలనే కోరిక. సినీ రంగంలోకి అడుగు పెట్టాలని, ఓవైపు చదువుకుంటూ మోడలింగ్పై దృష్టిసారించాడు. అందరి దృష్టిని ఆకర్షించాడు. బైక్ రైడర్గానూ గుర్తింపు పొంది, టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చాడు. రైడర్గా సినీ ప్రస్థానం ప్రారంభించి... హీరో, విలన్గా నటిస్తూ తెరపై దూసుకుపోతున్నాడు నగరవాసి విష్షురెడ్డి. హిమాయత్నగర్: విష్షురెడ్డికి చిన్నప్పటి నుంచి బైక్ రైడింగ్ అంటే పిచ్చి. బెంగళూర్లో మోడలింగ్ చేస్తుండగా బైక్ రైడింగ్ పోటీల్లో పాల్గొనేవాడు. 2009లో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ‘జోష్’ సినిమాకు మంచి బైక్ రైడర్ కావాలని వెతికిన డైరెక్టర్... విష్షురెడ్డి గురించి తెలుసుకొని అతనికి అవకాశం ఇచ్చాడు. సినిమా సెకండాఫ్లో హీరోతో విష్షురెడ్డి చేసిన బైక్ రైడింగ్ విన్యాసాలు ప్రేక్షకులను అలరించాయి. అలా రైడర్గా సినీ రంగంలోకి అడుగుపెట్టిన విష్షురెడ్డి విభిన్న పాత్రలు పోషిస్తూ కెరీర్లో ముందుకెళ్తున్నాడు. త్వరలో ‘త్రయం’... ‘జోష్’ తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించిన విష్షురెడ్డి.. లవ్చేస్తే, నీ జతలేక, త్రయం సినిమాల్లో హీరోగా నటించారు. ఇందులో త్రయం సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులోనూ బైక్ రైడర్గా ప్రేక్షకులను అలరించనున్నాడు. డూప్ లేకుండా బైక్ రైడింగ్ విన్యాసాలు, మార్షల్ ఆర్ట్స్ చేశానని చెప్పాడు విష్షురెడ్డి. ఆకాశ్తో విలన్గా... ఓవైపు హీరోగా నటిస్తూనే విలన్ పాత్రలకూ ఓటేస్తున్నాడు విష్షురెడ్డి. ఇందులో భాగంగా ‘పూరీ కనెక్ట్స్ సంస్థ’ ఆధ్వర్యంలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ‘మెహబూబా’ సినిమా నిర్మిస్తున్నాడు. ఇందులో ఆయన తనయుడు ఆకాష్ హీరో కాగా, విష్షురెడ్డి విలన్గా నటిస్తున్నాడు. ఈ సినమా దాదాపు పూర్తయిందని చెప్పాడు. అవకాశాలొస్తున్నాయి.. ఇప్పటివరకు చేసిన సినిమాలు నాకు సంతృప్తినిచ్చాయి. బాలీవుడ్, కోలీవుడ్లోనూ అవకాశాలు వస్తున్నాయి. కథలను బట్టి అక్కడా సినిమాలు చేస్తాను. – విష్షురెడ్డి -
సరదాగా కాసేపు..
సాక్షి, సిద్దిపేట: కరవు ప్రాంతంగా ఉన్న తెలంగాణకు గోదావరి నీళ్లతో కాళ్లు కడిగి కష్టాలు తీర్చాలన్న తపనతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మహా యజ్ఞం మాదిరి చేపట్టామని రాష్ట్ర భారీనీటిపారుదల, మార్కెటింగ్శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం జిల్లాలోని చంద్లాపూర్ ప్రాంతంలో నిర్మిస్తున్న రంగనాయకసాగర్ రిజర్వాయర్ పనులను రెండో రోజు పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి బైక్పై ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. కాళేశ్వరం నుంచి నీటిని తరలించే విధానం, పంపులు పనిచేయడం, అక్కడి నుంచి రంగనాయక సాగర్, మల్లన్నసాగర్ రిజర్వాయర్లకు నీళ్లు నింపడం మొదలైన అంశాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకొన్నారు. ఇంజనీర్లు, కార్మికులు, అధికారులు అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. అందరి కష్టం, శ్రమ అంతా కరువును తరమి కొట్టాలన్నదే అని మంత్రి వివరించారు. అదేవిధంగా రంగనాయక సాగర్ రిజర్వాయర్లో కట్టను మంత్రి పరిశీలించి నీటి సామర్థ్యం తట్టుకునేందుకు చేపట్టిన అధునాతన పద్దతులు, నల్లమట్టి, ఇసుకతో నిర్మాణలతో ఉపయాగాలను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని, వచ్చే ఖరీఫ్ నాటికి రైతులకు నీళ్లు ఇచ్చేలా పనులు జరగాలని మంత్రి ఆదేశించారు. -
అందరూ షాకయ్యారు
ఇంత పెద్ద సిటీలోనూ బైక్ నడిపించే అమ్మాయిల శాతం చాలా తక్కువే. ప్రముఖ కళాశాలల విద్యార్థినులను అడిగినప్పుడు చాలామంది తమకు బైక్ నడిపించడం రాదన్నారు. కారణమేంటని అడిగితే.. తల్లిదండ్రులు వద్దనడం, టీజింగ్, సేఫ్టీ తదితర చెప్పారు. అమ్మాయిలతో బైకథాన్ నిర్వహించాలనుకున్న ‘తరుణి’ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు మమతా రఘువీర్, బైకర్నీ జయభారతిలకు ఇది ఆశ్చర్యం కలిగించింది. అప్పుడే అమ్మాయిలకు బైక్ నేర్పించాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వీరు. – సాక్షి, సిటీబ్యూరో సెల్ఫ్ డిఫెన్స్, మెడికల్ ఎమర్జెన్సీ, ట్రాఫిక్ రూల్స్, భద్రత, బాధ్యతాయుత డ్రైవింగ్.. ఇలా అన్నీ కలిపి ఒక కోర్సు తయారు చేసింది జయభారతి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్, రవాణాశాఖ, హీరో మోటర్స్తో కలిసి బేగంపేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లోని ట్రైనింగ్ పార్క్లో ఈ సెషన్ నిర్వహించారు. అమ్మాయిలు బైక్ నేర్చుకోవడానికి అడ్డంకిగా చూపుతున్న అన్నింటికీ ఈ శిక్షణతో సమాధానమిచ్చారు. ఇది మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. మొదటి బ్యాచ్లో 30 మంది విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా శిక్షణ తీసుకున్న మహిళలు ‘సాక్షి’తో తమ అనుభవాలు పంచుకున్నారు. ఇదీ కోర్సు.. మొదటి బ్యాచ్లో గృహిణులు, ఉద్యోగినులు, విద్యార్థినులు శిక్షణ తీసుకున్నారు. ప్రతి శనివారం ఉదయం 7–9 వరకు 8 వారాలు శిక్షణ ఉంటుంది. మొదటి రెండు తరగతుల్లో లర్నింగ్ లైసెన్స్ సెషన్స్ నిర్వహించారు. శిక్షణలో డ్రైవింగ్ రూల్స్, లైసెన్స్ విధివిధానాలు, ఆర్టీఏ విభాగాలతో సెషన్స్ ఉంటాయి. శిక్షణకు బైక్లను హీరో మోటార్స్ సమకూరుస్తోంది. బైకర్నీ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణకు రూ.500 నామమాత్ర ఫీజు తీసుకుంటున్నారు. మొదటి బ్యాచ్కు వచ్చిన స్పందనతో మరిన్ని బ్యాచ్లకు శిక్షణనివ్వనున్నారు. వివరాలకు ‘తరుణి’ ఫేస్బుక్ పేజీని సంప్రదించండి. www.facebook.com/Tharuni.org ఇదో సాధికారత.. అమ్మాయిలు బైక్పై వెళ్తే భద్రత ఉండదని పేరెంట్స్ భయపడుతుంటారు. కానీ బైక్ ఉంటే ఎక్కువ సేఫ్. సమయం మన చేతిలో ఉంటుంది. ఎక్కడికైనా వెళ్లగలం. ఏదైనా సాధించగలమనే నమ్మకం వస్తుంది. మహిళ బైక్ నడుపుతుందంటే సాధికారత సాధించినట్లే. మహిళలకు సైకిల్స్ ఇవ్వడం, బైక్ రైడింగ్ నేర్పించడం ద్వారా వారిని సాధికారత సాధించేలా చేయాలన్నదే మా సంస్థ లక్ష్యం. – మమత, ‘తరుణి’ నిర్వాహకురాలు చీరకట్టు అడ్డుకాదు.. నా జీవితం ఇంటికి పరిమితమైంది. నేనేమీ చేయలేనని నాన్నకు అభిప్రాయం ఏర్పడింది. ఎలాగైనా బైక్ రైడింగ్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. నాన్నను ఇక్కడికి తీసుకొచ్చి నేను బైక్ నడిపి చూపించాను. ఇది నాలో కొత్త ఉత్సాహన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపింది. స్కూటీ లాంటివి నేర్చుకోవడానికి చీరకట్టు అడ్డుకాదు. బైక్కు చుడిదార్ వేసుకుంటే సరిపోతుంది. – స్వప్న, గృహిణి అవకాశమే ఆయుధం.. అమ్మాయిలకు బైక్ నేర్చుకునే అవకాశం లేకపోవడంతోనే వారు వెనకబడిపోయారు. అవకాశం కల్పించి నేర్పిస్తే బాగా నేర్చుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు. ఇందుకు ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలే ఉదాహరణ. – జయభారతి, లేడీ బైకర్ అందరూ షాకయ్యారు.. మా ఇంట్లో పల్సర్, ఎఫ్జడ్ ఉన్నాయి. అయితే బైక్లు బరువుగా ఉంటాయని అన్నయ్యలు నన్ను నడపొద్దు అనేవారు. ఇక్కడ శిక్షణలో చేరాక ఓ రోజు బైక్ రైడ్ చేసి చూపించాను. అంతే అందరూ షాకయ్యారు. అమ్మ అయితే ఫుల్ హ్యాపీ. నాకు అవెంజర్ కొనివ్వమని ఇంట్లో డిమాండ్ చేస్తున్నాను. బైక్ నేర్చుకోవడం కష్టమేం కాదు. బ్యాలెన్సింగ్ రావాలంతే. – శ్రుతి, డిగ్రీ ద్వితీయ సంవత్సరం అబ్బాయిలకే పెద్ద బైకులా? అమ్మాయిలకు చిన్న బైక్లు, అబ్బాయిలకు పెద్ద బైక్లు అనడం కరెక్ట్ కాదు. ధైర్యసాహసాలు అంటే మగవారి సొత్తుగా చిత్రీకరించారు. అమ్మాయిలందరూ బైక్ నడపాలి. అప్పుడే అన్ని బైక్లు అందరికీ అనే ఆలోచన వస్తుంది. – సత్యవేణి ఏ వయసులోనైనా ఓకే.. మనకు నచ్చిన పని చేయడానికి వయసు ఎప్పుడూ అడ్డంకి కాదు. నేను 51 ఏళ్ల వయసులో బైక్ నేర్చుకొని నడపిస్తున్నాను. ఏ కారణాలతోనూ మన ప్యాషన్ను పక్కన పెట్టొద్దు. సరైన శిక్షణ తీసుకొని, భద్రతా ప్రమాణాలు పాటించాలి. – అనిత, స్వచ్ఛంద సేవకురాలు -
టీనేజ్ స్పీడ్కు బ్రేక్
►పిల్లలకు రహదారి భద్రతా పాఠాలు ►స్కూళ్లు, కాలేజీల్లో ఆర్టీఏ రోడ్ సేఫ్టీ క్లబ్లు ►1,450 విద్యా సంస్థల్లో ఏర్పాటుకు ప్రణాళికలు సిటీబ్యూరో: అసలే కుర్రాళ్లు. ఆపైన టాప్గేర్లో హైస్పీడ్. కళ్లు మూసి తెరిచేలోగా మాయమైపోవాలనుకుంటారు. మరోవైపు బైక్, కార్ రేసింగ్లు. అయితే రోడ్డు నిబంధనలపై అవగాహన ఉండదు. స్కూల్ దశల్లోనే బైక్ రైడింగ్ చేయాలనే ఉత్సాహంతో ప్రాణాలు కోల్పోతున్న టీనేజ్ కుర్రాళ్లు. అలాంటి పిల్లల వాహన డ్రైవింగ్కు కళ్లెం వేసేందుకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన పెంపొందించేందుకు ఆర్టీఏ ప్రణాళికలను రూపొందిస్తోంది. నగర శివార్లలోని స్కూళ్లు, కళాశాలలు, తదితర విద్యాసంస్థల్లో వినూత్నంగా రోడ్డు భద్రతా క్లబ్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టింది. సుమారు 1,450 విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకొని ఈ క్లబ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇవి పూర్తిగా పిల్లల క్లబ్లు ∙ఈ రోడ్డు సేఫ్టీ క్లబ్బుల నిర్వహణలో పిల్లలే ప్రధాన భాగస్వాములు. ఒకరిద్దరు టీచర్లు, కొందరు పిల్లలతో కలిపి క్లబ్లు ఏర్పాటు చేస్తారు. రోడ్డు భద్రతపై స్కూల్లో చేపట్టవలసిన కార్యక్రమాలను ఈ క్లబ్లే చేపడతాయి. ఈ క్లబ్లకు ఆర్టీఏ శిక్షణనిస్తుంది. ∙ఉదయం ప్రార్థన సమయంలో రోడ్డు భద్రత నిబంధనలను గుర్తు చేసుకోవడంతో పాటు, రోడ్డు భద్రతపై రూపొందించిన షార్ట్ఫిల్మ్లను ప్రదర్శిస్తారు. ∙పిల్లలే పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేలా ఆర్టీఏ శిక్షణనిస్తుంది. అవసరమైన మెటీరియల్ను ఆర్టీఏ అందజేస్తుంది. ∙8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, కాలేజీల్లో ఇంటర్ స్టూడెంట్స్ను భాగస్వాములుగా చేస్తూ ఈ క్లబ్లు ఏర్పాటు చేస్తారు. ∙కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గండిమైసమ్మ, ఉప్పల్, బోడుప్పల్, అల్వాల్, మల్కాజిగిరి, బాలానగర్, షామీర్పేట్ తదితర ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లోనే బ్లాక్స్పాట్లు కూడా అధికంగా ఉన్నట్లు రవాణా అధికారులు గుర్తించారు. ∙స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్డే వంటి వేడుకల్లో రోడ్డు భద్రతపై పిల్లలకు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేస్తారు. ప్రమాద రహిత జీవనమే లక్ష్యంగా.. ముందస్తుగానే పిల్లల్లో అవగాహన కల్పించడం, ఉపాధ్యాయులను, స్కూళ్లను, తల్లిదండ్రులను కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములను చేయడం ద్వారా భవిష్యత్ తరాలు ప్రమాదరహిత జీవనం కొనసాగించాలన్నదే మా ఆకాంక్ష. అందుకే ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తాం. – డాక్టర్ పుప్పాల శ్రీనివాస్, ఉప రవాణా అధికారి, మేడ్చల్. -
బైక్ను ఢీకొన్న ఆటో,కింద పడ్డ మహిళ
-
నాన్నకు ప్రేమతో.. జనిత్
సినిమాలో నాన్న కోసం ఏదైనా చేసే హీరోలను,హీరోయిన్లను చూస్తాం... ఆమె జీవితంలో రియల్ హీరో నాన్నే ... ఆయన తీరని కోరికను తాను నేరవేర్చాలనీ కంకంణం కట్టుకుంది... కష్టాలను, అవమానాలను భరించింది... అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది... ‘‘హీరో’’అయ్యింది... ఎల్లలు దాటేలా చేసింది నాన్నపై ఆమెకు ఉన్న ప్రేమ. ఏ అమ్మాయి చేయని సాహసం చేసింది. ఉగ్రవాదుల కోటలో, తుపాకి తూటాల మధ్యలోంచి రహదారిని ఎంచుకొని... చివరికి లక్ష్యాన్ని చేరుకొంది. తండ్రి కలను సాకారం చేసింది... తండ్రిపై ప్రేమ సాహసానికి ఊపిరూదింది... పాకిస్థాన్కు చెందిన జనిత్ ఇర్ఫాన్ (21) అనే అమ్మాయి నాన్నకు బైక్పై సుదూర ప్రాంతాల్ని చుట్టేయాలనే కోరిక ఉండేది. అది తీరకుండానే ఆయన చనిపోవడంతో తానే తండ్రి కోరికను పూర్తి చేయాలని ఆలోచించింది. బైక్ నడపడం అప్పటి వరకూ రాక పోయిన నేర్చుకొని ప్రయాణాన్ని ప్రారంభించాలని అనుకొంది. జనిత్ స్వస్థలం ఉత్తర పాకి స్థాన్లోని లాహోర్ ప్రాంతం. ఒక సారి తమ్ముడు 70సీసీ బైక్ని ఇంటికి తీసుకొచ్చాడు. జనిత్ బైక్ నేర్పమని తమ్మున్ని అడిగింది. ఆమె తల్లి కూడా బైక్ నేర్పమని కొడుక్కు చెప్పింది. ఆ సందర్భంలోనే తండ్రి కోరికను సాకారం చేయమని జనిత్ను ప్రోత్సహించింది. కష్టాల కడలి నుంచి సంతోషాల తోటకు పయనం... జనిత్ మొదట్లో బైక్ నడపడం కష్టమనిపించేదని, ఒకే సమయంలో బైక్ గేర్, క్లచ్చ్, బ్రేక్స్ను వాడడం కష్టమయ్యేదని బైక్ నేర్చుకొనే తొలి నాటి అనుభవాలను గుర్తు చేసింది. తొలి నాళ్లల్లో లాహోర్ పరిసర ప్రాంతాల్లోనే చక్కర్లు కొట్టేది. 2015 జూన్ నెలలో తన తండ్రి తీరని కోరికని సాకారం చేసేందుకు మొదటి అడుగు వేసింది. ఆరు రోజుల్లో పాక్-చైనా-భారత్ సరిహద్దు ప్రాంతమైన కశ్మీర్ చేరుకొవాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఒంటరిగానే ప్రయాణించాలని నిర్ణయించుకుంది. కశ్మీర్ను చూడాలనే కోరిక ఎప్పటి నుంచో ఉందని కూడా వివరించింది. ఇస్లామాబాద్కు మొదట చేరువైంది. తర్వాత కొండలు, కోనలు, నదులు దాటుకుంటూ పాక్ ఆధీనంలోని కశ్మీర్ రాజధాని ముజఫరాబాద్ చేరుకుంది. అక్కడి నుంచి నీలం వ్యాలీ వరకూ తన ప్రయాణాన్ని కొనసాగించింది. దారి వెంట గ్రామాల్లో ఆగుతూ అక్కడి జనాలతో ఫొటోలను తీసుకుంటూ సాగింది తన ప్రయాణం. ప్రయాణంతో ప్రేమ... 3200 కిలోమీటర్లు ప్రయాణించాలని (లాహోర్ నుంచి చైనా సరిహద్దు ప్రాంతమైన ఖున్జరబ్ వరకూ) నిర్ణయించుకొంది. ప్రయాణం చేస్తున్న సమయంలో ఇతర మహిళ బైక్ రైడర్లు జనిత్ను ప్రోత్సహించారు. తాము చూసిన పాకిస్థానీ మొదటి బైక్ రైడర్ అని జనిత్ ను ప్రశంసించారు. 20 రోజుల ప్రయాణంలో ప్రపంచంలోనే ఎత్తు అయిన పీఠభూమిగా పేరున్న డిసాయ్కు చేరుకొంది. కనీసం అక్కడ విశ్రాంతి తీసుకునేందుకు ఆశ్రయం కల్పించే వారు కరువయ్యారు. అంతేకాకుండా స్థానికుల నుంచి జనిత్ కు ప్రతికూల పరిస్థితులు సైతం ఎదురయ్యాయి. దారి వెంట ప్రమాదాలు జరిగిన తన ప్రయాణాన్ని ఏవీ ఆపలేక పోయాయి. భయాలకు, ప్రమాదాలకు భయపడి లక్ష్యాన్ని వదిలేయద్దని తన లాంటి వారికి జనిత్ సూచిస్తోంది. అడ్డంకులు దాటుకుంటూ... మహిళల్లో తక్కువ మంది బైక్ రైడర్స్ ఉన్నారని ఆమె తొలి అనుభవంలోనే గ్రహించింది. 'నేను అబ్బాయిల్లా దుస్తువులు ధరించి ప్రయాణాన్ని ప్రారంభించా. కొన్ని చోట్ల ఆగి దారి గురించి ఇతరులను అడిగాను. నా మాటను బట్టి నన్ను అమ్మాయని గుర్తించి నోరు వెళ్లబెట్టే వారు. ఆ లోపే అక్కడి నుంచి నేను బయలుదేరేదాన్ని. కొందరు అమ్మాయిలు బైక్ నడపకూడదని అనే వారు. కానీ దారి వెంట ఎదురైన కొంత మంది స్త్రీలు, సరిహద్దు దళాల సైనికులు మాత్రం వెన్నుతట్టి ప్రోత్సహించారు. మిఘర్ ప్రాంతంలో ఒక మహిళ నాతో మాట్లాడేందుకు ప్రయత్నించింది. ఆమె మాట్లాడే భాష వేరు. అక్కడే ఉన్న ఒక ట్రాన్స్లేటర్ తన మాటలను నాకు చెప్పాడు. ఆమాటాల అర్థం ...నువ్వు చేస్తున్న ఈ యాత్ర నమ్మశక్యం కానిది’. అంటూ తన ప్రయాణ అనుభవాలను జనిత్ ఫేస్బుక్లో పంచుకొంది. సానుకూలతే మంచి ఆయుధం... ప్రయాణంలో బాధలు ఎదురైనా... చేరుకోబోయే ప్రాంతాల గురించి ఆలోచించడంతో ఏది బాధించేది కాదు. టీవీల్లో పేపర్లో చూసే మంచును మొదటి సారి ప్రత్యక్షంగా చూసాను. ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అలసిపోయినప్పడు యోగా చేసేదాన్ని. ఖున్జరబ్ చేరుకొవడం జీవితంలో గొప్ప అనుభూతి. ఇప్పడు ఆ మధుర క్షణాలను తలుచుకుంటే భావోద్వేగానికి గురవుతానని జనిత్ పేర్కొంది. మరో ప్రస్థానం... జనిత్ ఒక వైపు యాత్రలను కొనసాగిస్తూనే, చదువుల్లోనూ రాణిస్తోంది . త్వరలో ఆమె సింధులోని మిథ్ అనే గ్రామానికి వెళ్లాలని అనుకొంటోంది. మిథ్ ప్రతేక్యత ఏంటంటే అక్కడ హిందువులు, ముస్లింలు కలిసి నివసిస్తున్న ప్రాంతం. మరో పాంత్రం పాకిస్థాన్ స్విజ్జర్లాండ్గా పిలువబడే స్వేత్ వ్యాలీకి చేరుకోవాలని ప్రణాళికలు రచించుకుంటోంది. ప్రస్తుతం జనిత్ ఫేస్బుక్లో... జనిత్ ఇర్ఫాన్: వన్ గర్ల్ 2 వీల్స్ అనే పేరుతో పర్సనల్ బ్లాగ్ను రన్ చేస్తోంది. -
సాహసనారి వసుంధర
బుద్ధన్ ఏసు గాంధీ చిత్రం కోసం నటి వసుంధర బైక్పై స్వారీ చేయడం, కారు వేగంగా నడపడం వంటి పలు సాహసాలు చేస్తున్నారట. ఆ వివరాలేమిటో చూద్దాం. బ్లెసింగ్ ఎంటర్టెయినర్స్ పతాకంపై ప్రభాతీస్ సామువేల్ నిర్మిస్తున్న చిత్రం బుద్ధన్ ఏసు గాంధీ. వెట్రివేల్ చంద్రశేఖర్ కథ, కథనం,దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రంలో నటి వసుంధర ప్రధాన పాత్రలో క్రైమ్ రిపోర్టర్గా నటిస్తున్నారు.ఆ వివరాలను దర్శకుడు తెలుపుతూ రాజకీయ నాయకుల అవినీతి, అక్రమాలను సేకరించి పత్రికలో ప్రచరించే ధైర్యవంతురాలైన యువతిగా నటి వసుంధర నటిస్తున్నారని తెలిపారు. ఈ పాత్ర కోసం ఆమె మోటార్ బైక్పై స్వారీ, వేగంగా కారు నడపడం వంటి సాహసోపేతమైన సన్నివేశాల్లో నటిస్తున్నారని చెప్పారు. విషయం ఏమిటంటే వ సుంధరకు అసలు బైక్ నడపడం రాదన్నారు. చిత్ర యూనిట్ ఆమెకు బైక్ నడపడంలో శిక్షణ ఇచ్చారని తెలిపారు. రోజూ అన్నానగర్ నుంచి కోయంబేడు, వడపళని, మధురవాయిల్ ప్రధాన రోడ్లపై వసుంధరకు బైక్ నడపడంలో శిక్షణ ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఇందులో కిషోర్, అశోక్, కయల్ విన్సెంట్, కల్లారి అఖిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని వెల్లడించారు. చిత్ర షూటింగ్ చెన్నై పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుపుకుంటోందని దర్శకుడు తెలిపారు. -
గోవా రోడ్లపై సమంత బైక్ రైడింగ్
ఈ ఫొటో చూశారా.. పొట్టి నిక్కరు లాంటి డ్రెస్ వేసుకుని సమంత బైక్ రైడింగ్కు వెళుతూ తెగ ఎంజాయ్ చేస్తోంది కదూ! ఏ సినిమా కోసమే షూట్ చేసిన సీన్ కాదిది. ఈ టాలీవుడ్ బ్యూటీ గోవా రోడ్లపై సరదాగా రైడింగ్కు వెళ్లినప్పడు తీసిన ఫొటో ఇది. వేడుకల్లో నిండైన దుస్తుల్లో కనిపించే ఈ భామ.. తెలుగు సినిమాల్లో కూడా ఇంతగా ఎక్స్పోజ్ చేయని సమంతేనా ఇలాంటి డ్రెస్ వేసుకుని రోడ్లపై తిరుగుతోందని ఆశ్చర్యంగా ఉందా? నిజంగా సమంతాయే. సమంత తన డిజైనర్ కోనా నీరజను వెనుక కూర్చోబెట్టుకుని గోవాలో చక్కర్లు కొట్టారు. కోనా నీరజ ఈ ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సమంత గతంలో హైదరాబాద్లో కూడా బైక్ రైడింగ్కు వెళ్లారు. తమిళ హీరో ఆర్యతో కలసి షికారుకు వెళ్లినట్టు గాసిప్స్ వచ్చాయి. అయితే తాను బైక్లో వెళ్లింది తన అసిస్టెంట్ ఆర్యతో అని.. తమిళ హీరో ఆర్యతో కాదంటూ సమంత సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు. -
డబుల్ కిక్
"There is no more lovely, friendly and charming relationship, communion or company than a good marriage" ఈ మాటలను మార్టిన్ లూథర్ వీళ్ల కోసమే అన్నాడేమో అనిపిస్తుంది ఈ జంటను చూస్తే! శ్యామ్కపూర్, వసూశ్రీ.. అతను సింధీ.. ఆమె అచ్చతెలుగు ఆడపడుచు. శ్యామ్.. నాన్వెజిటేరియన్. వసూశ్రీ.. ప్యూర్వెజిటేరియన్! ఆయన చదువు .. తొమ్మిదో తరగతి, టేబుల్ టెన్నిస్ ప్లేయర్. ఆమె ఏంబీఏతో పాటు ఇంటీరియర్ డిజైనింగ్, మల్టీమీడియా, ఫొటోగ్రఫీ వంటి కళల్లోనూ సర్టిఫికెట్ ప్లస్ నైపుణ్యం రెండూ సాధించింది. బాస్కెట్బాల్ ప్లేయర్ అనే ప్రత్యేకతా ఉంది. పుస్తక ప్రియురాలు కూడా! ఇన్ని వ్యత్యాసాలను ఒక్కటి చేసిన సామ్యం బైక్ రైడింగ్! ఎలా అని అడిగితే ఇలా చెప్తారు.. - శ్యామ్కపూర్, వసూశ్రీ ‘వసూని నేను ఫస్ట్టైమ్ 1994... కామన్వెల్త్ టోర్నమెంట్లో చూశాను లాల్బహదూర్ స్టేడియంలో’ చెప్పాడు శ్యామ్. ‘నేనప్పుడు డిగ్రీ సెకండియర్లో ఉన్నా. మా కాలేజ్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ వాలంటీర్గా వెళ్లాను. హాంకాంగ్ టేబుల్ టెన్నిస్ టీమ్ని చూసుకునేదాన్ని. శ్యామ్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్గా ఆ టోర్నీకి వచ్చాడు. ఆయనది లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ నవ్వుతూ వసూశ్రీ. ‘అవును మేడమ్ని కన్విన్స్ చేయడానికి ఆర్నెల్లు పట్టింది’ అని శ్యామ్ చెప్తుండగానే ‘నాకు శ్యామ్ కన్నా ఆయన బైక్ నచ్చింది. నా ప్యాషన్ అంతా బైక్ రైడింగ్ మీదే!’ అని చెప్పింది వసూశ్రీ. రైడింగ్ అభిరుచి ఎలా స్టార్ట్ అయింది?‘నాకు 15 ఏళ్లున్నప్పుడనుకుంటా.. ఫస్ట్టైమ్ బైక్ నడిపా. అదీ మా పెద్దన్నయ్య హీరోహోండా. పెద్దన్నయ్య చాలా ఎంకరేజ్ చేసేవాడు’ అని వసూశ్రీ గుర్తుచేసుకుంటే ‘మా తాత జమునాదాస్ కపూర్ డాక్టర్. నిజామ్కి పర్సనల్ ఫిజీషియన్గా ఉండేవాడు. మా నాన్నకు రామ్కోఠిలో యూనివర్సల్ ఆటోమొబైల్ స్టోర్ ఉండేది. రైడింగ్ ఆసక్తి బహుశా మా షాప్ వల్లే కలిగిందనుకుంటా! నాకు ఊహ తెలిసినప్పటి నుంచే బైక్స్ రైడ్ చేయడం మొదలుపెట్టా’నంటూ అతనూ తన స్టార్టింగ్ పాయింట్ను గుర్తు చేసుకున్నాడు. పెళ్లి ప్రయాణం.. ‘పరిచయమైన ఏడాదిన్నరకు పెళ్లి చేసుకున్నాం’ అన్నారిద్దరూ!. ‘పెళ్లాయ్యాకే ఏంబీఏ చేశాను. నిజానికి అసలు జర్నీ అంతా అప్పటినుంచే మొదలైంది. శ్యామ్ వెరీ ప్రాక్టికల్ అండ్ అవుట్ స్పోకెన్. వెనకాల ఉన్నాను అనే భరోసా ఇస్తాడు కానీ అన్నీ నేనే చేసుకునేలా చూస్తాడు. మాకు ఫార్చ్యూన్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ ఉంది. దానికి ఆయన ఫౌండర్ అయితే నేను మేనేజింగ్ పార్టనర్ని. కొన్ని వెంచర్స్ని కంప్లీట్గా నాకే వదిలేస్తాడు. ఎంతకష్టమైనా సరే వాటిని నేనే పూర్తిచేయాలి. దాని వల్ల నేనెంతో నేర్చుకున్నాను. మా వర్కర్స్కి మేడం డమ్మీ అనే అపోహ రాకుండా మేడం యాక్టివ్ అనే భయమూ ఏర్పడింది. ఇలా తన దగ్గర నేర్చుకున్నవి, నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయ్’ అని శ్యామ్కి కితాబిచ్చింది. ‘తన దగ్గరా చాలా నేర్చుకున్నాను మల్టీటాస్క్ ఎలా చేయొచ్చో’ అని భార్యకూ కితాబిచ్చాడు శ్యామ్. మెరిట్స్ అండ్ డీమెరిట్స్.. ‘ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అన్నిట్లో పర్ఫెక్ట్ అనే భావనలో మేమిద్దరం లేం’ అంటారు ముక్తకంఠంతో. ‘అసలు నెగటివ్ షేడ్స్ గురించి ఆలోచించం. తనకు కొంచెం కోపమెక్కువ. శ్యామ్ కోపంగా ఉన్నప్పుడు నేను సెలైంట్ అయిపోతాను. అయితే మా ఇద్దరిలో ఎవరి తప్పు ఉన్నా సారీ చెప్పేది నేనే. మా పందొమ్మిదేళ్ల మ్యారీడ్ లైఫ్లో ఆయన ఇప్పటిదాకా సారీ చెప్పలేదు’ అని వసూశ్రీ అంటుంటే ‘ఆమె నేను చెప్పేదాకా ఆగకుండా తనే ముందు చెప్పేస్తుంది’ అన్నాడు శ్యామ్. ‘ఎనీ వే మై వైఫ్ ఈజ్ పర్ఫెక్ట్. కూల్గా ఉండడం తన దగ్గరే నేర్చుకున్నాను’ చెప్పాడు. ‘ తనలో నాకు నచ్చే గుణం అదే. అందరిముందు నాకు కాంప్లిమెంట్ ఇస్తాడు. ఈ రోజు నేనిలా ఉన్నానంటే తనవల్లే అని!’అంది భర్త సుగుణాన్ని ఆస్వాదిస్తూ.‘మా దగ్గర రెండువందల రూపాయలు మాత్రమే ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో ఇప్పుడూ అంతే సంతోషంగా ఉన్నాం’ అని శ్యామ్ అంటుంటే ‘అప్పుడే మా పెళ్లయి పందొమ్మిదేళ్లయిందా అనిపిస్తుంది.. మా సహజీవనం నిన్నమొన్న మొదలైనట్టే ఉంటుంది’ అంటుంది వసూశ్రీ. ఈ అనుబంధానికి ‘నమ్మకం, గౌరవం, స్పేస్..’ అనే మూడు మంత్రాలే కారణం అంటారిద్దరూ! హ్యాపీ రైడ్.. ఈ రైడర్స్ జంట హార్లీ ఓనర్స్ గ్రూప్ (హాగ్) సభ్యులు. హార్లీ డేవిడ్సన్ బైక్పై దేశమంతా చుట్టొచ్చిన ఈ జంట గత జూలైలో ఖజరహో ట్రిప్ వెళ్లొచ్చింది. హాగ్ ఓనర్స్ గ్రూప్ బంజారా చాప్టర్లో శ్యామ్కపూర్ అసిస్టెంట్ డైరక్టర్ గా ఉన్నారు. వీరి బైక్ థీమ్ దక్కనీ ఒడిస్సీ థీమ్. బెస్ట్ బైక్ కేటగిరీ కింద జోనల్, నేషనల్ బెస్ట్ కస్టమైజ్డ్ అవార్డును అందుకున్నారు. ఇంటర్ చదివే కూతురు, ఎయిత్ చదివే కొడుకూ ఉన్నారు వీళ్లకు. ఇప్పటికీ ఏ మాత్రం సమయం దొరికినా బైక్రైడింగ్కు వెళ్లిపోతుందీ జంట. రొటీన్ లైఫ్లోని అలకలు, కినుకలు, వృత్తిజీవితంలోని ఒత్తిళ్లను బ్రేక్ చేసేది ఈ జర్నీయే’ అని చెప్తారు. ఈ జంట ప్రయాణం ఇలాగే హ్యాపీగా సాగాలని కోరుకుందాం!. - సరస్వతి రమ -
సేఫ్టీ రైడ్
ప్రజల్లో సురక్షితంగా బైక్ రైడింగ్ చేయాలనే అవగాహన కలిగిస్తూ సాగుతున్న ‘బైక్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా- నేషనల్ సేఫ్టీ రైడ్’ బుధవారం నగరానికి చేరుకుంది. గత నెల 31న ఢిల్లీలో ప్రారంభమైన ఈ రైడ్ ఇప్పటి వరకు నాలుగు వేల కిలోమీటర్లు ప్రయాణించింది. రుతి స్పోర్ట్స్తో కలిసి ఈ మెగా అవేర్నెస్ రైడింగ్ను చేపట్టారు. ఈ టీమ్లోని మొత్తం 9 మంది సభ్యుల్లో ముగ్గురు మహిళలే కావడం విశేషం. జైపూర్, అజ్మీర్, ముంబై, సూరత్, పూనె, అహ్మాదాబాద్, కొచి, బెంగళూరు తదితర నగరాలను చుట్టివచ్చిన టీమ్కు సిటీలో ఘన స్వాగతం లభించింది. ఇక్కడ నుంచి కోల్కతా వైపునకు దూసుకుపోయింది. -
దొంగ చాటుగా బైక్ నడిపేదాన్ని!
‘‘అమ్మానాన్నలకు నచ్చకపోయినా... మనకు నచ్చినవి మనం దొంగచాటుగా అయినా చేసేస్తుంటాం. అయితే... ఒక్కోసారి అవే జీవితంలో ఉపయోగపడుతుంటాయి’’ అంటూ చిన్నతనంలోని తన బైక్ రైడింగ్ సంఘటనని గుర్తు చేసుకున్నారు కథానాయిక తాప్సీ. ‘‘నాకు బైక్ నడపడం మహా సరదా. చిన్నప్పుడే ధైర్యంగా బైక్ నడిపేసేదాన్ని. కానీ అమ్మానాన్నలకు మాత్రం నేను బైక్ నడపడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. పడిపోతానేమో అని వారి భయం. అందుకే బైక్ జోలికెళ్తే చాలు... చీవాట్లు పెట్టేసేవారు. అయినా సరే.. నా అలవాటు మాత్రం వదులుకోలేదు. దొంగచాటుగా నైనా బైక్ నడిపేసేదాన్ని. ఎప్పుడైనా పొరపాటున బైక్ నడుపుతూ అమ్మానాన్నల కంట పడ్డాననుకోండీ...వాళ్లు కొట్టక ముందే ఏడ్చేసేదాన్ని’’ అంటూ గత స్మృతుల్ని తాప్సీ నెమరువేసుకున్నారు. ఆమె ఇంకా చెబుతూ -‘‘అమ్మానాన్నలకు ఇష్టం లేకపోయినా... ఇష్టంతో నేను బైక్ నేర్చుకోవడం నాకు ఇప్పటికి అక్కరకొచ్చింది. హిందీలో నేను చేసిన ‘చష్మే బద్దూర్’, ‘రన్నింగ్ షాదీ డాట్ కామ్’ చిత్రాల్లో పాత్రల పరంగా నేను బైక్ నడపాలి. చిన్నప్పుడే నేర్చుకుని ఉండటం వల్ల ఈజీగా నడిపేశా. సెట్లో నా స్పీడ్ చూసి యూనిట్ మొత్తం భయపడిపోయేవారు. కానీ బైక్ నడుపుతుంటే నాకు మాత్రం ఏదో తెలీని దర్పం’’ అంటూ తనదైన శైలిలో అందంగా నవ్వేశారు తాప్సీ. -
బైక్ రైడింగ్ బాగుంది
బైక్ రైడింగ్ చాలా బాగుందంటోంది నటి హన్సిక. ఈ సంచలన నటి ఐదు రకాల బైక్లపై రైడింగ్ చేస్తూ ఆడి పాడిందట. ఈ పాట చిత్రంలో హైలెట్ అయిందంటున్నారు ఆ చిత్ర దర్శకుడు. ఇంతకీ హన్సిక అంతగా ఎంజాయ్ చేస్తూ నటించిన పాట ఏ చిత్రంలోనిదనగా మీ ప్రశ్న. యువ నటుడు శివకార్తికేయన్తో హన్సిక రొమాన్స్ చేస్తున్న చిత్రం మాన్ కరాటే. తిరుకుమరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని ఒక పాటను ఇటీవల పొల్లాచ్చిలో హన్సికపై చిత్రీకరించారట. పూర్తి మద్రాసు కల్చర్తో కూడిన ఈ పాటలో హన్సిక బీచ్ రెస్క్యూ బైక్, అమెరికన్ చాపర్ బైక్, సైడ్కార్బైక్, ఎ లా షోలేలతో పాటు మరో 500 సిసి బుల్లెట్, బైక్లలో రైడింగ్ చేస్తూ నటించడం విశేషం అని దర్శకుడు తెలిపారు. ఆసక్తికరమైన నేపథ్యంలో సాగే ఈ పాట కుర్రకారును అమితంగా ఆకర్షిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హన్సిక మాట్లాడుతూ ఈ బైక్ రైడింగ్ సాంగ్లో నటించడం చాలా థ్రిల్లింగ్గా ఉందన్నారు. ఒక్కో బైక్పై రైడింగ్ చేయడానికి ముందుగా శిక్షణ తీసుకున్నట్లు చెప్పారు.