chittooor distirict
-
చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
సాక్షి, చిత్తూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలను బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొగిలిఘాట్ వద్ద శుక్రవారం మధ్యాహ్నాం ఈ ప్రమాదం జరిగింది. అయితే, బస్సు అదుపు తప్పి లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని అంబులెన్స్ల సాయంతో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘాట్ రోడ్లో ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. ఇక, లారీ చిత్తూరు నుంచి ఐరన్ లోడ్తో బెంగళూరు వెళ్తోంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ మనోహర్తో పాటు బస్సులో ప్రయాణీకులు మృతి చెందారు. -
టీడీపీ మైనింగ్ మాఫియా అరాచకం.. క్వారీలో దారుణ హత్య
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో టీడీపీ మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. పచ్చ పార్టీ నేతల కనుసన్నల్లో పలమనేరులో అనధికారికంగా క్వారీల నిర్వహణ జరుగుతోంది. అంతేకాకుండా అక్కడ పనిచేస్తున్న వారిపై దాడులు కూడా జరుగుతున్నాయి.వివరాల ప్రకారం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా పలమనేరు మండలం కొలమాసనపల్లిలో శరత్ కుమార్ అనే వ్యక్తి క్వారీని టీడీపీ నేత ఆక్రమించుకున్నారు. ఇక, అక్కడ క్వారీలో పనిచేస్తున్న సిబ్బందికి రెండు నెలలుగా జీతం ఇవ్వకుండా వారిని వేధింపులకు గురిచేస్తున్నాడు సదరు టీడీప నేత. అంతేకాకుండా క్వారీలో పనిచేస్తున్న చిన్నస్వామి అనే యువకుడిని క్వారీలో చంపిపడేయటం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, ఈ హత్య విషయం పలమనేరు పోలీసు స్టేషన్కు చేరింది. పోలీసు స్టేషన్లో టీడీపీ నేతలు పంచాయతీ పెట్టారు. ఇక, మృతుడు చిన్న స్వామి డెడ్బాడీని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో మృతుడి కుటుంబీకులు, వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అతడిని హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. -
నగరి: జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల
విద్యాదీవెన.. సీఎం జగన్ నగరి పర్యటన అప్డేట్స్ ► నగరి బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. జగనన్న విద్యాదీవెన నిధుల్ని బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు. నగరిలో సీఎం జగన్ కామెంట్లు అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డి అయినా తింటారు. 28 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయ్యాడు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన పేరు చెబితే ఒక్క పథకమైనా కనిపిస్తుందా?. సొంత కొడుకు మీదే చంద్రబాబుకు నమ్మకం లేదు. అందుకే దత్తపుత్రుడికి ప్యాకేజీ ఇచ్చి అరువు తెచ్చుకున్నాడు. చంద్రబాబు జీవితమంతా వెన్నుపోట్లు, అబద్ధాలు, మోసాలు. కుట్రలు, కుతంత్రాలనే నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారు. రెచ్చగొట్టి గొడవలు పెట్టి.. శవరాజకీయాలు చేయాలన్నదే ఆయన ఉద్దేశం. కావాలనే పోలీసులపై రాళ్లు రువ్వించారు. పోలీసులపై కర్ర, బీరు సీసాలతో దాడి చేయించాడు. ఓ పోలీస్కన్ను కూడా పోగొట్టారు. చంద్రబాబు ఢిల్లీలో సీఈసీని కలుస్తాడట. దొంగ ఓట్లు ఆయనే సృష్టించి.. మన మీద ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లాడు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడవడానికి ఏమాత్రం వెనుకడాడని వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి.. ఆయన ఫొటోనే దండం పెడతాడు. ఎన్టీఆర్ నాణేం విడుదల కోసం ఢిల్లీ కూడా వెళ్లాడు. సీఎం జగన్ ప్రసంగం ప్రతి పేద కుటుంబానికి నేటి కంటే రేపు మరింత బాగుండాలి. తల్లిదండ్రుల పేదరికం పిల్లల భవిష్యత్తుకు అడ్డురాకూడదు. విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు. పేద పిల్లలు ఇబ్బంది పడకూడదనే విద్యాదీవెన తీసుకొచ్చాం. ఇది వాళ్ల భవిష్యత్తు మార్చబోయే పథకం. నాలుగేళ్ల కాలంలో ఈ పథకం ద్వారా రూ. 11 వేల మూడు వందల కోట్లు జమ చేశాం. 8 లక్షల 44 వేల 336 మంది మంది తల్లుల ఖాతాలో రూ.680 కోట్లు జమ చేస్తున్నాం. జగనన్న వసతి దీవెన కూడా పేద విద్యార్థలు కోసం అమలు చేస్తున్నాం. మంత్రిరోజా కామెంట్లు ► పేద విద్యార్థులకు సీఎం జగన్ ఉన్నత విద్య అందిస్తున్నారు. విద్యాదీవెన, వసతిదీవెన పథకాలు దేశంలో ఎక్కడా లేవు. విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత సీఎం జగన్ది. ఏపీలో విద్యారంగాన్ని సాక్ష్యాత్తూ ప్రధానే ప్రశంసించారు. జగన్ అంటే జనం.. జనం అంటే జగన్. కాంపౌండర్ కూతురు వైద్య విద్య అభ్యసిస్తుందంటే.. ఆ ఘనత సీఎం జగన్కే దక్కుతుంది. గతంలో చంద్రబాబు పేదింటి పిల్లలను విద్యకు దూరం చేశారు. ► చిత్తూరు కలెక్టర్ సగిలి షన్మోహన్ ప్రారంభోపన్యాసంతో విద్యాదీవెన నిధుల జమ కార్యక్రమం ప్రారంభం ► ప్రారంభమైన విద్యాదీవెన కార్యక్రమం ► నగరిలో విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వేదిక వద్దకు సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడి నేతలతో, లబ్ధిదారులతో ముచ్చటించారు. అక్కచెల్లెళ్లమ్మలతో ఫొటో దిగారు. ఆపై వేదిక వద్ద ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైఎస్సార్కు పుష్ఫనివాళి అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. ► నగరి లో కీలపట్టు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద కు చేరుకున్న సీఎం జగన్. స్వాగతం పలికిన మంత్రులు ఆర్.కే రోజా, ఉషశ్రీ చరణ్, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎమ్మెల్యేలు ఆదిములం, ఏమ్.ఏస్.బాబు, వెంకట్ గౌడ, ఎమ్మెల్సీ భరత్ తదితరులు. ► తిరుపతి రేణిగుంట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో నగరి బయలుదేరిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ► కాసేపట్లో సీఎం జగన్ నగరి చేరుకోనున్నారు. ► రేణిగుంట ఎయిర్పోర్ట్కు చేరుకున్న సీఎం జగన్. మంత్రి పెద్దిరెడ్డి, టీటీడీ చైర్మన్ భూమన, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సుబ్రమణ్యం, శ్రీకాళహస్తి ఎమ్మేల్యే బియ్యపు మధు సూధన్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. ► విద్యాదీవెన కార్యక్రమం కోసం చిత్తూరు జిల్లా నగరి పర్యటనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయల్దేరారు. 📖 ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.15,593 కోట్లు ఖర్చుచేసింది(ఇవాళ్టి రూ.680 కోట్లతో కలిపి). మొత్తం మీద నాలుగేళ్లలో విద్యారంగంపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.69,289 కోట్లు ఖర్చుపెట్టింది. 📖 జగనన్న విద్యాదీవెన కింద.. హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బందిపడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తోంది సీఎం జగన్ ప్రభుత్వం. 📖 జగనన్న విద్యాదీవెన పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టారు. పేద పిల్లలకు ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో.. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సుల నిమిత్తం ఆయా కళాశాలలకు చెల్లించే ఫీజుల మొత్తాన్ని జగన్ సర్కారే భరిస్తోంది. 📖 ఏప్రిల్–జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను సోమవారం సీఎం జగన్ నగరి వేదికగా విడుదల చేయనున్నారు. బటన్ నొక్కి రూ.680.44 కోట్లను 8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేస్తారు. జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా లబ్ధిదారుల ఖాతాలో నిధుల జమ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ చిత్తూరు నగరి వెళ్లనున్నారు. అక్కడి బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం.. ఆయన నిధుల్ని విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తారు. ఈ పర్యటనలోనే నగరిలో సుమారు రూ.31 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కూడా సీఎం జగన్ ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. -
చిత్తూరులో టీడీపీ కార్యకర్తల వీరంగం.. పోలీసులనే రక్తం కారేలా..
పుంగనూరు: చిత్తూరు రోడ్ షోలో చంద్రబాబు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడంతో వారంతా రెచ్చిపోయి ప్రశాంతంగా ఉండే పుంగనూరులో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. రోడ్ షోకు బందోబస్తు నిర్వహించి రక్షణ కల్పించడానికి వచ్చిన పోలీసులపైనే విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. ఇష్టమొచ్చినట్టు రాళ్లు రువ్వారు, వాహనాలకు నిపు పెట్టారు, అక్కడున్న వారంతా టీడీపీ కార్యకర్తల వీరంగాన్ని బెంబేలెత్తిపోయి ఇళ్లల్లోకి వెళ్లి దాక్కున్నారు. పాపం పోలీసులు మాత్రం వీధిలో భాగంగా వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిపై రక్తమోడేలా హింసాత్మక దాడులు చేశారు. అల్లర్ల గురించి పోలీస్ అధికారుల సంఘం ప్రెసిడెంట్ ఉదయ్ మీడియాకు వివరిస్తూ.. టీడీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే దాడులు చేశారన్నారు. పుంగనూరులో ప్రశాంతతకు విఘాతం కలిగించి విధ్వంసం సృష్టించాలనే లక్ష్యంతోనే అల్లర్లు జరిగాయి. వాస్తవానికి వారికి ఆ మార్గంలో రావడానికి అనుమతే లేదు. అయినా కూడా టీడీపీ కార్యకర్తలు ఇదే మార్గాన్ని ఎంచుకుని ఇక్కడికి చొరబడ్దారు. వారు చేసిన దాడుల్లో సామాన్యులతో పాటు పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. చంద్రబాబు రోడ్ షో గురించి ప్రకటించగానే అల్లర్ల సృష్టించాలని వారు ముందే పథకం రచించారు. పథకం ప్రకారమే వారు తమ వెంట ఆయధాలను తెచ్చుకున్నారు. వారు దాడులు చేస్తున్నా ప్రతిదాడి చేయకుండా నచ్చజెప్పే ప్రయత్నం చేసి పోలీసులు సహనాన్ని పాటించారు. ముఖ్యంగా గాయపడిన పోలీసులు ఎంతో సంయమనాన్ని పాటించారన్నారు. తామే దాడి చేసి పోలీసులు తమపై దాడి చేశారంటూ ఎదురు ఆరోపణలు చేస్తుండడం శోచనీయం. పోలీసులు రెచ్చగొట్టారనేది పూర్తిగా అవాస్తవం. మేము పోలీసులం.. మాకు అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా ఒక్కటే. ఎవ్వరికైనా రక్షణ కల్పించడమే మా కర్తవ్యం. మేం చట్టప్రకారం విధులు నిర్వహిస్తున్నాం. శాంతిభద్రతలను కాపాడడమే మా లక్ష్యం. ఎవరి కార్యక్రమాలకైనా విధిగా మేం భద్రతగా కల్పిస్తాం. అది మా బాధ్యతని గుర్తు చేశారు. రక్షణ కల్పించే మాపైనే వారు దాడి చేసి గాయపరిచారు. ఎంతగా అడ్డుకునే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా విధ్వంసం సృష్టించేందుకే ప్రయత్నించారు. తోటి కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవ చేసేందుకు ఉసిగొల్పారు. సంఘటన గురించి తెలియగానే డీజీపీ వెంటనే విచారణకు ఆదేశించారన్నారు. గాయపడిన పోలీసుల్లో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఘటనలో నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తి లేదు. విధి నిర్వహణలో ఆంధ్ర పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి ఘటనల్లో కఠినంగా వ్యవహరించాలి. రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ ఘటనను ఖండిచాలి. ఈ కేసును ప్రత్యేక కోర్టు ద్వారా విచారించాలని నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చూడాలన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఎంతటివారైనా చట్టాన్ని గౌరవించాలి. కిందిస్థాయి వారికి పై స్థాయిలోని వారే చెప్పాలని అన్నారు చిత్తూరు జిల్లా పోలీస్ అధికారుల సంఘం ప్రెసిడెంట్ ఉదయ్. ఇది కూడా చదవండి: పుంగనూరు ఘటనపై విచారణకు డీజీపీ ఆదేశం -
మరో నకిలీ టీడీడీ వెబ్సైట్పై ఎఫ్ఐఆర్ నమోదు
-
నారా లోకేష్ యువ గళానికి జనస్పందన కరువు
సాక్షి, చిత్తూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్రకు జనస్పందన కరువైంది. అట్టర్ ప్లాప్ దిశగా లోకేష్ అడుగులు పడుతున్నాయి. పలమనేరు నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్రకు జనం ఆసక్తి చూపించడం లేదు. వ్యక్తిగత సిబ్బంది మినహా కార్యకర్తలు సైతం పెద్దగా కనిపించడం లేదు. జనాలులేక వెలవెల బోతున్న యువగళం పాదయాత్రకు కార్యకర్తలు సైతం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. విశేషం ఏంటంటే.. కార్యకర్తలకంటే బందోబస్తుకు వచ్చిన పోలీసులు, మీడియా సిబ్బంది సంఖ్యే ఎక్కువగా కనిపిస్తోంది. -
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి
-
కబడ్డీ కోర్టులో రోజా.. ఆటగాళ్లలో జోష్ నింపిన నగరి ఎమ్మెల్యే
తిరుపతి తుడా: జాతీయస్థాయి కబడ్డీ టోర్నమెంట్తో తిరుపతిని క్రీడాపురిగా తీర్చిదిద్దారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి ప్రశంసించారు. శుక్రవారం స్థానిక ఇందిరా మైదానంలో మూడోరోజు కబడ్డీ లీగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని బెస్ట్ ప్లేయర్లకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా తిరుపతి ప్రతిష్ట ఇనుమడించేలా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రానికి క్రీడలతో కొత్త సొబగులు వచ్చాయని తెలిపారు. తెలుగు బాష, సంస్కృతి, సంప్రదాయాలకు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పెద్దపీట వేస్తారని కొనియాడారు. తిరుపతి ఇందిరా మైదానంలో కబడ్డీ లీగ్ పోటీలను ప్రారంభించి మాట్లాడుతున్న ఎంపీ మిథున్రెడ్డి, వేదికపై జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దారుఢ్యానికి దోహదపడుతాయన్నారు. కబడ్డీ పోటీలతో తిరుపతిలో పండుగ వాతావరణ ఏర్పడిందని తెలిపారు. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ క్రీడ కబడ్డీకి పూర్వ వైభవం తీసుకురావాలన్నదే లక్ష్యమన్నారు. ప్రతిష్టాత్మక టోర్నీని విజయవంతంగా నిర్వహించడం వెనుక తిరుపతి ప్రజలు, వ్యాపారులు, ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల సహకారం ఉందని తెలిపారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ అత్యున్నతంగా ప్రోటీలను నిర్వహించడం ఎమ్మెల్యే భూమనకే చెల్లిందన్నారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, మేయర్ శిరీష, కమిషనర్ గిరీష, ఆంధ్ర కబడ్డీ సంఘం కార్యదర్శి యలమంచి శ్రీకాంత్, అదనపు కమిషనర్ హరిత పాల్గొన్నారు. క్రీడలతో ఆరోగ్యం.. ఆనందం జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, టీటీడీ ఈఓ కేఎస్ జవహర్రెడ్డి తిలకించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ జాతీయ క్రీడలను తిరుపతిలో నిర్వహించడం గర్వకారణమన్నారు. క్రీడలతో ఆర్యోగం, ఆనందం దక్కుతుందని తెలిపారు. ఈఓ జవహర్రెడ్డి మాట్లాడుతూ కబడ్డీ పోటీలకు టీటీడీ పూర్తి సహకారం అందించిందన్నారు. క్రీడాకారులకు తమ వంతుగా వసతి సౌకర్యం కల్పించామని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే రోజా క్రీడాకారులను పరిచయం చేసుకుని వారిలో జోష్ నింపేందుకు ఆటవిడుపుగా కబడ్డీ ఆడారు. టీటీడీ జేఈఓ సదా భార్గవి, అర్జున అవార్డు గ్రహీత హోన్నప్ప గౌడ, మేయర్శిరీష, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, అభినయ్రెడ్డి, ఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథ్రావు తదితరులు పాల్గొన్నారు. -
Kuppam: చంద్రబాబు అడగగానే రూ.కోటి
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఏపాటి విలువ ఉండేదో అందరికీ తెలిసిందే. శాసనసభ సమావేశాల్లో మాట్లాడే అవకాశం మొదలు.. విపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధుల విడుదల వరకు పూర్తిస్థాయిలో వివక్ష కొనసాగింది. ఇప్పుడు ఎన్నికల వరకే రాజకీయాలు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికార, ప్రతిపక్ష పార్టీలనే భేదం చూడబోం అని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ దిశగానే పాలన సాగిస్తున్నారు. అందులో భాగంగానే ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖలు రాయగానే కుప్పం నియోజకవర్గానికి రూ.కోటి నిధులు విడుదలయ్యాయి. పనులు కూడా మొదలయ్యాయి. సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున నిధులు కేటాయించడం ఆనవాయితీ. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు విడుదల ఓ ప్రçహసనంగా ఉండేది. 2014–19 కాలంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్(ఎస్డిఎఫ్) కింద బాబు తన ఇష్టానుసారం నిధులు విడుదల చేయించారు. కేవలం టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకే నిధులు మంజూరయ్యాయి.అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పలుమార్లు అడిగినా ప్రయోజనం లేకపోయింది. కానీ రెండేళ్ల కిందట వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పథకం పేరును ముఖ్యమంత్రి అభివృద్ధి నిధులు (సీఎండీఎఫ్)గా మార్పు చేసి.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకూ నిధులు విడుదల చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలిచ్చారు. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలనే తేడా లేకుండా ఆయా నియోజకవర్గాల్లో పనుల కోసం అడిగిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేకూ నిధులు మంజూరు చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఆ క్రమంలోనే చంద్రబాబు కోరిన వెంటనే కుప్పానికి రూ.కోటి నిధులు మంజూరు చేశారు. బాబు లేఖలు రాయగానే రెండు దఫాలుగా నిధులు 2020 మే 16న సీఎండీఎఫ్ కింద నిధులు మంజూరు చేయాలని చంద్రబాబు మొదటి లేఖ రాశారు. ఆ లేఖ అందిన వెంటనే అప్పటి కలెక్టర్ నారాయణభరత్గుప్త రూ.70.85 లక్షలను విడుదల చేశారు. ఆ నిధులతో శాంతిపురం, గుడుపల్లి, కుప్పం, రామకుప్పం మండలాల్లో ఆర్డబ్ల్యూఎస్ ద్వారా 32 తాగునీటి పనులు చేపట్టారు. ఆ తర్వాత 2020 సెప్టెంబర్ మూడో తేదీన బాబు లేఖ రాయడంతో అధికారులు రూ.29.15లక్షలు విడుదల చేశారు. మొత్తంగా రూ.కోటి నిధులతో ఆయా మండలాల్లోని గ్రామాల్లో ప్రధానంగా తాగునీటి పనులకు శ్రీకారం చుట్టారు. ఎన్నో ఏళ్లుగా గుక్కెడు నీటికి నోచుకోని జనం సంబరాలు చేసుకున్నారు. రాజకీయాలకతీతంగా కుప్పం అభివృద్ధి 30 ఏళ్లుగా వెనుకబడిన కుప్పం నియోజకవర్గ అభివృద్ధి ఇన్నేళ్లకు గాడిన పడింది. రాజకీయాలకతీతంగా అన్ని నియోజకవర్గాలనూ ప్రగతిబాట పట్టించాలనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయం మేరకు రెండేళ్లలోనే నియోజకవర్గ స్వరూపం మారిపోయింది. పార్టీలకతీతంగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికీ అందుతున్నాయి. కేఆర్జే భరత్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తీరిన తాగునీటి సమస్య వర్షాలు సక్రమంగా లేకపోవడంతో గ్రామంలోని తాగునీటి బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. సుమారు 150కి పైగా కుటుంబాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.12 లక్షల వ్యయంతో మూడు బోర్లు వేయించారు. ఇప్పుడు తాగునీటి సమస్య పరిష్కారమైంది. ఈ ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటాం. సురేష్, కృష్ణదానపల్లె, కుప్పం మండలం -
‘వాలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు తప్పు పట్టడం సిగ్గుచేటు’
సాక్షి, చిత్తూరు: ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో ఆదర్శవంతంగా వాలంటీర్లు నిలుస్తున్నారని కొనియాడారు. ఈ మేరకు ఎస్ఆర్ పురంలో ప్రభుత్వ పథకాలపై వాలంటీర్లతో నారాయణస్వామి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి పథకాన్ని అర్హులకు అందిస్తున్నారని ప్రశంసించారు. అలాంటి వాలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు తప్పు పట్టడం సిగ్గుచేటన్నారు. మంచి కార్యక్రమాలు ఏవి జరిగిన చంద్రబాబుకు గిట్టవని దుయ్యబట్టారు. చదవండి: ఏపీలో కొత్తగా 8,239 కరోనా కేసులు -
ప్రజాప్రతినిధులు బాధ్యతగా ఉండాలి: చెవిరెడ్డి
-
శ్రీకాళహస్తిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ
-
కుప్పం లో జరుగుతున్నా అభివృద్ధి బాబు కి కనిపించలేదా ?
-
దేవుడే అస్త్రమా.. ఇదేం రాజకీయం..?
-
చిత్తూరు జిల్లా: ఏకగ్రీవ సర్పంచ్లు వీరే!
సాక్షి, చిత్తూరు: పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ తరువాత చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాలు ఊపందుకున్నాయి. రామచంద్రా పురం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే విధంగా... నారాయణవనం మండలం లోని 19 పంచాయితీలలోని ఐదు పంచాయతీల్లో కూడా వైఎస్సార్ సీపీ మద్దతుదారులే ఏకగ్రీవం కావడం విశేషం. అంతేగాక పూతలపట్టు నియోజకవర్గం యాదమర్రి మండలంలోని పది గ్రామ పంచాయితీలలో కూడా ఇదే తరహాలో ఏకగ్రీవాలు జరిగాయి.(చదవండి: వైఎస్సార్ జిల్లా: ఏకగ్రీవాలు ఇవే!) ఏకగ్రీవ పంచాయతీలు రాయల చెరువు-మాదాసు మురగదాస్ సి. రామాపురం-సుబ్రమణ్యం రెడ్డి కొత్త వ్యాప కుప్పం-ఇస్మాయిల్ రెడ్డి నారాయణవనం మండలం నారాయణవనం టౌన్- శారద భీముని చెరువు- మురుగేశన్, బొప్పరాజుపాళ్యం- మునికుమారి, కసింమిట్ట- శశికళ, తిరువట్యం- నాగూర్ పూతలపట్టు నియోజకవర్గం యాదమర్రి మండలం కొత్త పాలెం- జి. లోకేష్ మోదం పల్లి- ఎం. సుబ్బులు బొమ్మ సముద్రం- వి. రఘు చిన్న కాలపల్లి-మనోరంజిని ఎం పైపల్లి- జమున పూర్తి మర్ది- పి. సుశీలమ్మ కొత్తపల్లి- కె. బాలాజీ మడి కొత్తపల్లి- కవిత పొలకల- వై. వాసంతి ఇరువారం పల్లి- కె. సులోచన ఇక పూతలపట్టు పూతలపట్టు నియోజకవర్గంలోని తవణంపల్లి మండలంలోని 32 గ్రామ పంచాయతీలకు గాను 12 మంది సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో 11 మంది సర్పంచులు వైఎస్సార్ సీపీ మద్దతుదారులు కాగా, ఒకరు టీడీపీకి మద్దతుదారుగా ఉన్నారు. నగిరి మండలం వి.కె.ఆర్.పురం సర్పంచిగా నందిని ఏకగ్రీవం వేలవాడి- చంద్రకళ బుగ్గ అగ్రహారం- రవికుమార్ ఆయనంబాకం- శేఖర్ విజయపురం- మురళీకృష్ణ విజయాపురం మండలం మాధవరం- మమత శ్రీహరిపురం-జ్యోతి కోసలనగరం- ఉమా మహేశ్వరి -
అంతులేని విషాదం: చంటిబిడ్డతో కుప్పకూలిపోయింది
కలకడ : భర్త అంత్యక్రియలకు ఆరురోజుల పసికందుతో యువతి హాజరు కావడం కలకడలో ఆదివారం విషాదాన్ని నింపింది. ప్రేమించి, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న యువతిని విధి చిన్నచూపు చూసింది. ప్రమాదంలో గాయపడిన భర్త ఆరోగ్యంగా ఇంటికి చేరుకుంటాడని ఎదురు చూసిన భార్య కు విగతజీవుడై రావడంతో చంటిబిడ్డతో కుప్పకూలిపోయింది. కలకడవాసులను కళ్లు చెమర్చిన ఈ ఘటన వివరాలు .. కలకడ ఇందిరమ్మ కాలనీకి చెందిన పి.గంగాధర (25) శుక్రవారం రాత్రి ద్విచక్రవాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురికాగా, శనివారం తిరుపతిలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే దుఃఖాన్ని మింగుకుని తల్లిదండ్రులు ఈ విషయం కోడలు మంగమ్మతో చెప్పకుండా దాచారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నాడని నమ్మబలికారు. ఆదివారం భర్త మృతదేహం ఇంటికి చేర డంతో మంగమ్మ చంటిబిడ్డతో కుప్పకూలిపోయింది. భర్త లేని జీవితం తనకు వద్దంటూ ఆమె విలపించడం అక్కడి వారిని కంటతడిపెట్టించింది. ఆరు రోజుల పసికందుతో భర్త అంత్యక్రియల్లో పాల్గొంది. మూడు కిలోమీటర్లు నడచి సొమ్మసిల్లి పడిపోయింది. మృతదేహాన్ని చెల్లెలు భవాని శ్మశానం వరకు నలుగురిలో ఒకరుగా మోసింది. ఈ దృశ్యాలు కలకడవాసుల కలచివేశాయి.(చదవండి: పాపం ఆమెకు తెలియదు.. భర్త శవమై వస్తున్నాడని..!!) వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి రైలు నుంచి జారిపడి వృద్ధుడు.. చంద్రగిరి: మండలంలోని ముంగళిపట్టు వద్ద రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందాడు. అతనికి సుమారుగా 70 ఏళ్లు ఉంటాయని, చంద్రగిరి–ముంగళిపట్టు మధ్య రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి ఉంటాడని పాకాల రైల్వే హెడ్కానిస్టేబుల్ గౌరీశంకర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు పాకాల రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు. శ్రీసిటీలో ఇంజినీర్ సత్యవేడు: శ్రీసిటీలోని ఈఎంపీ రోడ్డు వద్ద ఆదివారం లారీ ఢీకొని జమిల్ కంపెనీ ఇంజినీర్ ఎస్ మహ్మద్హుసేన్(30) మృతి చెందారు. రాయచూర్(కర్ణాటక)కు చెందిన ఎస్.మహ్మద్హుసేన్ శ్రీసిటీలోని జెమిల్ కంపెనీలో ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ఆదివారం తడలో స్నేహితుని ఇంటికి బైక్పై వెళ్లి తిరిగి వస్తుండగా ఈఎంపీ రోడ్డు వద్ద లారీ ఢీకొంది. మహ్మద్ హుసేన్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని సత్యవేడు క మ్యూనిటీ వైద్యశాలకు తరలించారు. భార్య రాయచూర్లో ఉంటోంది. ఏడాది కిందటే వివాహమైంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అరుణ్కుమార్రెడ్డి తెలిపారు. వేట కొడవలితో వీరంగం పెద్దతిప్పసముద్రం: మండలంలోని మద్దయ్యగారిపల్లె పంచాయతీ పులగంటివారిపల్లెలో ఓ వ్యక్తి వేటకొడవలితో ఆదివారం సాయంత్రం వీరంగం సృష్టించడం కలకలం రేపింది. గ్రామానికి చెందిన హేమంత్కుమార్ తన పొలంలోని పంటను ఇతరుల మూగజీవాలు మేశాయని ఆ గ్రహం చెందాడు. వేటకొడవలితో గ్రామానికి చెందిన సుబ్బమ్మ, వెంకటనారాయణ, గణేశ్, రమణ, శ్రీనివాసులు, హరిపై దాడి చే సి తీవ్రంగా గాయపరిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన గణేశ్(22)ను వైద్యం కోసం బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రతి మహిళ శక్తి స్వరూపిణి: ఎమ్మెల్యే రోజా
సాక్షి, చిత్తూరు : చెడుపై పోరులో ప్రతి మహిళ దుర్గాదేవిగా మారాలని ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆకాంక్షించారు. ప్రతి మహిళా ఓ శక్తి స్వరూపిణి అని ఆమె అన్నారు. దసరా పండుగను ఎమ్మెల్యే రోజా తన నివాసంలో జరుపుకున్నారు. దుర్గాదేవి పూజలో పాల్గొన్న ఆమె రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. రాజకీయంగా, సామాజికంగా మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఆయన పరిపాలనలో మహిళలు అందరూ నిజమైన విజయదశమి జరుపుకుంటున్నారన్నారు. సీఎం జగన్ పాలనలో మహిళలకు పూర్తి రక్షణ ఉందన్నారు. ఆయన నేతృత్వంలో పని చేయడానికి తాను నిజంగా గర్వపడుతున్నానని అన్నారు. చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడానికి మాత్రమే ఉంటారని ఎద్దేవా చేశారు. (అంతిమ విజయం మంచినే వరిస్తుంది.. ) -
టిక్టాక్ దంపతుల ఆత్మహత్య!
సాక్షి, గుంటూరు : బెల్లంకొండలో శుక్రవారం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మనస్తాపంతో నవ దంపతులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పవన్, శైలజ టిక్టాక్ ద్వారా పరిచయమయ్యారు. నెల క్రితమే వారు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. శైలజది చిత్తూరు కాగా, పవన్ స్వస్థలం మంగళగిరి. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడంతో శైలజ తల్లిదండ్రులు పవన్పై కేసు నమోదు చేశారు. దీంతో మనస్తాపం చెందిన నవదంపతులు ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. చదవండి: ప్రభుత్వ ఉద్యోగ దంపతుల ఆత్మహత్య -
చిత్తూరి చిన్నోడి కోసం యూకే ఎంపీలు క్యూ
లండన్: సాయం చేయాలనుకునే వారికి ఎదుటి వారి కష్టాలు చూసి స్పందించే మనసు ముఖ్యం. ఇతరులకు మంచి చేయాలనే ఆలోచన ఉంటే చాలు.. ఏదో ఓ రకంగా మనం తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. దీనికి వయసుతో పని లేదు. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాడు ఓ ఐదేళ్ల చిన్నారి. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. వైరస్ కట్టడి కోసం విధించిన లాక్డౌన్తో ఎందరో రోడ్డున పడ్డారు. తినడానికి తిండి లేక నానా తిప్పలు పడ్డారు. ఇలాంటి కష్టకాలంలో అన్నార్తులను ఆదుకునేందుకు ఎందరో ముందుకు వచ్చారు. తోచిన సాయం చేశారు. మాంచెస్టర్లో ఉంటున్న చిత్తూరు జిల్లాకు చెందిన అనీశ్వర్ కుంచాలా అనే ఐదేళ్ల చిన్నారికి కూడా సాయం చేయాలనే కోరిక కలిగింది. తనేమో ఇంకా చిన్న పిల్లాడే. సాయం చేయాలనుకుంటే తన పిగ్గి బ్యాంక్లో ఉన్న డబ్బును ఇచ్చేసి ఊరుకోవచ్చు. కానీ అనీశ్వర్ భారీ మొత్తంలో సాయం చేయాలనుకున్నాడు. (ఇవి ఎవరికి ఇవ్వాలో సలహా ఇవ్వండి: ఉపాసన) ఈ క్రమంలో సర్ థామస్ మూర్ అనే 100 ఏళ్ల వృద్ధుడు అనీశ్వర్కు ఓ మార్గం చూపించాడు. యూకేలో కరోనాతో బాధపడేవారికి వైద్యం అందించడం కోసం 100 ఏళ్ల వయసులో థామస్ మూర్ ఓ సర్కిల్ చుట్టు 100 రౌండ్లు నడిచి విరాళాలు సేకరించాడు. ఈ సంఘటనతో స్ఫూర్తి పొందిన అనీశ్వర్.. మరో 60 మంది పిల్లలతో కలిసి ‘లిటిల్ పెడలర్స్ అనీశ్వర్ అండ్ ఫ్రెండ్స్’ పేరుతో మేలో ఓ బృందాన్ని ఏర్పాటు చేశాడు. వీరంతా కలిసి దాదాపు 3200 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కి కరోనా బాధితుల కోసం విరాళాలు సేకరించాడు. ఇలా మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు సాధించాడు. ఈ మొత్తాన్ని కరోనాపై పోరు సాగిస్తున్న భారత్కు అందించాడు. ప్రస్తుతం యూకేకు సాయం చేయడం కోసం క్రికెట్ చాంపియన్షిప్ ప్రారంభించాడు అనీశ్వర్. (అందం.. సేవానందం..) ప్రస్తుతం ఈ చిన్నారి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ, ఏపీ బ్రిటీష్ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ అనీశ్వర్ ఆశయాన్ని తెగ ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిన్నారి యూకేలో సెలబ్రిటీ అయ్యాడు. బ్రిటీష్ రాజకీయ నాయకులు అనీశ్వర్ను కలిసి.. ప్రశంసిస్తున్నారు. వారింగ్టన్ సౌత్ ఎంపీ ఆండీ కార్టర్ అనీశ్వర్ ఆశయాన్ని మెచ్చుకున్నారు. మరో ఎంపీ షార్లెట్ మేనేజర్ ఆగస్టు 6న అనీశ్వర్ను కలవనున్నారు. Ever since @UttaraVarmaTOI's article about 5 year old #Telugu boy Aneeshwar's fundraising for COVID I've talked about him. My friend @poonamkaurlal asked to say Namaste so Telugu diaspora contact, @uday_nagaraju, fixed a wonderful chat. Bike ✔ Now on to 🏏 4 Lakhs & counting 🙏 pic.twitter.com/mJ0Nt3ZIOo — Dr Andrew Fleming (@Andrew007Uk) June 28, 2020 -
కరోనాను జయించిన 16 నెలల బాలుడు
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన 16 నెలల బాలుడు కరోనా వైరస్ను జయించాడు. తండ్రి, తల్లితో పాటు 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉన్న ఆ బాలుడు శుక్రవారం డిశ్చార్జ్ అయ్యాడు. తిరుపతి స్విమ్స్ ఉద్యోగి అయిన బాలుడి తండ్రికి తొలుత కరోనా వైరస్ సోకగా, ఆ తర్వాత ఇంట్లో వారికి సోకింది. దాంతో వారంతా క్వారంటైన్లోకి వెళ్లి చికిత్స తీసుకున్నారు. కాగా, పిల్లాడు ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన చెందారు. కాగా, ఆ బాలుడు కరోనా నుంచి కోలుకోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ రోజు నెగటివ్ రిపోర్ట్స్ రావడంతో బాలుడితో పాటు తల్లి, తండ్రిని డిశ్చార్జ్ చేశారు. (తమ్ముడి మృతితో ఆగిన ఇద్దరక్కల గుండెలు! -
స్వీయ నియంత్రణే మందు
-
స్పందనపై నమ్మకాన్ని పెంచండి
‘‘ స్పందన కార్యక్రమంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలి. అర్జీదారులకు చిరునవ్వుతో స్వాగతం పలుకుతూ వినతులు స్వీకరించి, వాటిని పరిష్కరించడం అధికారుల బాధ్యత. అర్జీదారులకు సత్వర పరిష్కారం చూపడమే లక్ష్యం కావాలి. స్పందన కార్యక్రమానికి ప్రజలు ఎన్నో ఆశలతో వస్తారు. వారి సమస్యలకు అధికారులు పరిష్కారం చూపగలిగితే ఎంతో సంతో షిస్తారు’’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ పేర్కొన్నారు. శుక్రవారం ఎస్వీ యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో స్పందనపై చిత్తూరు, వెఎస్సార్ కడప జిల్లాల పరిధిలోని ఉన్నతాధికారులకు ప్రాంతీయ స్థాయి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, ప్రత్యేకాధికారి డాక్టర్ హరికృష్ణ, రాష్ట్ర మున్సిపల్ అడ్మిని్రస్టేషన్, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ విజయ్ కుమార్ సూచనలు ఇచ్చారు. మధ్యాహ్నం బృంద చర్చ నిర్వహించారు. అధికారులు పలు అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. యూనివర్సిటీ క్యాంపస్ : స్పందనలో వచ్చిన ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారాలను చూపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోగ్యరాజ్ అధికారులకు సూచించారు. తిరుపతిలో శుక్రవారం నిర్వహించిన ప్రాంతీయ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్పందన కార్యక్రమానికి అర్జీలు సమరి్పంచేందుకు వచ్చే ప్రజలతో అధికారులు మర్యాదపూర్వకంగా మెలగాలని, వారి అర్జీలను స్వీకరించడంతో పాటు రసీదులను అందజేయాలని తెలిపారు. అర్జీలపై విచారణ జరిపి వాటిని వెబ్సైట్లో పెట్టాలని సూచించారు. తాము ఇప్పటికే శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ప్రాంతీయ సదస్సులు నిర్వహించి అధికారులకు నాణ్యమైన స్పందన జరిపేలా శిక్షణ ఇచ్చామన్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం తిరుపతిలో స్పందనపై చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల పరిధిలో ప్రాంతీయ స్థాయి వర్క్షాప్ను నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే వారం నుంచి స్పందన మెరుగ్గా ఉండేలా చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. హాజరైన అధికారులు, (ఇన్సెట్లో) మాట్లాడుతున్న సీఎం స్పెషలాఫీసరు రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ విజయ్కుమార్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమాన్ని కలెక్టర్లు మానిటర్ చేసుకుంటూ ఉండాలన్నారు. అర్జీలను తిరస్కరించే సమయంలో ఆలోచించి చేయాలన్నారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి 45,665 ఫిర్యాదులు వస్తే అందులో 8,239 ఫిర్యాదులు తిరస్కరింపబడ్డాయన్నారు. వైఎస్సార్ జిల్లాకు సంబంధించి 49,131 సమస్యలు వస్తే 5,476 సమస్యలు తిరస్కరించారని చెప్పారు. సీఎం ప్రత్యేక అధికారి డాక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ స్పందన కార్యక్రమానికి వస్తున్న అర్జీలు చాలావరకు చిన్నచిన్న సమస్యలేనని, వీటిని సకాలంలో పరిష్కరించగలిగితే ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందని చెప్పా రు. అయితే చాలా మంది అధికారులు స్పందనలో వచ్చే అర్జీలను పరిశీలించడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా మాట్లాడుతూ స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పలు సలహాలు, సూచనలు వస్తుంటాయని వాటిని స్వీకరించాలని చెప్పా రు. అధికారులు వివిధ రకాల పనుల్లో ఉన్నప్పటికీ, స్పందనకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వైఎస్సార్ జిల్లా జాయింట్ కలెక్టర్ గౌతమి మాట్లాడుతూ స్పందనపై నాణ్యమైన పరిష్కారం ఉండాలన్నారు. స్పందనలో ఎక్కువగా భూ సమస్యలు, ఇంటి పట్టాల మంజూరు, పెన్షన్లు మంజూరు చేయాలని వినతులు వస్తున్నాయని తెలిపారు. చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల అధికారులకు స్పందన నిర్వహణపై గ్రూప్ డిస్కషన్ నిర్వహించారు. రెవెన్యూ శాఖ జాయింట్ సెక్రటరీ వెట్రిసెలి్వ, డీఐజీ రాజశేఖర్ బాబు, చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కండేయులు, జేసీ– 2.చంద్ర మౌళి, ట్రైనీ కలెక్టర్ çపృధ్వీతేజ్, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ గిరీష, మదనపల్లె సబ్–కలెక్టర్ కీర్తి చేకూరి, తిరుపతి,చిత్తూరు ఆర్డీవోలు కనక నరసారెడ్డి, సి.రేణుక, డీఆర్వో విజయ చందర్, మునిసిపల్ కమిషనర్లు, జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. గ్రూప్ డిస్కషన్ విజయవంతం ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో శుక్రవారం స్పందన కార్యక్రమంపై నిర్వహించిన వర్క్షాప్లో అధికారులకు నిర్వహించిన గ్రూప్ డిస్కషన్ విజయవంతమైందని సీఎం స్పెషలాఫీసర్ హరికృష్ణ చెప్పారు. అధికారులు పలు అంశాలు తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. తమ దృష్టికి వచ్చిన అంశాలపై చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ అడ్మిని్రస్టేషన్ కమిషనర్ విజయ్కుమార్ మాట్లాడుతూ ఈ వర్క్షాప్ అన్ని స్థాయిల్లో జరగాలని తెలిపారు. చెవిరెడ్డికి సీఎంవో అధికారుల కితాబు తిరుపతి రూరల్ : రాష్ట్రంలోనే వినూత్నంగా, ఆదర్శవంతంగా స్పందన కార్యక్రమాన్ని చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు కితాబు ఇచ్చారు. శుక్రవారం ఎస్వీ యూనివర్సిటీలో స్పందన కార్యక్రమంపై అధికారులకు నిర్వహించిన ప్రాంతీయ స్థాయి వర్క్షాపులో ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి సాల్మన్ ఆరోగ్యరాజ్, స్పందన కార్యక్రమం రాష్ట్ర కో–ఆర్డినేటర్, ముఖ్యమంత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ హరికృష్ణతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో మండల స్థాయిలో నిర్వహించే స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీదారులను కేవలం బాధితులుగా, ఫిర్యాదుదారులుగా కాకుండా, అతిథులుగా చూస్తూ వారికి టీ, స్నాక్స్తో పాటు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నారని సీఎంవో అధికారులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అందుకోసం ఎమ్మెల్యే రూ.7 లక్షల సొంత నిధులను సైతం అందించటం అందరికీ ఆదర్శనీయమని ప్రశంసించారు. స్పందన కార్యక్రమం నిర్వాహణలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా చెవిరెడ్డి ముందుకు సాగుతున్నారని, ఇదే స్ఫూర్తితో అన్ని నియోజకవర్గాల్లో చేపడితే బాగుంటుందని సూచించారు. -
పారదర్శకంగానే గ్రామ సచివాలయ నియామకాలు
సాక్షి, చిత్తూరు అర్బన్: జిల్లాలో జరగనున్న గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల భర్తీ పారదర్శకంగా జరుగుతుందని, ఇందులో ఎలాంటి సందేహాలూ వద్దని చిత్తూరు ఎస్పీ చింతం వెంకట అప్పలనాయుడు స్పష్టం చేశారు. ఈ పోస్టుల్లో అక్రమాలకు, దళారులకు తావుండకూడదని ఇ ప్పటికే ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు స్వయంగా పర్యవేక్షిస్తున్నారన్నారు. కొందరు వ్యక్తులు ప్రముఖలను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో సచివాలయ పోస్టులపై దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తప్పుడు పోస్టులు పెడుతున్న వారిని గుర్తించడానికి ఓ బృందాన్ని నియమించామన్నారు. వాట్సప్, ఎఫ్బీ గ్రూపుల్లో ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే అడ్మిన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల నియామకం జరుగుతుందని, ప్రతి పరీక్ష కేంద్రం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పోస్టులు ఇప్పిస్తామని నమ్మించే ప్రయత్నం చేసినా, తప్పుడు ప్రచారాలు ట్రోల్ చేసినా డయల్–100, పోలీస్ వాట్సప్ నెంబరు– 9440900005కు ఫిర్యాదు చేయాలని కోరారు. -
పర్యావరణాన్ని పరిరక్షిస్తూ.. పారిశ్రామిక కారిడార్
అవినీతి అక్రమాలకు తావు లేకుండా.. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ నూతన పారిశ్రామిక కారిడార్కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా భూసేకరణకు ప్రయత్నాలు ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో భూ సేకరణలో పెద్దఎత్తున అవినీతి అక్రమాలు చోటుచేసుకోవడంతో పాత విధానానికి స్వస్తిపలికి.. నూతన పారిశ్రామిక విధానానికి కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు, రహదారి సౌకర్యం, రైల్వే మార్గం, నీటి సౌకర్యం, ఆకాశ మార్గంలో రాకపోకలకు అనుకూలంగా రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్ర యం, జిల్లాకు అతి సమీపంలో సముద్రతీర ప్రాంతం ఉండటంతో పారిశ్రామిక వేత్తలు పెద్ద ఎత్తున పెట్టుబడులతో రావడానికి ఆసక్తిచూపుతున్నారు. సాక్షి, తిరుపతి: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు, నీటి సరఫరాకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, బుచ్చినాయు డు కండ్రిగ మండలాల పరిధిలోని మొ త్తం 34 గ్రామాల్లో విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతంగా గుర్తించినట్లు తెలిసింది. అందుకు అవసరమైన భూముల సేకరణకు జిల్లా అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. కలెక్టర్ నారాయణ భరత్గుప్త ఆదేశాల మేరకు తిరుపతి ఆర్డీఓ కనకనరసారెడ్డి ఆధ్వర్యంలో 40 మందితో కూడిన బృందం క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. ఈ బృందాన్ని ఉత్తర, దక్షిణ విభాగాలుగా విభజించారు. ఉత్తరంలో 11వేల ఎకరాలు, దక్షిణంలో 13వేల ఎకరాలను సేకరించనున్నారు. పర్యావరణానికి ముప్పు లేకుండా జాగ్రత్తలు పర్యావరణానికి ముప్పు వాటిల్ల్ల కుండా ఎక్కడా చెరువుల జోలికి వెళ్లకుండా జనావాసానికి ఎటువంటి ఆటం కాలూ లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. అదేవిధంగా రెండు పంటలు పండే భూములను కూడా తీసుకోవద్దని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు. రెండు పంటలు పండే భూములకు కండలేరు జలాశయం నుంచి 6 టీఎంసీల నీటిని సరఫరా చేసేం దుకు ప్రభుత్వ యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. భూములు ఇచ్చే రైతులకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం రూ.1,507 కోట్లు కేటాయించినట్లు ఆర్డీఓ కనకనరసారెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో పరిహారం పంపిణీలో జరిగిన అవకతవకల నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం నేరుగా రైతులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించనుంది. భూములకు సంబంధించిన పత్రాలు పరిశీలించి, క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన తర్వాతే పరిహారం పంపిణీ చెయ్యనుంది. దీంతో పరిహారం పంపిణీలో అవకతవకలు జరిగే అవకాశాలు ఉం డవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు పూర్తయితే శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు దొరికే పరిస్థితులు ఉన్నాయి. సీఎం సాహసోపేత నిర్ణయం స్థానికులకు 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చట్టం చెయ్యడం సాహసోపేత నిర్ణయం. సీఎం తీసుకున్న నిర్ణయంతో నియోజకవర్గంలో అనేకమంది నిరుద్యోగ యువతకు ఎంతో మేలు చేకూరనుంది. ముఖ్యంగా వారి కుటుం బాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. – బియ్యపు మధుసూదన్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే -
వ్యవ‘సాయం’ కరువై..అప్పులే దరువై..
నేల తల్లినే నమ్ముకుని రెక్కలు ముక్కలు చేసుకున్నాడు. కష్టాల సేద్యంలో అప్పులే దిగుబడి అయినా గుండె దిటవు చేసుకున్నాడు. ఏదో ఒక రోజు తన ఇబ్బందులు తొలగిపోతాయనే నమ్మకంతో వ్యవసాయానికి అప్పులు చేస్తూ వచ్చాడు. చివరకు అప్పుల మోత పెరిగి, రుణదాతల ఒత్తిళ్లు తీవ్రం కావడంతో కుంగిపోయాడు. పురుగుల మందును ఆశ్రయించాడు. తాను నమ్ముకున్న భూమాత ఒడిలోనే తుదిశ్వాస విడిచాడు. సాక్షి, చౌడేపల్లె/ చిత్తూరు: అప్పులు తీర్చలేక పురుగుల మందుతాగి రైతు బలవన్మరణం చెందిన విషాద సంఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది. వివరాలు.. దిగువపల్లె పంచాయతీ భవానీ నగర్కు చెందిన ఏ.దొరస్వామినాయుడు(43) నిరుపేద రైతు. అతనికి పక్షిరాజపురానికి సమీపంలో పొలం ఉంది. రెక్కలు ముక్కలు చేసుకుని వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించేవాడు. తనకున్న పొలంలో నాలుగేళ్ల కాలంలో నాలుగు బోర్లు వేశాడు. ఇందు కోసం రూ.4లక్షలు అప్పు చేశాడు. అలాగే ఇతరుల వద్ద వడ్డీకి కూడా రుణాలు తీసుకున్నాడు. 1000–1050 అడుగుల లోతుతో బోర్లు వేసినా ఆశించిన ఫలితం శూన్యం. ఇటీవల వేసిన బోరులో అరకొరగా నీళ్లు రావడంతో ఆ గంగనే నమ్ముకున్నాడు. పంట బాగా పండితే అప్పులు తీర్చవచ్చనే కొండంత ఆశతో మళ్లీ లక్ష రూపాయలకు పైగా ఖర్చుచేసి టమాట పంట సాగు చేశాడు. అంతేకాకుండా ఈ ఏడాది కృష్ణమూర్తి అనే వ్యక్తిని వ్యవసాయంలో భాగస్వామిగా చేసుకుని ఇరు కుటుంబాల మహిళల నగలు బ్యాంకులో తాకట్టు పెట్టి, వ్యవసాయానికి రూ.85వేలు పంట రుణం తీసుకున్నాడు. అప్పటికే బ్యాంకు, ప్రైవేటు రుణాలు కలిపి రూ.12లక్షల వరకు అప్పు చేరింది. ఈ నేపథ్యంలో ఉన్న బోరులో నీటి సామర్థ్యం తగ్గి పంటలకు నీళ్లు సరిపోలేదు. చేతికొస్తుందనుకున్న పంట కళ్లెదుటే ఎండిపోతుండడంతో ఆందోళన చెందాడు. మరోవైపు రుణదాతల ఒత్తిళ్లు పెరిగిపోయాయి. అప్పులు కంటికి కునుకు లేకుండా చేశాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి భోజన సమయంలో తన కుటుంబ సభ్యుల వద్ద అప్పుల విషయమై తీవ్రంగా కలత చెందినట్టు తెలిసింది. శుక్రవారం ఉదయం టిఫిన్ చేయకుండా అన్యమనస్కంగా పొలానికి వెళ్లాడు. బోరు వద్ద కూర్చుని ఏదో పనిలో నిమగ్నమయ్యాడు. అక్కడే దరిదాపుల్లోని పొలం పనిలో ఉన్న అతడి చిన్నాన్న భార్య గోపాలమ్మ అతడిని చూసి వ్యవసాయ పనులు చేస్తున్నాడని తలచి కొంతసేపటికి వెళ్లిపోయింది. అప్పటికి ఉదయం 9 గంటలు. 10.30 గంటల సమయంలో ఆర్ఆర్ కాలనీకి చెందిన అంజి అటు వైపు వెళ్లాడు. బోరు వద్ద నోటిలో నురుగ వస్తూ, అపస్మారక స్థితిలో పడి ఉన్న దొరస్వామిని చూశాడు. అతడి పక్కనే పురుగుల మందు డబ్బా పడి ఉండడంతో విషయం అర్థమైంది. కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. దొరస్వామి కుటుంబీకులు, గ్రామస్తులు హుటాహుటిన దొరస్వామి నాయుడుని మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచాడు. మృతుడికి భార్య భారతి, పిల్లలు రేవతి, కీర్తి, జయంతి, జగదీశ్ ఉన్నారు. ఇక మాకు దిక్కెవ్వరు? అంటూ మృతురాలి భార్య తన పిల్లల్ని పట్టుకుని గుండెలవిసేలా రోదించడం పలువురినీ విచలితుల్ని చేసింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్ఐ అనిల్కుమార్, ఆర్ఐ ప్రకాష్, వీఆర్వో నారాయణ మృతుని పొలం వద్దకు వెళ్లి పరిశీలించారు. అనంతరం మదనపల్లె ప్రభుత్వాçసుపత్రికి వెళ్లి మృతుల కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడారు.రైతు ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుని కుటుంబాన్ని ఆదుకుంటాం దొరస్వామినాయుడు కుటుంబాన్ని ఆదుకుంటా మని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. రైతు ఆత్మహత్య విషయం తెలుసుకున్న ఆయన మృతుని కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి ఓదార్చారు. ఆయనతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీపీ అంజిబాబు, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు రుక్మిణమ్మ సంతాపం వ్యక్తం చేశారు. -
సైనికుల్లా పనిచేస్తాం.. కార్యకర్తలకు అండగా ఉంటాం
సాక్షి, చిత్తూరు అగ్రికల్చర్ : వైఎస్సార్సీపీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని, వారి సమస్యల పరిష్కారానికి మంత్రులు, ఎమ్మెల్యేలు సైనికుల్లా పనిచేస్తామని డెప్యూటీ సీఎం, ఎక్సైజ్శాఖ మంత్రి నారాయణ స్వామి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయ ఆవరణలో చిత్తూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో కార్యకర్తలు, నాయకులు సమష్టిగా కృషి చేయడం వల్లే వైఎస్సార్సీపీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పార్టీ కార్యకర్తలకు పెద్దపీట వేశారన్నారు. ప్రతి కార్యకర్త సంతోషంగా ఉండాలన్నదే ఆయన ధ్యేయమన్నారు. కార్యకర్తలు సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే అధికారుల ద్వారా సత్వర పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనంతరం కార్యకర్తలు, నాయకులు, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా అభివృద్ధికి కృషి.. కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లా అభివృద్ధికి తమవంతు నిరంతరం కృషి చేస్తామని చిత్తూరు పార్లమెంటు సభ్యుడు రెడ్డెప్ప అన్నారు. జిల్లాలో ఎక్కడా గాని ఒక్క సెంట్రల్ స్కూల్ లేదన్నారు. చిత్తూరులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. చిత్తూరు రైల్వేస్టేషన్లో ప్రతి రైలు నిలిచే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మేమున్నాం... ప్రతి కార్యకర్తకు ఎల్లవేళలా వెన్నుదన్నుగా తామున్నామని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు భరోసా ఇచ్చారు. పార్టీ అఖండ విజయానికి కృషి చేసిన కార్యకర్తలందరికి ఎల్లప్పుడు జవాబుదారీగా ఉంటామన్నారు. సమావేశంలో పలమనేరు, మదనపల్లె, సత్యవేడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వెంకటేగౌడ, నవాజ్బాషా, ఆదిమూలం, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఈసీ మెంబరు పురుషోత్తంరెడ్డి, చిత్తూరు నగర కన్వీనర్ చంద్రశేఖర్, రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, నాయకులు జేఎంసీ శివ, పోకల అశోక్, జగదీశ్, రఘునాథరెడ్డి, శ్రీధర్రెడ్డి, త్యాగరాజులు, మధుసూదన్రాయల్, భాగ్యలక్ష్మి, పూంగొడి, ప్రతిమారెడ్డి, రాజరత్నంరెడ్డి పాల్గొన్నారు. నల్లబెల్లంపై ఆంక్షలు ఎత్తివేయండి జిల్లాలోని చెరకు రైతులు తయారుచేసే నల్లబెల్లంపై ఆంక్షలు ఎత్తివేసి ఆదుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీరాజ్శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను రైతు సంఘ నాయకులు, బెల్లం వ్యాపారులు కోరారు. గురువారం వారు స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో మంత్రులను కలిసి ఈ మేరకు వినతి చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జిల్లాకు విచ్చేసిన వైఎస్.జగన్మోహన్రెడ్డి నల్లబెల్లంపై ఆంక్షలు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు వెంకటరెడ్డి, జయచంద్రచౌదరి, నాగిరెడ్డి, రవీంద్రనాథ్రెడ్డి, బెల్లం వ్యాపారులు కె.శ్రీధర్రెడ్డి, మాధవనాయుడు, కేడీసీ భాస్కర్, డీఎస్ రెడ్డి, ఈశ్వర్రెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, రెడ్డిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు ఉద్యోగ భద్రత కల్పించండి ఉపాధి హామీ పథకం అమలుకు గత 13 ఏళ్లుగా కృషి చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఉపాధి హామీ సిబ్బంది రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్ది రామచంద్రారెడ్డిని కోరారు. గురువారం వారు తిరుపతిలో మంత్రిని కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. 2006 నుంచి ఉపాధి హామీ పథకం అమలుకు కాంట్రాక్టు పద్ధతిన వివిధ కేటగిరీల్లో విధులు నిర్వర్తిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపీడీలు, ఏపీఓలు, ఈసీలు, టీఏలు, సీఓలు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
బదిలీల్లో రెవెన్యూ
బదిలీల ప్రక్రియను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపే పూర్తిచేయాలన్న నిబంధన ఉంది. జిల్లాలోని అన్ని శాఖల్లో బదిలీల ప్రక్రియ పూర్తయినప్పటికీ రెవెన్యూ శాఖలో మాత్రం ఇప్పటివరకు పూర్తి కాని పరిస్థితి. ప్రస్తుతం నిర్వహించిన బదిలీల్లో అవకతవకలు, చేతివాటం జరిగిందనే విమర్శలు గుప్పుమంటున్నాయి. బదిలీల తీరును చూసి తోటి రెవెన్యూ సిబ్బందే ముక్కున వేలు వేసుకుంటున్నారు. అదేవిధంగా డీటీల పదోన్నతుల్లో కూడా అవకవతవకలు జరిగినట్లు తెలుస్తోంది. సాక్షి, చిత్తూరు కలెక్టరేట్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రెవెన్యూ బదిలీలు పూర్తయిపోయాయి. అయితే ఈ జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు బదిలీలు పూర్తి కాని దుస్థితి. కలెక్టరేట్ అధికారులు నిబంధనలను పాటించకపోవడం, ఇష్టానుసారంగా బదిలీల పోస్టింగ్లు ఇవ్వడం గందరగోళానికి దారితీసింది. దీంతో ఇప్పటికీ రెవెన్యూ శాఖలోని ఉద్యోగులకు బదిలీలు పూర్తికాని పరిస్థితి. కలెక్టరేట్ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో కింది స్థాయి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. జిల్లాలో రెవెన్యూ బదిలీలు ఎప్పటికి పూర్తవుతాయో దిక్కు తోచని పరిస్థితి నెలకొంది. పాత తేదీలు వేసి.. బదిలీల ఉత్తర్వుల్లో పాత తేదీలు వేసి, రోజుకో ఉత్తర్వులను విడుదల చేస్తున్నారు. కలెక్టరేట్ అధికారులు రోజుకో ఉత్తర్వులను విడుదల చేస్తుండడంతో ఉద్యోగుల్లో గందరగోళం మొదలైంది. నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టమొచ్చిన వారికి, ఇష్టానుసారంగా పోస్టింగ్లను కేటాయిస్తున్నారు. బదిలీలకు గడువు ముగిసి 15 రోజులవుతోంది. అయితే ఇప్పటికీ బదిలీల ప్రక్రియను పూర్తి చేయకపోవడం జిల్లా యంత్రాంగం వైఫల్యమేనని తెలుస్తోంది. పదోన్నతుల్లో అవకతవకలు జిల్లాలోని సీనియర్లుగా ఉన్న సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్థాయి ఉద్యోగులకు డీటీలుగా పదోన్నతి కల్పించారు. అందులో మొదటి విడతలో 34 మందికి, ఈ నెల 25న 20 మందికి డీటీగా పదోన్నతులు ఇచ్చారు. ఈ పదోన్నతుల్లో అవకతవకలకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 24న ఇచ్చిన పదోన్నతుల్లో పలమనేరులో ఆర్ఐగా పనిచేస్తున్న రిషివర్మకు పదోన్నతి కల్పించాల్సి ఉంది. అయితే ఆయనకంటే జూనియర్ అయిన సోమల ఆర్ఐ బాబ్జికి పదోన్నతి కల్పించారు. ముడుపులు తీసుకుని అర్హత లేనివారికి పదోన్నతులు కల్పించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనకు జరిగిన అన్యాయంపై రిషివర్మ శుక్రవారం కలెక్టరేట్లోని అధికారులకు వినతిపత్రాన్ని ఇచ్చారు. అప్పుడు ఏం చేయాలో తెలియక అధికారులు బాబ్జిని సంప్రదించి తన పదోన్నతిని వెనక్కి తీసుకుంటున్నానని లిఖితపూర్వకంగా రాసిఇవ్వాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. అందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక కలెక్టరేట్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా యంత్రాంగం చేస్తున్న తప్పిదాలకు అర్హులైన ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రెవెన్యూ బదిలీలను పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పారదర్శకత లోపం రెవెన్యూ బదిలీల్లో పారదర్శకత ఏమాత్రం లేదని కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. బదిలీలకు అర్హత ఉన్న వారికి కౌన్సెలింగ్ నిర్వహించి చేపట్టాల్సిన బదిలీలు తమకు ఇష్టమొచ్చినట్లు నిర్వహిస్తున్నారు. ఈ బదిలీల్లో ముడుపులు స్వీకరించి పోస్టింగులిస్తున్నారనే చర్చ మొదలైంది. గత 15 రోజులుగా బదిలీలు పూర్తికాకపోవడంతో దాదాపు 700 మంది పలు కేడర్ల ఉద్యోగులు ఎటూ కాకుండా గాల్లో ఉన్నారు. జిల్లా యంత్రాంగం చేసిన తప్పిదాలకు ఆ ఉద్యోగులకు బదిలీ ప్రక్రియ పూర్తయ్యే వరకు జీతాన్ని ఉచితంగా ఇవ్వాల్సిన పరిస్థితి. -
వలంటీర్ల ఇంటర్వ్యూలకు.. ఉన్నత విద్యావంతులు
సాక్షి, చిత్తూరు రూరల్: గ్రామ వలంటీర్ల నియామక ప్రక్రియలో కీలకమైన ఇంటర్వ్యూల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇందులో ఉన్నత విద్యావంతులు పెద్దసంఖ్యలో పాల్గొంటుండడం గమనార్హం. అధికారులు మండల కేంద్రంలో రోజుకు 40 నుంచి 50 మందిని ఇంటర్వ్యూలు చేస్తున్నారు. భారీగా దరఖాస్తులు రావడంతో చిత్తూరులో రెండు వారాలకు పైగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. వేతనం తక్కువైనా.. భవిష్యత్తుకు భరోసా లభిస్తుందనే ఆశతో ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాట్లు అభ్యర్థులు చెబుతున్నారు. ఇక సంక్షేమ పథకాలన్నింటనీ వలంటీర్ల ద్వారానే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ బియ్యం, పింఛన్లు తదితర పథకాలను లబ్ధిదారులకు చేరవేసేందుకు ఈ వ్యవస్థను వినియోగించనున్నారు. చిత్తూరు మండలంలోని గ్రామాల పరి ధిలో 50 కుటుంబాలకు ఒక వలంటీర్ చొప్పున 141 మందికి నియమించే అవకాశం ఉంది. 574 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వాటిలో 500 దరఖాస్తులు ఆమోదం పొందాయి. పెద్దసంఖ్యలో పట్టభద్రులు.. గ్రామ వలంటీర్ ఉద్యోగానికి ప్రభుత్వం ఇంటర్మీ డియట్ను అర్హతగా నిర్ణయించింది. దీంతో చిత్తూరు మండలంలోని వలంటీరు పోస్టులకు ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు ఉన్నత విద్యావంతులు దరఖాస్తు చేసుకుని మౌఖిక పరీక్షకు హాజరవుతున్నారు. ఇందులో పీజీలు, డీగ్రీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు 320 మంది ఉన్నారు. కాగా ఇంటర్వ్యూల్లో ఎంపికైన వారికి ప్రభుత్వం రూ. 5 వేల వేతనం అందించనుంది. పారదర్శకంగా.. పైరవీలకు తావు లేకుండా పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు సైతం ఇంటర్వ్యూలను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ప్రజాసేవలో ఆసక్తి ఉన్న అభ్యర్థులకే గ్రామ సేవలో ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇష్టంతో దరఖాస్తు చేశాను.. నేను ఎంబీఏ చేశా. చదువు పూర్తి చేసి మూడేళ్లవుతోంది. కానీ ఉద్యోగం లేదు. ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను గుర్తించి వలంటీర్ల నియామకానికి అవకాశం కల్పించింది. ఈ పోస్టుకు కూడా పోటీ అధికంగా ఉంది. పీజీ చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. నేను ఇష్టపడే దరఖాస్తు చేశాను. ఎంపికైతే ప్రజా సేవలో ఉంటా. – వరలక్ష్మి, శెట్టిగారిపల్లె ఉపాధి కోసం.. నేను కూడా ఎంబీఏ పూర్తి చేశాను. ప్రస్తుత్తం గ్రామ వలంటీర్ల నియామకానికి దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూకు వచ్చాను. రాష్ట్రంలో నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. కొత్త ప్రభుత్వం అందరికి ఉపాధి, ఉద్యోగవకాశాలు కల్పించాలి. యువతకు బాసటగా నిలవాలి. ఆ దిశగా వైఎస్సార్ ప్రభుత్వం అడుగులు వేస్తుందనే నమ్మకం ఉంది. – శివకుమార్, చెర్లోపల్లి పట్టభద్రులే అధికం.. వలంటీర్ల పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 9 రోజుల పాటు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. ఇవి సజావుగా సాగుతున్నాయి. ఆదివారంతో కార్యక్రమం ముగుస్తుంది. 65 నుంచి 75 శాతం మంది పట్టభద్రులే దరఖాస్తు చేసుకున్నారు. వారంతా పోటాపోటీగా ఎంతో ఉత్సాహంతో ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. – వెంకటరత్నం, ఎంపీడీఓ -
జనం కష్టాలు తెలిసిన నేత: జగన్
పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను..అని భరోసా ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి బడుగుజీవులకు ఆర్థిక భరోసా ఇస్తున్నారు. సామాజిక పింఛన్లు రూ.2,250, కిడ్నీ రోగులకు రూ.10 వేలు, దివ్యాంగ పింఛన్ రూ.3వేలకు పెంచుతూ తొలిసంతకం చేశారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేస్తున్న అమ్మలకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని రూ. వెయ్యి నుంచి రూ.3 వేలకు పెంచారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, గుడిపాల(చిత్తూరు): మండలంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 65 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు 80మంది ఉన్నారు. వారికి గౌరవ వేతనం రూ.3వేలకు పెంచడంతో ఆర్థికంగా ఎంతో ఆసరా కానుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు నిరాటంకంగా విద్యాభ్యాసం చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పధకాన్ని ప్రవేశ పెట్టారు. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా గౌరవ వేతనాన్ని పెంచాలని కార్మికులు గత ప్రభుత్వాన్ని కోరారు. అయితే సర్కార్ వారి మొరను పెడచెవిన పెట్టింది. వారి ఆకాంక్షను నిర్లక్ష్యం చేసింది. తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వాలని ఎన్నిసార్లు ఉద్యమాలు చేసినా గత ప్రభుత్వం స్పందించలేదు. ఈ క్రమంలో రాష్ట్రసారధ్య బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.వెయ్యి గౌరవవేతనాన్ని రూ.3 వేల పెంచడంతో వారిలో ఆనందం వెల్లువెత్తుతోంది. వైఎస్ జగన్ తండ్రిబాటలోనే సువర్ణ పాలన సాగిస్తారని ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. జనం కష్టాలు తెలిసిన నేత ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే మా గౌరవ వేతనం రూ.3వేలు చేశారు. గత ప్రభుత్వంలో ఇస్తామని చెప్పారు. కాని ఇవ్వలేదు. ఇప్పుడు సమాజంలో మాకు కూడా గౌరవంగా చెప్పుకునే వేతనం ఇస్తున్నారు. –లక్ష్మీ, నరహరిపేట, గుడిపాల మాట నిలబెట్టుకున్నారు: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి,వంట ఏజెన్సీల కష్టాలను గుర్తించి గౌరవ వేతనాన్ని రూ.3వేలు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రజల సమక్షంలో ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకున్నారు. –విజయ, నరహరిపేట, గుడిపాల మా నమ్మకం నిజమైంది మా కష్టాలు తీర్చే నాయకులు ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే అని ఎప్పటినుంచో నమ్మకం పెంచుకున్నాం. ఆయన సీఎం అయిన వెంటనే వృద్ధులు, కిడ్నీ బాధితులకు పింఛన్లు పెంచారు. వంట ఏజెన్సీలకు కూడా ఇచ్చినహామీ నెరవేర్చారు. ఆయనకు రుణపడి ఉంటాం. –మునెమ్మ, గుడిపాల ఎంతో ఆనందంగా ఉంది గత ప్రభుత్వంలో సక్రమంగా గౌరవ వేతనం వచ్చేది కాదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వంట ఏజెన్సీల కష్టాలు చూసి గౌరవవేతనం రూ.3వేలు చేశారు. మమ్మల్ని గుర్తించి ఇంతమేలు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈశ్వరమ్మ, గుడిపాల -
మంత్రి హోదాలో అసెంబ్లీకి
సాక్షి, తిరుపతి: ఐదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు టీడీపీ ఘోర పరాజయంతో ప్రతిపక్ష నేత హోదాలో బుధవారం అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రి హోదాలో హాజరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఏడుగురు కొత్త వారు ఎమ్మెల్యేలుగా గెలుపొంది మొదటిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. టీడీపీ ప్రభుత్వంలో అన్యాయంగా ఏడాదిపాటు సస్పెన్షన్కు గురై రెండోసారి తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆర్కే రోజా బుధవారం అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. టీడీపీ ప్రభుత్వంలో రాజ్యాంగానికి విరుద్ధంగా 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. వారికి మంత్రి పదవులు కట్టబెట్టి అసెంబ్లీలో కూర్చొబెట్టుకోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆర్కే రోజా, నారాయణస్వామి, చింతల రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథ్రెడ్డి, బియ్యపు మధుసూదన్రెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, ఆదిమూలం, వెంకటేగౌడ్, నవాజ్ బాషా, ఎంఎస్ బాబు ఘన విజయం సాధించారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ సునామీలో టీడీపీ నేతల అడ్రస్లు గల్లంతయ్యాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామికి చోటు కల్పించారు. ఇద్దరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో నారాయణస్వామి ఉప ముఖ్యమంత్రిని చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. వీరంతా అమరావతిలో బుధవారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు. కొత్త కొత్తగా.. నిండుగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మినహా.. మిగిలిన వారిలో పెద్దిరెడ్డి, నారాయణస్వామి, చింతల రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి అసెంబ్లీ సమావేశాల బహిష్కరణలో భాగంగా సుమారు ఏడాదికిపైగా శాసనసభ సమావేశాలకు దూరంగా ఉన్నారు. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా టీడీపీ ప్రభుత్వం అన్యాయంగా ఏడాదిపాటు సస్పెండ్ చెయ్యడంతో ఆమె అసెంబ్లీలోకి అడుగుపెట్టలేదు. జిల్లా నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వారితో పాటు సీనియర్ ఎమ్మెల్యేలు బుధవారం జరిగిన సమావేశానికి హాజరయ్యారు. గతంలో వైఎస్సార్సీపీ గుర్తుతో గెలిచి చంద్రబాబు ప్రలోభాలకు లొంగి పచ్చకండువా కప్పుకున్న అమర్నాథ్రెడ్డి ఏకంగా మంత్రి అయ్యారని, ఆయనకు పలమనేరు ఓటర్లు గుణపాఠం చెప్పారని జిల్లా వాసులు గుర్తుచేస్తున్నారు. ఐదేళ్ల పాటు ఏకపక్షంగా వ్యవహరించి.. సంక్షేమాన్ని పక్కనపెట్టి ధనార్జనే ధ్యేయంగా అవినీతి అక్రమాలకు తెరలేపిన టీడీపీ నేతలకు ఎన్నికల ఫలితాలతో గుణపాఠం చెప్పారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఓటుపై కత్తుల వేట!
జిల్లాలో టీడీపీ నేతలు సహనం కోల్పోయారు. ఓటమి భయంతో హింసాత్మక చర్యలకు ఒడిగట్టారు. వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులపై దాడులకు తెగబడ్డారు. పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థిని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి చితకబాదారు. తంబళ్లపల్లెలో ఓ కార్యకర్తను రాళ్లతో కొట్టి, కాళ్లతో తొక్కి చంపేశారు. అడ్డొచ్చిన వారిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. కవరేజ్కు వెళ్లిన మీడియానూ వదల్లేదు. కెమెరాలు లాక్కుని, ఐడీ కార్డులు చింపేసి అరాచకం సృష్టించారు. కొందరు నేతలు క్యూల్లోకి వెళ్లి యథేచ్ఛగా ప్రచారాలు చేస్తున్నా పోలీసులు అడ్డుచెప్పకపోవడం గమనార్హం. సాక్షి, తిరుపతి/చిత్తూరు అర్బన్: జిల్లాలోని ఓటర్లలో చైతన్యం కట్టలు తెంచుకుంది. ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం కనిపించింది. పోలింగ్ ప్రారంభ సమయానికే కేంద్రాల వద్ద భారీ ఎత్తున ఓటర్లు బారులు తీరారు. అనేక చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ నేతలు కుట్రలకు పదునుపెట్టారు. తంబళ్లపల్లి నియోజకవర్గం పీటీఎం పరిధిలో ఆ పార్టీ నేతలు దాడులకు పూనుకున్నా రు. నియోజకవర్గంలోని అన్ని బూత్లలో వైఎస్సార్సీపీకే అనుకూలంగా ఓట్లు వేస్తుండడంతో ఒకింత అసహనానికి లోనయ్యారు. టిసదుం జెడ్పీ హైస్కూల్ వద్ద ఉన్న పోలింగ్ బూత్లో ప్రచారం చేయడం ప్రారంభించారు. ఓటర్లు కొందర్ని బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు వారికి అడ్డుతగిలారు. రెచ్చిపోయిన టీడీపీ నేతలు రామాపు రం గ్రామానికి చెందిన ఆర్సీ వెంట్రామిరెడ్డి (68), మరికొందరు కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. వెంకట్రామిరెడ్డిని రాళ్లతో కొట్టి చంపేశారు. ఎంఎస్ బాబుపై హత్యాయత్నం పూతలపట్టు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంఎస్.బాబును హత్య చేయడానికి టీడీపీ నేతలు ప్రణాళిక రచించారు. సీఎం సామాజికవర్గానికి చెందిన పలు గ్రామాల్లో దళితులను ఓట్లు వేయనివ్వకుండా అడ్డుకున్నారు. తొలుత బందార్లపల్లెలో దళితులను ఓటు వేయడానికి అగ్రవర్ణాలు అంగీకరించలేదు. దీన్ని ప్రశ్నించడానికి వెళ్లిన ఎంఎస్ బాబుపై అక్కడే దాడిచేసి మట్టుబెట్టాలని టీడీపీ నేతలు ప్రణాళిక రచించారు. కానీ పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పచ్చ ముసుగు ధరిం చిన అల్లరిమూలు పారిపోయాయి. అటునుంచి ఐరాల మండలంలోని కట్టకిందపల్లెకి వెళ్లిన బాబు దళితులను ఎందుకు ఓటు వేయనివ్వడం లేదని ప్రశ్నించారు. అప్పటికే కాపుకాచిన టీడీపీ నేతలు బాబుతో పాటు ఆయన గన్మన్, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గాయాలతో తప్పించుకుని వెళుతున్న బాబు వాహనాన్ని అడ్డగించి, ధ్వంసం చేశారు. ఆయన్ను కిడ్నాప్చేసి మామిడితోపులోకి తీసుకెళ్లిన టీడీపీ కార్యకర్తలు మారణాయుధాలతో హత్య చేయడానికి ప్రయత్నించారు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన అనుచరులు చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. తెల్లగుండ్లపల్లెలో వైఎస్సార్సీపీ ఏజెంటుగా ఉన్న బాబ్జి అనే యువకుడ్ని టీడీపీ నేతలు కొట్టుకుంటూ లాక్కొచ్చారు. దాదాపు 300 మందిని ఓట్లు వేయనివ్వకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. రెడ్డెప్పపై దాడికి యత్నం కుప్పం మండలంలోని కృష్ణదాసనపల్లెలో పోలింగ్ సరళి పరిశీలించడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి రెడ్డెప్పపై టీడీపీ నాయకులు దాడి చేయడానికి ప్రయత్నిం చారు. చిత్తూరు రూరల్ మండలంలోని చెర్లోపల్లెలో స్థానికేతరులు ఓట్లు వేయడానికి వస్తుంటే అడిగిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ వాళ్లు రాళ్లు రువ్వడంతో పలువురు గాయపడ్డారు. కుప్పంలో కుట్రలు కుప్పం నియోజకవర్గ పరిధిలో టీడీపీ నేతల కుట్రలు చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప పోలింగ్ బూత్ల వద్దకు రాకుండా అడ్డుకున్నారు. దళవాయికొత్తపల్లి, కృష్ణదాసనపల్లిలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఇదిలావుంటే కుప్పం పరిధిలో టీడీపీ, బీజేపీ కుమ్మక్కయ్యాయి. బీజేపీ అభ్యర్థి ఎక్కడా తన ఏజెంట్లను నియమించకుండా చంద్రబాబుకు ఓట్లు వేసేలా కృషి చేశారు. సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని కేవీబీపురం రాగిగుంట బూత్లో ఉన్న వైస్సార్సీపీ ఏజెంట్లను బయటకు వెళ్లాలంటూ టీడీపీ నేతలు, అధికారులు బెదిరింపులకు దిగారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లు పోలింగ్ బూత్లో ఉండకూడదట తిరుపతి ఎన్జీఓ కాలనీలోని బూత్ నంబర్ 40లో టీడీపీ ఏజెంట్లను లోపల కూర్చో బెట్టి వైఎస్సార్సీపీ ఏజెంట్లను రానివ్వకుండా అడ్డుకున్నారు. అదేమిటని అడిగితే లోపల స్థలం చాల్లేదని చెప్పుకొచ్చారు. తిరుపతి స్కావెంజర్స్ కాలనీలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. రేణిగుంట మండలం ఎస్ఎన్ పురం బూత్ పరిధిలో ఓటర్ల జాబితాలో ఫొటోలు లేవు. గుడిమల్లంలో పోలింగ్ బూత్ వద్ద టీడీపీ కార్యకర్తలు ప్రచారం చేయడం కనిపించింది. వైస్సార్సీపీకి ఓట్లు పడుతున్నాయని ఓ కార్యకర్త చేత ఈవీఎంని గట్టిగా ఒత్తి మిషన్ పనిచెయ్యకుండా చేశారు. పోలింగ్ ప్రారంభమయ్యేసరికి మధ్యాహ్నం ఒంటిగంట దాటింది. ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు రేణిగుంట మండలం గాజులమండ్యం, నల్లపాళెం గ్రామస్తులు ఓటింగ్ను బహిష్కరించారు. గాజులమండ్యం పారిశ్రామికవాడ నుంచి వెలువడే వ్యర్థాల కారణంగా రెండు గ్రామాలతో పాటు మరికొన్ని పల్లెలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీనిపై ఎవ్వరూ స్పందించకపోవడంతో వారు ఓటింగ్కు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు. తర్వాత సమస్య సర్దుమణిగింది. చంద్రగిరిలో తమ్ముళ్లు దాష్టీకం వైఎస్సార్సీపీకి ఓటు వేస్తారన్న నెపంతో రామచంద్రాపురం మండలానికి చెందిన దళితులను పోలింగ్ కేంద్రాలకు రాకుండా అడ్డుకున్నారు. రావిళ్లవారిపల్లి, కమ్మపల్లి, కమ్మకండ్రిగ, టీటీకండ్రిగ, ఎన్ఆర్ కమ్మపల్లి, గణేశ్వరపురంలో టీడీపీ నేతల దౌర్జన్యాలకు అడ్డేలేకుండా పోయింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా గ్రామంలోకి రావడానికి వీల్లేదంటూ దాడికి తెగబడ్డారు. టీడీపీ ఏజెంట్లు మినహా మిగిలిన పార్టీలకు సంబంధించిన ఏజెంట్లను కూడా గ్రామంలోకి అడుగుపెట్టనివ్వకపోవడం గమనార్హం. కవరేజ్ కోసం వెళ్లిన సాక్షి విలేకరులు ప్రకాష్, శివశంకర్, రాజారెడ్డి, మరో ఫొటోగ్రాఫర్ను అడ్డుకున్నారు. సాక్షి విలేకరి శివశంకర్పై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఇతని వద్ద, రాజారెడ్డి వద్ద ఉన్న సెల్ఫోన్లు, ఐడీ కార్డులను లాక్కుని తరిమారు. సొరకాయలపాళెం గ్రామానికి చెందిన ఇరువర్గాల వారు రాళ్లు, రప్పలు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. మండల పరిధిలోని అనేక గ్రామాల్లో టీడీపీ నేతలు యథేచ్ఛగా రిగ్గింగ్కు పాల్పడ్డారు. పాకాల మండలంలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని భాస్కరనాయుడుపై చేయిచేసుకున్నారు. తమ్ములగుంటలో పులివర్తి నాని భార్య హల్చల్ చేశారు. మొరాయించిన ఈవీఎంలు జల్లా వ్యాప్తంగా సుమా రు 2,350 ఈవీఎంలు మొరాయించినట్లు అధికారులు వెళ్లడించా రు. వీటిని సకాలంలో సరిచేయడంతో సమస్య తప్పినట్లయింది. -
ఎన్నికల వేళ.. ఎవరూ పట్టించుకోరని..!
సాక్షి, చిత్తూరు అర్బన్: అసలే ఎన్నికల సీజన్. అధికారులంతా ఎన్నికల పనిలో బిజీ బిజీగా ఉన్నారు. విలువైన స్థలం. గుట్టుచప్పుడు కాకుండా చెరబడితే రూ.కోట్లు సంపాదించేయొచ్చనుకున్నాడు చిత్తూరుకు చెందిన ఓ టీడీపీ కార్యకర్త. ఇదే విషయాన్ని జిల్లా టీడీపీలోని ఓ నాయకుడి చెవినపడేశాడు. అక్కడి నుంచి గ్రీన్సిగ్నల్ రావడంతో సదరు టీడీపీ కార్యకర్త గంటల వ్యవధిలో ప్రభుత్వ స్థలంలో తహసీల్దారు ఏర్పాటు చేసిన బోర్డును తొలగించి కబ్జా చేసేస్తున్నాడు. చిత్తూరు నగరంలోని గంగాసాగరం ఆనుకుని అనుప్పల్లె రెవెన్యూ గ్రామంలో 64 సెంట్ల భూమి ఉంది. చాలా కాలంగా దీన్ని తన అధీనంలోకి తెచ్చుకోవడానికి బెంగళూరుకు చెందిన ఓ టీడీపీ కార్యకర్త విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఇతనికి జిల్లా టీడీపీలోని ఓ నాయకుడి అండ ఉండడంతో పలుమార్లు ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించాడు. అయితే స్థానికులు అడ్డుకుంటూ వస్తుండడంతో మధ్యలోనే పనులు ఆపేస్తూ వస్తున్నాడు. మార్కెట్లో దీని విలువ రూ.కోట్లలో ఉంటుంది. ఈ స్థలాన్ని పాఠశాలకు ఇవ్వాలని, సొంత ఇళ్లు లేని ఎస్సీ, బీసీలకు ఇవ్వాలనే ప్రతిపాదనలు రావడంతో అధికారులు దీన్ని రక్షించడానికి ఏడాది క్రితం చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ స్థలంలోకి ఎవరైనా రావాలనుకున్నా.. ఎవరైనా కబ్జా చేయడానికి ప్రయత్నించినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ బోర్డు కూడా ఏర్పాటు చేయించారు. అయితే ఉన్నఫలంగా ఈ బోర్డును తొలగించిన వ్యక్తి జేసీబీ సాయంతో స్థలాన్ని చదును చేసి, కబ్జా చేసేశాడు. అధికారులు బిజీ.. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అధికారులంతా బిజీగా ఉంటారని.. త్వరగా పని కానిచ్చేయమని జిల్లా టీడీపీలోని ఓ నాయకుడి ఆదేశాలతో రంగంలోకి దిగిన టీడీపీ కార్యకర్త స్థలాన్ని తన ఆధీనంలోకి తీసేసుకున్నాడు. పైగా దీన్ని తహసీల్దారు, ఆర్డీఓలు తన స్థలంగా తేల్చారంటూ గ్రామస్తులకు చెబుతున్నాడు. ఇన్నాళ్లు ప్రభుత్వ భూమిగా ఉన్నది.. ఉన్నట్టుండి ప్రైవేటు వ్యక్తికి ఎలా మారిపోతుందని గ్రామస్తులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులకు కక్కుర్తిపడి అధికా రులు, టీడీపీ వారికి అనుకూలంగా ప్రభుత్వ స్థలాన్ని దోచిపెడుతున్నారని ఆరోపిస్తున్నారు. జేసీ ఆగ్రహం.. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన విషయం జాయింట్ కలెక్టర్ దృష్టికి వెళ్లింది. దీంతో అధికారులపై ఆయన ఫైర్ అయ్యారు. భూమిని ఆక్రమించుకున్న వ్యక్తులపై క్రిమినల్ కేసులు పెట్టాలని చిత్తూరు తహసీల్దారును ఆదేశించారు. మళ్లీ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. అప్పటికప్పుడు తడుముకున్న రెవెన్యూ అధికారులు గంగాసాగరంలో హెచ్చరిక బోర్డునైతే ఏర్పాటు చేశారుగానీ.. ఆక్రమించేందుకు యత్నించిన టీడీపీ కార్యకర్తపై కేసు పెట్టడానికి వెనుకడుగు వేస్తున్నారు. -
జగనన్నతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
సాక్షి, ఎర్రావారిపాళెం: రాష్రాభివృద్ధి జగనన్నతోనే సాధ్యమవుతుందని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి నాటి స్వర్ణయుగాన్ని జననేత తిరిగి తీసుకువస్తాడని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎర్రావారిపాళెంలో వైఎస్సార్సీపీ ఆధర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ జగనన్న ప్రకటించిన నవరత్నాల పథకాలతో అన్ని వర్గాలకు మేలు చేకూరుతుందన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే యువశక్తికి తోడ్పాటుంటుందన్నారు. ప్రత్యేకహోదా విషయంలో అధికార పార్టీ ఊసరవెళ్లి ధోరణిలో ప్రజలను మోసం చేసిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించగల సత్తా ఒక జగనన్నకు మాత్రమే ఉందన్నారు. జగనన్న ప్రకటించిన ప్రతి హామీ కూడా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తారన్నారు. వైఎస్సార్సీపీలోకి టీడీపీ సీనియర్ నాయకుడు చెరుకువారిపల్లె పంచాయతీ పులిపుతృవారిపల్లెకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు తిమ్మసముద్రం వెంకటరెడ్డి తన భారీ అనుచర ఘనంతో కలసి వైఎస్సార్సీపలో చేరారు. వెంకటరెడ్డికి చెవిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెంకటరెడ్డి మాట్లాడుతూ టీడీపలో అవినీతి, అక్రమాల తీరు, పార్టీ విధానాలు నచ్చకనే వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఎంపీపీ రేవతిరెడ్డెప్పరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చెంగల్రెడ్డి, వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి దేపట్ల నాగార్జునరెడ్డి, కరుణాకర్రెడ్డి, రమేష్, నాగరాజనాయుడు, మహేశ్వర్రెడ్డి, నాగరాజ తదితరులు పాల్గొన్నారు. -
అజిష్ట గుట్టు పెరుమాళ్లకెరుక
కుప్పం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నాను. ఇందులో భాగంగా పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నా. శాంతిపురం మండలానికి అజిష్ట పరిశ్రమను తీసుకువచ్చాను’ అని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. రెండు నెలల క్రితం పరిశ్రమకు శంకుస్థాపన కూడా చేశారు. ఇప్పటి వరకు పరిశ్రమ నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ప్రభుత్వం ఈ సంస్థతో చేసుకున్న ఒప్పందం, ఇచ్చిన అనుమతులపై సమాధానం లేని అనేక ప్రశ్నలకు ఆస్కారం ఇస్తోంది. సాక్షి శాంతిపురం: మండలంలోని అమ్మవారిపేట రెవెన్యూ పరిధిలో అజిష్ట ఫుడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్కు ప్రభుత్వం భూములు కేటాయించిం ది. సంస్థ ఆరు నెలల క్రితమే 21.20 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. భూములను కూడా చదు ను చేసింది. జనవరి 3న చంద్రబాబునాయుడు పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. రూ 21.18 కోట్ల పెట్టుబడితో వచ్చే పరిశ్రమకు ప్రభుత్వ ప్రోత్సాహకంగా రూ.5 కోట్లను ఇస్తున్నట్టు ప్రకటించారు. కూరగాయలు, పండ్లను డిహైడ్రేట్ చేసి ప్రాసెసిం గ్ చేస్తారని పేర్కొన్నారు. అధికారికంగా 18.16 ఎకరాల భూమిని అజిష్టకు ఇస్తున్నట్టు తెలిపారు. స్థానిక రెవెన్యూ అధికారులు మాత్రం 21.20 ఎకరాలను అప్పగించారు. శంకుస్థాపన చేసి రెండు నెలలు అవుతున్నా పనులు ప్రారంభం కాలేదు. 25 ఉద్యోగాలు మాత్రమే.. రూ.5 కోట్ల ప్రభుత్వ రాయితీ, 21.20 ఎకరాల భూమి పొందిన ప్రైవేటు సంస్థ కల్పించే ఉద్యోగాలు మాత్రం 25 మాత్రమే. సాధారణంగా పరిశ్రమల్లో ప్రతి రూ.5 లక్షల పెట్టుబడికి ఒక ఉద్యోగం జనరేట్ అవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. పరిశ్రమ పేరుతో ఇస్తున్న రూ.5 కోట్ల రాయితీని పది మందికి ఉద్యోగాలు కల్పిం చే చిన్నతరహా పరిశ్రమల స్థాపనకు కేటాయిం చినా 500 కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది. రోజుకు 69 వేల లీటర్ల నీరు కుప్పం ప్రాంతంలో భూగర్భ జలాలు అంతంత మాత్రమే ఉన్నాయి. 1,500 అడుగుల లోతుతో బోర్లు తవ్వినా నీరు వస్తుందనే నమ్మకం లేదు. మార్చి నెలకే తాగునీటి బోర్లు ఎండిపోయి అనేక గ్రామాల్లో నీటి సమస్య ఎక్కువైంది. ఇవేవీ పట్టని ప్రభుత్వం అజిష్ట పరిశ్రమ రోజుకు 69 వేల లీటర్ల నీటిని తోడుకోవడానికి అనుమతులు ఇచ్చింది. ఇదే జరిగితే రామకుప్పం–శాంతిపురం మండలాల్లోని అనేక బోర్లు ఎండిపోయే ప్రమాదం ఉంది. తద్వారా గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేయక తప్పని పరిస్థితి వస్తుంది. పరిశ్రమ వచ్చేనా? అమ్మవారిపేట వద్ద అజిష్ట పరిశ్రమ ఏర్పాటుపై స్థానికుల్లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 2004 సంవత్సరానికి ముందు సీఎంగా ఇదే భూముల్లో లీఫ్ టూ క్లాత్ పరిశ్రమ పేరుతో హడావుడి చేసినా ఒరిగింది ఏమీ లేదంటున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనం చెవిలో పూలు పెట్టే ప్రయత్నంలో భాగంగానే పరిశ్రమ ఏర్పాటును తెరపైకి తెచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది. -
వివాహేతర బంధమే ప్రాణం తీసింది
సాక్షి, చిత్తూరు రూరల్ : వివాహేతర సంబంధం దారుణ హత్యకు దారితీసింది. చేసిన తప్పును తెలుసుకుని భర్త వద్దకు తిరిగి చేరుకోవాలన్న మహిళ చివరకు ప్రియుడి చేతిలో హత్యకు గురైంది. ప్రియుడు అతి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటన చిత్తూరు నగరం చెన్నమ్మగుడిపల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు నగరం చెన్నమ్మగుడిపల్లికి చెందిన హరికృష్ణ, కనకదుర్గ(36)లకు 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరి కాపురం కొంతకాలం సజావుగా సాగింది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే ఇటీవల అదే గ్రామానికి చెందిన త్యాగరాజు అనే వ్యక్తితో కనకదుర్గకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో భర్త హరికృష్ణ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ కారణంతో ఇద్దరూ విడిపోయారు. కనకదుర్గ పుట్టింటికి వెళ్లిపోయింది. పిల్లలు ఇద్దరు హరికృష్ణ దగ్గరే ఉంటున్నారు. కాగా, చివరకు చేసిన తప్పును తెలుసుకున్న కనకదుర్గ భర్తకు దగ్గర కావాలనుకుంది. గత మూడు రోజులుగా తన పిల్లలతో పాటు భర్తను కలుసుకుని కాపురం కాపురం చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు త్యాగరాజు జీర్ణించుకోలేకపోయాడు. శనివారం కనకదుర్గ పుట్టింట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై దాడి చేశాడు. ఈ విషయాన్ని స్థానికులు 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని త్యాగరాజుని మందలించారు. దీంతో కనకదుర్గపై కక్ష పెంచుకున్న త్యాగరాజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై మరోమారు దాడికి దిగాడు. చీరతో గొంతు నులిమి హత్య చేసి పరారయ్యాడు. స్థానికులు సమాచారంతో డీఎస్పీ రామాంజనేయులు, సీఐ శ్రీధర్, ఎస్ఐ పురుషోత్తంరెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదివారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోమవారం పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఓటు.. ఆన్లైన్ వేటు
సాక్షి, గుడిపాల: అధికార తెలుగుదేశం పార్టీకి ఓటమి భయం పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో అక్రమాలకు తెరలేపింది. వైఎస్సార్సీపీ ఓటర్లే తొలగింపు లక్ష్యంగా భారీగా కుట్రలు పన్నుతోంది. తెలుగుదేశం నాయకులు.. వైఎస్సార్సీపీ ఓట్ల తొలగింపే లక్ష్యంగా ఇటీవల ఫారం–7 కింద 189 కొత్తపల్లె పంచాయతీలో 111 మంది అర్హులైన ఓటర్లను తొలగించేందుకు దరఖాస్తు చేశారు. ఓటు తొలగించాలని తాము ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేదని స్వయంగా బాధిత ఓటరే చెబుతున్నారు. ఈనేపథ్యంలో ఈ విషయంపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి ఓట్ల దొంగల అక్రమాలకు చరమగీతం పాడాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఊర్లో ఉన్నా ఓటు తీసేస్తారా? గ్రామంలో కూలిపని చేసుకొని జీవిస్తున్నాను. ఊర్లో ఉన్నవారి ఓట్లను తొలగించే అధికారం టీడీపీ నాయకులకు ఎవరిచ్చారు. మాకు తెలియకుండా ఆన్లైన్లో ఎవరు దరఖాస్తు చేశారో అధికారులు గుర్తించి చర్యలు తీసుకోవాలి. వైఎస్ జగన్కు ఓటువేస్తామని ఉద్దేశంతోనే ఇలాంటి అడ్డదారులు ఎంచుకుంటున్నారు. –(చిన్నపాప,189కొత్తపల్లె)గుడిపాల దుర్మార్గమైన చర్య మేం గ్రామంలో 20ఏళ్లుగా ఉంటున్నాం. ఇక్కడే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. మాకు తెలియకుండానే మా ఇంట్లో వారి ఓట్లను తొలగించేశారు. గ్రామంలో ఉన్న మా ఓట్లను ఎలా తొలగిస్తారు. ఇది దర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యంలో ఓటు వేసుకొనే ఎవరికైనా ఉంది. పిరికిపందెలే ఇలా చేసేది. –(మణివేలు,189కొత్తపల్లె)గుడిపాల వైఎస్సార్సీపీ సానుభూతి పరుల ఓట్లే లక్ష్యం వైఎస్సార్సీపీ సానుభూతి పరుల ఓట్లనే టార్గెట్ చేసి తీయించేస్తున్నారు. గ్రామంలో ఉన్నవారి ఓట్లను తీసేందుకు టీడీపీ నాయకులు యత్నిస్తున్నారు. ప్రజల మద్దతు లేనివారే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతున్నారు. ఓటుతో వారికి ఈసారి తగిన బుద్ధి చెబుతాం. ఓటు వేయడంలో చాలా కసిగా ఉన్నాం. ఫారం–7 దరఖాస్తు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. –(కర్ణల్,189కొత్తపల్లె)గుడిపాల డేటా చోరీ కుట్రపూరితమే.. అధికార పార్టీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఐటీ గ్రిడ్ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించడం కుట్రలో భాగమే. ప్రభుత్వ ప్రమేయం లేకుండా ప్రజల సమాచారం ప్రైవేట్ సంస్థకు వెళ్లే ఆస్కారమే లేదు. ప్రభుత్వ అండదండలతోనే వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి ఆ పార్టీకి అనుకూలంగా మార్చుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ వద్ద ఉన్న యాప్ద్వారా ఓటర్ల తొలగింపునకు పాల్పడుతున్నారు. –(గోకుల్,189కొత్తపల్లె) గుడిపాల నాపేరుపై 38 దరఖాస్తులు వచ్చాయి 189కొత్తపల్లె వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్గా ఉండి కూడా మా ఓట్లు తొలగింపునకు ఎందుకు ఫారం–7 ఇస్తాం. వైఎస్సార్సీపీ ఓట్లు గల్లంతు చేసేందుకు హైదరాబాద్ కేంద్రంగా టీడీపీ నాయకులు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. నాపేరుతో దరఖాస్తు చేసి 38ఓట్లను తొలగించేలా చేశారు. అంతా వైఎస్సార్సీపీ సానుభూతి పరులనే టార్గెట్ చేస్తున్నారు. ఈ కుట్రను తిప్పికొడతాం. –(కారిమేగన్, వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్, 189కొత్తపల్లె) గుడిపాల మా ఇద్దరి ఓట్లూ.. నా వయస్సు 67 సంవత్సరాలు. ఇదే గ్రామంలో పోస్ట్మాస్టర్గా ఉండి రిటైర్డ్ అయ్యాను. ప్రస్తుతం ఇదే గ్రామంలోనే జీవనం సాగిస్తున్నాను. నాతో పాటు నా భార్య ఓటును కూడా తొలగించేందుకు కుట్రపన్నారు. ఓటు తొలగింపు కోసం ఆన్లైన్లో ఫారం–7ను దరఖాస్తు చేశారు. ఇది ఎవరి కుట్రో తెలియడం లేదు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. –(వసంత,ముస్వామి దంపతులు, 189కొత్తపల్లె) గుడిపాల మండలం : గుడిపాల పంచాయతీ : 189 కొత్తపల్లె మొత్తం ఓట్లు : 2,138 పురుషులు :1,077 స్త్రీలు :1,061 ఫామ్–7 ద్వారా వచ్చిన దరఖాస్తులు :111 -
సీనియర్ సిటిజన్స్కు నోటీసులు
సాక్షి, పాకాల : ఎన్నికల హడావుడి మొదలుకావడంతో పోలీసులు వైఎస్సార్సీపీ సానుభూతి పరులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా గొడవలతో సంబంధం లేని విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులకు నోటీసులు ఇస్తున్నారు. పోలీసు స్టేషన్కు రావాలని చెబుతుండడంతో వృద్ధులు ఆందోళన చెందుతున్నారు. శాంతికి భంగం కలిగించకుండా ఉండాలని, ముందస్తుగా రూ.2 లక్షలకు ప్రామిసరీ నోటు రాసివ్వాలని పోలీసులు చెబుతున్నారని, ఇలా ఎప్పుడూ లేదని వారు పేర్కొంటున్నారు. ఈ విషయంపై ఎస్ఐ సునీల్కుమార్ని వివరణ కోరగా శాంతిభద్రతల దృష్ట్యా అన్ని పార్టీల వారికి నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. -
జిల్లాలో మొదలైన ఎన్నికల కోలాహలం
సాక్షి, చిత్తూరు, కలెక్టరేట్: జిల్లాలో రాజకీయం మరింత వేడెక్కింది. సుమారు 31 లక్షల ఓటర్లు 14 మంది శాసనసభ్యులు, 3 ఎంపీలను ఎన్నుకునే ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం నగారా మోగించింది. లోక్సభ, శాసన సభలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల కానుంది. షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మార్చి 25 కాగా, 26న నామినేషన్లను పరిశీలిస్తారు. ఇదే నెల 28 వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఏప్రిల్11న పోలింగ్ జరుగనుంది. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. తక్షణమే నిబంధనలు అమల్లోకి.. తక్షణమే ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదివారం రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి గోపాలక్రిష్ణ ద్వివేది కలెక్టర్ను ఆదేశించారు. ప్రభుత్వ భవనాలపై ఉన్న బ్యానర్లు కటౌట్లు, ఫ్లెక్సీలు 24 గంటల్లో తొలగించాలని కోరారు. బహిరంగ ప్రదేశాల్లో 48 గంటల్లోగా తీసేయాలన్నారు. ప్రతి జిల్లాలో ఫిర్యాదుల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. అధికార వాహనాలను వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పథకాలపై ప్రభుత్వ ప్రకటనలను వెంటనే ఆపేయకుంటే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఫ్లయింగ్ స్క్వాడ్, మొబైల్ టీంలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తొలివేటు.. ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై వేటు వేసేందుకు కలెక్టర్ ప్రద్యుమ్న వెనకాడడం లేదు. ఇందులో భాగంగా కుప్పం ఈడీటీ జీహెచ్ ఆనంద్ బాబును సస్పెండ్ చేశారు. అధికారులు ఉద్యోగులు మోడల్ కోడ్ను అనుసరించకపోతే కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంటానని ముందే హెచ్చరించారు. కఠినంగా వ్యవహరిస్తాం ఎన్నికల నిర్వహణలో చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం. నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తాం. 22వేల మంది సిబ్బందితో ఎన్నికలకు రెడీ అయ్యాం. ఇంకా 200 ఈవీఎంలు రావాల్సి ఉంది. రాత్రి పది గంటల తరువాత ప్రచారం నిషిద్ధం. ఉదయం 6 గంటల తరువాతే ప్రచారానికి అనుమతి. ప్రభుత్వ భవనాలు, కార్యాలయాల్లో ప్రచారం చేసుకోకూడదు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహించాలన్నదే నా ధ్యేయం. –జిల్లా ఎన్నికల ప్రధానాధికారి పీఎస్ ప్రద్యుమ్న 38 చెక్పోస్టులు ఏర్పాటు చేశాం జిల్లాలో 38 చెక్పోస్టులు ఏర్పాటు చేశాం. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోనే 23 నెలకొల్పాం. రూ.50 వేల కంటే ఎక్కువ నగదు వ్యక్తిగతంగా ఉంచుకోరాదు. అంతకంటే ఎక్కువ నగదు దొరికితే కేసు నమోదు చేస్తాం. సరైన డాక్యుమెంట్లు చూపే వరకు నగదు వెనక్కి ఇవ్వం. – విక్రాంత్ పాటిల్, ఎస్పీ -
టీడీపీలో మొదలైన టెన్షన్
సాక్షి, తిరుపతి: ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. నెల రోజుల వ్యవధిలో ఎన్నికల ప్రక్రియను ముగించేలా నిర్ణయం తీసుకుంది. ఆమేరకు ఆదివారం షెడ్యూల్ విడుదల చేసింది. పో లింగ్కు కేవలం నెలరోజుల సమయమే ఉండడంతో జిల్లాలోని అధికార పార్టీ నేతల్లో కలవరం మొదలైంది. నెల రోజుల్లో అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో పూర్తిచేయాల్సి ఉండడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటన వెలువడింది. ఏప్రిల్ 11న పోలింగ్.. మే 23న ఫలితాలు ప్రకటించనున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీలో ఆందోళన మొదలైంది. పోలిం గ్కు నెలరోజుల సమయం మాత్రమే ఉండడంతో తిరుపతి పార్లమెంట్, చిత్తూరు, నగరి, పూతలపట్టు, శ్రీకాళహస్తి, తిరుపతి, గంగాధరనెల్లూరు, సత్యవేడు, తంబళ్లపల్లి, మదనపల్లి అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను టీడీపీ ఇంకా ఖరారు చెయ్యలేదు. దీంతో ఆ స్థానాలను ఆశిస్తున్న వారంతా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. తిరుపతి పార్లమెంట్ స్థానానికి అభ్యర్థి దొరక్కపోవడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక ఎప్పుడు? నెల రోజుల సమయంలో అభ్యర్థుల్ని ఎప్పుడు ఎంపిక చేస్తారు?, మేనిఫెస్టో తయారుచేసి ఎప్పుడు ప్రకటిస్తారని టీడీపీ శ్రేణులు అధినేత చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మార్చి 18న నోటిఫికేషన్ రావడం.. మార్చి 25తో నామినేషన్లు వేసేందుకు సమయం ముగుస్తుండడం పార్టీలను పరుగులు పెట్టిస్తోంది. అంటే 15 రోజుల్లోనే అభ్యర్థుల్ని ఫైనల్ చేయాల్సి ఉంటుంది. నామినేషన్లు వేసేందుకు కూడా వారం సమయం మాత్రమే ఉండడం. ప్రచారానికి కూడా తక్కువ సమయం ఉండడం అధికార పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. అధినేత చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై నాన్చివేత ధోరణి అవలంభిస్తుండడంపై ఆశావాహులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్, జనసేన జిల్లాలో ఊసే లేకుండా పోయింది. జనం హర్షం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించిడంపై ఓటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అరాచకాలు.. అధికార దుర్వినియోగం, అవినీతి అక్రమాలతో విసిగి పోయిన జనం మాత్రం షెడ్యూల్ విడుదల కావడంతో జిల్లాలో కొందరు బాణా సంచాలు పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. నేటితో అరాచకపాలనకు తెరపడినట్లేనని సంబరపడుతుండటం గమనార్హం. -
వైఎస్సార్సీపీ నేతలను నిర్బంధించి కొట్టారు
-
అందుకే శివాజీ అమెరికా పారిపోయాడు
తిరుమల: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, సినీ నటుడు శివాజీ కలిసి ఆపరేషన్ గరుడ పేరుతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చంపడానికి ప్రయత్నించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆర్కే రోజా మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఈ కేసులో ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు, ప్లాన్లో భాగంగానే శివాజీ అమెరికా పారిపోయారని వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు కేబినేట్ సమావేశంలో శివాజీ పాల్గొన్నారని వార్తలు కూడా వచ్చాయని చెప్పారు. టీడీపీతో సంబంధం లేకపోతే అతన్ని ఇంతవరకూ అరెస్ట్ చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆయన మంత్రుల తీరు చూస్తుంటే వెగటు వేస్తుందని వ్యాఖ్యానించారు. ప్రజలకి, ప్రతిపక్షాలకి రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిపై హత్యాయత్నం జరిగితే అది ఒట్టి డ్రామా అని సీఎం చంద్రబాబు కొట్టి పారేయడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్పై జరిగింది హత్యాయత్నం అని రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొన్నారు, మరి ఇప్పుడు ఏమంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. క్రిమినల్ కేసులున్న శ్రీనివాస్కి ఎన్వోసీ తీసుకుని ఎందుకు తన వద్ద పెట్టుకున్నాడో హర్షవర్దన్ చౌదరి చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. జగన్పై హత్యాయత్నం జరిగితే ఆ కోణంలో దర్యాప్తు చేయకుండా కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసు సరైన మార్గంలో విచారణ సాగటం లేదు కనుకనే వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయాలని కేంద్రాన్ని కోరారని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకపోతే ఎందుకు కుట్రకోణంలో విచారించటం లేదని చంద్రబాబుకు సూటిగా ప్రశ్నవేశారు. సోమిరెడ్డి ఒక సోంబేరి రెడ్డిలా తయారయ్యారని, ఐదుసార్లు ఓడిపోయినా, నెల్లూరు ప్రజలు ఛీకొట్టినా మంత్రి పదవి కట్టబెట్టి చంద్రబాబు వెర్రికూతలు కూయిస్తున్నారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. జగన్పై హత్యాయత్నం కేసుకు సంబంధించి టీడీపీ నేతలు రౌడీల్లాగా, గూండాల్లాగా దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం, మంత్రులు దిగజారుడు మాటలు ఆపి, ఇకనైనా బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. వైఎస్ జగన్ ప్రజాబలాన్ని ఓర్వలేకే టీడీపీ, ఆపరేషన్ గరుడను నడిపిస్తోందని అన్నారు. కేసులో కీలక నిందితుడైన శివాజీని అరెస్ట్ చేయకుండా, జగన్ కుటుంబ సభ్యులపై నిందలు వేయడం బాధాకరమన్నారు. వారి మాటలు వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
శ్రీవారి ఆభరణాలపై భక్తుల్లో అనుమానం
-
అందుకే ప్రభుత్వం దిగి వచ్చింది: ఎమ్మెల్యే రోజా
సాక్షి, తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా బుధవారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో రోజా మాట్లాడారు. నిత్యం స్వామివారికి సేవ చేసే రమణదీక్షితులను అవమానపరిచి తొలగించారని టీడీపీపై మండిపడ్డారు. చంద్రబాబు నిరంకుశత్వానికి ఇది నిదర్శనమన్నారు. మహా సంప్రోక్షణ సమయంలో భక్తులను దర్శనానికి అనుమతించకపోతే నిరసన తెలియజేశామని.. దీంతో ప్రభుత్వం దిగి వచ్చిందని తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించిన వారిని వెంటనే టీటీడీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. శ్రీవారి ఆభరణాల వివరాలు ఆన్లైన్లో ఉంచాలని, గతంలో ఆన్లైన్లో ఉంచుతామని చెప్పిన జేఈఓ శ్రీనివాస రాజు ఇప్పటివరకు వాటిని పెట్టలేదని వివరించారు. తిరుమల శ్రీవారి ఆభరణాలు మాయం అయ్యాయని భక్తుల్లో అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. వాటిని నివృత్తి చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విజయనగరంలో గిరిజన గర్భిణీ మహిళ 12 కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్లి బిడ్డను పోగొట్టుకుంది.. కనీస వైద్య సదుపాయం లేకపోవడం వల్లే ఇలా జరిగిందని మండిపడ్డారు. దళితులు, గిరిజనులు అంటే చంద్రబాబుకు పట్టదు.. అందుకే గిరిజన మంత్రిని కూడా నియమించలేదని వెల్లడించారు. -
అనుమానం పెనుభూతమై..
మదనపల్లె క్రైం: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను.. ఓ భర్త అతికిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన సోమవారం రాత్రి మదనపల్లెలో చోటు చేసుకుంది. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన పై పోలీసులు, మృతురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మదనపల్లె పట్టణంలోని అనపగుట్టకు చెందిన సురేంద్ర అలియాస్ సూరి(40) పదిహేనేళ్ల క్రితం క్రితం స్వగ్రామం కురబలకోట మండలం ముదివేడు పంచాయతీ గొడ్డిండ్లపల్లె నుంచి వచ్చి అనపగుట్టలో స్థిరపడ్డాడు. స్థానికంగా ఉంటూ చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడేవాడు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రం వెళ్లిన సూరికి ముళబాగళ్ సమీపంలోని హెచ్.గొల్లపల్లెకు చెందిన రత్నమ్మ, శీనప్ప దంపతుల కుమార్తె రుక్మిణి(38)ని పెళ్లి చేసుకున్నాడు. ఇది వరకే 20 ఏళ్ల క్రితం రుక్మిణికి లక్ష్మణప్పతో మొదటి సారి వివాహం అయింది. వీరికి రెడ్డి కిషోర్ కుమారుడు ఉన్నాడు. సూరికి కూడా ఇది వరకే పెళ్లి అయి భార్య వదిలేసింది. కాగా రుక్మిణి రెండో భార్య. ఈమె ఎస్టేట్లోని ఓ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనికి వెళ్తుండేది. వీరికి నేత్రా(7) కుమార్తె ఉంది. భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. దీంతో తరచూ గొడవలు పడేవారు. రోజూ మాదిరిగానే సోమవారం పనికి వెళ్లి ఇంటికి వచ్చిన రుక్మిణితో సూరిగొడవపడ్డాడు. అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రిస్తుండగా ఇంటిలోని రోకలి బండతో భార్య తలపై మోదాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆమెను స్థానికులు గుర్తించి ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. సూరిపై 2009లో హత్యకేసు, 2012 దారి దోపిడీ, హత్య కేసులు ఉన్నాయి. సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ సురేష్కుమార్, ఎస్ఐ కృష్ణయ్య, సిబ్బంది, ఘటనా స్థలానికి చేరుకుని విచారణ అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గ్రామాల్లో మొదలైన జల్లికట్టు సందడి
-
బాబు తీరుపై మండిపడుతున్న జనం
-
56వ రోజు పాదయాత్ర డైరీ
-
56వ రోజు పాదయాత్ర డైరీ
56వ రోజు 08–01–2018, సోమవారం పూతలపట్టు శివారు, చిత్తూరు జిల్లా. ఈ రోజు తేనెపల్లి దగ్గర 108 అంబులెన్స్ కనిపించింది. వెంటనే నాన్నగారు గుర్తుకొచ్చారు. ఒకప్పుడు దేశవ్యాప్తంగా అందరి మన్ననలు పొందిన అతిగొప్ప పథకమది. కానీ నేడు పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా కనిపిస్తోంది. ఆ అంబులెన్స్ పక్కనే ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు నిలుచున్నారు. వారు నా దగ్గరకు వచ్చి ‘సార్.. మీ నాన్నగారి వల్లే మాకు ఉద్యోగాలొచ్చాయి. అప్పట్లో మాకు ఏ ఇబ్బందీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కొద్ది సంవత్సరాలుగా జీతాలు పెంచడం లేదు. మూడు నెలలుగా అసలు జీతాలే ఇవ్వడంలేదు. చాలా అంబులెన్స్లు మూలనపడ్డాయి. ఉన్నవాటిలో సౌకర్యాలు కూడా సరిగా లేవు. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండానే చాలా వాహనాలను నడిపిస్తున్నారు. ఉద్యోగులపై వేధింపులు ఎక్కువయ్యాయి. దాదాపు పది సంవత్సరాలకు పైబడి పనిచేస్తున్నాం. ఇప్పుడు వేరే ఉద్యోగాలకు వెళ్లలేము. ఇలాంటి పరిస్థితులొస్తాయని కలలో కూడా ఊహించలేదు. మీ నాన్నగారి మీద అభిమానంతో, మీమీద నమ్మకంతో.. మిమ్మల్ని కలవడానికి వచ్చాం’అన్నారు. ఒకప్పుడు గ్రామీణ ప్రజలకు అత్యవసర సేవలందిస్తూ.. ఎన్నో ప్రాణాలను కాపాడుతూ.. పేదల పాలిట సంజీవనిగా పేరొందిన పథకం ఈ స్థితికి చేరుకోవడం చాలా బాధనిపించింది. నాన్నగారు ఈ పథకాన్ని ప్రారంభించి అద్భుతంగా సేవలందించడం చూసి.. దానిని ఆదర్శంగా తీసుకుని దేశంలోని దాదాపు 20కి పైగా రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ పథకం ప్రారంభమైన మన రాష్ట్రంలో తప్ప, మిగతా అన్ని చోట్లా విజయవంతంగా నిర్వహింపబడటం. దీనికి కారణం.. ఎంతో పవిత్రమైన ఆశయంతో, సేవా దృక్పథంతో ప్రారంభమైన ఈ పథకాన్ని కూడా నేటి మన పాలకులు వ్యాపారమయం చేసి అవినీతి ఆదాయ మార్గంగా మలచుకోవడం ఒకటైతే, 108 అనగానే రాష్ట్ర ప్రజలందరికీ నాన్నగారే గుర్తొస్తారు కాబట్టి ఈ పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మరొకటి. యాత్ర ముగిసే సమయంలో కుప్పం నియోజకవర్గానికి చెందిన దళితులు కలిశారు.‘సార్.. మాది గుడిపల్లి మండలం సోడిగానిపల్లి గ్రామం. మా దళితవాడలో మాల గెరిగమ్మ, సూద్ర గెరిగమ్మ అనే దేవాలయాలున్నాయి. ఆ గుడులకు చెందిన విలువైన భూములను టీడీపీ వాళ్లు కబ్జా చేసి, ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. అధికారుల చుట్టూ, కలెక్టర్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోవడంలేదు’అన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో.. దళితులు ఎంతో భక్తితో కొలిచే దేవాలయాలకు చెందిన భూముల్ని ఆయన అనుచరులే ఆక్రమించుకుని అమ్ముతుంటే.. ముఖ్యమంత్రిగారు దానిపై చర్యలు తీసుకోకపోవడం అత్యంత శోచనీయం. అయినా దళితులంటే ఆయనకు ఎలాంటి అభిప్రాయముందో అందరికీ తెలిసిందే. మొన్నటికి మొన్న జెర్రిపోతులపాలెంలో దళిత మహిళపై జరిగిన దాష్టీకాన్ని ఇంకా ప్రజలెవరూ మరువలేదు. ఆఖరికి ‘అవినీతికి కాదేదీ అనర్హం’.. అన్నట్లుగా గుడి భూములను సైతం వదలడంలేదు. మొన్న సదావర్తి భూములను తన బినామీల ద్వారా మింగాలని చూశారు. చివరికి కనకదుర్గమ్మ గుడి భూములనూ వదల్లేదు. మీరే ఇలా ఉంటే.. ఇక మీ అనుచరులు ఎలా ఉంటారు?! ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా? చివరిగా, ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. రాజధాని మొదలుకుని మీ బినామీలకు కట్టబెట్టిన అనేక ప్రాజెక్టులలో సరైన పరిహారం కూడా ఇవ్వకుండా దళితుల భూములను బలవంతంగా లాక్కోవడం నిజం కాదా? ‘దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా..’ అన్న మీ నుంచి ఇంతకన్నా ఏం ఆశిస్తారు..? కొండారెడ్డిపల్లె క్రాస్ వద్ద వైఎస్ జగన్కు నాగలిని బహూకరిస్తున్న అభిమాని -
మహిళను ట్రాక్టర్తో తొక్కించి..
-
చిత్తూరు జిల్లాలో దారుణం: ట్రాక్టర్తో తొక్కించి..
సాక్షి, చిత్తూరు : జిల్లాలో దారుణం జరిగింది. పాత కక్షల కారణంగా భార్యాభర్తలపై రంజిత్ అనే వ్యక్తి ట్రాక్టర్ ఎక్కించాడు. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా...మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన యాదమర్రి మండలం వరిగపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో భార్య విమలమ్మ(52) అక్కడికక్కడే మృతి చెందింది. భర్త జగన్నాధ రెడ్డి(65) తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో దగ్గరలోని చిత్తూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే...వరిగపల్లి గ్రామానికి చెందిన జగన్నాధ రెడ్డి, రంజిత్ మధ్య కొంతకాలంగా భూ తగాదాలు ఉన్నాయి. ఈ విషయంపై కోర్టు కేసు కూడా నడుస్తోంది. భూమిపై ఇంజక్షన్ ఆర్డర్ తీసుకువచ్చిన జగన్నాథ రెడ్డి ఇవాళ ఆ భూమిని ట్రాక్టర్తో సాగుచేసేందుకు ప్రయత్నించాడు. కేసు కోర్టులో ఉండగా ఎలా దున్నుతావని, రంజిత్ స్నేహితుడు గోవిందరాజులు.. జగన్నాధ రెడ్డి దంపతులను ప్రశ్నించాడు. ఈ విషయాన్ని రంజిత్కు సమాచారం అందించడంతో అక్కడకు వచ్చిన అతడు వారిపై నుంచి ట్రాక్టర్ను పోనివ్వడంతో విమలమ్మ అక్కడికక్కడే చనిపోయింది. జగన్నాధ రెడ్డికి తీవ్రగాయాలు అయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జేసీ వాహనం ఢీకొని వ్యక్తి మృతి
చిత్తూరు , తిరుపతి అర్బన్ : జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీషా వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి తిరుపతి పరిధిలోని కరకంబాడి రోడ్డులో జరిగింది. ఈ ఘటనలో తిమ్నినాయుడుపాలెంకు చెందిన చిల్లర కొట్టు వ్యాపారి ఎం.వెంకటేశ్వర్లు(39) అక్కడికక్కడే మృతి చెందారు. రెండునెలల వ్యవధిలో జేసీ గిరీషా వాహనం ఢీకొని మృతిచెందిన వారిలో వెంకటేశ్వర్లు రెండోవ్యక్తి. సంఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా రాత్రి రుయాస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి రుయావద్ద మృతుని కుటుంబ సభ్యులు, తిమ్మినాయుడుపాలెం స్థానికులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటేశ్వర్లు కరకరంబాడి రోడ్డు పక్కన చిల్లర కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం తిరుమలలో గరుడసేవ కారణంగా అవసరమైన ఇంటి వస్తువులు, పూజాసామగ్రి కొనుగోలు చేసేందుకు ఇంటికి బయలుదేరారు. ఈ తరుణంలో కరకంబాడి మెయిన్ రోడ్డునుంచి తిమ్మినాయుడు పాలెంకు వెళ్లే దారివద్ద జేసీ వాహనం ఢీకొనడంతో వెంకటేశ్వర్లు తలకు తీవ్రంగా గాయపడ్డాడు. రక్తపుమడుగులో పడి అక్కడే మరణించాడు. అయితే జేసీ వాహనం కరకంబాడి వైపునుంచి తిరుపతికి చాలా స్పీడ్గా, దురుసుగా వెళ్లడం వల్లే ప్రమాదం తీవ్రమై వెంకటేశ్వర్లు ప్రాణాలు విడిచాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా రెండు నెలల క్రితం కూడా జేసీ వాహనం పుత్తూరు వద్ద రోడ్డుపై వెళ్తున్న స్కూల్ పిల్లాడిని ఢీకొట్టి మరణానికి కారణమైంది. అయితే ఆరోజు వాహనం నడిపిన డ్రైవరు, మంగళవారం రాత్రి కరకంబాడి రోడ్డులో వాహనం నడిపిన డ్రైవరూ ఒకరేనని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇంటికి పెద్ద దిక్కు అయిన వెంకటేశ్వర్లు మృతితో అతని భార్య రాధ, ఎనిమిదేళ్ల కొడుకు గణపతి, తల్లి, ఇతర కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
ఆటో బోల్తా, విద్యార్ధినికి గాయాలు
వి.కోట: ఆటో బోల్తాపడి ఓ విద్యార్ధినికి తీవ్రగాయాలు కాగా, మరో ముగ్గురికి స్వల్పంగా గాయపడిన సంఘటన వి.కోట మండలం పామునిగానిపల్లి వద్ద మంగళవారం ఉదయం జరిగింది. వి.కోట మండలం పాతూరుకి చెందిన చంద్ర పామునిగానిపల్లి జడ్పీ హైస్కూల్లో 8వ తరగతి చదువుతోంది.ఈ రోజు ఉదయం స్కూల్కి వెళ్లేందుకు షేరింగ్ ఆటో ఎక్కింది. విద్యార్ధిని వెళుతున్న ఆటో పాముగానిపల్లి వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో విద్యార్ధిని కాలు విరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి స్వల్ప గాయలయ్యాయి. క్షతగాత్రులను కుప్పం ఆరోగ్య కేంద్రానికి తరలించారు.