companies
-
అప్పుడు 90 గంటలు.. ఇప్పుడు మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు
''ఇంట్లో కూర్చుని ఎంతసేపని భార్యని చూస్తూ ఉంటారు?.. ఇంట్లో కంటే ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని మీ భార్యకు చెప్పండి. వారానికి 90 గంటలు పనిచేయండి. నేను ఆదివారాలు కూడా పనిచేస్తున్నా.. ఆరోజు మీతో పని చేయించలేక పోతున్నందుకు బాధపడుతున్నా. అలా చేయించగలిగితే నాకు చాలా హ్యాపీ'' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లార్సెన్ & టూబ్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ (SN Subrahmanyan).. మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు.మంగళవారం చెన్నైలో జరిగిన CII మిస్టిక్ సౌత్ గ్లోబల్ లింకేజెస్ సమ్మిట్ 2025లో సుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ.. సౌకర్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నిర్మాణ పరిశ్రమకు కార్మికుల కొరత ఏర్పడుతోంది. భారతదేశంలో కార్మికులు పనిచేయడానికి ఇష్టపడటం లేదు. ప్రభుత్వం అందించే కొన్ని పథకాల కారణంగా.. కార్మికుల ఆర్ధిక వ్యవస్థ బాగానే ఉందని, బహుశా ఈ కారణంగానే వారు పనిచేయడానికి ఇష్టపడటం లేదని అన్నారు.కార్మికుల కొరత భారతదేశ మౌలిక సదుపాయాల నిర్మాణంపై ప్రభావం చూపుతోంది. ఎల్ అండ్ టీ సంస్థకు 4 లక్షల మంది కార్మికులు అవసరం. కానీ అవసరమైన మేర కార్మికులు లభించడం లేదు. అంతే కాకుండా ద్రవ్యోల్బణం కారణంగా.. కార్మికుల వేతనాలను కూడా సవరించాల్సిన అవసరం ఉందని సుబ్రహ్మణ్యన్ పేర్కొన్నారు.కార్మికులలో మాత్రమే కాకుండా.. ఉద్యోగులలో కూడా అదే ధోరణి ఉందని సుబ్రమణ్యన్ అన్నారు. నేను ఎల్ అండ్ టీ కంపెనీలో ఇంజినీర్గా ఉద్యోగంలో చేరినప్పుడు.. మా బాస్ ఢిల్లీలో పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. దానికి నేను ఒకే చెప్పాను. కానీ ఇప్పుడు ఎవరికైనా ఢిల్లీలో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని చెబితే ఉద్యోగాన్నే వదిలేసి వెళ్ళిపోతారు అని అన్నారు.90 గంటల పనిపై చర్చవారానికి 90 గంటలు, ఆదివారాలు కూడా పనిచేయాలని చెప్పిన సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు గతంలో చర్చకు దారితీశాయి. దీనిపై ఆదార్ పూనవాలా, ఆనంద్ మహీంద్రా, ఐటీసీ సంజీవ్ పూరి వంటి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు స్పందిస్తూ.. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి వివరించారు.గరిష్ట పని గంటలను వారానికి 70 లేదా 90 గంటలకు పెంచే ప్రతిపాదనను పార్లమెంటుకు కూడా చేరింది. బడ్జెట్కు ముందు ఆర్థిక సర్వేలో వారానికి 60 గంటలకు పైగా పని చేయడం వల్ల.. ఆరోగ్యం దెబ్బ తింటుందని, ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయని వెల్లడించారు. రోజుకు 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సేపు పనిచేస్తే.. శారీరక, మానసిక సమస్యలు ఎదురవుతాయని ఒక సర్వేలో కూడా తెలిసింది. -
టాటా బోయింగ్ అరుదైన ఘనత: 300వ AH-64 అపాచీ ఫ్యూజ్లేజ్
టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (TBAL) హైదరాబాద్లోని.. దాని తయారీ కేంద్రం నుంచి 300వ ఏహెచ్-64 అపాచీ ఫ్యూజ్లేజ్ డెలివరీ చేసింది. ఈ ఫ్యూజ్లేజ్లను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల కోసం తయారు చేస్తారు.సుమారు 14,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఉత్పత్తి కేంద్రంలో కంపెనీ AH-64 అపాచీ హెలీకాఫ్టర్ ఫ్యూజ్లేజ్లతో పాటు.. సెకెండరీ స్ట్రక్చర్లను కూడా తయారు చేస్తోంది. భారతదేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, స్వదేశీ తయారీ నైపుణ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి TBAL నిరంతర అంకితభావాన్ని ఇది నిదర్శనం.భారత వైమానిక దళం వద్ద ప్రస్తుతం 22 AH-64 అపాచీ హెలికాఫ్టర్లు ఉన్నాయి. బోయింగ్ అండ్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) మధ్య ఉమ్మడి వెంచర్ 900 మందికి పైగా ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను నియమించింది. ఏరో స్ట్రక్చర్లను అసెంబుల్ చేయడానికి ఉపయోగపడే విడి భాగాల్లో దాదాపు 90 శాతం వరకు దేశీయంగానే తయారవుతాయి. -
టెస్లా బాస్ చేతికి టిక్టాక్?: మస్క్ ఏం చెప్పారంటే..
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో అధిక ప్రజాదరణ పొందిన చైనా షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ (TikTok)ను ఇప్పటికే భారత్తో సహా చాలా దేశాలు నిషేధించాయి. అమెరికా కూడా ఈ యాప్ను నిషేదించనున్నట్లు సమాచారం. కానీ దీనిని (టిక్టాక్) ఇలాన్ మస్క్ (Elon Musk) కొనుగోలు చేయనున్నట్లు కొన్ని వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత?.. దీనిపై మస్క్ అభిప్రాయం ఏంటనేది ఇక్కడ చూసేద్దాం.భద్రతా కారణాల దృష్ట్యా.. టిక్టాక్ యాప్ను అమెరికా నిషేధించాలని యోచిస్తోంది. ఈ నిషేధం నుంచి తప్పించుకోవడానికి.. టిక్టాక్ మాతృ సంస్థ బైట్డ్యాన్స్ (ByteDance) ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత మస్క్కు విక్రయించాలని ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. దీనిపై మస్క్ స్పందించారు.నేను టిక్టాక్ కొనుగోలుకు బిడ్డింగ్ వేయలేదు. దానిని కొనుగోలు చేయాలనే ఆసక్తి నాకు లేదు. ఒకవేళా ఆ యాప్ కొనుగోలు చేస్తే దానిని ఏమి చేయాలో తెలియదు. కంపెనీలను కొనుగోలు చేయడం కంటే.. కొత్త కంపెనీలను నెలకొల్పడమే నాకు ఇష్టం అని మస్క్ స్పష్టం చేశారు.2017లో ప్రారంభమైన టిక్టాక్, అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయింది. ఎంత వేగంగా ప్రజాదరణ పొందిందో.. అంతే వేగంగా ఈ యాప్ను పలు దేశాలు రద్దు చేశాయి. అమెరికా కూడా ఈ యాప్పై ఆంక్షలు విధించింది. చైనా యాజమాన్యాన్ని వదులుకోకపోతే టిక్టాక్ నిషేధాన్ని ఎదుర్కోక తప్పదనే బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఇటీవల ఆమోదం తెలిపింది.ఇదీ చదవండి: యూట్యూబర్పై సెబీ కన్నెర్ర: ఎవరీ అస్మితా పటేల్?అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం.. తరువాత అమెరికా సుప్రీంకోర్టు కూడా టిక్టాక్ మాతృసంస్థ బైట్డ్యాన్స్కు ఓ డెడ్లైన్ ఇచ్చింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన 75 రోజుల్లో టిక్టాక్ను విక్రయించాలని సూచించింది. అయితే కంపెనీ జాయింట్ వెంచర్లో అమెరికాకు 50 శాతం వాటా ఇస్తే.. టిక్టాక్కు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో సంస్థ టిక్టాక్ను మస్క్కు విక్రయించనున్నట్లు వార్తలు వచ్చాయి. -
ఐపీవోకు 7 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(Sebi) తాజాగా 7 కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ జాబితాలో డిఫెన్స్ తయారీ కంపెనీ ఏఎంపీపీసహా.. ఆదిత్య ఇన్పోటెక్, బ్రిగేడ్ హోటల్, కుమార్ ఆర్క్ టెక్, సోలార్ వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్, ఇండోగల్ఫ్ క్రాప్ సైన్సెస్, గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్, ప్రోస్టార్ ఇన్ఫోసిస్టమ్స్ చేరాయి. అయితే ఆటో విడిభాగాల సంస్థ వినే కార్పొరేషన్ ముసాయిదా పేపర్స్ను ఇటీవలే వెనక్కి తీసుకుంది. మర్చంట్ బ్యాంకర్ల వివరాల ప్రకారం ఇవన్నీ ఉమ్మడిగా రూ. 7,800 కోట్లు సమీకరించనున్నాయి. రూ. 4,000 కోట్లపై కన్ను ఐపీవో ద్వారా ఎస్ఎంపీపీ లిమిటెడ్ రూ. 4,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. దీనిలో భాగంగా రూ. 580 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుండగా.. మరో రూ. 3,420 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ శివ్ చంద్ కన్సల్ విక్రయానికి ఉంచనున్నారు. ప్రస్తుతం ప్రమోటర్గా కన్సల్ 50 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 437 కోట్లు అనుబంధ కంపెనీ ద్వారా పెట్టుబడి వ్యయాలపై వెచ్చించనుంది. రూ. 1,300 కోట్ల సమీకరణ ఆదిత్య ఇన్ఫోటెక్ ఐపీవో ద్వారా రూ. 1,300 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. దీనిలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుండగా.. మరో రూ. 800 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ నిధుల్లో రూ. 375 కోట్లు రుణాల చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రూ. 900 కోట్లకు సై ఆతిథ్య రంగ కంపెనీ బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ ఐపీవోలో భాగంగా రూ. 900 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా పెట్టుబడులను సమీకరించాలని ఆశిస్తోంది. వీటిలో రూ. 481 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 59 కోట్లు మెటీరియల్ అనుబంధ సంస్థ ఎస్ఆర్పీ ప్రోస్పరిటా హోటల్ వెంచర్స్కు కేటాయించనుంది. మరో రూ. 108 కోట్లు భూమి కొనుగోలుకి వెచ్చించనుంది. రూ. 740 కోట్లపై దృష్టి పీవీసీ బ్లెండ్ ఆధారిత బిల్డింగ్ మెటీరియల్ తయారీ కంపెనీ కుమార్ ఆర్క్ టెక్ ఐపీవో ద్వారా రూ. 740 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. రూ. 500 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనుండగా.. మరో రూ. 240 కోట్ల విలువైన ఈక్విటీని కంపెనీ తాజాగా జారీ చేయనుంది. ఈ నిధుల్లో రూ. 182 కోట్లు అనుబంధ సంస్థ టేలియస్ ఇండస్ట్రీలో పెట్టుబడికి వెచ్చించనుంది. రూ. 600 కోట్లకు రెడీ సోలార్వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఐపీవోలో భాగంగా రూ. 600 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. దీనిలో రూ. 550 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 50 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. రూ. 200 కోట్లతోపాటు.. ఐపీవోలో భాగంగా ఇండోగల్ఫ్ క్రాప్సైన్సెస్ రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 38.55 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. 1.9 కోట్ల షేర్ల జారీ గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ ఐపీవోలో భాగంగా 1.9 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. నిధులను పరికరాల కొనుగోలు, వర్కింగ్ క్యాపిటల్, సాధరణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. పబ్లిక్ ఇష్యూకు ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ ఐపీవోలో భాగంగా పవర్ సొల్యూషన్లు, ప్రొడక్టుల తయారీ కంపెనీ ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ 1.6 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. నిధులను రుణ చెల్లింపులు, అనుబంధ సంస్థలో వాటా కొనుగోలు, వర్కింగ్ క్యాపిటల్, సాధరణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. సెబీకి ఉయ్వర్క్ ఇండియా ప్రాస్పెక్టస్వర్క్స్పేస్ సేవల సంస్థ ఉయ్వర్క్ తమ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) సంబంధించి ముసాయిదా ప్రాస్పెక్టస్ని (డీఆర్హెచ్పీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమరి్పంచింది. ఈ ఇష్యూలో భాగంగా కంపెనీ 4,37,53,952 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనుంది. ఐపీవో పూర్తిగా ఓఎఫ్ఎస్ రూపంలో ఉంటుంది కాబట్టి ఇష్యూ ద్వారా వచ్చే నిధులు కంపెనీకి లభించవు. వ్యక్తులు, చిన్నా .. పెద్ద వ్యాపార సంస్థలు, అంకురాలు మొదలైన కస్టమర్లకు నాణ్యమైన వర్క్స్పేస్లను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. -
రెండేళ్లలో 1,000 ఐపీవోలు
న్యూఢిల్లీ: రానున్న రెండేళ్లలో మొత్తం 1,000 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టే వీలున్నట్లు దేశీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల అసోసియేషన్(ఏఐబీఐ) తాజాగా అంచనా వేసింది. ఇందుకు ప్రధానంగా ఆర్థిక వృద్ధి, సానుకూల స్టాక్ మార్కెట్లు, మెరుగుపడనున్న నియంత్రణా సంబంధ నిబంధనలు తోడ్పాటు నివ్వగలవని పేర్కొంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26)లో అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా కంపెనీల నిధుల సమీ కరణ రూ. 3 లక్షల కోట్లను అధిగమించవచ్చునని అభిప్రాయపడింది. రానున్న రెండేళ్ల(2026, 2027)లో దేశీ క్యాపిటల్ మార్కెట్లు భారీ ప్రగతిని సాధించనున్నట్లు ఏఐబీఐ తెలియజేసింది. గత ఆరేళ్లలో 851 కంపెనీలు ఐపీవోలు చేపట్టడం ద్వారా మొత్తం రూ. 4.58 లక్షల కోట్లు సమీకరించినట్లు వెల్లడించింది. వీటిలో 281 కంపెనీలు మెయిన్ బోర్డు నుంచి లిస్ట్కాగా.. 570 సంస్థలు ఎస్ఎంఈ విభాగానికి చెందినవిగా తెలియజేసింది. గతేడాదిలో గత ఆర్థిక సంవత్సరం(2023–24) స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ ద్వారా దేశీ కంపెనీలు ఉమ్మడిగా రూ. 67,955 కోట్లు సమకూర్చుకున్నట్లు ఏఐబీఐ పేర్కొంది. వీటిలో ప్రధాన కంపెనీలు రూ. 61,860 కోట్లు అందుకోగా.. ఎస్ఎంఈలు రూ. 6,095 కోట్ల పెట్టుబడులు సమీకరించాయి. మరోవైపు క్విప్ ద్వారా 61 కంపెనీలు రూ. 68,972 కోట్ల నిధులను సమీకరించాయి. ఐపీవోల పరిమాణంరీత్యా గతేడా ది భారత్ ప్రపంచవ్యాప్తంగా తొలి స్థానంలో నిలిచినట్లు ఏఐబీఐ చైర్మన్ మహావీర్ లునావట్ తెలియజేశారు. మొత్తం 335 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచ్చినట్లు వెల్లడించారు. తద్వారా యూఎస్, యూ రప్లను భారత్ అధిగమించినట్లు పేర్కొన్నారు. గత రెండేళ్ల బాటలో వచ్చే ఏడాదిలోనూ ఐపీవోలు రికార్డ్ సృష్టించనున్నట్లు అంచనా వేశారు. వెరసి క్విప్లు, ఐపీవోల ద్వా రా రూ. 3 లక్షల కోట్ల ను మించి పెట్టుబడుల సమీకరణకు వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.ల్యూమినో ఇండస్ట్రీస్ లిస్టింగ్ బాట సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు కండక్టర్స్, పవర్ కేబుళ్ల తయారీ కంపెనీ ల్యూమినో ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 420 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 15 కోట్లు పరికరాల కొనుగోలుకి వెచ్చించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా ప్రొడక్ట్ ఆధారిత ఈపీసీ సేవలు అందిస్తోంది. కండక్టర్స్, పవర్ కేబుళ్లు, ఎలక్ట్రికల్ వైర్లతోపాటు విద్యుత్ ప్రసారం, పంపిణీకి చెందిన ఇతర ప్రత్యేక విడిభాగాలను సైతం రూపొందిస్తోంది. కంపెనీ క్లయింట్లలో కల్పతరు ప్రాజెక్ట్స్, మాంటె కార్లో, జాక్సన్ లిమిటెడ్, వరోరా కర్నూల్ ట్రాన్స్మిషన్ తదితరాలున్నాయి. అంతేకాకుండా దేశ, విదేశీ ప్రభుత్వ విద్యుత్ బోర్డులు సైతం కస్టమర్ల జాబితాలో ఉన్నాయి. 2024 సెప్టెంబర్కల్లా కంపెనీ ఆర్డర్ బుక్ విలువ రూ. 1,804 కోట్లకు చేరింది. గతేడాది(2023–24) ఆదాయం 85% జంప్చేసి రూ. 1,407 కోట్లను తాకగా.. నికర లా భం రూ. 19 కోట్ల నుంచి రూ. 87 కోట్లకు ఎగసింది. ఐపీవో గ్రే మార్కెట్పై సెబీ కన్నుప్రీలిస్టింగ్ ట్రేడింగ్ను అనుమతించే యోచనపబ్లిక్ ఇష్యూల అనధికార క్రయవిక్రయాల(గ్రే మార్కెట్)కు చెక్ పెట్టే యోచనలో ఉన్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పేర్కొంది. ఇందుకు ఒక వ్యవస్థను ప్రవేవపెట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు సెబీ చైర్పర్శన్ మాధవీ పురీ బచ్ పేర్కొన్నారు. తద్వారా ఐపీవోలో షేర్లను పొందగల ఇన్వెస్టర్లు ముందుగానే వీటిని విక్రయించేందుకు వీలు కల్పించనున్నట్లు తెలియజేశారు. ఇటీవల కాలంలో పలు ఐపీవోలకు భారీస్థాయిలో స్పందన లభించడంతోపాటు.. అధిక లాభాలతో లిస్టవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొద్దికాలంగా గ్రే మార్కెట్ లావాదేవీలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు ఇలాంటి లావాదేవీలను కోరుకుంటుంటే నియంత్రణల పరిధిలో వీటిని ఎందుకు అనుమతించకూడదంటూ వ్యాఖ్యానించారు. దేశీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల అసోసియేషన్ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో బచ్ ఇంకా పలు అంశాలపై స్పందించారు. నిజానికి గ్రే మార్కెట్ లావాదేవీలు సరికాదని, ఆర్గనైజ్డ్ మార్కెట్ ద్వారానే క్రయవిక్రయాలు చేపట్టడం శ్రేయస్కరమని బచ్ తెలియజేశారు. ఇందుకు రెండు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్గదర్శకాలు సిద్ధమయ్యాక ఐపీవో షేర్లకు లిస్టింగ్కంటే మూడు రోజులు ముందుగా లావా దేవీలకు తెరతీయనున్నట్లు వివరించారు. షేర్ల కేటాయింపులు, లిస్టింగ్ మధ్యలో ఇందుకు వీలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగం కొన్ని కంపెనీలు ఐపీవోల ద్వారా సమీకరించిన నిధులను దురి్వనియోగపరుస్తున్నట్లు గుర్తించామని బచ్ తెలియజేశారు. క్యాపిటల్ మార్కెట్లలో ఇలాంటి సంస్థలు కార్యకలాపాలు నిర్వహించకుండా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు అడ్డుకోవాలని సూచించారు. ఐపీవో డాక్యుమెంట్లను వేగంగా పరిశీలించి అనుమతులిచ్చేందుకు వీలుగా ఒక సాధనాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ఐబ్యాంకర్లకు ఇలాంటి కంపెనీలగురించి తెలుస్తుందని, ఇలాంటి వాటికి సహకరించవద్దని సలహా ఇచ్చారు. ఎస్ఎంఈ విభాగంలో ఇలాంటి ఐపీవోలు వెలువడితే అధిక సబ్ర్స్కిప్షన్ నమోదవుతున్నదని చెప్పారు. ఆపై షేరు ధర భారీగా పెరుగుతూపోవడం ద్వారా ప్రమోటర్లు త్వరితగతిన లాభపడుతున్నట్లు వివరించారు. సంబంధిత పార్టీ లావాదేవీల ద్వారా ఐపీవో నిధులను కొన్ని కంపెనీలు ప్రమోటర్ సంబంధ సంస్థలలోకి చేర్చడం లేదా రక్షణాత్మక ప్రాంతాలకు మళ్లించడం చేస్తున్నట్లు బచ్ తెలియజేశారు. ఈ నిధులను విదేశీ మార్కెట్లలో ఇతర సంస్థలు లేదా సాఫ్ట్వేర్ వంటి ప్రొడక్టుల కొనుగోలుకి వినియోగిస్తున్నాయని వివరించారు. -
సరికొత్త ప్రచారం!
సాక్షి, అమరావతి : వాట్సాప్ లేదా మెసేజ్లు తెరవగానే ప్రెస్టేజ్ నుంచి ప్రత్యేక ఆఫర్లు.. తనిష్క్ మీ కోసం ప్రత్యేకమైన ఆఫర్లు.. అంటూ పలు కంపెనీల మెసేజ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇటువంటి బిజినెస్ మెసేజింగ్పై కంపెనీలు పెద్ద ఎత్తున దృష్టి సారిస్తున్నాయి. సాధారణ మెసేజ్లతో పోలిస్తే బిజినెస్ మెసేజ్లు 90 శాతంపైగా చదువుతుండటంతో వ్యాపార సంస్థలు తమ ప్రచారం కోసం బిజినెస్ మెసేజింగ్ను ఎంచుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో బిజినెస్ మెసేజింగ్ రూపు రేఖలు వేగంగా మారిపోతున్నాయి. వినియోగదారుల వ్యక్తిగత అభిరుచికి అనుగుణంగా ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వ్యాపార ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఇందుకోసం రిచ్ కమ్యూనికేషన్స్ సర్విసెస్ (ఆర్సీఎస్), జెనరేటివ్ ఏఐ, చాట్బోట్ వంటి సాధనాలపై దృష్టి సారిస్తున్నాయి. సాధారణ స్పామ్ మెసేజ్లు, ఇతర మెసేజ్లతో పోలిస్తే ఈ బిజినెస్ మెసేజ్లు ఎటువంటి మోసాలకు ఆస్కారం లేకుండా సెక్యూరిటీ ఉండటం, చూడగానే ఆకర్షించే విధంగా విజువల్ ఆడియోతో ఉంటుండటంతో కంపెనీలు వీటిపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. ప్రతి కంపెనీ తమ ఉత్పత్తుల ప్రచారం, లేదా సమాచారం ఎప్పటికప్పుడు అందించడం కోసం గూగుల్, యాపిల్ వంటి సంస్థలు అందిస్తున్న సర్విసు సేవలను వినియోగించుకుంటున్నాయి. రూ.26 వేల కోట్ల మార్కెట్దేశీయ బిజినెస్ మెసేజింగ్ మార్కెట్ పరిమాణం 2024లో రూ.6,885 కోట్లుగా ఉండగా, 2025లో బిలియన్ డాలర్లు అంటే రూ.8,500 కోట్ల మార్కును అధిగమిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2030 నాటికి ఈ మార్కెట్ పరిమాణం మూడు రెట్లు పెరిగి రూ.26,000 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కంపెనీలు అందిస్తున్న వాయిస్ బోట్స్ సర్విసులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో 4 శాతం కంపెనీలు ఈ బిజినెస్ మెసేజింగ్ సేవలు వినియోగించుకుంటుండగా, మరో 30 శాతం కంపెనీలు జనరేటివ్ ఏఐపై ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దేశీయ బిజినెస్ మెసేజింగ్ మార్కెట్లో 50 శాతం వాటాను వాట్సాప్ అందిస్తున్న ఆర్సీఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉందంటున్నారు. 2029 నాటికి దేశవ్యాప్తంగా ఆర్సీఎస్ లావాదేవీల సంఖ్య 2.54 కోట్లు దాటడంతోపాటు ఈ వ్యాపార పరిమాణం ఒక్కటే రూ.4,624 కోట్లు దాటుందని అంచనా వేస్తున్నారు. -
జీరో కార్బన్ ఉద్గారాల వైపు ప్యూర్ ఈవీ
జీరో కార్బన్ ఉద్గారాల వైపు అడుగులు వేస్తూ.. ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'ప్యూర్ ఈవీ' (Pure EV) పునరుత్పత్పాదక శక్తి ద్వారా విద్యుత్ బిల్లులను గణనీయంగా తగ్గించుకుంది. తెలంగాణలోని కంపెనీ సదుపాయంతో డీజీ అండ్ గ్రిడ్తో కూడిన 500 కిలోవాట్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్.. 125 కిలోవాట్ సిస్టం వంటి వాటిని ఏకీకృతం చేయడం ద్వారా.. ఎనర్జీ ఎఫిషియన్సీలలో సరికొత్త మైలురాయిని సాధించింది. మునుపటి ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే.. విద్యుత్ బిల్లులకు సంబంధించిన ఖర్చులలో 60 శాతం, డీజీ ఇంధన బిల్లులలో 65 శాతం తగ్గింపును నమోదు చేసింది.సోలార్ ఇన్స్టాలేషన్ అనేది కంపెనీ కార్యకలాపాలను శక్తివంతం చేయడానికి.. పునరుత్పాదక శక్తిని వినియోగించుకోవడానికి మాత్రమే కాకుండా గ్రిడ్ నుంచి విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించడానికి సహాయం చేస్తుంది. 500 KWh పూర్తిగా కొత్త బ్యాటరీలను కలిగి ఉంటుంది. అంటే పాత బ్యాటరీల స్థానంలో లేటెస్ట్ జనరేషన్ బ్యాటరీలను అమర్చింది. ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. పూర్తిగా ఎలక్రిక్, సోలార్ వంటి వాటిని ఉపయోగించడం వల్ల కాలుష్య తీవ్రతను తగ్గించవచ్చు.పునరుత్పాదక శక్తిని ఉపయోగించుకునే శక్తిని కంపెనీ పొందినందుకు చాలా సంతోషిస్తున్నాము. ఇది పర్యావరణానికి అనుకూలంగా ఉండటమే కాకుండా.. ఖర్చులను కూడా గణనీయంగా తగ్గించడంలో సహాయపడుతుందని ప్యూర్ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ డా. నిశాంత్ దొంగరి అన్నారు. లేటెస్ట్ పవర్ స్టోరేజ్ టెక్నాలజీతో కలిసి సోలార్ పవర్ (Solar Power) ఉపయోగించడం ద్వారా.. మేము భవిష్యత్తులో గొప్ప పురోగతిని సాధించవచ్చని ఆయన అన్నారు. అంతే కాకుండా జీరో కార్బన్ ఉద్గారాలు మా లక్ష్యం అని అన్నారు. -
ప్లాస్టిక్ బాటిల్ వాటర్తో హై రిస్క్: ఇండస్ట్రీ ఇవి కచ్చితంగా పాటించాల్సిందే!
ఎన్ని హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తున్నా, ఏ మాత్రం లక్ష్య పెట్టకుండా ఇబ్బడి ముబ్బడిగా ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్లు తాగుతున్న మనందరికి భారతదేశ ఆహార నియంత్రణ సంస్థ ఒక హెచ్చరిక లాంటి వార్తను అందించింది. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ , మినరల్ వాటర్ను "హై-రిస్క్ ఫుడ్" కేటగిరీలో చేర్చింది. అంతేకాదు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ధృవీకరణను తొలగించాలనే ఆదేశాలు జారీ చేసింది. అలాగే కఠినమైన భద్రతా ప్రోటోకాల్ను ఆయా కంపెనీలు కచ్చితంగా పాటించాలని పేర్కొందిఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నోటిఫికేషన్ ప్రకారం, కొత్త మార్గదర్శకాలకనుగుణంగా ప్రకారం, తయారీదారులు , ప్రాసెసర్లు లైసెన్స్లు లేదా రిజిస్ట్రేషన్లను మంజూరు చేయడానికి ముందు తప్పనిసరిగా తనిఖీలు చేయించుకోవాలి. అక్టోబరులో, ప్యాకేజ్డ్ వాటర్కి సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ అవసరాన్ని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సవరించిన నిబంధనల ప్రకారం, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ మరియు మినరల్ వాటర్ తయారీ దారులందరూ ఇప్పుడు లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ పొందేందుకు తప్పనిసరిగా వార్షిక, రిస్క్ ఆధారిత తనిఖీలు చేయించుకోవాలి.గతంలో, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ పరిశ్రమ BIS , FSSAI రెండింటి ద్వారా ద్వంద్వ ధృవీకరణ అవసరాల తొలగించాలి డిమాండ్ చేసింది. కానీ ఈ వాదనలను తోసిపుచ్చిన సంస్థలు తప్పని సరిగా తనిఖీలు చేయించాలని, సంబంధిత ధృవీకరణ పత్రాలను పొందాలనిస్పష్టం చేశాయి. దీనికి ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వంటి హై-రిస్క్ ఫుడ్ కేటగిరీలలో వ్యాపారం చేస్తున్నవారు, FSSAI-గుర్తింపు పొందిన మూడవ-పక్ష (థర్డ్పార్టీ) ఆహార భద్రతా ఏజెన్సీల వార్షిక ఆడిట్లను పొందాల్సి ఉంటుంది.హై-రిస్క్ ఫుడ్ కేటగిరీల క్రింద వచ్చే ఇతర ఉత్పత్తులు:పాల ఉత్పత్తులు, అనలాగ్స్పౌల్ట్రీతో సహా మాంసం , మాంసం ఉత్పత్తులు,మొలస్క్లు, క్రస్టేసియన్లు , ఎచినోడెర్మ్లతో సహా చేపలు , చేప ఉత్పత్తులుగుడ్లు , గుడ్డు ఉత్పత్తులునిర్దిష్ట పోషక అవసరాల కోసం ఉద్దేశించిన ఆహార ఉత్పత్తులుతయారుచేసిన ఆహారాలు (ప్రిపేర్డ్ ఫుడ్)భారతీయ స్వీట్లుపోషకాలు, వాటి ఉత్పత్తులు (ఫోర్టిఫైడ్ బియ్యం మాత్రమే)కాగా ప్లాస్టిక్ బాటిల్స్ లోని నీళ్లు తాగడం చాలా ప్రమాదమని ఇప్పటికే చాలామంది నిపుణులు హెచ్చరించారు. ప్లాస్టిక్ పర్యావరణానికి ముప్పు కలిగించటమే కాదు, మానవ ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుందని పేర్కొన్నారు. అనేక రసాయనాలతో తయారైన ప్లాస్టిక్ బాటిల్స్ లోని నీరు తాగటం వల్ల ఒక్కోసారి కేన్సర్ లాంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
ఎనిమిది కంపెనీలకు రూ.7300 కోట్ల పెనాల్టీ!.. కారణం ఇదే..
హ్యుందాయ్ మోటార్, మహీంద్రా, కియా, హోండాతో సహా మొత్తం 8 దిగ్గజ కార్ల తయారీదారులు కేంద్రం గట్టి షాకివ్వనుంది. ఈ కంపెనీలు 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ఉద్గార ప్రమాణాలను పాటించనందుకు అధిక పెనాల్టీని ఎదుర్కోవలసి ఉంటుంది.2022లో అమలులోకి వచ్చిన కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ కెపాసిటీ (CAFE) ప్రమాణాల ప్రకారం.. కంపెనీలు విక్రయించే అన్ని కార్లు 100 కిలోమీటర్లకు 4.78 లీటర్ల కంటే ఎక్కువ ఇంధన వినియోగం జగగకూడదు. అంతే కాకుండా కర్బన ఉద్గారాలు కూడా కిలోమీటరుకు 113 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు. అయితే కంపెనీలు ఈ నియమాలను పెడచెవిన పెట్టినట్లు సమాచారం. ఈ కారణంగానే కేంద్రం ఈ సంస్థలకు రూ.7,300 కోట్లు పెనాల్టీ విధించనుంది.కేంద్రం విధించనున్న ఫెనాల్టీలో అత్యధికంగా హ్యుందాయ్ మోటార్కు (రూ. 2837.8కోట్లు) పడే అవకాశం ఉంది. ఆ తరువాత స్థానంలో మహీంద్రా (రూ.1788.4 కోట్లు), కియా (రూ.1346.2 కోట్లు), హోండా (రూ.457.7 కోట్లు), రెనాల్ట్ (రూ.438.3 కోట్లు), స్కోడా (రూ.248.3 కోట్లు), నిస్సాన్ (రూ. 172.3 కోట్లు), ఫోర్డ్ (రూ.1.8 కోట్లు) ఉన్నాయి.ఈ విషయం మీద ఆటోమొబైల్ కంపెనీనీలు.. కేంద్రంతో చర్చలు జరుపుతున్నాయి. తాము 2023 జనవరి 1నుంచి ఉద్గార ప్రమాణాలకు సంబంధించిన అన్ని నియమాలను కఠినంగా పాటిస్తున్నామని సంస్థలు పేర్కొన్నాయి. కాబట్టి ఆ ఆర్థిక సంవత్సరం మొత్తానికి కలిపి పెనాల్టీ విధించడం సరికాదని చెబుతున్నాయి. దీనిపైన కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. -
ఎలాంటి తప్పులకు పాల్పడలేదు
న్యూఢిల్లీ: అదానీ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ గౌతమ్ అదానీపై యూఎస్లో నమోదైన లంచంఅభియోగంపై గ్రూప్ సీఎఫ్వో జుగేశిందర్ రాబీ సింగ్ ఎక్స్ వేదికగా స్పందించారు. 11 లిస్టెడ్ సంస్థలతో కూడిన అదానీ గ్రూప్ పోర్ట్ఫోలియో కంపెనీల్లో ఏ ఒక్కటీ ఎలాంటి తప్పులకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. న్యాయపరమైన ఆమోదాలు పొందిన తర్వాత యూఎస్లో నేరారోపణపై అదానీ గ్రూప్ వివరణాత్మక వ్యాఖ్యను చేస్తుందని సింగ్ చెప్పారు. ‘సంబంధం లేని అంశాలను ఎంచుకుని, శీర్షిక సృష్టించడానికి ప్రయత్నించే వార్తలు, నివేదికలు చాలా ఉన్నాయి. లీగల్ ఫైల్లో సమర్పించిన విషయాన్ని మేము వివరంగా సమీక్షించిన తర్వాత పూర్తి సమయంలో ప్రతిస్పందిస్తాం. నేరారోపణపై ఏ న్యాయస్థానం ఇంకా తీర్పు ఇవ్వలేదు. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ యొక్క న్యాయవాదులు వివరించినట్లుగా ఇవి ఆరోపణలు మరియు నిందితులు నిర్దోషిగా భావించబడతారు. నేరారోపణ అదానీ గ్రీన్ యొక్క ఒక ఒప్పందానికి సంబంధించినది. ఇది అదానీ గ్రీన్ యొక్క మొత్తం వ్యాపారంలో దాదాపు 10 శాతం. దీని గురించి చాలా ఖచ్చితమైన, సమగ్రమైన వివరాలు ఉన్నాయి. మేము తగిన వేదికలో విశదీకరిస్తాము’ అని జుగేశిందర్ రాబీ సింగ్ వివరించారు. అదానీ చైర్మన్కు సమన్లున్యూయార్క్: యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ కమీషన్ (ఎస్ఈసీ) చేసిన లంచం ఆరోపణలపై తమ వైఖరిని వివరించాల్సిందిగా అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ గౌతమ్ అదానీ మరియు అతని మేనల్లుడు, అదానీ గ్రీన్ ఎనర్జీ డైరెక్టర్ సాగర్లకు సమన్లు అందాయి. 21 రోజుల్లోగా ఎస్ఈసీకి సమాధానం ఇవ్వాలని న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి అహ్మదాబాద్లోని అదానీ శాంతివన్ ఫామ్ నివాసానికి, అదే నగరంలోని అతని మేనల్లుడు సాగర్ నివాసానికి సమన్లు జారీ అయ్యాయి.కెన్యాలో విమానాశ్రయ నిర్వహణ ఒప్పందం కుదుర్చుకోలేదుకెన్యా ప్రధాన విమానాశ్రయాన్ని నిర్వహించడానికి తాము ఎటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోలేదని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. యూఎస్లో లంచం ఆరోపణల నేపథ్యంలో 2.5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఒప్పందాలను కెన్యా రద్దు చేసిందనే వార్తలపై బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ శనివారం స్పందించింది. కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ఆ దేశ ప్రధాన విమానాశ్రయ ప్రాజెక్టు రద్దుకు ఆదేశించినట్లు వచ్చిన నివేదికలను ధృవీకరించుకోవడానికి స్టాక్ ఎక్సే్ఛంజీలు పంపిన నోటీసులకు అదానీ గ్రూప్ ప్రతిస్పందించింది. విమానాశ్రయ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్.. ఈ ఏడాది ఆగస్టులో కెన్యాలో విమానాశ్రయాలను అప్గ్రేడ్ చేయడానికి, ఆధునీకరణకు, నిర్వహణకై ఒక అనుబంధ సంస్థను ఏర్పాటు చేసినట్లు ఒక ఫైలింగ్లో తెలిపింది. ఈ రోజు వరకు కంపెనీకి లేదా దాని అనుబంధ సంస్థలకు కెన్యాలో ఏ విమానాశ్రయ ప్రాజెక్ట్ను అప్పగించలేదని, ఏ విమానాశ్రయానికి సంబంధించి ఏదైనా కట్టుబడి లేదా ఖచ్చితమైన ఒప్పందాన్ని కుదుర్చుకోలేదని సంస్థ తెలిపింది.పవర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టుపై.. కెన్యాలో 30 ఏళ్లపాటు కీలకమైన విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్మించి, నిర్వహించడానికి గత నెలలో సంతకం చేసిన ఒప్పందంపై మాట్లాడుతూ.. సవరించిన సెబీ లిస్టింగ్ నిబంధనల ప్రకారం సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్) రెగ్యులేషన్స్ 2015 యొక్క షెడ్యూల్–3, పార్ట్ ఏ, ప్యారా–బీ ఐటెం 4 పరిధిలోకి ప్రాజెక్ట్ రాదని కంపెనీ తెలిపింది. దీని ప్రకారం దక్కించుకున్న, సవరించిన లేదా రద్దు అయిన కాంట్రాక్టుల గురించి ఎలాంటి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని గ్రూప్ పేర్కొంది. రద్దును నిర్ధారించడానికి లేదా తిరస్కరించడానికి గ్రూప్ నిరాకరించింది. పవర్ ట్రాన్స్మిషన్ లైన్లను నిర్వహించే అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ కెన్యాలో ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ను దక్కించుకున్నట్టు అక్టోబర్ 9న ప్రత్యేక ఫైలింగ్లో తెలిపింది. దీనికి అనుగుణంగా కెన్యాలో అనుబంధ సంస్థను నెలకొల్పినట్టు వివరించింది. -
మీటింగ్కు రాలేదని 90 శాతం ఉద్యోగులను తొలగించిన సీఈఓ
సంస్థ నిర్వహించిన సమావేశానికి హాజరుకాలేదని.. దాదాపు ఉద్యోగులందరినీ సీఈఓ తొలగించిన ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాకు చెందిన మ్యూజిక్ కంపెనీలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.ఉదయం ఉద్యోగులందరీ సమావేశానికి హాజరుకావాలని కంపెనీ సీఈఓ వెల్లడించారు. కానీ ఈ సమావేశానికి 99 మంది హాజరుకాలేదు. దీంతో కోపంతో ఊగిపోయిన సీఈఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీరందరిని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి ఆ కంపెనీలో పనిచేసే మొత్తం ఉద్యోగుల సంఖ్య 110 మంది మాత్రమే. 99 మందిని తీసేస్తూ సీఈఓ నిర్ణయం వల్ల ఆ సంస్థలో 11 మంది మాత్రమే మిగిలారు.ఉద్యోగులను తొలగించడం మాత్రమే కాకుండా.. కంపెనీకి సంబంధించిన వస్తువులు మీ దగ్గర ఏవైనా ఉంటే తిరిగి ఇచ్చేయండి. అన్ని అకౌంట్స్ నుంచి లాగ్ అవుట్ అవ్వండి అంటూ సీఈఓ పేర్కొన్నారు. సమావేశానికి హాజరుకాలేదనే కారణంతో జాబ్ నుంచి తొలగించిన సీఈఓపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పని పూర్తి చేయడంలో నిమగ్నం కావడం వల్లనే, సమావేశానికి హాజరు కాలేదని ఉద్యోగులు చెబుతున్నారు.ఇదీ చదవండి: భర్తకు తెలియకుండా చేసిన పని.. బెంజ్ కంపెనీ బతికేలా చేసిందిఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒక్క సమావేశానికి హాజరు కాలేదని సుమారు 90 శాతం మందిని తొలగించడం ఎంతవరకు న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు మిగిలిన 11 మంది ఉద్యోగులను సీఈఓ పీల్చి పిప్పి చేస్తాడు అని అన్నారు. ఇంకొందరు.. ఇలాన్ మస్క్ నుంచి ఆయన పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చారు. -
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. వందలాది మందికి నోటీసులు
అమెరికన్ దిగ్గజ విమాన తయారీ సంస్థ 'బోయింగ్'.. 438మంది ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులు జారీ చేసింది. గతంలోనే ఈ సంస్థ ఉద్యోగుల తొలగింపులకు సంబంధించిన విషయాన్ని వెల్లడించినప్పటికీ.. ఎట్టకేలకు లేఆఫ్ నోటీసులను జారీ చేసింది. యూఎస్లోని సియాటెల్ ప్రాంతంలో కంపెనీకి చెందిన 33వేల మంది ఉద్యోగులు సమ్మె చేయడం వల్ల వచ్చిన నష్టాన్ని భర్తీ చేయడంలో భాగంగా ఉద్యోగుల తొలగింపులు చేపట్టింది.ఆర్ధిక పరమైన సమస్యలను రూపుమాపుకోవడానికి మాత్రమే కాకుండా.. ఉత్పత్తిలో జరిగిన ఆలస్యాలను దృష్టిలో ఉంచుకుని బోయింగ్ 438 మందికి లేఆఫ్ నోటీసులు అందించింది. ఇందులో 218 మంది ఇంజనీర్లు, సొసైటీ ఆఫ్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్ ఎంప్లాయీస్ ఇన్ ఏరోస్పేస్ (SPEEA) యూనిట్లోని సభ్యులు, మిగిలినవారు టెక్నీకల్ విభాగానికి చెందిన ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. కంపెనీ తన ఉద్యోగులను తొలగించినప్పటికీ.. అర్హత కలిగిన వారికి మూడు నెలల వరకు కెరీర్ ట్రాన్సిషన్ సేవలు, ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు అందించనున్నట్లు సమాచారం.సమ్మె ఎఫెక్ట్సియాటెల్ ప్రాంతంలో బోయింగ్ ఉద్యోగులు సుమారు 33,000 మంది నెల రోజులు సమ్మె చేయడం వల్ల.. 737 మ్యాక్స్, 767, 777 జెట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో కంపెనీ భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి, ఉద్యోగులను తొలగించడానికి సంస్థ సిద్ధమైంది. బోయింగ్ ఉన్న పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు చాలా అవసరమని కంపెనీ సీఈఓ గత నెలలోనే పేర్కొన్నారు. -
ఇషా అంబానీ సారథ్యంలోని ఏడు కంపెనీలు ఇవే..
ముకేశ్ అంబానీ గారాల తనయ 'ఇషా అంబానీ' రిలయన్స్ గ్రూపుకు చెందిన వివిధ రంగాల్లో కీలక బాధ్యతలను నిర్వహిస్తోంది. రిలయన్స్ రిటైల్ మేనేజింగ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తూనే.. ఇతర సంస్థలను కూడా పర్యవేక్షిస్తోంది. ఈ కథనంలో ఇషా సారథ్యంలో ముందుకు సాగుతున్న సంస్థల గురించి తెలుసుకుందాం.తీరా బ్యూటీ (Tira Beauty)ఇషా అంబానీ సారథ్యంలోని ప్రముఖ వెంచర్లలో తీరా బ్యూటీ ఒకటి. ఇది ఏప్రిల్ 2023లో ప్రారంభమైన ఓమ్ని ఛానల్ బ్యూటీ రిటైల్ ప్లాట్ఫామ్. దీని ద్వారా వెర్సేస్, మోస్చినో, డోల్స్ & గబ్బానా వంటి లగ్జరీ ఉత్పత్తులను విక్రయిస్తోంది. ప్రీమియం షాపింగ్ అనుభవాన్ని కస్టమర్లకు అందించడం ఈ ప్లాట్ఫామ్ లక్ష్యం.హామ్లేస్ (Hamleys)రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ 2019లో సుమారు రూ. 620 కోట్లతో టాయ్ రిటైలర్ హామ్లేస్ను కొనుగోలు చేసింది. ఇది కూడా ఇషా అంబానీ పర్యవేక్షణలో ఉంది. హామ్లేస్ అనేది ప్రపంచ మార్కెట్లోని పురాతనమైన, అతిపెద్ద బొమ్మల రిటైలర్లలో ఒకటి. ఇషా అంబానీ ఈ సంస్థను విస్తరించడంలో కీలక పాత్ర పోషించింది.అజియో (Ajio)ఇషా అంబానీ పర్యవేక్షణలో ఉన్న మరో సంస్థ అజియో. లాక్మే ఫ్యాషన్ వీక్ ఎస్ఎస్16 సందర్భంగా ప్రారంభమైన అజియో.. అతి తక్కువ కాలంలోనే ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్గా అవతరించింది. ప్రస్తుతం ఈ కంపెనీ అధిక లాభాలను గడిస్తూ ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తూ దూసుకెళ్తోంది.కవర్ స్టోరీ (Cover Story)ఇషా దర్శకత్వంలో మరో కీలకమైన బ్రాండ్ 'కవర్ స్టోరీ'. ఇది భారతీయ వినియోగదారులకు అంతర్జాతీయ కాస్మొటిక్స్ అందించే మొట్టమొదటి ఫ్యాషన్ బ్రాండ్గా గుర్తింపు పొందింది. ఇతర దేశాల సౌందర్య ఉత్పత్తులను భారతీయులకు పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో దీనిని ప్రారభించారు.ఫ్రెష్పిక్ (Freshpik)2021లో ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్లో.. ఫ్రెష్పిక్ పేరుతో ఇషా అంబానీ ఫుడ్ రిటైల్ కంపెనీని ప్రారంభించింది. ఇందులో అంతర్జాతీయ పదార్థాలు అందుబాటులో ఉంటాయి. ఇది ఆహార ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇది కూడా ఇషా అంబానీ సారథ్యంలో చాలా వేగంగా అభివృద్ధి చెందింది.నెట్మెడ్స్ (Netmeds)ఇషా అంబానీ ఆన్లైన్, ఆఫ్లైన్ కస్టమర్ అవసరాలను తీర్చే లక్ష్యంతో.. చెన్నైలో ఈ-ఫార్మసీ నెట్మెడ్స్ను కూడా పర్యవేక్షిస్తుంది. 2020లో నెట్మెడ్స్ను రిలయన్స్ రిటైల్ కొనుగోలు చేయడం ద్వారా ఔషధ రంగంలోకి ప్రవేశించింది. ఇది కూడా మంచి లాభాలను ఆర్జిస్తూ ముందుకు సాగుతోంది.ఇదీ చదవండి: లేటు వయసులో రెండో పెళ్లికి రెడీ అయిన ప్రపంచ కుబేరుడు.. ఆరేళ్లుగా!7-ఎలెవెన్ (7-Eleven)రిలయన్స్ రిటైల్తో భాగస్వామ్యం ద్వారా ప్రపంచంలోని ప్రముఖ కన్వీనియన్స్ స్టోర్ చైన్ 7-ఎలెవెన్ను భారతదేశానికి తీసుకురావడంలో ఇషా అంబానీ కీలక పాత్ర పోషించింది. భారతీయ వినియోగదారులకు ఐకానిక్ 24/7 కన్వీనియన్స్ స్టోర్ పరిచయం చేసి.. మెరుగైన షాపింగ్ అనుభూతిని అందిస్తోంది. -
18వేల కంపెనీలు.. రూ.25వేల కోట్ల ఎగవేత
న్యూఢిల్లీ: జీఎస్టీ కింద నమోదైన 18,000 కంపెనీలు 25,000 కోట్ల పన్ను ఎగవేత వ్యవహారం వెలుగు చూసింది. ఇటీవలే జీఎస్టీ అధికారులు దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఇది తెలిసింది.కేవలం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) కోసమే 73,000 కంపెనీలు ఏర్పాటైనట్టు పన్ను అధికారులు అనుమానిస్తున్నారు. ‘‘ఎందుకంటే ఈ సంస్థలకు ఎలాంటి అమ్మకాలు లేకపోవడం గమనార్హం. వీటిల్లో 18వేల కంపెనీలు మనుగడలో లేవు. అవి రూ.24,550 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డాయి’’అని ఓ పన్ను అధికారి తెలిపారు. గతేడాది నిర్వహించిన తొలి డ్రైవ్లోనూ.. 21,791 కంపెనీలు రూ.24,010 కోట్లు ఎగవేసినట్టు గుర్తించడం గమనార్హం. -
కొత్త హోదాలతోనే ఉద్యోగాలు.. ఇదే సరికొత్త ట్రెండ్
టెక్నాలజీ ఎంత వేగంగా మారుతుందో.. దానికి తగ్గట్లే వ్యాపార ధోరణి మారుతోంది. ముఖ్యంగా ఉత్పత్తి, సేవా రంగాల్లో పుట్టగొడుగుల్లా కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. అలాగే.. ఉద్యోగాలలోనూ విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2024లో పలు ఉద్యోగాలలో నియామకాలు పొందిన ప్రతి 10 మందిలో ఒకరు.. గత పాతికేళ్లలో వినిఎరుగని కొత్త హోదాలతో ఉద్యోగాలు పొందినట్లు లింక్డ్ఇన్ సర్వే వెల్లడించింది. గత 25 ఏళ్లలో ఏనాడూ వినని పొజిషన్లను పలువురు ఉద్యోగులకు ఆ కంపెనీలు అప్పగించాయని, వాటిల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంజనీర్, సస్టైనబిలిటీ మేనేజర్.. లాంటివి ఉన్నాయని లింక్డ్ఇన్ విభాగం ‘వర్క్ చేంజ్ స్నాప్షాట్’ తెలిపింది.‘‘ఉద్యోగాలలో మార్పులు వేగంగా పెరుగుతున్నాయని యూకేకు చెందిన పలువురు వ్యాపారవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొత్త పొజిషన్లు, నైపుణ్యాలు, సాంకేతికతలకు ఎక్కువ డిమాండ్ ఉందని.. ప్రతీ నలుగురిలో ముగ్గురు ఉద్యోగులు నమ్ముతున్నారు. అలాగే కంపెనీలు సైతం ఆ కొత్త హోదా ఉద్యోగులపైనే అధికంగా అంచనాలు పెంచుకుంటున్నాయి’’ అని ఆ నివేదిక తెలిపింది. ఇందుకోసం చేపట్టిన అధ్యయనంలో.. సుమారు 51 శాతం మంది హెచ్ఆర్ నిపుణులు ఈ అభిప్రాయం వెల్లడించారట. ఇక ఏఐతో సహా కొత్త టెక్నాలజీల వేగంగా అభివృద్ధి చెందటంతో.. యూకే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు 2016 నుంచి 2030 వరకు 65 శాతం వరకు మారవచ్చని లింక్డ్ఇన్ సర్వే డేటా తెలియజేస్తోంది. ఏఐని ఉపయోగిస్తూ బిజినెస్ చేయడానికి సిద్ధమైనవారికి భారీ అవకాశాలు ఉన్నాయని చెప్పింది. తమ సర్వేలో పాల్గొన్న యూకే వ్యాపారవేత్తల్లో అత్యధికులు (80 శాతం) మంది టీం పనితీరును మెరుగుపరచటంలో ఏఐ సామర్థ్యాన్ని గుర్తించారని తెలిపింది. అయితే.. కేవలం 8 శాతం కంపెనీలను మాత్రామే ఏఐ తమను ముందువరసలో ఉంచుతోందని అభిప్రాయపడినట్లు పేర్కొంది. మరోవైపు.. హెచ్ఆర్ నిపుణులపై ఒత్తిడి మేరకు ప్రతి ముగ్గురిలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉద్యోగస్తులు ప్రతిరోజూ వారు తీసుకోవలసిన నిర్ణయాల పట్ల నిరుత్సాహంగా ఉన్నారని తెలిపింది. 15శాతం మంది.. వారంలో పావు వంతు వరకు అవసరమైన తమ పని చేస్తున్నారని వెల్లడించింది.‘‘ప్రస్తుతం సమయంలో వర్క్ ప్లేస్లో మార్పులు వస్తున్నాయి.నిరంతరం అభివృద్ధి చెందుతోంది. ఏఐ వంటి కొత్త సాంకేతికతలు మన రోజువారీ వర్క్ను మెరుగుపరచడానికి గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఏఐ సామర్థ్యాన్ని వాడుకోవటం ఎలా పెంచుకోవాలో కొన్ని బిజినెస్లు పరిశీలన చేస్తున్నాయి’ అని లింక్డ్ఇన్ (యూకే) మేనేజర్ జానైన్ చాంబర్లిన్ అభిప్రాయడ్డారు. -
కార్పొరేట్ జపం!
ఆల్ఫాబెట్స్లో చిట్టచివరి అక్షరమే అయినా.. కొత్తగా పుట్టుకొచ్చే కంపెనీలకిపుడు ‘జెడ్’ తొలి ప్రాధాన్యంగా మారుతోంది. జెన్ జెడ్ ఎఫెక్ట్ కావచ్చు... మరేదైనా కారణం కావచ్చు.. ‘జె’వ్రీథింగ్ ‘జెడ్’ అనేలా బ్రాండ్ బా‘జా’ మోగుతోంది. దశాబ్దకాలంగా జెడ్ కంపెనీల జోరు ఓ రేంజ్లో పెరుగుతూ వస్తోంది! కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2023లో 1,608 కంపెనీలు జెడ్ అక్షరంతో పురుడు పోసుకున్నాయి. 2018తో పోలిస్తే ఈ సంఖ్య ఏకంగా 70 శాతం ‘జూ’మ్ అయ్యింది. మొత్తంమీద ఏర్పాటవుతున్న కొత్త కంపెనీల సంఖ్య ఏటా 9 శాతం పెరుగుతుండగా.. జెడ్ కంపెనీల జోరు 11 శాతంగా ఉంది. ఇక ఈ ఏడాది ఆగస్ట్ నాటికే 1,493 కంపెనీలు జెడ్ అక్షరంతో ఆవిర్భవించడం గమనార్హం. పేరులో ‘జో’ష్ ఉంది... మన దేశంలో ఎవరికైనా.. దేనికైనా పేరు పెట్టడం అంటే పెద్ద ప్రహసనమే. వ్యక్తిగత అంశాల నుంచి, ఆచారాలు, మతాలు, జ్యోతిష్యం, సంఖ్యా శాస్త్రం ఇలా చాలా విషయాలు ప్రభావం చూపుతుంటాయి. అయితే, కంపెనీలు పేర్లు ఖాయం చేయడంలో ఈ అంశాలకు తోడు బ్రాండింగ్, మార్కెటింగ్ టెక్నిక్లు ఇతరత్రా బోలెడన్ని విషయాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ‘మేము ఆట బొమ్మలు, పుస్తకాలు, స్టేషనరీ వ్యాపారాన్ని ప్రారంభించేటప్పడు ఏదైనా సరదాగా ఉండే పేరు కోసం బుర్రబద్దలు కొట్టుకున్నాం. చివరకు జనాల నోళ్లలో నానేలా జిగ్మ్యాగ్ ఎంటర్ప్రైజెస్ అనే పేరును నిర్ణయించాం’ అని ముంబైకి చెందిన హేతల్ సంగానీ చెబుతున్నారు. వాస్తవానికి జిగ్జాగ్ అని పెడదామనుకున్నా.. అది అప్పటికే వేరొకరు రిజిస్టర్ చేసుకోవడంతో జిగ్మ్యాగ్ను ఎంచుకోవాల్సి వచి్చందని ఆయన పేర్కొన్నారు. బ్రాండ్ పేరు పలికేటప్పుడు ఒకరకమైన జోష్ ఉండాలని కొత్తతరం ఎంట్రప్రెన్యూర్స్ కోరుకుంటున్నారు. బోరింగ్గా, పాత వాసనలతో ఉండకూడదనేది వారి అభిప్రాయం. ‘ఈ రోజుల్లో ప్రమోటర్లు పేర్లను ఎంచుకునేటప్పుడు క్యాచీగా, ప్రత్యేకంగా, ట్రెండీగా ఉండేలా చూసుకుంటున్నారు. అంతర్జాతీయంగానూ గుర్తింపు పొందడం చాలా ముఖ్యం. ఆ్రస్టాలజీ, న్యూమరాలజీ కూడా కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఆల్ఫాబెట్స్లో ‘ఏ’ అక్షరంతో కంపెనీలకు కొదవలేదు. దీంతో చివరిదైన జడ్కు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది’ అని కంపెనీ సెక్రటరీ ఎస్ఎస్ విశ్వనాథన్ తెలిపారు. 1992లో మీడియా మొఘల్ సుభాష్ చంద్ర నెలకొల్పిన ‘జీ టీవీ’ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు! ఇక కొత్తగా నెలకొలి్పన ‘జీ5’ ఓటీటీ కూడా బంపర్ హిట్టే!!‘జెడ్’ ఫ్యాక్టర్!డిస్కౌంట్ బ్రోకరేజీగా ఆరంభమైన ‘జెరోధా’ ఇప్పుడు దేశంలో టాప్ బ్రోకింగ్ కంపెనీగా ఎదగడంలో జెడ్ ఫ్యాక్టర్ కూడా బాగానే పని చేసిందని చెప్పొచ్చు. క్విక్ కామర్స్ సంచలనం జెప్టో పేరు కూడా మార్మోగుతోంది. జీలక్స్ ఫ్యాషన్స్, జెనెర్జీ ఫుడ్స్, జోల్డ్ అకాడమీ, జోబుల్ ఈస్టోర్, జాయిడ్ ఏఐ, జెలో టెక్నాలజీస్, జిమన్స్ టూర్స్, జోఫర్స్, జింబర్ ఇండియా, జూజూ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ, జప్నోసిస్, జెన్నెక్ట్స్ ఇండియా ఇవన్నీ ఇటీవలి జెడ్ మేనియాలో జస్ట్ చిన్న లిస్ట్ మాత్రమే! ‘ఆల్ఫాబెట్స్లో కొన్ని పలికేందుకే కాదు.. వినేందుకు కూడా చాలా సొగసుగా ఉంటాయి. అలాంటి వాటిలో జెడ్ లేదా జీ కూడా ఒకటి. అంతేకాదు, నవతరం జెన్ జెడ్కు కూడా ఇది భలే కనెక్ట్ అవుతోంది. మరీ పెద్దగా కాకుండా నాలుగు అక్షరాలలోపు ఉండేవి పంచింగ్గా ఉంటాయి’ అంటున్నారు బ్రాండ్ స్ట్రాటజీ స్పెషలిస్ట్ హరీష్ బిజూర్. జాప్, జారా, జీల్, జీబ్రా, జీ, జెన్, జెనిత్, జెస్ట్, జెటా, జియస్, జిలియన్, జింగ్, జియాన్, జూమ్ వంటివి వీటిలో కొన్ని.జెడ్ = 8ఇక న్యూమరాలజీ (సంఖ్యా శాస్త్రం) పరంగా కూడా జెడ్ అక్షరానికి విశిష్టత ఉందంటున్నారు నిపుణులు. జెడ్ అనేది 8 అంకెను సూచిస్తుందని... భౌతిక శక్తి, స్థిరత్వం, పరివర్తనను ఇది చాటిచెబుతుందనేది న్యూమరాలజిస్టుల మాట! దీని ఆకారం విషయానికొస్తే.. జిగ్జాగ్ షేపు అనేది వినూత్నత, ఆధునికతకు చిహ్నంగా ఉంటుందని.. నవతరానికి, బ్రాండింగ్, సోషల్ మీడియాలో గుర్తింపునకు కూడా ప్రాతినిథ్యం వహిస్తుందని బ్రాండింగ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం (ఆ్రస్టాలజీ) సంగతి చూస్తే... జెడ్ అక్షరంపై గురుడు లేదా బృహస్పతి గ్రహ బలం అధికంగా ఉంటుందని గుజరాత్కు చెందిన ఆ్రస్టాలజర్ మనీష్ భట్ చెబుతున్నారు. ‘ప్రస్తుతం గ్రహాల కదలికలు... జెడ్ అక్షరం వాడకంపై చాలా సానుకూల ప్రభావం చూపుతున్నాయి’ అని భట్ వ్యాఖ్యానించారు!జెరోధా... జోహో.. జొమాటో.. జూడియో.. జెప్టో... జాగిల్ ప్రీపెయిడ్.. ఇంకా చాలా పెద్ద లిస్టే ఉంది! అయితే ఏంటంటరా? జెన్ జెడ్ మేనియాతో జెడ్ (జీ) నామజపం జోరందుకుంది. జెడ్ అక్షరంతో మొదలయ్యే బ్రాండ్లు, కంపెనీల సంఖ్య ఏటికేడు ఎగబాకుతుండటమే దీనికి నిదర్శనం. పలకడానికి ఈజీగా, వినసొంపుగా... బ్రాండ్ నేమ్ కూడా ఎఫెక్టివ్గా ఉండటంతో వీటికి ప్రాచుర్యం పెరుగుతోంది. అంతేకాదు.. ఇటీవల జెడ్ అక్షరంతో వచ్చిన పలు బ్రాండ్లు బిజినెస్ హిట్ కొట్టి.. ఆయా రంగాల్లో జనాలకు చిరపరిచితంగా కూడా మారిపోవడం విశేషం!! -
మానసిక ఆరోగ్యంతోనే అభివృద్ధి
మానవ సమాజంలో పని అనేది ఒక అంత ర్భాగం. మానవుడు ఆహా రం కోసం చేసే వెదుకు లాట/ వేట మొట్టమొదటి పనిగా చెప్తారు. 18వ శతాబ్దంలో వచ్చిన పారిశ్రామిక విప్లవం పని గంటలు, పని ‘సంస్కృతి’లో అనేక మార్పులు తీసుకువచ్చింది. పరిశ్రమలు, కార్మికులు కలసి ఒక సంస్థాగత వ్యవస్థగా ఏర్ప డ్డారు. టెక్నాలజీ అభివృద్ధి చెందడం, ఇంటర్నెట్ ప్రవేశంతో కొత్తకొత్త ఉద్యోగాల రూపకల్పన జరగడం ప్రారంభమయింది. యాంత్రికీకరణ, కృత్రిమ మేధ అభివృద్ధితో ఇది మరింత కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక మనిషి తన జీవిత కాలంలో సుమారుగా తొంభైవేల నుండి ఒక లక్ష గంటల పాటు పని ప్రదేశంలోఉంటాడని అంచనా. అంటే యుక్త వయసు నుండి రిటైరయ్యే వరకు ఉన్న జీవిత కాలంలో ఇది సుమారు మూడు వంతుల సమయం. ఒక ఉద్యోగస్థుడు తన సహ చరులతో ఇంతకాలం గడపడం వలన వారితో ప్రత్యేక అనుబంధం ఏర్పరుచుకుంటాడు. ఈ బంధాలు, పనిచేసే వాతావరణం, యాజమాన్యంతో ఉండే సంబంధం... ఇవన్నీ ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని చాలావరకు ప్రభావితం చేస్తాయి. కనుకనే ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ ‘పని చేసే ప్రదేశంలో మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి’ అనే నినాదంతో ఈ సంవత్సరం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపు కుంటోంది. పని ప్రదేశాల్లో ఒత్తిడి అనేది అత్యంత సహజ మైన విషయం. అయితే ఈ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోతే పలు రకాల శారీరక, మానసిక సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. ఒక సర్వే ప్రకారం ప్రతీ పదిమందిలో ఎనిమిది మంది ఏదో ఒక రకమైన ఒత్తిడిని ఎదు ర్కొంటున్నట్లు తేలింది. ప్రతి నలుగురిలో ఒకరు చికిత్స అవసరం అయిన మానసిక సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలా బాధపడే వారిలో కేవలం నలభై శాతం మంది మాత్రమే సరైన వైద్య సహాయం పొందుతున్నారు. అయితే ఇది ఉద్యోగి ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడం ద్వారా ఉత్పాదకతను కూడా తగ్గిస్తుంది. ఇది మిగిలిన ఉద్యోగుల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కనుక ఉద్యోగితో పాటుగా యాజమాన్యాలు / సంస్థలు తమ ఉద్యోగుల మానసిక ఆరోగ్యం మీద తగిన జాగ్రత్తలు తీసు కోవలసిన అవసరం ఉంది. సరైన సమయపాలన పాటించడం, ఒత్తిడికి గురైనపుడు సహచరుల, యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళి సహాయం పొందడం; పనికి, వ్యక్తిగత జీవితానికి హద్దులు పెట్టుకొని కొంత సమయం తనకోసం మాత్రమే కేటాయించుకోవడం, వారాంతాల్లో కుటుంబ సభ్యులతో సమయం గడపడం, పనిలో అప్పుడప్పుడు కొంత విరామం తీసుకోవడం లాంటివి చేయడం ద్వారా ఉద్యోగి ఒత్తిడిని కొంత వరకు తగ్గించవచ్చు. విభిన్న షిఫ్ట్ సిస్టవ్ులో పనిచేసే దంపతులు కలిసి ఉండే సమయం తక్కువ అవడంవల్ల కలిసి క్వాలిటీ టైవ్ు గడిపే అవకాశాలు సన్నగిల్లి వీరి మధ్య కొన్ని మనస్పర్థలు, అనుమా నాలు తలెత్తే అవకాశముంది. సమర్థంగా పనిచేసే వారిని యాజమాన్యం ఎప్పటికప్పుడు ప్రోత్సహించి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల వీరిలో మానసిక స్థైర్యం పెంపొందుతుంది. మహిళా ఉద్యోగులు, ఒకవైపు ఇంటి బాధ్యతలు, పిల్లల సంరక్షణ; మరోవైపు ఉద్యోగ బాధ్యతల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంది. అలాంటి వారి ఎడల సంస్థలు కొన్ని వెసులుబాట్లు ఇస్తే, వీరు ఒత్తిడికి లోను కాకుండా ఉండగలరు. కంపెనీలు కూడా ఈ మధ్య కాలంలో ‘వర్క్ ఫ్రమ్ హోవ్ు’ను ప్రోత్సహించడం వలన ఉద్యో గుల్లో ఉత్పాదకత పెరిగినట్లు గణాంకాలు చెబు తున్నాయి. ప్రతి సంస్థ అర్హత కలిగిన మానసిక వైద్యులు లేదా క్లినికల్ సైకాలజిస్టుల సేవలు తమ ఉద్యోగులకు కల్పించాలి. యోగా, ధ్యానం, ఒత్తిడి గురించి వర్క్షాప్స్ వంటి కార్యక్రమాలు తరచుగా తమ సంస్థల్లో జరిగేలా ఏర్పాట్లు చేయాలి. ఒక క్రమ పద్ధతిలో నైపుణ్య పరీక్షలు జరిపి అర్హులైన వారికి ఇంక్రిమెంట్లు, పదోన్న తులు, ఇతర వసతులు కల్పించడం ద్వారా ఉద్యోగస్థుల్లో సంతృప్తి శాతాన్ని పెంచవచ్చు. ఎప్పుడైతే ఉద్యోగస్థులు తమ పనిపట్ల తృప్తితో ఉంటారో వారు మరింత పాజిటివ్ ధృక్పథంతో, సంస్థ అభివృద్ధికి కృషిచేస్తారు. వారు మిగిలిన వారికి ఒక మంచి ఉదాహరణగా నిలిచి, ఒక చక్కని పని సంస్కృతి అనేది సంస్థలో అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని అన్ని సంస్థలు పని ప్రదేశాల్లో ఉద్యోగుల, కార్మికుల మానసిక ఆరోగ్యానికి అత్యంత ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. జీవితంలోగాని,వృత్తిలో గాని విజయం సాధించాలంటే మనసును స్థిరంగా, ప్రశాంతంగా ఉంచుకోవడమనేది చాలా ముఖ్యమని అందరూ గుర్తించాలి. డా‘‘ ఇండ్ల రామసుబ్బారెడ్డి వ్యాసకర్త ప్రముఖ మానసిక వైద్యనిపుణులు(రేపు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం) -
పండుగల ఆఫర్లు షురూ
న్యూఢిల్లీ: పండుగల సీజన్లో మెరుగైన అమ్మకాల కోసం కంపెనీలు ఆఫర్ల బాట పట్టాయి. ఇప్పటికే కార్ల కంపెనీలు, ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల అమ్మకాలు గణేశ చతురి్థ, ఓనమ్ పండుగల సందర్భంగా ఆఫర్లతో అమ్మకాలు పెంచుకున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు డిమాండ్ స్తబ్దుగా ఉండడంతో, ప్రస్తుత పండుగల సమయంలో మెరుగైన అమ్మకాలపై కంపెనీలు కోటి ఆశలు పెట్టుకున్నాయి. కేరళలో ఓనమ్ పండుగకు ముందే మారుతి 10 శాతం అధిక బుకింగ్లను సాధించింది. వినాయక చవితి రోజు అయితే మహారాష్ట్ర, కర్ణాటకలో అధిక కార్ల డెలివరీలను నమోదు చేసినట్టు మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పార్థో బెనర్జీ తెలిపారు. ఇక ఓనమ్ సమయంలో (సెపె్టంబర్ 6 నుంచి 15 వరకు) ద్విచక్ర వాహన అమ్మకాలు 15–16 శాతం పెరిగాయి. కేరళలో కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల అమ్మకాలు గతేడాది ఇదే కాలంలో పోల్చి చూస్తే 7–8 శాతం అధికంగా నమోదయ్యాయి. గతేడాది ఓనమ్ సమయంలో విక్రయాలు తగ్గడాన్ని పరిశ్రమ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. కార్లు, ప్రీమియం కన్జ్యూమర్ ఉత్పత్తుల పరంగా డిమాండ్ కొనసాగుతూనే ఉంది. ‘‘ఓనమ్ సమయంలో మాస్ విభాగంలో అమ్మకాల పెరంగా పెద్ద వృద్ధి లేదు. ప్రీమియం ఉత్పత్తుల విభాగంలోనే ఎక్కువ అమ్మకాలు కొనసాగాయి. మాస్ విభాగం అమ్మకాలు అవసరాల ఆధారంగానే ఉన్నాయి. వేసవిలో అధిక వేడి కారణంగా కూలింగ్ ఉత్పత్తులు పెరగడం ఇందుకు నిదర్శనం’’అని గోద్రేజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. ఓనమ్ సందర్భంగా విక్రయాలు గతేడాదితో పోలి్చతే పెరిగాయి కానీ, ఆశించిన స్థాయిలో లేవని వెల్లడించారు. వీటికి డిమాండ్..ఫాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు ఓనమ్ పండుగ సమయంలో 15 శాతం అధికంగా నమోదయ్యాయి. ఆరంభ స్థాయిలోని సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ల విక్రయాలు 6–7 శాతం పెరిగాయి. వాషింగ్ మెషిన్లలో అధిక ఫీచర్లతో కూడిన పూర్తి ఆటోమేటిక్ ఉత్పత్తుల విక్రయాలు 12–13 శాతం వృద్ధి చెందాయి. ఇక సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ల అమ్మకాలు కేవలం 4–5 శాతమే పెరిగాయి. యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ బుకింగ్లను శుక్రవారం ప్రారంభించగా, మొదటి రోజే కస్టమర్ల నుంచి వచి్చన స్పందన గతేడాది కంటే మెరుగ్గా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సాధారణంగా పండుగల సీజన్ మెరుగ్గా ఉంటే 12–15 శాతం మేర అధిక అమ్మకాలు కొనసాగుతాయని, కార్ల విక్రయాల్లో వృద్ధి 20 శాతం మేర ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దీపావళి వరకు కొనసాగే పండుగల సీజన్కు అమ్మకాలు తీరు ఎలా ఉంటాయన్నది ఓనమ్ సమయంలో డిమాండ్ తెలియజేస్తుంటుంది. గతేడాది ఆటో అమ్మకాల బేస్ అధిక స్థాయిలో ఉండడంతో, ఈ ఏడాది విక్రయాలు తక్కువగా ఉండొచ్చన్న అంచనా సైతం నెలకొంది. గడిచిన కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్న డిమాండ్కు ప్రస్తుత పండుగల సీజన్ అమ్మకాలు సానుకూల సంకేతాలిస్తున్నట్టు మారుతి సుజుకీ పార్థా బెనర్జీ పేర్కొన్నారు. ఈ పండుగల సీజన్ స్కూటర్లు, మోటారు సైకిళ్లకు ఉత్తమంగా నిలిచి పోతుందని హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ ఇంకా పుంజుకోవాల్సి ఉందంటూ, ఇప్పటి వరకు కనిపిస్తున్న సంకేతాలు సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో నెలవారీ సగటున 3.30 లక్షల యూనిట్ల విక్రయాలు నమోదు కాగా, పండగుల సీజన్లో 15 శాతం మేర అమ్మకాలు పెరుగుతాయని ఆటోమొబైల్ పరిశ్రమ అంచనాతో ఉంది. ఎల్రక్టానిక్స్, ఆటోమొబైల్ తదితర పరిశ్రమలకు ఏటా పండగుల సీజన్ అమ్మకాల పరంగా ఎంతో కీలకం కావడం తెలిసిందే. -
చట్టాలను ఉల్లంఘించిన స్మార్ట్ఫోన్ కంపెనీలు
శామ్సంగ్, షియోమీ,మోటోరోలా, రియల్మీ, వన్ప్లస్ వంటి స్మార్ట్ఫోన్ కంపెనీలు అమెజాన్.. ఫ్లిప్కార్ట్తో కుమ్మక్కై ఈ-కామర్స్ సంస్థల భారతీయ వెబ్సైట్లలో యాంటీట్రస్ట్ చట్టాలను ఉల్లంఘిస్తూ ప్రత్యేకంగా ఉత్పత్తులను లాంచ్ చేశాయని రాయిటర్స్ ఒక నివేదికలో వెల్లడించింది.కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నిర్వహించిన యాంటీట్రస్ట్ పరిశోధనలలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ చట్టాలను ఉల్లంఘించాయని, ఎంపిక చేసిన విక్రేతలకు ప్రాధాన్యత ఇవ్వడం, నిర్దిష్ట జాబితాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఉత్పత్తులను బాగా తగ్గించడం, ఇతర కంపెనీలను దెబ్బతీసినట్లు రాయిటర్స్ నివేదికలో వెల్లడించింది.ఇదీ చదవండి: తమిళనాడుకు దిగ్గజ కంపెనీలు.. రూ.7618 కోట్ల పెట్టుబడులు రాయిటర్స్ నివేదికపై స్మార్ట్ఫోన్ తయారీదారులు స్పందించలేదు. అంతే కాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంపెనీలు కూడా ఇప్పటివరకు వ్యాఖ్యానించలేదు. అయితే రెండు సీసీఐ నివేదికల పరిశోధనల సమయంలో అమెజాన్ & ఫ్లిప్కార్ట్లు ప్రత్యేకమైన లాంచ్ల ఆరోపణలను వ్యతిరేకించాయి. నివేదిక వెల్లడైన తరువాత స్పందించలేదు. -
మూడు నెలల్లో భారీగా ఉద్యోగాలు.. ఈ రంగాల్లోనే అధికం
న్యూఢిల్లీ: భారత కంపెనీలు నియామకాల పట్ల బలమైన ధోరణితో ఉన్నట్టు మ్యాన్పవర్ గ్రూప్ ‘ఎంప్లాయిమెంట్ అవుట్లుక్ సర్వే క్యూ4, 2024’ నివేదిక వెల్లడించింది. 37 శాతం భారత కంపెనీలు వచ్చే మూడు నెలల్లో (అక్టోబర్–డిసెంబర్) నికరంగా తమ సిబ్బందిని పెంచుకోనున్నట్టు ఈ సర్వేలో తెలిపాయి. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ కాలంలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 7 శాతం అధికం. క్రితం ఏడాది అక్టోబర్ - డిసెంబర్తో పోల్చి చూస్తే తటస్థంగా ఉంది.వివిధ రంగాల్లోని 3,150 కంపెనీల అభిప్రాయాలను సర్వేలో భాగంగా మ్యాన్పవర్ గ్రూప్ తెలుసుకుంది. భారత్ తర్వాత కోస్టారికాలో అత్యధికంగా 36 శాతం కంపెనీలు, ఆ తర్వాత యూఎస్లో 34 శాతం కంపెనీలు నియామకాల పట్ల సానుకూలంగా ఉన్నాయి. సిబ్బందిని తగ్గించుకునే కంపెనీలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నికర నియామకాల గణాంకాలను ఈ సంస్థ రూపొందించింది.‘‘నియామకాల ఉద్దేశ్యం భారత ఆర్థిక వ్యవస్థ పట్ల సానుకూల ధోరణిని తెలియజేస్తోంది. విదేశీ విధానాలు, పెద్ద ఎత్తున మౌలిక వసతుల అభివృద్ధికి తోడు మనకున్న అధిక యువ జనాభా సానుకూలతలు అంతర్జాతీయ మార్కెట్లో భారత పోటీతత్వాన్ని పెంచుతాయి’’అని మ్యాన్పవర్ గ్రూప్ ఇండియా ఎండీ సందీప్ గులాటి పేర్కొన్నారు. రంగాల వారీగా..మ్యానపవర్ గ్రూప్ సర్వే ప్రకారం.. దాదాపు అన్ని రంగాల్లోనూ నియామకాల పట్ల సానుకూలత వ్యక్తమైంది. ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్ రంగాల్లో వచ్చే మూడు నెలల్లో 47 శాతం కంపెనీలు నియామకాల పట్ల సానుకూలంగా ఉంటే, ఐటీలో 46 శాతం, ఇండ్రస్టియల్స్, మెటీరియల్స్రంగాల్లో 36 శాతం, కన్జ్యూమర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రంగాల్లో 35 శాతం కంపెనీలు సిబ్బందిని పెంచుకోవాలని అనుకుంటున్నాయి. అతి తక్కువగా కమ్యూనికేషన్ సర్వీసెస్ రంగాలో 28 శాతం కంపెనీలే వచ్చే మూడు నెలల్లోనియామకాల పట్ల సానుకూలంగా ఉన్నాయి.ఇదీ చదవండి: 6జీ టెక్నాలజీపై కేంద్రం దృష్టి: జ్యోతిరాదిత్య సింధియా ఉత్తరాదిలో ఉద్యోగాల డిమాండ్ 41 శాతంగా ఉంటే, పశ్చిమాదిన 39 శాతంగా ఉంది. అధిక దేశీయ వినియోగం, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే పథకాలు, ఔట్సోర్స్ సేవల డిమాండ్ పెంచడం, తయారీపై భారత్ దృష్టి సారిస్తుందని అంచనా వేస్తున్నట్టు గులాటి తెలిపారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం చూస్తుంటే.. భారత్ నిరుద్యోగాన్ని తగ్గించి, కొత్త తరహా పరిశ్రమల అవసరాలు తీర్చే మానవ వనరుల అభివృద్ధి ద్వారా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయొచ్చని గులాటీ వివరించారు. -
యూఎస్ కంపెనీ కీలక నిర్ణయం: ఉద్యోగుల్లో మొదలైన భయం
ప్రైస్వాటర్హౌస్కూపర్స్ (PwC) యునైటెడ్ స్టేట్స్లో దాదాపు 1,800 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. 2009 తరువాత కంపెనీ ఇంత పెద్ద లేఆఫ్స్కు సిద్దమవ్వడం ఇదే మొదటిసారి. ఈ లేఆప్స్ ప్రభావం అసోసియేట్స్, మేనేజింగ్ డైరెక్టర్లు, బిజినెస్ సర్వీసులు, ఆడిట్, పన్ను విభాగాల్లో పనిచేసే ఉద్యోగులపై పడే అవకాశం ఉంది.కంపెనీ తొలగించనున్న ఉద్యోగుల్లో సగం కంటే ఎక్కువమంది అమెరికా బయట పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక పరిస్థితుల కారణంగానే సంస్థ ఈ లేఆప్స్ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. అంతే కాకుండా కంపెనీ భవిష్యత్తు కూడా దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులను తొలగించాల్సి వస్తున్నట్లు సంస్థ ఒక మెమోలో వెల్లడించింది.కరోనా సమయంలో అనేక దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను దొలఁగించినప్పటికీ.. ప్రైస్వాటర్హౌస్కూపర్స్ మాత్రం లేఆప్స్ ప్రకటించలేదు. కానీ కరోనా మొత్తం తగ్గుముఖం పట్టిన తరువాత దాదాపు రెండువేల మందిని ఇంటికి పంపే యోచన చేస్తోంది. ఈ విషయం తెలిసిన ఉద్యోగులలో ఇప్పటికే భయం మొదలైంది. అయితే ఏ విభాగంలో ఎంతమంది ఉద్యోగులను తొలగించారనేది త్వరలోనే తెలుస్తుంది. -
సెలవుల విషయంలో కొత్త రూల్: ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్
సిక్ లీవ్, పేరెంటల్ లీవ్ వంటి లీవ్స్ అన్నీ కూడా కంపెనీ విధివిధానాలు లేదా నియమాల మీద ఆధారపడి ఉంటాయి. లీవ్స్ విషయంలో కొన్ని కంపెనీలు కఠినంగా వ్యవహరిస్తే.. మరికొన్ని కంపెనీలు ఉదారంగా ఉంటాయి. ఇటీవల ఓ కంపెనీ లీవ్స్ విషయంలో ఓ కొత్త రూల్ పాస్ చేస్తూ మెమో రూపొందించింది. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.సోషల్ మీడియాలో వైరల్ అయిన మెమోలో ''పిల్లల అనారోగ్యం'' ఉద్యోగి సెలవు తీసుకోవడానికి సరైన కారణం కాదని పేర్కొన్నారు. మీ పిల్లలకు ఆరోగ్యం బాగాలేనప్పుడు కాల్ చేసి లీవ్ తీసుకోవడం కుదరదు. ఎందుకంటే మేము మీ పిల్లలను పనిలో పెట్టుకోవడం లేదు. మీరే పనిచేయాలి. కాబట్టి ఈ కారణంతో లీవ్ తీసుకోవడానికి అవకాశం లేదు.ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంలో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఉద్యోగుల విషయంలో కంపెనీ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని అన్నారు. అనారోగ్యంతో ఉన్న బిడ్డను ఆఫీసుకు తీసుకురావాలా? అంటూ కొందరు ప్రశ్నించారు. ఈ రూల్ ఏ కంపెనీ పెట్టిందో చెప్పండి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఇదీ చదవండి: వైకల్యాన్ని జయించి.. బిలియనీర్గా నిలిచి: జీవితాన్ని మార్చే స్టోరీఉద్యోగులను పనిలో పెట్టుకునే ముందు.. వారికి తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, బంధువులు ఎవరూ లేకుండా ఉండేలా చూసుకోండి. ముందు వెనుక ఎవరూ లేని అనాథలను మీ కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వండి. అప్పుడు సరిపోతుంది అంటూ ఓ యూజర్ తీవ్రంగా విమర్శించారు. -
మొన్న గూగుల్.. నేడు విస్టన్: తమిళనాడుకు దిగ్గజ కంపెనీలు
గూగుల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న తరువాత తమిళనాడు ప్రభుత్వం.. ఇప్పుడు అమెరికాకు చెందిన లింకన్ ఎలక్ట్రిక్, విషయ్ ప్రెసిషన్, విస్టన్లతో రూ.850 కోట్ల విలువైన ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా సీఎం తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.గురువారం రోజు కూడా స్టాలిన్ ప్రభుత్వం ట్రిలియంట్తో రూ. 2000 కోట్ల అవగాహనా ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. ఈ కంపెనీ రాష్ట్రంలో తయారీ యూనిట్ను మాత్రమే కాకుండా.. డెవలప్మెంట్ అండ్ గ్లోబల్ సపోర్ట్ సెంటర్ను ప్రారభించనుంది. చెన్నైలో పాదరక్షల ఉత్పత్తి, విస్తరణ గురించి నైక్తో కూడా చర్చలు జరిపినట్లు సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.In the land of opportunities, every new dawn ignites fresh hopes.We’ve secured MoUs worth ₹850 crores with Lincoln Electric, Vishay Precision, and Visteon, bringing us one step closer to realising our vision.Through relentless effort and determination, we continue to turn… pic.twitter.com/Evj0qu8IPt— M.K.Stalin (@mkstalin) September 6, 2024అంతకుముందు బుధవారం, స్టాలిన్ చెన్నైలోని రూ. 200 కోట్ల ఆర్&డీ ఇంజనీరింగ్ సెంటర్ విస్తరణ కోసం బహుళజాతి పవర్ మేనేజ్మెంట్ కంపెనీ అయిన ఈటన్తో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం రాష్ట్రంలో ఉద్యోగాల సంఖ్యను పెంచుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి: కొత్త ధరలు ఇవే..రాష్ట్ర శ్రేయస్సును పెంపొందించే లక్ష్యంతో విదేశీ పెట్టుబడులను పొందేందుకు స్టాలిన్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్లో అధికారిక పర్యటనలో ఉన్నట్లు సమాచారం. 2024 ఆగష్టు 31న చెంగల్పట్టు జిల్లాలో ఎలక్ట్రోలైజర్లు మరియు గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడానికి ఓహ్మియంతో కొత్త ఫ్యాక్టరీ స్థాపనకు ఒప్పందం జరిగింది. దీని ద్వారా 500 ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.Exciting developments in Chicago!Secured a ₹2000 crore MoU with Trilliant to establish a manufacturing unit as well as their Development & Global Support Centre in Tamil Nadu.Thanks to Trilliant for this valuable partnership!Had productive talks with Nike on expanding its… pic.twitter.com/KjsZ2iFkHP— M.K.Stalin (@mkstalin) September 5, 2024 -
భారత్లో హెడ్ ఆఫీస్ అమ్మేస్తున్న అమెరికన్ కంపెనీ
ప్రముఖ టెక్ కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగిస్తుంటే.. అమెరికాకు చెందిన 'కాగ్నిజెంట్' మాత్రం ఏకంగా భారతదేశంలోని ఆఫీసునే అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఇందులో నిజమెంత? ఆఫీసును విక్రయిస్తే.. ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? అనే వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.భారతదేశంలో సుమారు 20 సంవత్సరాలుగా ప్రధాన కార్యాలయంగా కలిగిన ఉన్న ఆఫీసును డిసెంబర్ నాటికి విక్రయించే అవకాశం ఉందని సమాచారం. ఈ విక్రయానికి సంబంధించిన బాధ్యతను అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ సంస్థ 'జేఎల్ఎల్'కు అప్పగించినట్లు చెబుతున్నారు.కాగ్నిజెంట్ విక్రయించనున్న ఈ ఆఫీసు చెన్నైలోని ఐటీ కారిడార్లో ఉంది. ఇది సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీని విలువ సుమారు రూ. 750 కోట్ల నుంచి రూ. 800 కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం. దీనిని కొనుగోలు చేయడానికి భాష్యం గ్రూప్, కాసాగ్రాండ్ సంస్థలు సుముఖత చూపుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం మీద ఆ రెండు సంస్థలు ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు.ఇదీ చదవండి: 30 నెలలు వెయింట్ చేయించి.. షాకిచ్చిన విప్రో!: మండిపడుతున్న ఫ్రెషర్స్2024 డిసెంబర్ నాటికి ఆఫీసును విక్రయించి.. చెన్నైలోని జీఎస్టీ రోడ్డులోని తాంబరం సమీపంలో కొత్త హెడ్ ఆఫీసు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కాబట్టి బహుశా ఉద్యోగులంతా ఆ కొత్త ఆఫీసు నుంచి పనిచేయాల్సి ఉంటుందని భావిస్తున్నాము. కొత్త భవనం అందుబాటులోకి రావడంతో.. కంపెనీ తన పాత భవనాన్ని విక్రయించడానికి సన్నద్ధమైంది. -
టాప్ కంపెనీల్లో ఇంటర్న్షిప్కు మార్గం! (ఫోటోలు)