contraversy
-
స్టార్ హీరోయిన్కి హైకోర్టు నుంచి నోటీసులు.. కారణం ఏంటంటే?
కొన్నిసార్లు ఊహించని విధంగా చిక్కులు ఎదురవుతుంటాయి. అలా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్కి మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓ విషయంలో చిన్న పదం ఉపయోగించినందుకుగానూ ఈ పరిస్థితి ఎదురైంది. ఇప్పుడీ విషయం కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది?(ఇదీ చదవండి: చిక్కుల్లో హీరో శింబు.. కమల్ హాసన్ మూవీలో నటించడానికి వీల్లేదంటూ..)బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కరీనా కపూర్ ఒకరు. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లయింది. ఈ క్రమంలోనే తన ప్రెగ్నెన్సీ అనుభవాలతో 'కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్' పేరుతో ఓ పుస్తకం రాసింది. అయితే ఈ బుక్ టైటిల్లో 'బైబిల్' పదాన్ని ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ లాయర్ క్రిస్టోఫర్ ఆంథోని కోర్టుని ఆశ్రయించారు. జస్టిస్ గురుపాల్ సింగ్ అహ్లువాలియా నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ కరీనాకు నోటీసు జారీ చేసింది. ఆ పదం వాడటానికి గల కారణమేంటని ప్రశ్నించింది.కరీనా కపూర్పై కేసు కూడా నమోదు చేయాలని క్రిస్టోపర్ పిటిషన్ వేశారు. ఈ పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. బుక్ టైటిల్లోని 'బైబిల్' పదం వల్ల క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసినట్లు అవుతుందని ఆంథోనీ తన పిటీషన్లో పేర్కొన్నారు. క్రైస్తవులకు బైబిల్ అనేది పవిత్ర గ్రంథం అని, కరీనా కపూర్ తన ప్రెగ్నెన్సీని బైబిల్తో పోల్చడం సరికాదు అని ఆయన చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: వైఎస్సార్సీపీ అభ్యర్థి కోసం ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్.. ఇదెక్కడి క్రేజ్ రా మావ) -
ఫిఫా చరిత్రలో మాయని మచ్చలా ఐదు వివాదాలు
ఫిఫా వరల్డ్కప్ 2022 ప్రారంభానికి మరొక రోజు మాత్రమే మిగిలింది. నవంబర్ 20 నుంచి మొదలుకానున్న సాకర్ సమరం డిసెంబర్ 18 వరకు జరగనుంది. దాదాపు నెల రోజుల పాటు జరగనున్న సమరంలో ఫైనల్ మ్యాచ్కు లుసెయిల్ స్టేడియం వేదిక కానుంది. ఇక ఫిఫా వరల్డ్కప్లో విజయాలు ఎన్ని ఉంటాయో వివాదాలు కూడా అన్నే ఉంటాయి. అన్ని గుర్తుండకపోయినా కొన్ని మాత్రం చరిత్రలో మిగిలిపోతాయి. అలా ఫిఫా వరల్డ్కప్ చరిత్రలో మాయని మచ్చలా మిగిలిపోయిన ఐదు వివాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ►మారడోనా హ్యాండ్ ఆఫ్ గాడ్(Hand Of GOD Goal) 1986 ఫిఫా వరల్డ్కప్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది అర్జెంటీనా విశ్వవిజేతగా నిలవడం. దీనితో పాటు డీగో మారడోనా అనే పేరు కూడా కచ్చితంగా వినిపిస్తుంది. అర్జెంటీనా విజేతగా నిలవడంతో మారడోనా పాత్ర ఎంత కీలకమో అతని హ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్ కూడా అంతే ప్రసిద్ధి చెందింది. 1986 సాకర్ వరల్డ్ కప్లో ఇంగ్లండ్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో మారడోనా రెండు గోల్స్ చేశాడు. అందులో ఒక గోల్ను చేతితో కొట్టడం అధికారులెవరు గుర్తించలేదు. తర్వాత మారడోనా కొట్టిన ఆ గోల్.. ''హ్యాండ్ ఆఫ్ గాడ్''(Hand OF GOD) గోల్గా ప్రసిద్ధి చెందింది. ఈ గోల్ అప్పట్లో వివాదాస్పదమైంది.క్వార్టర్స్లో ఇంగ్లండ్తో మ్యాచ్లో అర్జెంటీనా 2–1తో గెలిచి సెమీఫైనల్ చేరింది. అయితే మారడోనా తన ఆటతో అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలబెట్టడంతో అందరూ ఆ వివాదాన్ని మరిచిపోయారు. ఆ తర్వాత మారడోనా తన ఆటబయోగ్రఫీలో ''హ్యాండ్ ఆఫ్ గాడ్'' గురించి రాసుకొచ్చాడు. మాట్లాడిన ప్రతీసారి "హ్యాండ్ ఆఫ్ గాడ్" గోల్ అంటున్నారు.. కానీ ఆ చేయి మారడోనాది అన్న సంగతి మరిచిపోయినట్లున్నారని పేర్కొన్నాడు. ► జినదిన్ జిదానే(2006 ఫిఫా వరల్డ్కప్) ఫుట్బాల్ బతికున్నంత వరకు 2006లో ఫ్రాన్స్ ఆటగాడు జినదిన్ జిదానే చేసిన పని గుర్తిండిపోతుందనంలో అతిశయోక్తి లేదు. టోర్నీ ఆసాంతం అద్భుత ఆటతీరు కనబరిచి ఒంటిచేత్తో ఫ్రాన్స్ను ఫైనల్కు చేర్చాడు. అయితే అతను ఫైనల్లో చేసిన ఒక చిన్న తప్పిదం ఫ్రాన్స్ ఓటమికి బాటలు వేయడంతో పాటు కెరీర్ను కూడా ముగించింది. ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి. అప్పటికే ఫ్రాన్స్ ఇటలీ గోల్ పోస్టులపై దాడి చేస్తూనే ఉంది. అయితే ఇక్కడే జిదానే పెద్ద పొరపాటు చేశాడు. ఇటలీ మిడ్ఫీల్డర్ మార్కో మాటెరాజీతో గొడవపడ్డాడు. ఆవేశంలో జిదానే తన తలతో మార్కో చాతిలో గట్టిగా గుద్దాడు నొప్పితో విలవిల్లాడిపోయిన మార్కో అక్కడే కుప్పకూలాడు. అయితే మొదట ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. జిదానే కూడా సైలెంట్గా ఉన్నాడు. కానీ రిప్లేలో జిదానే బండారం బయటపడింది. దీంతో రిఫరీ రెడ్ కార్డ్ చూపించడంతో మైదానం వదిలాడు. అలా వెళ్లిన జిదానే మళ్లీ తిరిగి గ్రౌండ్లో అడుగుపెట్టలేదు. అతనికి అదే చివరి మ్యాచ్ అవుతుందని బహుశా అతను కూడా ఊహించి ఉండడు. జిదానే వైఖరి తప్పుబట్టినప్పటికి అతని ఆటతీరును మాత్రం అందరూ మెచ్చుకోవడం విశేషం. ► పోర్చుగల్ వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్, 2006 ఫిఫా వరల్డ్కప్ ఈ మ్యాచ్ను న్యూరేమ్బెర్గ్ యుద్ధం అని పిలుస్తారు. పోర్చుగల్,నెదర్లాండ్స్ మధ్య ప్రి క్వార్టర్స్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ కన్నా గొడవలే ఎక్కువసార్లు జరిగాయి. అందుకే మ్యాచ్లో రష్యా రిఫరీ వాలెంటిన్ ఇవనోవ్ ఆటగాళ్లు చేసిన తప్పిదాలకు నాలుగు రెడ్ కార్డ్స్.. 16 సార్లు ఎల్లో కార్డులను జారీ చేశాడు. ఒక ఫిఫా ప్రపంచకప్లో మ్యాచ్లో అన్నిసార్లు రెడ్, ఎల్లో కార్డులు జారీ చేయడం అదే తొలిసారి. అసలు మ్యాచ్లో ఎవరు నెగ్గారనే దానికంటే ఎన్ని కార్డులు జారీ అన్న విషయమే గుర్తుంది. ఇక మ్యాచ్లో పోర్చుగల్ 1-0 తేడాతో డచ్పై గెలిచి క్వార్టర్స్కు చేరుకుంది. ► 2002 ఫిఫా వరల్డ్కప్లో సడెన్ డెత్ వివాదం 2002 ఫిఫా వరల్డ్కప్కు తొలిసారి ఆసియా దేశాలైన జపాన్, సౌత్ కొరియాలు ఆతిథ్యం ఇచ్చాయి. ఈ ప్రపంచకప్లో సౌత్ కొరియా సెమీఫైనల్ వరకు రాగా.. జపాన్ మాత్రం ప్రి క్వార్టర్స్లో వెనుదిరిగింది. అయితే స్పెయిన్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో పెనాల్టీ షూటౌట్ ద్వారా సౌత్ కొరియా సెమీస్కు అర్హత సాధించింది. ఇక ప్రి క్వార్టర్స్లో ఇటలీతో జరిగిన మ్యాచ్లో సౌత్ కొరియా సడెన్ డెత్ రూల్తో క్వార్టర్స్ చేరడం వివాదాస్పదంగా మారింది. నిర్ణీత సమయంలో మ్యాచ్ ముగిసిన తర్వాత టైబ్రేక్కు దారితీస్తే అప్పుడు సడెన్ డెత్ కింద పరిగణించి.. ఇద్దరిలో ఎవరు ఎక్కువసార్లు గోల్పోస్ట్పై దాడి చేస్తే వారిని విజేత కింద లెక్కిస్తారు. దీని ప్రకారం సౌత్ కొరియా ముందంజలో ఉండడంతో వారినే విజయం వరించింది. దీనిపై స్పెయిన్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికి రూల్స్ ప్రకారమే చేసినట్లు మ్యాచ్ రిఫరీ పేర్కొనడంతో నిరాశగా వెనుదిరిగింది. ఈ వివాదం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ► 2010 ఫిఫా వరల్డ్కప్: ఘనాపై లూయిస్ సురెజ్ చివరి నిమిషంలో హ్యాండ్బాల్ ఈ టోర్నమెంట్ ఆఫ్రికా దేశమైన దక్షిణాఫ్రికాలో జరిగింది. ఈ టోర్నీలో ఘనాది డ్రీమ్ రన్ అని చెప్పొచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఘనా క్వార్టర్స్ వరకు చేరి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక క్వార్టర్స్లో ఉరుగ్వేతో తలపడింది. మ్యాచ్లో ఘనా ఫ్రీ కిక్ పొందింది. ఆ సమయంలో గోల్పోస్ట్ వద్ద ఉన్న లూయిస్ సురేజ్ ఘనా ఆటగాడు డొమినిక్ ఆదియ్య హెడర్ గోల్ను చేతితో అడ్డుకున్నాడు. దీంతో సురేజ్కు రెడ్కార్డ్ జారీ చేయడంతో మైదానం వీడాడు. ఆ తర్వాత నిర్ణీత సమయం ముగిసేలోగా ఇరుజట్లు 1-1తొ నిలవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసి పెనాల్టీ షూటౌట్కు దారి తీసింది. ఇక పెనాల్టీ షూటౌట్లో ఉరుగ్వే గోల్ చేసిన ప్రతీసారి సురేజ్ ఎంజాయ్ చేయడం అప్పట్లో వైరల్గా మారింది. ఇక షూటౌట్లో ఉరుగ్వే 4-2తో ఘనాను ఓడించి సెమీ-ఫైనల్లో అడుగుపెట్టింది. చదవండి: సాగర తీరంలో దూసుకెళ్తున్న రేసింగ్ కార్లు.. క్రికెట్లో ప్రొటీస్.. ఫుట్బాల్లో డచ్; ఎక్కడికెళ్లినా దరిద్రమే -
‘రాజీనామాకు సిద్ధమా?’.. కేరళ సీఎంకు గవర్నర్ సవాల్
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర గవర్నర్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇటవలే విశవిద్యాలయాల వీసీల రాజీనామాలపై వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. సీఎం, గవర్నర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ముఖ్యమంత్రి పినరయి విజయన్కు సవాల్ విసిరారు గవర్నర్ ఆరీఫ్ మహ్మద్ ఖాన్. యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్ల నియామకంలో రాజకీయ జోక్యం ఉందని ముఖ్యమంత్రి ఒక్క ఉదాహరణ చూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. రాజకీయ జోక్యం అంటూ సీఎం చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ‘ఆర్ఎస్ఎస్కు చెందిన వారిని తీసుకొచ్చేందుకే ఈ పని చేస్తున్నానని వారు తరుచుగా చెబుతున్నారు. ఆర్ఎస్ఎస్ కాకుండా, ఏ వ్యక్తినైనా నా అధికారంతో నామినేట్ చేసినట్లయితే నేను రాజీనామా చేస్తా. దానిని నిరూపించకపోతే ఆయన(సీఎం విజయన్) రాజీనామా చేసేందుకు సిద్ధమేనా? నేను సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నానని సీఎం చెబుతున్నారు. వారు విద్యారంగాన్ని మెరుగుపరుస్తున్నట్లు చెబుతున్నారు. సరైన అర్హత లేని, అనర్హులైన సీపీఎం లీడర్ల బంధువులతో నియామకాలు చేపట్టి ఎలా సాధిస్తారు?’ అని సీఎంపై విమర్శలు గుప్పించారు గవర్నర్ ఆరిఫ్ ఖాన్. కొద్ది రోజుల క్రితం సంచలనంగా మారిన బంగారం స్మగ్లింగ్ కుంభకోణంపైనా విమర్శలు గుప్పించారు గవర్నర్. స్మగ్లింగ్ కార్యకలాపాలను ముఖ్యమంత్రి కార్యాలయం ప్రోత్సహిస్తున్నట్లు గమనిస్తున్నానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎంకి సన్నిహితులైన వారు స్మగ్లింగ్ చేస్తే తాను జోక్యం చేసుకునేందుకు కారణాలు ఉన్నాయని స్పష్టం చశారు. ఇద చదవండి: ముదురుతున్న వివాదం.. కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎం -
ముదురుతున్న వివాదం.. కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎం
తిరువనంతపురం: కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి, గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్కు వివాదం ముదురుతోంది. ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టేలా వర్సిటీ విద్యార్థుల దగ్గర ప్రసంగాలు చేశారని, ఆయనపై రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం పినరయి విజయన్కు గవర్నర్ సూచించారు. ఆర్థిక మంత్రిపై తాను విశ్వాసం కోల్పోయానని, ఆయన్ను పదవి నుంచి తొలగించాలన్న అర్థం వచ్చేలా బుధవారం లేఖ రాశారు. గవర్నర్ డిమాండ్ను సీఎం తోసిపుచ్చారు. యూపీ నుంచి వచ్చే విద్యార్థులకు కేరళలో పరిస్థితులు అర్థం కావడం సంక్లిష్టంగా ఉంటుందని ఈ నెల 18న కేరళ వర్సిటీలో విద్యార్థుల సమావేశంలో బాలగోపాల్ అన్నారు. ‘‘మంత్రి తన ప్రమాణాన్ని మరిచారు. దేశ ఐక్యత, సమగ్రతలను తక్కువ చేసి చూపిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి పదవిలో ఉండకూడదు. ఆయన నా విశ్వాసాన్ని కోల్పోయారు’’ అంటూ లేఖలో పేర్కొన్నారు. మంత్రిపై తనకు పరిపూర్ణ విశ్వాసముందంటూ సీఎం ఘాటుగా బదులిచ్చారు. ఆయనను తప్పించడానికి ఏ కారణాలూ లేవన్నారు. కేరళలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకం అంశంలో ఇప్పటికే ప్రభుత్వం, రాజ్భవన్ మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. -
ఓయూలో రాహుల్ హీట్
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు వేసవి ఎండలతో వాతావరణం వేడెక్కుతుండగా.. మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ హీట్ రగులుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో ఓయూలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమానికి వైస్ చాన్స్లర్ నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే ఓయూలోని పరిపాలన కార్యాలయంపై కొంతమంది దాడులకు పాల్పడటంతో కేసుల నమోదు, అరెస్టులు, రిమాండ్ వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొన్నాళ్లుగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయి. వీసీ రవీందర్ ఏడాది క్రితం బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్కరణల దిశగా అడుగులేశారు. పీహెచ్డీల కాలవ్యవధిని నిక్కచ్చిగా అమలు చేయాలనే ఉద్దేశంతో పాటు క్యాంపస్ పరిధిలో భద్రత ఏర్పాట్లలో కొత్త వ్యక్తుల నియామకం, హాస్టళ్ళపై నిరంతర నిఘా వంటి చర్యలపై విద్యార్థుల నుంచి వ్యతిరేకత కన్పిస్తోంది. దీనికి తోడుగా రాహుల్ గాంధీ అంశం తెరమీదికి రావడంతో ఉద్రిక్తతలకు దారి తీసింది. వివాదానికి కారణమేంటి? రాహుల్ ముఖాముఖి వివాదంపై విభిన్న వాదనలు విన్పిస్తున్నాయి. చారిత్రక నేపథ్యం ఉన్న ఓయూకి జాతీయ నాయకులను అనుమతిస్తే వర్సిటీకి మరింత బలం చేకూరుతుందని విద్యార్థులు చెబుతుండగా.. విద్య, రాజకీయాలను వేర్వేరుగా చూడటం సరికాదని కాలేజీ రాజకీయ విభాగం అధ్యాపకుడు ఒకరు వ్యాఖ్యానించారు. అనేక సందర్భాల్లో రాజకీయ ప్రముఖులను ఆహ్వానించడం సాధారణమేనన్నారు. రాహుల్ ముఖాముఖిని ఈ కోణంలోనే చూస్తే వివాదం ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఓయూ క్యాంపస్లోకి రాజకీయ కార్యకలాపాలను అనుమతించవద్దనే నిర్ణయం తీసుకున్నామని వీసీ రవీందర్ అంటుండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని ఓయూ విద్యార్థి నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ చనగాని దయాకర్ చెబుతుండడం గమనార్హం. (చదవండి: ఓయూ రగడ.. ఆగని అరెస్టులు) -
మరో వివాదం రేపిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్
-
బిగ్బాస్ హారికకు భారీ షాక్..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా నియమితురాలైన దేత్తడి హారికకు రాష్ట్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ హారికను నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేయడమే కాక ఆమెకు అపాయిట్మెంట్ ఆర్డర్ సైతం అందజేశారు. అయితే దీనిపై వివాదం రాజుకుంది. మంత్రికి, ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా నియామకం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై టూరిజం శాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వ్యవహారం చీఫ్ సెక్రటరీ వరకు వెళ్లింది. దీంతో వెంటనే అలర్టెయిన అధికారులు అధికారిక వెబ్సైట్లో హారికకు నియామకానికి సంబంధించిన వివరాలను తొలగించారు. అయితే తెలంగాణ టూరిజం అధికారిక ట్విట్టర్లో మాత్రం ఆమె నియామకానికి సంబంధించిన వివరాలు అలాగే ఉన్నాయి. హారికకు ముందు తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా నియమించిన సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో తాజాగా హారికను నియమించగా.. ప్రస్తుతం ఆమె పేరును వెబ్సైట్ నుంచి తొలగించడం కలకలం రేపుతుంది. ఇక హారిక నియామకంపై ఓ రేంజ్లో విమర్శలు వచ్చాయి. అసలు ఏ అర్హత ఆధారంగా ఆమెని బ్రాండ్ అంబాసిడర్గా నియమించారంటూ నెటిజనులు విమర్శించారు. యూట్యూబ్ స్టార్గా సత్తా చాటడం, బిగ్ బాస్లో పాల్గొనడమే అర్హతలా అని ప్రశ్నించారు. ఎవరెస్ట్ సహా ప్రపంచంలోని ఆరు ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన మాలావత్ పూర్ణ, మిస్ ఇండియాగా ఎంపికై వారణాసి మానస తదితరులను ఎంపిక చేయవచ్చు కదా అంటూ సూచించారు. చదవండి: స్టార్ హీరోయినే నా డ్రీమ్: దేత్తడి హారిక -
హారిక నియామకానికి సంబంధించిన వివరాలు తొలగింపు
-
కత్తితో కేక్ కట్ చేసిన హీరో.. క్షమాపణలు
చెన్నై : ఈ మధ్య కాలంలో పుట్టినరోజు వేడుకల్లో కొన్ని అసాధారణ దృశ్యాలు కనిపిస్తున్నాయి. వెరైటీగా ఉంటుందని చెప్పి తల్వార్, గన్తో కేక్ కట్ చేస్తున్నారు కొందరు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం.. జనాలు వారి మీద దుమ్మెత్తిపోయడం వంటివి చూస్తూనే ఉన్నాం. సామాన్యులనే ఇంతలా తిడితే.. ఇక ఇవే పనులు హీరోలు చేస్తే.. ఇంకెంత ట్రోలింగ్ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బహిరంగంగా క్షమాపణలు చెప్పే వరకు వదలరు నెటిజనులు. తాజాగా తమిళ హీరో విజయ్ సేతుపతి ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వివరాలు నేడు విజయ్ సేతుపతి పుట్టినరోజు. ఈ నేపథ్యంలో దర్శకుడు పొన్రామ్ తన టీంతో కలిసి విజయ్ కోసం కేక్ తీసుకువచ్చారు. అయితే వెరైటీగా ఉంటుందని చెప్పి కత్తితో కేక్ కట్ చేయించారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజనులు ఓ రేంజ్లో ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో విజయ్ సేతుపతి క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటానని వెల్లడించారు. (చదవండి: గుర్తుండిపోయే జ్ఞాపకం) ఈ మేరకు విజయ్ సేతుపతి తన ట్విట్టర్లో ‘నా పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన వారందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పుట్టిన రోజు సందర్భంగా తీసిన ఓ ఫోటో ప్రస్తుతం వివాదాస్పదం అవుతుంది. దీంట్లో నేను కత్తితో కేట్ కట్ చేశాను. నేను దర్శకుడు పొన్రామ్ చిత్రంలో నటించబోతున్నాను. ఇందులో కత్తి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇక నేను నా పుట్టిన రోజును పొన్రామ్, బృందంతో జరుపుకున్నాను. దాంతో కేక్ కట్ చేయడానికి కత్తిని ఉపయోగించాను. ఈ పనితో నేను సమాజంలోకి తప్పుడు సంకేతాలు పంపానని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇక మీదట నేను జాగ్రత్తగా ఉంటాను. నా పనితో ఎవరినైనా బాధపెట్టినట్లయితే, క్షమాపణలు కోరుతున్నాను. నా చర్యకు చింతిస్తున్నాను’ అంటూ విజయ్ సేతుపతి తమిళ్లో ట్వీట్ చేశారు. (చదవండి: సిరీస్ కోసం సీరియస్) 🙏🏻 pic.twitter.com/dRRrYrmRd1 — VijaySethupathi (@VijaySethuOffl) January 16, 2021 గతంలో, చెన్నై పోలీసులు తమ పుట్టినరోజు కేక్ను కత్తితో కట్ చేసినందుకు స్థానిక గూండాలను అరెస్టు చేశారు. ఇప్పుడు విజయ్ సేతుపతి అదే నేరం చేశారు. మరి తనను కూడా అరెస్టు చేస్తారా అని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. ఇక తాజాగా విజయ్ సేతుపతి నటించిన మాస్టర్ చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
అమెరికా ఎన్నికలు; జూనియర్ ట్రంప్ కలకలం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఒట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో జో బైడెన్ ముందంజలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదంగా మారింది. దీనిపై మన దేశంలోని విపక్షాలు మండి పడుతున్నాయి. ట్రంప్ తన బుద్ది చూపించుకున్నారు. మనం స్నేహ హస్తం అందిస్తే.. వారు మనల్ని అవమానించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. మంగళవారం డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఓ వరల్డ్ మ్యాప్ని ట్వీట్ చేశారు. దీనిలో దాదాపు అన్ని దేశాలను రిపబ్లికన్ పార్టీ కలర్ అయిన ఎరుపు రంగులో చూపించారు. అంటే ఈ దేశాలన్ని తన తండ్రి విజయం సాధిస్తాడని నమమ్ముతున్నాయి.. ఆయనకే ఓటు వేస్తాయి అనే ఉద్దేశంతో ఇలా ఎరుపు రంగులో చూపించారు. ఇక ఇండియా, చైనా, లైబేరియా, మెక్సికో వంటి దేశాలను మాత్రం డెమొక్రాట్ పార్టీ రంగు బ్లూ కలర్లో చూపించారు. ఈ దేశాలన్ని జో బైడెన్కు మద్దతుదారులని.. ఆయనకే ఓటు వేస్తాయని తెలిపారు. అలానే అమెరికాలోని కాలిఫోర్నియా, మేరీల్యాండ్ వంటి రాష్ట్రాలను కూడా నీలం వర్ణంలోనే చూపించారు. ఒకే చివరకు నా ఎన్నికల మ్యాప్ అంచనా ఇలా ఉంది అంటూ చేసిన ట్వీట్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఈ ట్వీట్లో అతడు జమ్ము కశ్మీర్, లద్దాఖ్, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలను ఎరుపు రంగులో చూపించాడు. అది కాస్తా వివాదాస్పదంగా మారింది. దీనిపై విపక్షాలు మండి పడితున్నాయి. (చదవండి: ట్రంప్ గెలిస్తే అతనికి 112 కోట్లు) Okay, finally got around to making my electoral map prediction. #2020Election #VOTE pic.twitter.com/STmDSuQTMb — Donald Trump Jr. (@DonaldJTrumpJr) November 3, 2020 మనం స్నేహితుడని భావిస్తే.. ట్రంప్ బుద్ధి చూపించాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ ట్వీట్పై స్పందించారు. ‘సీనియర్ ట్రంప్తో మనకు ఎంతో స్నేహం. ఇక జూనియర్ ట్రంప్ ఇండియాని జో బైడెన్, కమలా హారిస్ మద్దుతుదారుగా చూపించారు. ఆశ్చర్యం ఏంటంటే.. జమ్ము కశ్మీర్, ఈశాన్య ప్రాంతాలు మాత్రమే ట్రంప్కి ఓటు వేస్తాయని వెల్లడించారు. ఎవరైనా అతడి కలర్ పెన్సిల్ని లాక్కొండి’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. So much for the friendship with Trump Senior. Junior has placed India firmly with @JoeBiden & @KamalaHarris though interestingly Jr. believes J&K & the NorthEast go against the rest of India & will vote Trump. Someone needs to take his colouring pencils away. https://t.co/AqVyX4ixdl — Omar Abdullah (@OmarAbdullah) November 3, 2020 అలానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయుకుడు శశి థరూర్ కూడా జూనియర్ ట్వీట్పై స్పందించారు. ‘నమో బ్రొమాన్స్కు దక్కిన బహుమతి ఇది. డాన్ జూనియర్ భారత్లోని జమ్ము కశ్మీర్, ఈశాన్య ప్రాంతాలను చైనా, మెక్సికో వంటి శత్రువులు, మురికి ప్రదేశాలతో కలిపారు. సెరినేడింగ్ ఈవెంట్ల కోసం కోట్లు ఖర్చు చేసినందుకు దక్కిన ఫలితం ఇది’ అన్నారు. (చదవండి: అమెరికా అధ్యక్షులెవరో తేలకపోవచ్చు!) The price of Namo’s bromance: Kashmir & the NorthEast cut off from the rest of India, &the whole “filthy" place relegated by Don Jr to the realm of hostiles, along with China&Mexico. So much for the crores spent on obsequious serenading stadium events! https://t.co/fsI53aSkpv — Shashi Tharoor (@ShashiTharoor) November 3, 2020 మరోవైపు భారతదేశానికి మాజీ పాకిస్తాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ఈ మ్యాప్ని "ప్రోత్సాహకరంగా"ఉంది అంటూ ప్రశంసించారు. "మంచిది. జమ్మూ కాశ్మీర్ని పాకిస్తాన్లో భాగంగా చూపించారు. చాలా ప్రోత్సాహకరంగా ఉంది" అంటూ ట్వీట్ చేశారు. Good. Jammu and Kashmir is shown as part of Pakistan. Very encouraging. https://t.co/cAwqYniOct — Abdul Basit (@abasitpak1) November 3, 2020 -
కాక రేపుతున్న పాపడం..
న్యూఢిల్లీ: భారతీయ ఆహారంలో పాపడాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా వెజిటేరియన్ భోజనంలో పాపడం తప్పని సరి. అయితే గత కొద్ది రోజులుగా పాపడం ఏదో ఓ కారణంతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. పాపడ్తో కరోనా పరార్.. కోవిడ్ బారిన పడకుండా ఉండాలంటే పాపడాలు తినాలంటూ ఓ మంత్రి వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది. తాజాగా పాపడం మరో సారి వార్తల్లో నిలిచింది. 2014లో చిన్నారుల కోసం కంపోజ్ చేసిన ఓ పాపడం పాట ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. విగ్లెస్ అనే పిల్లల సంగీత బృందం సభ్యుడైన ఆంథోనీ డోనాల్డ్ జోసెష్ ఫీల్డ్ అనే ఆస్ట్రేలియా సంగీతకారుడు దీనిని స్వరపరిచారు. దాదాపు ఆరేళ్ల నాటి పాట తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాక వివాదాస్పదంగా మారింది. ఇక ఈ వీడియోలో ఆస్ట్రేలియన్ల బృదం "పాపడం" పాటను పాడతారు. దీనిలో ఒక దక్షిణాసియా మహిళ కూడా ఉంది. అయితే ఆమె నోటి వెంట ఎలాంటి పదాలు వెలువడవు.. పైగా ఏదో బలవంతంగా నవ్వుతూ.. ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం వీడియోలో చూడవచ్చు. (చదవండి: ‘ఈ పాపడ్తో కరోనా పరార్’) ఆమె కాక మిగతా అందరూ "పాపడం" అనే పదాన్ని పదేపదే జపిస్తూ ఉంటారు. ఒకానొక సమయంలో, ఈ టీంలోని ఒకరు క్రికెట్ బ్యాట్ని ఊపుతూ, పాటను పాడతాడు. ఇది క్రికెట్ పట్ల భారతదేశ ప్రేమను సూచిస్తుంది. సాంస్కృతిక ప్రాతినిధ్యంపై అవగాహన కల్పించడానికి 2014 లో పిల్లల కోసం రాసిన పాట అకస్మాత్తుగా దేశీ సోషల్ మీడియాలో వైరలయ్యింది. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ‘2020లో ఇలాంటివి ఇంకా ఏమేం చూడాల్సి వస్తుందో.. మీ ఆలోచన బాగుంది.. ఆచరణ బాగాలేదు.. ఇలాంటి పాటతో పిల్లలకు ఏం బోధించాలనుకుంటున్నారు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. వివాదం తలెత్తడంతో ఫీల్డ్ దీనిపై స్పందించారు. ‘భారతీయ సమాజాన్ని సాంస్కృతికంగా కించపరిచే ఉద్దేశం నాకు లేదు. క్షమించండి’ అని కోరారు. Al, I wrote the song, and directed the clip in 2014 (which was meant as a celebration). It was not my intention to be culturally insensitive to the Indian community, or to add value to ethnic stereotyping. Apologies . — Anthony Field (@Anthony_Wiggle) October 22, 2020 -
వివాదంలో 800: స్పందించిన మురళీధరన్
శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా ప్రస్తుతం '800' పేరుతో ఓ తమిళ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మురళీధరన్ పాత్రలో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నారు. అయితే కొన్ని తమిళ సంఘాలు, సంస్థలు ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. శ్రీలంక జాతీయ జట్టుకు ఆడి మురళీధరన్ తమిళ జాతికి ద్రోహం చేశారని అవి ప్రచారం చేస్తున్నాయి. మురళీధరన్ పాత్రలో నటిస్తున్నందుకు విజయ్ సేతుపతిపై మండిపడుతున్నాయి. ఈ వ్యవహారంపై మురళీధరన్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకూ జీవితంలో నేను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను. నా వ్యక్తిగత జీవితం, క్రికెట్ జీవితం గురించి చాలా మంది మాటలన్నారు. ఇప్పుడు '800' చిత్రం కూడా నా జీవితం గురించే చర్చిస్తుంది కాబట్టి, దీనిపైనా విమర్శలు వస్తాయి. అయితే, నేను కొన్ని విషయాలపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను’ అన్నారు ‘ఈ చిత్రాన్ని కొందరు వివిధ కారణాలతో రాజకీయంగా వ్యతిరేకిస్తున్నారు. నేను ఇదివరకు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి చూపిస్తున్నారు. గత ఏడాది నేను 2009 నాకు అత్యంత ఆనందం కలిగించిన సంవత్సరం అని అన్నాను. అయితే కొందరు దీన్ని వక్రీకరించి 'శ్రీలంకలో తమిళులను పెద్ద సంఖ్యలో చంపిన ఏడాది మురళీధరన్కు అత్యంత ఆనందం కలిగించిన సంవత్సరమట' అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఓ సామాన్యుడి కోణంలో ఆలోచించండి. దేశంలో యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంది. ఇంతటి ఆందోళనకర పరిస్థితుల్లో 2009లో యుద్ధం సమాప్తమైంది. ఓ సామాన్యుడిగా సురక్షితంగా ఉన్నామన్న భావన నాకు కలిగింది. పదేళ్లుగా ఇరువైపులా మరణాలు లేవు. అందుకే, 2009ని నేను అత్యంత ఆనందం కలిగించిన సంవత్సరం అని అన్నాను. అమాయకులను చంపడాన్ని నేను ఎప్పుడూ సమర్థించలేదు. సమర్థించబోను’ అని మురళీధరన్ స్పష్టం చేశారు. (చదవండి: ‘800’ వివాదం.. జనాలకు ఏం పని లేదా?!) అంతేకాక ‘నా జీవిత కథను సినిమాగా తీస్తామని నిర్మాణ సంస్థ ముందుకువచ్చినప్పుడు మొదట నేను తటపటాయించా. కానీ, ఆ విషయం గురించి ఆలోచించన తర్వాత, మురళీధరన్గా నేను సాధించిన విజయాలు నా ఒక్కడివే కాదనిపించింది. నా తల్లిదండ్రుల సహకారం ఇందులో ఎంతో ఉంది. నా ఉపాధ్యాయులు, కోచ్లు, సహచర ఆటగాళ్లు అందరూ నా వెనుక ఉన్నారు. సినిమాతో వాళ్లకు గుర్తింపు వచ్చినట్లవుతుందని అనిపించింది. అందుకే ఒప్పుకున్నాను’ అని తెలిపారు. ఇక "శ్రీలంక తమిళులు చనిపోతున్నప్పుడు ముత్తయ్య ఫిడేలు వాయించారు. తన సొంత ప్రజలు చనిపోయినప్పుడు అతను ఆనందించారు. అలాంటి వ్యక్తి క్రీడాకారుడిగా ఎంత సాధించినా ఉపయోగం ఏమిటి? మనకు సంబంధించినంతవరకు, ముత్తయ్య నమ్మకద్రోహం చేసాడు" అని ప్రముఖ డైరెక్టర్ భారతీరాజా విమర్శించారు. (చదవండి: ముత్తయ్య మురళీధరన్ బయోపిక్లో నటించొద్దు! ) పీఎంకే చీఫ్ డాక్టర్ పి రామదాస్ మాట్లాడుతూ, "విజయ్ సేతుపతి ఈ చిత్రాన్ని తిరస్కరించినట్లయితే, అతను తమిళ చరిత్రలో గౌరవప్రదమైన స్థానం పొందుతాడు లేదని ధిక్కరిస్తే, ద్రోహుల చరిత్రలో నిలిచిపోతాడు" అని తెలిపారు. ఇక ఈ చిత్ర నిర్మాతలు, డార్ మోషన్ పిక్చర్స్, ఈ సినిమా "పూర్తిగా స్పోర్ట్స్ బయోగ్రఫీ" అని, దీనిలో శ్రీలంకలో తమిళుల పోరాటాలను తక్కువ చేసే సన్నివేశాలను చూపించమని చెప్పారు. ఈ వివాదాలపై విజయ్ సేతుపతి ఇంకా స్వయంగా స్పందించలేదు. 2017లో నటుడు, రాజకీయ నాయకుడు రజనీకాంత్ తన 2.0 చిత్రం నిర్మాతలు ఏర్పాటు చేసిన శ్రీలంక కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. నిరాశ్రయులైన తమిళులకు ఇళ్లను పంపిణీ చేయడానికి నిర్ణయించిన ఈ కార్యక్రమాన్ని కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. దీని ద్వారా తమిళులు పునరావాసం పొందారని అంతర్జాతీయ సమాజానికి తప్పుడు ప్రచారం చేయడానికి శ్రీలంక తన పర్యటనను ఉపయోగించుకోవచ్చని రజనీని హెచ్చరించాయి. -
జ్యోతిక వ్యాఖ్యలను సమర్థించిన సూర్య..
చెన్నై : ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్లో పాల్గొన్న ప్రముఖ నటి జ్యోతిక చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆలయాల తరహాలోనే ఆసుపత్రులు, పాఠశాలలను అభివృద్ధి చేయాలన్న జ్యోతిక వ్యాఖ్యలపై పలువురు హిందూవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యలపై జ్యోతిక క్షమాపణ చెప్పాలని కూడా కొందరు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో జ్యోతిక చేసిన వ్యాఖ్యలను ఆమె భర్త, ప్రముఖ హీరో సూర్య సమర్థించారు. తమ కుటుంబం జ్యోతిక అభిప్రాయానికి మద్దతుగా నిలుస్తుందన్నారు. జ్యోతిక ఆలోచనను చాలా మంది స్వాగతిస్తున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించి సూర్య సోషల్ మీడియాలో ఓ లేఖను విడుదల చేశారు. ద్వేషాన్ని కాదని.. ప్రేమను పంచాలని ఆయన కోరారు. ‘చెట్లు ప్రశాంతగా ఉన్నప్పటికీ.. గాలి వాటిని అలాగే ఉండనివ్వదు. ఓ అవార్డు ఫంక్షన్లో నా భార్య చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అలాగే తీవ్ర చర్చకు దారితీసింది. దేవాలయాలకు విరాళాలు ఇచ్చిన మాదిరిగానే.. పాఠశాలలకు, హాస్పిటల్స్కు కూడా విరాళాలు ఇవ్వాలనేదే ఆమె అభిప్రాయం. కానీ ఓ వర్గం ప్రజలు దీనిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదు. స్వామి వివేకానంద సహా ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు.. మతం కన్నా మానవత్వం గొప్పదని చెప్పారు. నేను ఇదే విషయాన్ని నా పిల్లలకు కూడా చెబుతాను. ఆధ్యాత్మికవేత్తల భోదన నుంచి పొందిన ప్రేరణతో జ్యోతిక చేసిన వ్యాఖ్యలకు మా కుంటుంబం మద్దతుగా నిలుస్తోంది. ఆమె ప్రసంగంలోని సారాంశాన్ని అర్థం చేసుకున్న చాలా మంది ఈ సమయాల్లో కూడా మద్దతుగా నిలిచారు. వారందరి నా కృతజ్ఞతలు’ అని సూర్య పేర్కొన్నారు. సినిమాల విషయానికి వస్తే.. సూర్యతో పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉంటున్న జ్యోతిక.. ఇటీవలి కాలంలో నటనుకు ప్రాధాన్యమున్న పాత్రల్లో, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘పొన్ మగళ్ వందాళ్’ చిత్రం త్వరలోనే ఓటీటీ ప్లామ్ఫామ్లో విడుదల కానుంది. #அன்பைவிதைப்போம் #SpreadLove pic.twitter.com/qjOlh8tHtV — Suriya Sivakumar (@Suriya_offl) April 28, 2020 చదవండి : ఓటీటీకే ఓటు -
ఎక్స్ట్రార్డినరీ జనరల్ బాడీ మీటింగ్!
హైదరాబాద్ ఫిల్మ్చాంబర్లోని నిర్మాతల మండలి హాలులో ఆదివారం (20వ తేదీ) తెలుగు సినిమా నటీనటుల సంఘం ‘మా’ జనరల్ ఆత్మీయ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మా’ జనరల్ కార్యదర్శి జీవితారాజశేఖర్ మాట్లాడుతూ – ‘‘ఆదివారం జరిగిన సమావేశాన్ని ఆత్మీయ సమ్మేళనం, ఆంతరంగిక సమ్మేళనం, ‘మా’ సమావేశం.. ఇలా ఏదైనా అనుకోవచ్చు. ఈ సమావేశానికి దాదాపు 200 మంది సభ్యులు హాజరయ్యారు. ఆదివారం జరిగిన సమావేశ వివరాలను ‘మా’ కార్యవర్గం ఆమోదం మేరకు తెలియజేస్తున్నా. ఆదివారం 9గంటల నుంచి సాయత్రం 5.30 గంటల వరకు సమావేశం జరిగింది. 28 మంది కమిటీ సభ్యుల మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయి. వాటిని మేం పరిష్కరించుకోలేకపోయాం. మెజారిటీ సభ్యులు అత్యవసరంగా ‘ఎక్స్ట్రార్డినరీ జనరల్ బాడీ మీటింగ్’ పెట్టుకోవాలని సూచనలు చేశారు. ఆ సమావేశంలో ‘మా’ లాయర్ గోకుల్గారు, కోర్టులో కేసు వేసిన వరప్రసాద్గారు కూడా ఉన్నారు. ‘మా’లో ఉన్న 900 మందికిపైగా సభ్యుల్లో 20శాతం మంది సభ్యులు ఆమోదం తెలిపితే 21రోజుల్లోగా ‘ఎక్స్ట్రార్డినరీ జనరల్ బాడీ మీటింగ్’ జరుగుతుంది. సమస్యలు పరిష్కారం కావాలని కోరుకునే సభ్యులందరూ ‘మా’ ఆఫీసుకు వచ్చి సంతకాలతోనో, రావడానికి సాధ్యం కాకపోతే ఈమెయిల్ ద్వారానో, పోస్ట్ ద్వారానో ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అంటూ ఓ వీడియో ద్వారా పేర్కొన్నారు. -
కౌశల్ ఆర్మీకి ప్రతీ రూపాయికి లెక్క ఉంది..
బిగ్బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్కు.. ఆయన విజయంలో కీలక పాత్ర పోషించిన కౌశల్ ఆర్మీకి మధ్య వివాదం ముదురుతోంది. ఫౌండేషన్ డబ్బును కౌశల్ ఇష్టం వచ్చినట్టుగా వృధా చేస్తున్నాడంటూ ఆరోపిస్తు ఆర్మీ సభ్యులు ఎదురు తిరగటంతో కౌశల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘మూడు నెలల క్రితం స్థాపించిన కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ గురించిన అన్ని వివరాలు జెన్యూన్గా ఉన్నాయి. ప్రతీ రూపాయికి లెక్క ఉంది. కావాలంటే ఎవరైనా ఆడిటింగ్ చేసుకోవచ్చు. నేను డబ్బు మనిషిని కాను. ఎలాంటి ఆధారాలు లేకుండా నా మీద ఆరోపణలు చేస్తున్నారు. నన్ను అభిమానించిన ప్రతీ ఒక్కరికీ నేను కృతజ్ఞడుని. బిగ్బాస్ గేమ్ను నేను ఎంతో కష్టపడి గెలిచాను. అలాంటిది నా మీద ఓ మీడియా సంస్థ (సాక్షి కాదు) నా గురించి తప్పుడు ప్రచారం చేస్తోంది. 20 సంవత్సరాలు కష్టపడితే నాకు వచ్చిన మంచి అవకాశం బిగ్ బాస్ 2. సామాన్యుడైన కౌశల్ ఈ స్థాయికి రావటం ఇష్టం లేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఆర్మీ తరపున చేసే ప్రతీ కార్యక్రమం రికార్డెడ్. అన్ని వివరాలు ఫేస్బుక్లో కూడా ఉన్నాయి. నా కుటుంబాన్ని కూడా వదిలి కౌశల్ ఆర్మీ కోసం పనిచేస్తున్నా. నా పై ట్రోలింగ్ చేస్తున్న ఆరుగురిపై సైబర్ క్రైమ్ పోలిస్ స్టేషన్లో కేసు నమోదు చేసాన’ని తెలిపారు. -
క్రిష్పై కంగనా సోదరి ఫైర్
వివాదాల నడుమ విడుదలైన మణికర్ణిక చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఈ సినిమాపై ఇంత హైప్ క్రియెట్ కావడానికి వివాదాలు కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. తొలుత ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఆయన ఈ చిత్రం నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం మణికర్ణిక వివాదంపై క్రిష్ స్పందించారు. హీరోయిన్ కంగనా రనౌత్ కారణంగానే ఈ ప్రాజెక్టు నుంచి బయటకు రావాల్సి వచ్చిందని వెల్లడించారు. తన పట్ల ఆమె చాలా దురుసుగా ప్రవర్తించిందని కూడా తెలిపారు క్రిష్. (‘మణికర్ణిక’ వివాదంపై స్పందించిన క్రిష్) అయితే క్రిష్ చేసిన వ్యాఖ్యలపై కంగన సోదరి రంగోలి స్పందించారు. క్రిష్ను ఉద్దేశిస్తూ.. ‘డైరెక్టర్గారు.. సినిమా మొత్తం మీరే తీశారు. మేం ఒప్పుకుంటా. కానీ తెర మీద మొత్తం కంగనానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ విజయాన్ని, ప్రశంసల్ని ఆమె ఆస్వాదిస్తుంది. తనను ఒంటరిగా వదిలేయండి. దయచేసి మీరు ప్రశాంతంగా ఆసీనులుకండం’టూ రంగోలి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. పత్రికలుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా 70 శాతం సినిమాను తానే డైరెక్ట్ చేసినట్లు చెప్పారు. అయితే ఈ విషయాన్ని క్రిష్ ఖండించారు. కంగనా కేవలం 30 శాతం సినిమాను మాత్రమే తెరకెక్కించిందని తెలిపారు. ఒకరు చేసిన పనిని తనదిగా చెప్పుకుంటున్న ఆమెకు అసలు నిద్ర ఎలా పడుతుందో అర్థం కావడం లేదని క్రిష్ వ్యాఖ్యానించారు. తాను తీసిన సన్నివేశాలనే మళ్లీ చిత్రీకరించి ఆమె పేరు వేసుకుందన్నారు. @DirKrish chalo man liya you directed the whole film now please calm down, still Kangana is the leading face of the film let her enjoy this moment of her success and great appreciation, please leave her alone, we all believe you now please take a seat 🙏 https://t.co/rInLkrHreO — Rangoli Chandel (@Rangoli_A) January 28, 2019 -
‘నా సినిమా రిలీజ్ లేదు.. కావాలనే ఇలా చేశారు’
విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ముద్ర. తమిళ సినిమా కనితన్కు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తిగా కావచ్చింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ వారమే(25-01-2019) రిలీజ్ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై స్పందించిన హీరో నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు. సోషల్ మీడియా పేజ్లో ‘ఈ వారం నా సినిమా రిలీజ్ కావటం లేదు. కొంత మంది వ్యక్తులు కావాలనే నా సినిమా టైటిల్ను సేమ్ డిజైన్తో వాడుకున్నారు. టికెట్ బుకింగ్ యాప్లో నా పేరును కూడా వాడుతున్నారు. మా నిర్మాతలు ఆ వ్యక్తులపై చర్యలకు సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తా’మన్నారు. ప్రస్తుతం నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ముద్ర సినిమా నిర్మాణకార్యక్రమాలు జరుపుకుంటోంది. టీఎన్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్నారు. Guys My Movie is NOT RELEASING this week... SOME ppl with evil intentions have used the exact SAME LOGO DESIGN nd put MY NAME in the BOOKINGS APP... My Producers are on the case and will UPDATE u soon with the details.. This is disgraceful 👇 #Mudra pic.twitter.com/2c4IzXaVIV — Nikhil Siddhartha (@actor_Nikhil) 24 January 2019 -
తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న వివాదాస్పద చిత్రం
విమర్శలు, వివాదాలు, కేసుల మధ్య మహా చిత్రం ఒక ఘట్టాన్ని దాటింది. నటి హన్సిక నటిస్తున్న తాజా చిత్రం మహా. ఇది ఈ అమ్మడి 50వ చిత్రం అన్న విషయం తెలిసిందే. ఎక్స్ట్రా ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై వి. మదియళగన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జమీల్ దర్శకత్వం వహిస్తున్నారు. మహ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ ఇటీవల విడుదలై ఎలాంటి వివాదాలకు దారితీస్తుందో తెలిసిందే. హన్సిక కాషాయ వాస్త్రాలు ధరించి, నోటీ నిండా పొగతో చేతిలో సిగరెట్తో కాశీ పట్టణం తీరంలో సింహాసనంలో దర్జాగా కూర్చున్న దృశ్యంపై తీవ్ర దుమారం రేపింది. ఇవన్నీ అసలు పట్టనట్లు ఆ చిత్ర నిర్మాత వి.మదియళగన్ శనివారం ఒక ప్రకటనను విడుదల చేస్తూ, మాగ్నెటింగ్, అలూరింగ్, హిడ్డన్, అగ్రెస్సీవ్ వంటివి మహా చిత్రంలో ఇంకా చాలా ఉంటాయని పేర్కొన్నారు. ఈ చిత్రం మొత్తం తమిళ చిత్రపరిశ్రమ దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటుందన్నారు. సాధారణంగా నిర్మాతలు స్టార్ తారాగణాన్ని, ప్రముఖ దర్శకులను, ప్రముఖ సాంకేతిక నిపుణులను తమ చిత్రాల్లో ఉండాలని కోరుకుంటారన్నారు. తనకు మాత్రం ప్రణాళిక ప్రకారం, నిబద్ధతతో పనిచేసే చిత్ర టీమ్ లభించడం ఆనందంగా ఉందన్నారు. మహా చిత్రం షూటింగ్ తొలి షెడ్యూల్ సంతృప్తిగా పూర్తి చేశారని చెప్పారు. అందుకు నటి హన్సిక, దర్శకుడు జలీల్, ఛాయాగ్రాహకుడు లక్ష్మణ్ ఇలా అందరి సహకారం చాలా సంతోషాన్నికలిగిస్తోందని అన్నారు. ఈయన నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న కొలైయుధీర్ కాలం, అరుణ్ విజయ్ హీరోగా బాక్సర్ చిత్రాలను నిర్మిస్తున్నారు. వీటిలో నయనతార నటించిన కొలైయుధీర్ కాలం చిత్రం త్వరలో రిలీజ్కు రెడీ అవుతోంది. -
మహా వివాదంపై వివరణ
హన్సిక లేటెస్ట్ చిత్రం ‘మహా’ ఫస్ట్ లుక్ పోస్టర్ల మీద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. హన్సిక కాషాయ వస్త్రాలు ధరించి ధూమపానం చేస్తున్నట్టుగా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసింది చిత్రబృందం. అయితే ఈ పోస్టర్స్ మీద కొందరు అభ్యంతరాలు తెలిపారు. మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఈ విషయం గురించి చిత్రదర్శకుడు యుఆర్ జమీల్ స్పందిస్తూ – ‘‘మా ఫస్ట్ లుక్ గురించి అందరి కామెంట్స్ చూశాను. దర్శకుడిగా నా ఉద్దేశం ఎవరినీ హర్ట్ చేయాలని కాదు. కొత్తగా చూపించాలనుకున్నాను. కుల, మతాలకు సంబంధించిన సెంటిమెంట్స్ను దెబ్బతీసే ఉద్దేశం అయితే అస్సలు లేదు. హిందూ, ముస్లిం మతాలను కాదు, మానవత్వాన్ని నమ్ముతాను నేను. దయ చేసి ఇందులోకి కులాలు, మతాలకు సంబంధించిన యాంగిల్ను తీసుకురావద్దు’’ అని పేర్కొన్నారు. ‘మహా’ హన్సిక కెరీర్లో 50వ చిత్రం కావడం విశేషం. -
పెరియార్కుత్తుకు చిందేసిన శింబు
సంచలనం, కలకలం, వివాదం, అంతకు మించి ప్రతిభ ఇవన్నీ కలిస్తే శింబు. ఈ యువ నటుడు పాడినా, మాట్లాడినా, ఆడినా వార్తే. అలా శింబు ఎప్పుడూ ప్రత్యేకమే. శింబు షూటింగ్కు సరిగా రారు, నిర్మాతలను ఇబ్బంది పెడతారు, దర్శకులతో గొడవ పడతారు లాంటి ఆరోపణలూ ఉన్నాయి. ఆ మధ్య విజయాలకు దూరమై విమర్శలకు బాగా దగ్గరైన శింబుపై రెడ్ కార్డ్ పడనుందనే దుమారం వరకూ పరిస్థితులను తెచ్చుకున్న నటుడు శింబు. ఇక ఆ మధ్య బీప్ పాటతో పోలీసులకు ఫిర్యాదు, కేసులు, కోర్టులు వరకూ వెళ్లారు. అలాంటివి తగ్గి ఇటీవల నటించిన సెక్క సివంద వానం చిత్ర విజయంతో మళ్లీ ఫామ్లోకి వచ్చిన శింబు నటుడిగా బిజీ అయ్యారు. ఆయన నటించిన తాజా చిత్రం వందా రాజాదాన్ వరువేన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. చేతిలో చాలా అవకాశాలు ఉన్నాయి కూడా. ఇలాంటి సమయంలో పెరియార్ కుత్తు అనే ప్రైవేట్ ఆల్బ మ్తో మరోసారి సంచలనానికి రెడీ అయ్యారు. తమిళనాడులో పెరియార్కు చాలా ఉన్నత భావాలు కలిగిన రాజకీయ సామాజిక వాది అనే పేరు ఉంది. అలాంటి నాయకుడి పేరుకు కుత్తు (ఐటమ్ సాంగ్కు కుత్తు పదాన్ని వాడతారు) పదం చేర్చి శింబు పాడి, ఆడిన పాటతో కూడిన ఆడియోను శుక్రవారం యూ ట్యూబ్లో విడుదల చేశారు. జాతి, మత వివక్షతను ఎండగట్టేలా సాగే ఆ పాటకు నటుడు శింబు నల్లషర్టు, ప్యాంటు ధరించి గ్రాఫిక్స్తో రూపొందించిన పెరియార్ శిల వద్ద ఐటమ్ సాంగ్ మాదిరి చిందులేస్తూ నటించడం విశేషం. ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ దుమ్మురేపుతోంది. మరి ఈ వీడియోను ఎవరు ఏ విధంగా కెలికి వివాదంగా తెరపైకి తీసుకొచ్చారో చూడాలి. -
ఫస్ట్ లుక్ వివాదం.. కష్టాల్లో హీరోయిన్
హీరోయిన్ కెరీర్లో 50 సినిమాలు పూర్తి చేయటమంటే మామూలు విషయం కాదు. అలాంటి అరుదైన ఘనతను సాదించిన సౌత్ బ్యూటీ హన్సిక. అయితే త్వరలో తన 50వ సినిమా ‘మహా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న హన్సికకు ఆ సినిమా కారణంగా వివాదాలు ఎదురవుతున్నాయి. మహా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదల చేసారు. అయితే ఆ లుక్ ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. సన్యాసులు ధరించే కాషాయ వస్త్రాలను ధరించిన హన్సిక, సింహాసనం లాంటి కుర్చిలో కూర్చొని హుక్కా తాగుతున్నట్టుగా ఉన్న స్టిల్ను ఫస్ట్ లుక్గా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఉందంటూ పీఎంకే పార్టీ కోర్టులో కేసు వేసింది. ఈ కేసును కోర్టు విచారణకు స్వీకరించటంతో సినిమా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి నెలకొంది. యు.ఆర్.జెమిల్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. 50వ సినిమా కావటంతో హన్సిక కూడా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరి ఈ వివాదం కారణంగా హన్సికకు మరింత ప్రచారం లభిస్తుందో లేక సినిమానే ఇబ్బందుల్లో పడుతుందో చూడాలి. -
సద్దుమణిగిన ‘ మా అసొషియేషన్’ వివాదం
-
సద్దుమణిగిన ‘మా’ వివాదం
గత కొద్ది రోజులుగా మా అసొషియేషన్లో వివాదాలు ఇండస్ట్రీని కుదిపేశాయి. శివాజీరాజా, నరేష్లు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అయితే వెంటనే నష్టనివారణ చర్యలకు దిగిన ఇండస్ట్రీ పెద్దలు పరిస్థితిని చక్కదిద్దారు. ఈ విషయంపై స్పందించిన తమ్మారెడ్డి భరద్వజ ‘అన్ని సంస్థలలో ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇరు వర్గాలు ప్రెస్మీట్ పెట్టి తప్పు చేశారు. ఇక నుండి అన్నీ విషయాలను తెలుగు ఫిలిం ఇండస్ట్రీనే చూసుకుంటుంద’న్నారు. ఇండస్ట్రీ ఏర్పాటు చేసిన కలెక్టివ్ కమిటీలో ‘మా’లో ఎలాంటి అవకతవకలు జరగలేదని తేలిందని తెలిపారు. ఇక నుంచి మా అధ్యుక్షుడు శివాజీ రాజా, సెక్రటరీ నరేష్లు కలిసి పనిచేస్తారని వెల్లడించారు. భవిష్యత్తులో కలెక్టివ్ కమిటీనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుందన్నారు. నరేష్ మాట్లాడుతూ.. ‘సంస్ధ లో డిఫరెంట్ ఓపినియన్స్ రావటం సహజం. కలెక్టివ్ కమిటీ ద్వారా అందరం కలుసుకొని మాట్లాడుకున్నాం. గతం గతః. రాబోయే రోజుల్లో జరిగే ఈవెంట్స్ కలిసి సక్సెస్ చేస్తాం. నేను, శివాజీ రాజా గారు సినీ పెద్దల సపోర్ట్ తో సిల్వర్ జూబ్లీ ఈవెంట్ లను సక్సెస్ చేయటానికి కృషి చేస్తాం’ అన్నారు. అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ.. చిన్న చిన్న మనస్పర్దలు వచ్చిన మాట వాస్తవమే.. కలెక్టివ్ కమిటీ ముందు అన్నీ వివరాలు ఉంచాము. ఎలాంటి అవకతవకలు లేవని తేలిందన్నారు. -
టాయిలెట్పై ఫన్నీ ట్వీట్ : నెటిజన్ల ఆగ్రహం
ఆసియాలోని టాయిలెట్లపై ఓ అమెరికన్ టీవీ స్టార్ చేసిన ట్వీట్ వివాదస్పదంగా మారింది. కొందరు అది అతనిది అమాయకత్వం అంటుంటే, మరికొందరు మాత్రం అతనిపై మండిపడుతున్నారు. ఇటీవల ఆసియా పర్యటనకు వచ్చిన డీన్ మైఖేల్ వాష్ రూమ్లోని మరుగుదొడ్డి పక్కన ఉన్నటువంటి హ్యాండ్ స్ప్రెయర్ గురించి ఓ ట్వీట్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేశాడు. మాములుగా కడుక్కోవడానికి వాడే హ్యాండ్ స్ప్రెయర్ను దప్పిక తీర్చుకోవడానికి వాడతారని పేర్కొన్నాడు. ‘నేను ఇక్కడి టాయిలెట్లను ఇష్టపడుతున్నానను ఎందుకంటే.. వాష్రూమ్లో ఉన్నప్పుడు ఒకవేళ దాహం వేస్తే తాగాడానికి వీలుగా వాటర్ పంప్(హ్యాండ్ స్ప్రెయర్ను ఉద్దేశించి) అందుబాటులో ఉంచార’ని ట్వీట్లో పేర్కొన్నారు. కాగా దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. చాలా మంది మైఖేల్ వ్యంగ్యంగానే ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. ముఖ్యంగా భారత్తో పాటు, పలు ఆసియా దేశాలకు చెందిన నెటిజన్లు అతన్ని ట్రోల్ చేస్తున్నారు. ఇలా అని నీకు ఎవరు చెప్పారు, రెస్ట్రూమ్లలో పేపర్స్ ఉండేది మీరు నవలలు రాసుకోవడానికా?, మేము నీకు వాటర్కు బదులు జూస్ పెడతాం.. అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. I love how bathrooms here have this water hose next to the toilet incase you get thirsty while in the restroom pic.twitter.com/xsfrFeYkzh — Dean Michael Unglert (@deanie_babies) July 10, 2018 -
ఎంపీలు వస్తే అధికారులు లేచి నిలబడాలి..
సాక్షి, చండీగఢ్ : హరియాణలో బీజేపీ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ సభ్యులు సందర్శిస్తే అధికారులు లేచి నిలబడాలని సూచించింది. ఎంపీల పర్యటనకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. అధికారులు తమను ఖాతరు చేయడం లేదని ఎంపీలు హరియాణ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్కు ఫిర్యాదు చేయడంతో 2011 మార్గదర్శకాలను ఉటంకిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా కార్యాలయాల్లోకి పార్లమెంట్ సభ్యులు ప్రవేశించగానే సంబంధిత అధికారులు అప్రమత్తమై లేచి నిలబడి,వారిని స్వాగతించాలని ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. హరియాణ మంత్రి అనిల్ విజ్ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసిందని నిర్ధారించారు. మరోవైపు ఈ ఉత్తర్వులపై అధికారులు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రభుత్వ అధికారుల హోదాను దిగజార్చడంతో పాటు వారి స్థాయిని తగ్గిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ అధికారులు ఇలా సమయాన్ని వృధా చేయడం సరికాదని, ఈ పనులు దిగువస్థాయి సిబ్బందికి అప్పగిస్తే బాగుండేదని మరికొందరు సీనియర్ అధికారులు వాపోయారు. -
వెటర్నరీలో అక్రమ పదోన్నతులు!
యూనివర్సిటీ క్యాంపస్ : శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో 2012లో చేపట్టిన అధ్యాపక పదోన్నతులు వివాదస్పదంగా మారాయి. తనకు కావాల్సిన వారికి మేలు చేకూర్చేందుకు అప్పటి వీసీ నిబంధనలకు వ్యతిరేకంగా చేసిన పదోన్నతులు ఇపుడు వర్సిటీలోని పలువురి పీఠాలు కదిలించేలా ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఆరేళ్ల తరువాత ఒక ప్రొఫెసర్ ఫిర్యాదు చేయడంతో గవర్నర్ విచారణకు ఆదేశించారు. వర్సిటీ దీనిపై ఒక కమిటీ వేసి విచారణ చేపట్టింది. ఈ అంశాన్ని పాలకమండలిలో చర్చకు పెట్టగా, ఇప్పుడు ఈ పదోన్నతులపై రాద్దాంతరం చేయవద్దని, బోర్డుకు తెలియకుండా ఏమీ చేయవద్దని పాలకమండలి వీసీకి సూచించింది. ఈ వ్యవహారం మొత్తం వర్సిటీలో తీవ్ర వివాదస్పదమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా.. అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేసే అధ్యాపకుడు కెరీర్ అడ్వాన్స్డ్ స్కీమ్(సీఏఎస్) కింద పదోన్నతి పొందాలంటే 9,000 ఏజీపీతో మూడు సంవత్సరాల బోధన అనుభవం ఉండాలి. 2012 అక్టోబర్లో ఉమ్మడి ఏపీగా ఉన్న సమయంలో అప్పటి వీసీ సీఏఎస్ కింద పదోన్నతులు కల్పించారు. నిబంధనల ప్రకారం మూడు సంవత్సరాల సర్వీసు పూర్తయిన వారికి ప్రొఫెసర్గా పదోన్నతి కల్పించాలి. అయితే ఈ నిబంధన పాటించలేదు. దీన్ని ప్రశ్నించినవారిని సంతృప్తిపరచడానికి మరో 20 మందికి తగినంత సర్వీసు లేకపోయినా పదోన్నతి ఇచ్చారు. ఇక్కడికి వరకు అంతా బాగానే ఉంది. ఏపీ విడిపోయాక, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కూడా విడిపోయింది. తెలంగాణలో పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ఆస్తులు, పోస్టులు పంచుకున్నారు. దొడ్డిదారిన పదోన్నతి పొందిన వారిలో 11 మంది తెలంగాణకు, 10 మంది ఏపీకి వచ్చారు. అక్రమ పదోన్నతులపై ఓ ప్రొఫెసర్ రెండు నెలల క్రితం గవర్నర్కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లిన ఓ అధ్యాపకుడికి తక్కువ సర్వీసుతో పదోన్నతి కల్పించారని, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో అధ్యాపకుల పదోన్నతులు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయిని అందులో పేర్కొన్నారు. ఆరు సంవత్సరాల తర్వాత ఈ పదోన్నతులపై ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ గవర్నర్ ఈ అంశంపై విచారణకు ఆదేశించారు. గవర్నర్ ఆదేశాల మేరకు వెటర్నరీ వీసీ హరిబాబు రహస్యంగా ఓ కమిటీ వేసి విచారణ జరిపించారు. విచారణ అనంతరం గవర్నర్కు వీసీ నివేదిక పంపినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో పలువురు పెద్దలు ఉన్నట్లు తెలిసింది. గత నెలలో 17వ తేదీ నిర్వహించిన పాలకమండలి సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. పాలక మండలి సభ్యులు వీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకమండలికి తెలియకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. దీంతో ప్రస్తుతానికి ఈ అంశం సద్దుమణిగింది. అయినప్పటికీ భవిష్యత్లో ఈ వ్యవహారం ఎంత వరకు వెళుతుందోనని అధ్యాపకులు, అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. మొత్తం మీద ఒక వ్యక్తికి మేలు చేసేందుకు ఓ మాజీ అధికారి చేసిన అక్రమాలు ఆరేళ్ల తర్వాత తెరపైకి వచ్చాయి. వర్సిటీలో అక్రమ పదోన్నతుల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. -
కోడలిపై మామ దాడి
వరికుంటపాడు: ఆస్తి పంపకాల వివాదం నేపథ్యంలో కోడలిపై మామ దాడి చేసి గాయపరిచాడు. మండలంలోని గొల్లపల్లిలోకి చెందిన బాధితురాలు గంగవరపు అనూరాధ కథనం మేరకు.. గ్రామానికి చెందిన గంగవరపు వెంకటరత్నం కుమారుడు వెంకటరమేష్కు ఆరేళ్ల క్రితం గొల్లపల్లి అనూరాధతో వివాహమైంది. అనంతరం ఆస్తి పంపకాలు చేసుకున్నారు. ఆ ఆస్తిని తిరిగి దక్కించుకునేందుకు మామ వెంకటరత్నం తరచూ ఆమెను చంపుతానని బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం పొలానికి వెళ్లి గడ్డి కోస్తుండగా మామ వెంకటరత్నం దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో 108 వాహనంలో ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతుంది. -
ప్రాచీన దిన పత్రిక దృష్టిని మరల్చుకోవడానికే..
తమిళసినిమా: మీడియాపై నటి అమలాపాల్ నిప్పులు చెరిగింది .ఇటీవల తన కారు కొనుగోలుపై పెద్ద దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. అమలాపాల్ బెంగళూర్లో ఖరీదైన కారును కొనుగోలు చేసి దాని రిజిస్ట్రేషన్ను పుదుచ్చేరిలో నకిలీ చిరునామాతో చేసుకుని మోసానికి పాల్పడిందన్న ప్రచారం హోరెత్తింది. ఈ వ్యవహారంపై నటి అమలాపాల్ గురువారం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో జాతీయ లక్ష్యాలతో మలబార్ ప్రాంతంలో స్వాతంత్య్ర పోరాట వీరుల చేత ప్రారంభించబడ్డ ఒక ప్రాచీన దిన పత్రిక సాధారణ ప్రజల దృష్టిని తన వైపు మరల్చుకోవడానికి, తద్వారా తన రీడర్ షిప్ను పెంచుకోవడానికి ఆసత్య ప్రచారాలకు పాల్పడడం తనకు వేదన కలిగించిందని తెలిపింది. నటిగా తాను ఏడాదికి రూ.కోటికి పైగా పన్నును చెల్లిస్తున్నానని చెప్పింది. అలాంటిది సంబంధిత శాఖాధికారులు ఎలాంటి అవకతవకలు తెలుసుకోకుండానే తనపైనా, తన కుటుంబంపైనా నిరాధార ఆరోపణల రాతలు రాస్తూ వేదనకు గురిచేయడంతో తాను మాట్లాడాల్సి వచ్చిందని తెలిపింది. ఒక భారత పౌరురాలిగా తాను ఎక్కడికైనా వెళ్లి పని చేసుకోవచ్చునని, ఆస్తులు కొనుగోలు చేసుకునే హక్కు ఉన్నదని పేర్కొంది. మాతృదేశం అన్న పదానికి నిజమైన అర్థాన్ని మరిచి కొందరు ప్రాంతీయ వాదనలను లేవనెత్తడంతో పాటు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. తమిళ్, మలయాళం భాషల్లో సమానంగా నటిస్తున్న తాను ఇరు రాష్ట్రాల్లోనూ ఆదాయాన్ని, ఆస్తులను కొనుగోలు చేయడానికి నిపుణుల సలహాలను తీసుకోవాలని భావించానంది. ఒక వేళ తాను తెలుగు చిత్రాల్లో నటించడానికి, బెంగళూర్లో స్థిరాస్తులు కొనుక్కోవడానికి ఇలాంటి వారి అనుమతి పొందాలేమోనని ఎద్దేవా చేసింది. -
వివాదంలో అల్లు అర్జున్ డీజే
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాపై వివాదంలో చెలరేగుతుంది. ఈ సినిమాలో బ్రాహ్మణుడి పాత్రలో నటిస్తున్న అల్లు అర్జున్ పై చిత్రీకరించిన ఓ పాట వివాదానికి కారణమైంది. ఇటీవల ఈ సినిమాలో బడిలో గుడిలో అనే డ్యూయెట్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ పాటలో బ్రాహ్మణుల మనో భావలు దెబ్బ తినేలా పద ప్రయోగాలు ఉన్నాయంటూ కొంత మంది అభ్యతరం వ్యక్తం చేస్తున్నారు. శివుణ్ని పూజించే సమయంలో వాడే కొన్ని మంత్రాలను ఈ పాటలో తప్పుగా వినియోగించారంటూ ఆరోపిస్తున్నారు. అయితే ఈ వివాదంపై ప్రస్తుతానికి చిత్రయూనిట్ స్పందించలేదు. గతంలో ఇదే తరహాలో రూపొందిన అదుర్స్ సినిమాపై కూడా వివాదం చెలరేగింది. అయితే అప్పుడు చిత్రయూనిట్ అభ్యంతరకర పదాలను మార్చి సినిమాను రిలీజ్ చేశారు. మరి డీజే విషయంలో చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. -
28న ‘ఉగాది’ జరుపుకోవడమే శాస్త్రసమ్మతం
ఉభయ గోదావరి జిల్లాల జ్యోతిష శాస్త్రవేత్తల సదస్సులో ప్రముఖులు రాజమహేంద్రవరం కల్చరల్ : ఉగాది పండుగను ఈనెల 28న జరుపుకోవడమే శాస్త్ర సమ్మతమని పలువురు జ్యోతిష శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మంగళవారం శ్రీనివాసనగర్లోని శ్రీమహాలక్ష్మీసమేత చిన్న వేంకన్నస్వామి వారి పీఠం శాఖాకార్యాలయంలో జరిగిన జ్యోతిష సదస్సుకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి జ్యోతిషవేత్తలు హాజరయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామం నుంచి వచ్చిన యువజ్యోతిషవేత్త దేవులపల్లి రామకృష్ణ శర్మ మాట్లాడుతూ 28వ తేదీ ఉదయం 8.40 గంటల నుంచి 29 ఉదయం 5.46 గంటల వరకు దృక్ సిద్ధాంతం ప్రకారం పాడ్యమి తిథి ఉందని, పూర్వసిద్ధాంతం ప్రకారం 29వతేదీ ఉదయం 6.59 వరకు పాడ్యమి తిథి ఉందని తెలిపారు. అయితే ‘త్రిమూర్త వ్యాప్తి గ్రాహ్యే’ అనే ధర్మశాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి సుర్యోదయ సమయం నుంచి 144 నిమిషాలు ఆ తిథి ఉండాలన్నారు. ఈ లెక్క ప్రకారం 28వ తేదీనే పాడ్యమితిథి ఉండటం వల్ల ఉగాది పండుగను ఆనాడే జరుపుకోవడం సమంజసమన్నారు. మరో జ్యోతిషవేత్త కల్లూరి వేంకటసాయి శర్మ మాట్లాడుతూ హేమలంబి వత్సరానికి ఆదిత్యుడు అధిపతి, పాడ్యమి తిథినాడే ఆదిత్యునికి అర్చన చేయడం శ్రేయస్కరమన్నారు. పుల్లేటికుర్రు గ్రామం నుంచి వచ్చిన యువజ్యోతిషవేత్త బళ్ల దేవి మాట్లాడుతూ 2007లో ఉగాది పండుగను మార్చి 19, 20 తేదీల్లో ఎప్పుడు జరుపుకోవాలన్న విషయమై వివాదం వచ్చినప్పుడు, నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక కమిటీ వేసి దానిని పరిష్కరించారని అన్నారు. పంచాంగశ్రవణం, నింభకుసుమభక్షణం, నూతన వస్త్రధారణ, పండిత సత్కారాలు పాడ్యమితిథి నాడే జరగాలన్నారు. గాయకుడు, కవి ఎర్రాప్రగడ రామకృష్ణ మాట్లాడుతూ వివాహసమయంలో ముహూర్తమంటే తాళి కట్టే సమయమని ఒక అపోహ ఉందని, తలపై జీలకర్ర, బెల్లంపెట్టే సమయమే ముహూర్తమన్నారు. అలాగే, దేవతార్చన చేసే సమయానికి ఉన్న తిథిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. పీఠాధిపతి చిన్న వేంకన్నబాబు మాట్లాడుతూ శాస్త్రవిహిత కర్మలు సరైన సమయాల్లో చేస్తేనే, మనం ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. గాడాల గ్రామంలోని పీఠంలో 28వతేదీ ఉదయం పది గంటలకు పంచాంగశ్రవణం జరుగుతుందన్నారు. చర్చల ద్వారా పంచాంగకర్తలు, జ్యోతిష శాస్త్రవేత్తలు ఏకాభిప్రాయానికి రావడం అవసరమని ఆయన పేర్కొన్నారు. పలువురు జ్యోతిషశాస్త్ర అభిమానులు పాల్గొన్నారు. -
'థెరీసా పవిత్రమూర్తి.. ఆమెను వదిలేయండి'
భారతరత్న మదర్ థెరిసాపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. థెరీసా పవిత్ర మూర్తి అని దయచేసి ఆమె విషయంలో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని హితవు పలికారు. మదర్ థెరీసాను వివాదాల్లోకి లాగొద్దని, ఇక ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా వదిలేయాలని కోరారు. తాను కోల్కతాలోని నిర్మల్ హృదయ్ ఆశ్రమంలో థెరీసాతో కలిసి కొంతకాలం పనిచేసినట్లు కేజ్రీవాల్ చెప్పారు. అలాగే, సీపీఎం కూడా భగవత్ వ్యాఖ్యల విషయం స్పందిస్తూ ఇలాంటి వ్యాఖ్యలతో ప్రపంచంలో భారత్కు ఉన్న గొప్ప ఇమేజ్ తగ్గుతుందని పేర్కొంది. ఇటువంటి వ్యాఖ్యలు చేసి భగవత్ కొత్తగా ఏం నిరూపించుకోవాలనుకుంటున్నారో అర్థం కావాడం లేదంది. అలాగే ఢిల్లీ కేథలిక్ అర్కడైయాసిస్ ఫాధర్ సవారిముత్తు స్పందిస్తూ మదర్ థెరీసాపై ఇలాంటి వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఆమె జీవితం మొత్తాన్ని సేవకే అంకితం చేసినట్లు తెలిపారు. కాగా, మదర్ థెరీసా సేవ చేయడం వెనుక మతమార్పిడి అంశం ఉందని భగవత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
దీపిక పదుకొనెకు ఆలియా భట్ బాసట!
ప్రముఖ ఆంగ్ల దినపత్రిక వివాదస్పద కథనానికి స్పందించిన తీరుపై బాలీవుడ్ తార దీపికా పదుకొనె దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. బాలీవుడ్ తారలతోపాటు, క్రికెటర్లు బాసటగా నిలిచారు. అసభ్య కథనం వెల్లడించిన ఆంగ్ల దినపత్రికకు గట్టిగా బుద్ది చెప్పిందని ఆలియా భట్ ట్విట్ చేశారు. దీపికా పదుకొనె వక్షోజ ప్రదర్శన చేసిందంటూ ప్రముఖ దినపత్రికకు చెందిన వెబ్ సైట్ కథనాన్నిప్రచురించింది. దాంతో నేను మహిళను, నాకు వక్షోజాలు ఉన్నాయి.. మీకు వచ్చిన సమస్యేమిటి?. మహిళను గౌరవించడం చాతకాకపోతే.. మహిళా చైతన్యం అంటూ మాట్లాడవద్దు అంటూ దీపిక ఘాటుగా స్పందించారు. -
అమీర్ ఈసారి నిండుగా బట్టలేసుకున్నాడు!
పీకే ఫస్ట్ లుక్ పోస్టర్ తో అమీర్ ఖాన్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రైలు పట్టాలపై టేప్ రికార్డర్ అడ్డం పెట్టుకుని నగ్నంగా నిలబడిన అమీర్ ఖాన్ ను అనేక కేసులు, వివాదాలు చుట్టుముట్టాయి. అయినా అమీర్ ఖాన్ అందరికి ధీటుగా జవాబిచ్చారు. తాను పబ్లిసిటీ కోసం ఆ పోస్టర్ విడుదల చేయలేదని.. సినిమా చూస్తే మీకు పూర్తిగా అర్ధమవుతుందని సమాధానమిచ్చారు. ఆగస్టు 20 తేదిన విడుదల చేసే రెండవ పోస్టర్ లో ట్రాన్సిస్టర్ కూడా అడ్డుగా ఉండదంటూ చమత్కరించిన అమీర్ ఖాన్.. అందర్ని ఆశ్చర్య పరిచారు. బుధవారం విడుదల చేసిన సెకండ్ లుక్ పోస్టర్ లో అమీర్ ఖాన్ పూర్తిగా, నిండుగా బట్టలేసుకుని బ్యాండ్ మేళం చేతిలో పట్టుకుని నిలుచున్నాడు. ఈ పోస్టర్ తో బట్టలేసుకోలేదని విమర్శల వర్షం కురిపించిన క్రిటిక్స్ నోళ్లకు తాళం వేశారు. ఈ పోస్టర్ పై క్రిటిక్స్ ఏమని విమర్శలు చేస్తారో వేచి చూడాల్సిందే. -
విజయాలకు దారిదేనా?!
-
స్థానికతను గుర్తించేది ఇలాగా ?!
-
అక్రమ భూమి ఎవ్వరిదైనా అక్రమమే!
-
వివాదమే ఆ సినిమాల కథావస్తువు!!
-
అసెంబ్లీ భవనాలపై వివాదం
కొలిక్కిరాని కేటాయింపులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలకు భవనాల కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వుల అమలులో వివాదాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఇరు రాష్ట్రాల అసెంబ్లీ కార్యదర్శులు రాజసదారం, సత్యనారాయణల మధ్య సమన్వయం కుదరకపోవడంతో అసెంబ్లీలో గదుల కేటాయింపు, వాటిలో మరమ్మతులు, సదుపాయాల కల్పన వంటివి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. పాత అసెంబ్లీ భవనాన్ని ఆంధ్రప్రదేశ్కు, కొత్త అసెంబ్లీ భవనాన్ని తెలంగాణకు కేటాయించారు. అయితే పాత అసెంబ్లీ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శికి ఇప్పటివరకు అప్పగించకపోవడంతో అక్కడ ఏర్పాట్లు ఆగిపోయాయి. పైగా పాతభవనంలోనే తెలంగాణ డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయాలున్నాయి. వాటిని ఖాళీచేస్తేకాని ఆంధ్రప్రదేశ్ నేతలకు, కార్యదర్శికి గదులు సమకూరే అవకాశం లేదు. దాంతోపాటు రెండు అసెంబ్లీ సమావేశ మందిరాల మధ్య రెండువైపుల మంత్రుల చాంబర్ లుగా ఉన్న రెండు అంతస్థుల భవనాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మంత్రులకు చేరొకవైపు కేటాయించాల్సి ఉంది. అయితే దీనిపై రెండు అసెంబ్లీల కార్యదర్శుల మధ్య వివాదం నెలకొంది. ఇటీవల స్పీకర్ మనోహర్ సమక్షంలో దీనిపై చర్చలు జరగ్గా ఎవరికి ఎటువైపు కేటాయించాలన్నది కొలిక్కిరాలేదు. దీంతో స్పీకర్ లాటరీ వేయాల్సి వచ్చింది. ఇలా ఒకవైపు భవనాన్ని ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. దాన్ని ఆ రాష్ట్ర కార్యదర్శికి అప్పగిస్తూ తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి లిఖితపూర్వక లేఖను ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు అలాంటి ఉత్తర్వు తమకు రాకపోవడంతో ఏపీ అసెంబ్లీ కార్యదర్శి దానిపై ఉన్నతాధికారులకు మొరపెట్టుకోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగే పాతభవనంలో ఉన్న తెలంగాణ కార్యదర్శి కార్యాలయం గదులు తనకు అప్పగిస్తే తమకు విధుల నిర్వహణకు వెసులుబాటుగా ఉంటుందని ఏపీ అసెంబ్లీ కార్యదర్శి అధికారులకు వివరించారు. తెలంగాణ అసెంబ్లీ భవనానికి సమీపంలో పాత అసెంబ్లీ భవనంలోనే ఉన్న డిప్యూటీ స్పీకర్ కార్యాలయ గదులను ఆ రాష్ట్ర కార్యదర్శికి కేటాయిస్తామన్నా అందుకు ఆయన నుంచి స్పందన లేదని ఏపీ అసెంబ్లీ సిబ్బంది వాపోతున్నారు. భవనాలను తమకు అప్పగించకపోవడంతో వివిధ శాసనసభాపక్ష కార్యాలయాలకు, మంత్రుల చాంబర్ల ఏర్పాటుకు కూడా వీలు కలగడం లేదని చెబుతున్నారు. -
విలక్షణం + వివాదం = ప్రకాష్ రాజ్