Dussehra Celebrations
-
లండన్లో ఘనంగా దసరా అలాయి బలాయి
హైదరాబాద్ తర్వాత ప్రపంచంలోనే తొలిసారిగా పరాయి గడ్డపై అలాయి బలాయి సాంస్కృతికి నాంది పలికారు. ప్రతి దేశంలో ఇప్పుడు ఎన్నో కుల సంఘాలు మత సంఘాలు రాష్ట్ర సంఘాలు, జిల్లా సంఘాలు ఇలా తెలుగు వారందరూ ఏదో ఒక సంస్థ ద్వారా సంఘాల ద్వారా విడిపోయి ఉన్నారు అందరిని కులాలకు మతాలకు అతీతంగా అందరిని ఒక వేదికపై తీసుకువచ్చి తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరూ అన్నదమ్ముల వలే కలిసి ఉండాలని చెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని సీక్క చంద్ర శేకర్ అన్నారు.ఈ కార్యక్రమానికి యూకే నలుముల నుండి వచ్చిన మిత్రులు వివిధ రాజకీయ పార్టీలకు, సంస్థలకు చెందిన ప్రముఖులు, డాక్టర్స్ ,ఇంజనీర్స్ వివిధ వ్యాపారాలకు సంబంధించిన వ్యాపారవేత్తలు అందరూ ఈ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇలానే ప్రతి ఏడాది ఇంకా అంగరంగ వైభవంగా చేసుకోవాలని కొనియాడారు. వివిధ తెలంగాణ రుచికరమైన వంటలు ఈ కార్యక్రమం లో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. సౌత్ఆల్ మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ,గారికి మొదటిగా అలయ్ బలై కండువా కప్పి ప్రారంభించడం జరిగింది. ఒక మంచి న్యూట్రల్ వేదిక (తటస్థ వేదిక)కు నాంది పలకడం కూడా ఎంతో ఆనంద దాయకం అన్ని అలై బలై సభ్యులు కొనియాడారు..ఎన్నో సంవత్సరాలుగా ఉంటూ కూడా ఎంతో మంది మిత్రులను కలిసిన సందర్బాలు తక్కువ. దశాబ్దాల కిందటి మిత్రులను కూడా ఈ వేదిక ద్వారా కలుసుకోవడం అలాగే ఎటువంటి జెండా, అజెండా ఈ కార్యక్రమానికి లేదని ఇది కేవలం స్నేహపూర్వక కలయికే. జమ్మి ఆకు ఇచ్చి పుచ్చుకొని అందరూ అలైబలే చెప్పుకొని తారతమ్యాలను మరచి ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమం చేసుకున్నారని ఈ సందర్భంగా సభ్యులు అతిధులు కొనియాడారు.(చదవండి: TCUK ఆధ్వర్యంలో తొలిసారి యూకేలో బతుకమ్మ వేడుకలు) -
పోర్ట్ల్యాండ్లో ఘనంగా TDF బతుకమ్మ సంబరాలు
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ పోర్ట్లాండ్ సిటీ చాప్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ , దసరా ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. క్వాటామా ఎలిమెంటరీ స్కూల్ లో జరిగిన ఈ వేడుకలని చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీని అనుమాండ్ల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పోర్ట్లాండ్ మెట్రో సిటీస్ నుండి పెద్ద ఎత్తున ప్రవాసులు పాల్గొని విజయవంతం చేసారు.తెలుగుదనం ఉట్టి పడేలా.. మహిళలు తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై రంగుల బతుకమ్మలతో వచ్చి బతుకమ్మ ఆట పాటలతో సందడి చేసారు. ఈ సంబరాల్లో భాగంగా దుర్గా పూజ నిర్వహించారు. అనంతరం జమ్మి ఇచ్చి పుచ్చుకొని అలయ్ భలాయ్ చేసుకున్నారు. బతుకమ్మ, రాఫెల్ డ్రా విజేతలకు టీడీఫ్ టీం బహుమతులని అందచేశారు.ఈ వేడుకలలో పాల్గొన్న వారందరికీ శ్రీని అనుమాండ్ల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలను వైభవోపేతంగా జరగడానికి సహకరించిన మహిళలకు అభినందనలు తెలిపారు. ఈ వేడుకలు విజయవంతం అవటానికి కృషి చేసిన స్పానర్స్, పోర్ట్లాండ్ చాప్టర్ టీం, వాలంటీర్స్, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ వేడుకల్లో పాల్గొన్న పోర్ట్లాండ్ మెట్రో ఇండియన్ కమ్యూనిటికి, సహాయ సహాకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. TDFసంస్థ స్థాపించి 25 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా, శుభాకాంక్షలు తెలిపారు. -
ట్రెడీషనల్ లుక్స్లో కుర్రకారు మనసు దోచేస్తున్న భాగ్యశ్రీ... (ఫొటోలు)
-
సొంతూరిలో సీఎం దసరా సంబరాలు
సాక్షి, నాగర్కర్నూల్/కొడంగల్: సీఎం రేవంత్రెడ్డి దసరా పండుగ సందర్భంగా శనివారం సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో పర్యటించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి స్వగ్రామానికి వచ్చిన రేవంత్రెడ్డికి అడుగడుగునా పూలు, డప్పు వాయిద్యాలు, బతుకమ్మలు, కోలాటాలతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల నడుమ దసరా వేడుకలు జరుపుకొన్న సీఎం రేవత్రెడ్డి అందరినీ పలకరిస్తూ గ్రామస్తుల్లో పండుగ సంబురాన్ని రెట్టింపు చేశారు. నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్రెడ్డి హెలీకాప్టర్లో చేరుకున్నారు. కొండారెడ్డిపల్లి పంచాయతీ కార్యాలయం పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, కలెక్టర్ సంతో‹Ù, ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, జి.మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాలినడకన శమీ పూజకు.. కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్రెడ్డి తన ఇంటి నుంచి గ్రామంలోని మైసమ్మ ఆలయ ప్రాంగణంలో ఉన్న జమ్మి చెట్టు వద్దకు గ్రామస్తులతో కలిసి కాలినడకన బయలుదేరారు. మార్గమధ్యలో గ్రామస్తులను పేరుపేరునా పలకరిస్తూ.. ఆప్యాయంగా ముచ్చటిస్తూ జమ్మిచెట్టు వద్దకు చేరుకొని శమీ పూజలు నిర్వహించారు. అనంతరం ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులు, అభిమానులు సీఎంతో సెలీ్ఫలు, ఫొటోల కోసం పోటీ పడటంతో సుమారు 40 నిమిషాలపాటు వారితో ఫొటోలు దిగుతూ గ్రామస్తులను ఆనందంలో ముంచెత్తారు.పాలమూరు బిడ్డగా ఉమ్మడి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపే బాధ్యత తనదని, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతానని చెప్పారు. విద్య, వైద్యం, సాగునీరు, ఉపాధి కల్పనకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, వేగంగా నిర్ణయం తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ఎమ్మెల్యేలు, అధికారులకు చెప్పారు. మరోసారి గ్రామానికి వచ్చి అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానన్నారు. రాత్రి 8.30 గంటలకు రోడ్డు మార్గంలో కొడంగల్కు బయలుదేరారు. కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డికి కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సు«దీర్, సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి స్వాగతం పలికారు.పూల మొక్కలు ఇచ్చి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఉదయం నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు సీఎంను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్రెడ్డి, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి, పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసూఫ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్, యువజన కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్ కృష్ణంరాజు తదితరులు సీఎంను కలిశారు. పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డి కొడంగల్కు వచ్చి ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
నయన్ ఇంట ఆయుధపూజ... పిల్లలతో బహుమతులు ఇప్పించిన విఘ్నేష్ శివన్ (ఫోటోలు)
-
Tirumala : తిరుమలలో ఘనంగా చక్ర స్నానం..(ఫొటోలు)
-
మంచు విష్ణు కూతుళ్లు.. అప్పుడే ఇంత పెద్దోళ్లు అయిపోయారే! (ఫొటోలు)
-
#DussehraFestival : దేశ వ్యాప్తంగా రావణ దహనం (ఫోటోలు)
-
దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన దసరా సంబరాలు.. ఊరూరా రావణ దహనాలతో సరికొత్త వెలుగులు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
దసరా సంబురాల్లో ప్రముఖుల సందడి
ఢిల్లీ: దేశవ్యాప్తంగా దసరా సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. రావణ దహనం కార్యక్రమాలు నిర్వసున్నారు. దసరా సంబరాల్లో ప్రముఖుల సందడి చేశారు. ఢిల్లీలోని మాధవ్ దాస్ పార్కులో నిర్వహించన దసరా వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తదితరులు హాజరయ్యారు.#WATCH | Delhi: President Droupadi Murmu and Prime Minister Narendra Modi leave after attending the Dussehra programme organised by Shri Dharmik Leela Committee at Madhav Das Park, Red Fort (Source: DD News) pic.twitter.com/wjIwCIinuu— ANI (@ANI) October 12, 2024 అదేవిధంగా ఢిల్లీలోని నవ్శ్రీ ధార్మిక్ లీలా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు.#WATCH | Congress Parliamentary party chairperson Sonia Gandhi and Lok Sabha LoP Rahul Gandhi attend the #Dussehra2024 celebrations at Nav Shri Dharmik Leela Committee Red Fort, Delhi pic.twitter.com/Wszph85yeQ— ANI (@ANI) October 12, 2024 జార్ఖండ్ రాజధాని రాంచీలో నిర్వహించిన రావణ దహనంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పాల్గొన్నారు.#WATCH | Jharkhand: 'Ravan Dahan' being performed in Ranchi as part of #DussehraCelebrations, in the presence of Jharkhand CM Hemant Soren pic.twitter.com/YH02qKkjtB— ANI (@ANI) October 12, 2024 బిహార్లోని పట్నాలో దసరా సంబరాల్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరీ పాల్గొన్నారు.#WATCH | Bihar CM Nitish Kumar and Dy CM Samrat Choudhary attend #DussehraCelebration at Gandhi Maidan in Patna pic.twitter.com/nqk833V4Wt— ANI (@ANI) October 12, 2024 అదేవిధంగా ముంబైలోని ఆజాద్ మైదానంలో శివసేన, శివాజీ పార్క్లో శివసేన (యూబీటీ) ఆధ్వర్యంలో దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.#WATCH | Maharashtra CM Eknath Shinde addresses Shiv Sena's Dussehra rally at Azad Maidan in Mumbai. pic.twitter.com/5UkP8C7iYs— ANI (@ANI) October 12, 2024అమృత్సర్: దుర్గియానా టెంపుల్ గ్రౌండ్లో నిర్వహించిన దసరా వేడుకలకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హాజరయ్యారు.#WATCH | Amritsar: Punjab CM Bhagwant Mann attended Dussehra celebrations at Durgiana Temple Ground pic.twitter.com/gPhZOwnBrL— ANI (@ANI) October 12, 2024ఛత్తీస్గఢ్: దసరా వేడుకల్లో భాగంగా రాయ్పూర్లో సీఎం విష్ణు దేవ్ సాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావణ్ దహన్ ప్రదర్శించారు.#WATCH | 'Ravan Dahan' being performed in Raipur, as part of #DussehraCelebrations in the presence of Chhattisgarh CM Vishnu Deo Sai pic.twitter.com/pMSCJ645m8— ANI (@ANI) October 12, 2024జమ్ము కశ్మీర్: శ్రీనగర్లోని ఎస్కే స్టేడియంలో నిర్వహించిన దసరా వేడుకలకు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఇతర నేతలు హాజరయ్యారు.#WATCH | Srinagar, J&K: National Conference President Farooq Abdullah attends #Dussehracelebrations at Srinagar's SK Stadium pic.twitter.com/tlDDni0dIW— ANI (@ANI) October 12, 2024 చదవండి: బంగ్లాలో మోదీ గిఫ్ట్ చోరీ.. భారత్ తీవ్ర స్పందన -
శమీ వృక్షానికీ, దసరా పండుగకు సంబంధం ఏంటి?
శమీ వృక్షానికీ, విజయదశమి పండుగకూ సన్నిహిత సంబంధం. శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. ‘శమీ’ అంటే అగ్ని అని కూడా అర్థం. అగ్ని అదృశ్యంగా శమీవృక్షంలో నిక్షిప్తమై ఉంటుందని శాస్త్రాలు చెప్తాయి. యజ్ఞాల లాంటి పవిత్ర కార్యాలలో జమ్మి కర్రలు మథించి, అగ్ని పుట్టించి, హోమాలు చేస్తారు. శమీవృక్షం ప్రస్తావన రుగ్వేదంలో, అధర్వ వేదంలో కనిపిస్తుంది. ఇక పురాణ ఇతిహాసాలలో సరేసరి. అంటే, అతి ప్రాచీన కాలం నుంచి భారతీయులు శమీవృక్షాన్ని పవిత్రమైన వృక్షాలలో ఒకటిగా భావిస్తూ వస్తున్నారు.ఇక, ‘విజయ’ అంటే శ్రవణా నక్షత్రంలో కలిసివచ్చే దశమి తిథి. ఇలా కలవటం ఆశ్వయుజ మాసం, శుక్ల పక్షంలో జరుగుతుంది. ఆ ‘విజయ’ దశమి రోజు సర్వదా శుభదినం. అంటే, మీనమేషాలూ, గోచార, గ్రహచారాలతో నిమిత్తం లేకుండా, ఎలాంటి శుభకార్యాలకైనా విజయదశమి మంచి రోజే!విజయదశమి దసరా నవరాత్రులలో ఆఖరి రోజు. చండముండులూ, మహిషాసురుడూ వంటి రాక్షసులందరినీ 9 రోజుల భీషణ యుద్ధంలో సంహరించిన దుర్గాదేవి, విజయదశమి నాడు విజయిగా, అపరాజితగా నిలిచింది. ఈ అపరాజిత రాజాధి రాజులను కూడా శాసించే శ్రీమహారాజ్ఞి కనుక, విజయదశమినాడు దుర్గాదేవిని రాజరాజేశ్వరిగా అలంకరించడం ఆనవాయితీ. విజయ దశమినాడు అపరాజితా పూజ చేయడం ఇక్ష్వాకుల కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. శ్రీరాముడు జమ్మి చెట్టును అపరాజితా దేవి ప్రత్యక్ష స్వరూపంగా భావించి, శమీపూజ ద్వారా దేవి అనుగ్రహం పొంది రావణ సంహారం చేశాడని దేవీ భాగవతం చెబుతోంది. రాజులకు యుద్ధ జయమూ, ఇతరులకు కార్య విజయమూ ఇవ్వగలదు గనక జమ్మి చెట్టు ‘విజయద–శమీ’ వృక్షం. అందుకే ఆబాలగోపాలం విజయదశమి నాడు శమీ పూజ చేసే ఆచారం కొనసాగుతూ వస్తున్నది.చదవండి: దసరా పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది?పూజ తరవాత అపరాజితా ప్రసాదంగా జమ్మి ఆకులను కోసి తెచ్చుకొని, వాటిని ‘బంగారం’లా దాచుకోవటం, కొన్ని ఆకులను పెద్దల చేతిలో ఉంచి, నమస్కరించి, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవటం, దసరా పూజల సందడిలో భాగం. పనిలో పనిగా, ఆ పరిసరాలలోనే ఎగురుతుండే పాలపిట్టను చూసి, దాని నిసర్గ సౌందర్యాన్ని మెచ్చుకోవటం కూడా శుభకరం అని ఆస్తికుల నమ్మకం. విజయదశమి సందర్భంగా అపరాజితా దేవి ఆశీస్సులు అందరికీ అంది, ఆనందం కలిగించాలని ఆకాంక్షలు!!– ఎం. మారుతి శాస్త్రి -
సరిగ్గా గమనించారా.. అమ్మవారి విగ్రహాలు కాదు.. మనుషులే అలా!
Live durga utsav: దసరా ఉత్సవాల్లో మండపాలలో దుర్గామాత విగ్రహాలు కనిపించడం సాధారణ దృశ్యమే. అయితే కోల్కతాలో బ్రహ్మ కుమారీస్ నిర్వహించే ‘లైవ్ దుర్గా ఉత్సవ్’లో 30 ఏళ్లు దాటిన మహిళలు కొన్ని గంటల పాటు కదలకుండా విగ్రహాల్లా కూర్చుంటారు!‘జీవకళ ఉట్టిపడుతుంది’ అనుకునే వాళ్లకు దగ్గరకు వచ్చి చూస్తేగానీ అసలు విషయం తెలియదు.‘ఇది సహనానికి పరీక్ష. కదలకుండా కూర్చోవడం అనేది అంత తేలికైన విషయం కాదు. పెద్ద సవాలు. ఈ సవాలు కోసం ప్రతి సంవత్సరం ఇష్టంగా ఎదురు చూస్తుంటాను’ అంటుంది 32 ఏళ్ల సులేఖ.గత పదిహేను సంవత్సరాలుగా లక్ష్మి, సరస్వతితో సహా వివిధ దేవతల రూపంలో మండపంలో కూర్చుంటూ ఉంది సులేఖ. సందర్శకులు నాణేలు, పువ్వులు వేదికపై విసురుతుంటారు.‘ఒక్కో దేవతకు ఒక్కో రకమైన ముఖకవళికలు ఉండాలి. దుర్గ ముఖంలో కోపం, శక్తి, ప్రశాంతత మిళితమై ఉంటాయి. నేను వేదికపై ధ్యానముద్రలో ఉంటాను కాబట్టి ఏ విషయంపైనా నా దృష్టి మళ్లదు’ అంటుంది ‘లైవ్ దుర్గా’గా పేరుగాంచిన సులేఖ. చదవండి: దురితాలను పోగొట్టి.. మన చుట్టూ రక్షణకవచంలా నిలబడే దుర్గమ్మ -
విజయదశమి రోజున రాజరాజేశ్వరి అలంకారం..!
శరన్నవరాత్రి మహౌత్సవాలలో అమ్మవారి అలంకారాలలో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరీదేవి. సకల భువన బ్రహ్మండాలకు రాజరాజేశ్వరీదేవి ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటుంది. పలు చోట్ల ఈ దేవిని "అపరాజితాదేవి"గా కూడా భక్తులు పూజించే ఆచారం ఉంది. రాజరాజేశ్వరి స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుడి అంకం అమ్మకు ఆసనం. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భకుల్తకు వరాలూగా అనుగ్రహిస్తుంది. ఈమె యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచ్తెతన్యాన్నిఈ రాజరాజేశ్వరి దేవి ఉద్దీపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈమె అధిష్టాన దేవత.ఆ పేరు ఎలా వచ్చిందంటే..దేవదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం వచ్చింది ఈ విజయదశమి రోజే అని పురాణ కథనం. 'శ్రవణా' నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి 'విజయా' అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయదశమి' అనుపేరు వచ్చినది .ఈ విజయదశమి నాడు తిధి, వారము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మొదలైన వాటితో నిమిత్తం లేకుండా కార్యం చేపట్టొచ్చు. పైగా తప్పక విజయం వరిస్తుంది. ఈ పర్వదినాన చేసే 'శమీపూజ' చాలా విశేషమైనది. శమీవృక్షమంటే 'జమ్మిచెట్టు'. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను, వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్థించి.. తిరిగి ఆయుధాలను వస్త్రములను పొందారు. శమీవృక్ష రూపంలో ఉన్న 'అపరాజితా' దేవి ఆశీస్సులు పొంది, కురుక్షేత్రంలో కౌరవులపై విజయము సాధించినారు. శ్రీరాముడు కూడా ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి, రావణుని సహరించి, విజయాన్ని పొందాడు. ఇక తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం 'పాలపిట్ట'ను చూచే ఆచారం కూడా ఉన్నది. ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని, విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి, ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు.“శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీఅర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ ||"ఈ అపరాజితాదేవిని పసుపు పచ్చని పూలతో పూజించాలి. ఆ తర్వాత శక్త్యానుసారం సువాసినీ పూజ చేయాలి. ఈ రోజు జపించాల్సిన మంత్రం..."ఐం క ఏ ఈల హ్రీం, క్లీం హసకహల హ్రీం సౌ: సకల హ్రీం" అనే మంత్రం జపించాలి. వీలైతే లలిత సహస్రనామం పారాయణ చేసి కుంకుమార్చన చేయాలి. నైవేద్యం: లడ్దూలు, బూర్లు, భక్ష్య భోజ్యాలు నివేదించాలి.(చదవండి: ఆ 'ఆదిపరాశక్తి' పేరు మీదుగా వెలిసిన మహానగరాలివే..!) -
దసరాలో ట్రెడిషనల్గా ఉండే స్టైలిష్ డిజైనర్ వేర్స్ ధరించండి ఇలా..!
తెలుగింటి సంప్రదాయం డ్రెస్సింగ్లో కనిపించాలి. స్టైల్ లో ఏ మాత్రం తగ్గకూడదు వెస్ట్రన్ వేర్ అనిపించకూడదు సౌకర్యం లో బెస్ట్ చాయిస్ అవ్వాలి... పండగ హంగులు ఔరా అనిపించాలి. ఇండియన్ వేర్ నే డిఫరెంట్గా ధరించాలి. దసరా వేడుకలో మరింత స్టైలిష్గా కనువిందు చేసే మోడ్రన్ హంగులివి. శారీ గౌన్కుట్టిన చీరలు, ధోతీ చీరలు, ప్యాంట్ తరహా చీరలు, కేప్ స్టైల్ డ్రేప్స్... వంటి వినూత్న పద్ధతులు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఎన్నో విభిన్న డిజైన్లలో ఆకట్టుకుంటున్న శారీ గౌన్, షరారా శారీ ధరిస్తే చాలా స్టైలిష్గా, తేలికగా, రోజంతా సౌకర్యవంతంగా హుషారుగా ఉంచుతుంది. ఎంబ్రాయిడరీ బ్లేజర్బ్లేజర్లు కార్పొరేట్ రంగానికి మాత్రమే పరిమితం అనుకుంటారు చాలామంది. కానీ, ఎంబ్రాయిడరీ బ్లేజర్ను డ్రేప్డ్ స్కర్ట్ లేదా ధోతీ ప్యాంట్తో స్టైల్ చేయచ్చు. నడుము భాగాన్ని బెల్ట్తో అలంకరిస్తే ఈ డ్రెస్ బెస్ట్ మార్కులు కొట్టేస్తుంది. గవ్వల కుర్తీధోతీ ప్యాంట్ డ్రేప్డ్ స్కర్ట్లకు గవ్వలు, అద్దాలతో ఎంబ్రాయిడరీ చేసిన కేప్ లేదా షార్ట్ కుర్తీతో స్టైల్ చేయచ్చు. ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ ΄్యాటర్న్ ఉన్న లెహెంగా లేదా పలాజో సెట్ కూడా పండగ కళను తెప్పిస్తుంది.సౌకర్యంగా! సల్వార్ కమీజ్ అయితే ప్రకాశవంతమైన రంగులు ఉన్నవి ఎంచుకోవాలి. పిల్లలతో సరి΄ోలే దుస్తులను ధరించడం వల్ల ఒకే కుటుంబ రూ΄ాన్ని సృష్టించవచ్చు. పండగ కళ రావాలనే ఆలోచనతో పిల్లలకు గాడీ ఎంబ్రాయిడరీ దుస్తులు వేయకూడదు. వారి డ్రెస్సులు సౌకర్యంగా ఉండాలి. ఆభరణాలు మేనికి గుచ్చుకోకుండా ఉండేవి ఎంచుకోవాలి. భారీ ఆభరణాలను ఉపయోగించే బదులు బ్యాంగిల్స్, జూకాలు తక్కువ బరువున్న యాక్ససరీస్ను ఉపయోగించాలి. (చదవండి: ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్..!) -
యుద్ధ విద్యల జమానా.. కోనసీమ చెడీ తాలింఖానా
కోనసీమ.. మైమరపించే ప్రకృతి అందాలకే కాదు.. ఆధ్యాత్మిక సౌరభాలకు.. సంస్థానాల పాలనకు.. స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలకు ఆలవాలంగా నిలుస్తోంది. ఇక్కడ జరిగే సంక్రాంతి.. దసరా పండగలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సంక్రాంతి సందర్భంగా నిర్వహించే ప్రభల తీర్థాలతోపాటు దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహించే చెడీ తాలింఖానా ప్రదర్శన సైతం జాతీయ స్థాయిలో గుర్తింపు సంతరించుకుంది. బ్రిటిష్ కాలంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని సంస్థానాల్లో యువకులకు యుద్ధ విద్యలు నేర్పించేందుకు చెడీ తాలింఖానా మొదలైంది. తరువాత కాలంలో స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తికి.. సమరయోధుల మధ్య ఐక్యతకు ప్రతీకగా మారింది. నాటినుంచి నేటి వరకు దశాబ్దాల కాలంగా ఈ వీరుల విద్య కోనసీమ సంస్కృతి, సంప్రదాయాలలో భాగమైంది. ఏటా దసరా ఉత్సవాలలో కత్తులు, బళ్లేలు, బాణా కర్రలతో సాగే ప్రదర్శన వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ నెల 12న దసరా రోజున రాత్రి చెడీ తాలింఖానా ప్రదర్శనలు అమలాపురంలో వీధుల్లో రోమాంచితం కానున్నాయి. – సాక్షి, అమలాపురంబర్మాలో శిక్షణ పొంది.. చెడీ తాలింఖానా బర్మా (మయన్మార్)కు చెందిన విద్య. ఉమ్మడి గోదావరి జిల్లాలోని సంస్థానాల్లో పనిచేసే సైనికులకు, యువతకు యుద్ధ నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు అమలాపురం పట్టణానికి చెందిన అబ్బిరెడ్డి రామదాసు (తొలి తరం వ్యక్తి) బర్మా వెళ్లి శిక్షణ పొంది వచ్చారు. పిఠాపురం, పెద్దాపురం, మొగల్తూరు తదితర సంస్థానాల నుంచి, స్థానిక యువకులు ఆయన దగ్గర ఈ విద్య నేర్చుకునేవారు. స్వాతం్రత్యానికి పూర్వం బ్రిటిష్ సేనలతో పోరాడే భారతీయులలో ఐక్యత కోసం బాలగంగాధర్ తిలక్ దసరా, వినాయక చవితి ఉత్సవాలను ప్రోత్సహించారు. ఊరేగింపులలో జాతీయ సమైక్యత చాటాలని ఆయన ఇచ్చిన పిలుపుతో దసరా ఉత్సవాలలో చెడీ తాలింఖానా ప్రదర్శన ఒక భాగమైంది. దసరా ఉత్సవాల్లో ఇది ప్రారంభమై 168 ఏళ్లు అయ్యింది. అమలాపురం పట్టణంలో దసరా రోజు సాయంత్రం నుంచి ఏడు వీధులకు చెందినవారు దసరా వాహనాలను ఊరేగిస్తారు. ఈ ప్రదర్శనలో చెడీ తాలింఖానా, సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. నాలుగు తరాలుగా.. అమలాపురానికి చెందిన అబ్బిరెడ్డి రామదాసు చెడీ తాలింఖానాకు అంకురార్పణ చేశారు. తరువాత ఆయన కుమారుడు అబ్బిరెడ్డి నరసింహరావు (రెండవ తరం వ్యక్తి) ఈ వీర విద్యను ప్రోత్సహించారు. అబ్బిరెడ్డి రామదాసు (మూడవ తరం) తాత బాటలో ఈ విద్యకు రాష్ట్రస్థాయి గుర్తింపును తీసుకువచ్చారు. అబ్బిరెడ్డి మల్లేశ్వరస్వామి (మల్లేష్–నాల్గవ తరం) తాత, తండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. మల్లేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా యూఎస్లోని టెక్సాస్లో పనిచేస్తున్నారు. దసరా సమయంలో ముందుగానే ఇక్కడకు వచ్చి స్థానికులకు శిక్షణ ఇస్తుంటారు. కత్తులు దూస్తూ.. బళ్లేలు తిప్పుతూ.. దసరా వస్తుందంటే చాలు అమలాపురంలో సంప్రదాయ చెడీ తాలింఖానా ప్రదర్శనకు సిద్ధమయ్యే యువతీ యువకులు ఎందరో. దసరా సందర్భంగా వీధుల్లో అమ్మవారు వివిధ రకాల రథాలపై కొలువై ఊరేగింపుగా వెళతారు. దీనికి ముందే ఏడు వీధులకు చెందిన యువకులు పట్టా కత్తులకు పదును పెడతారు. బళ్లేలు, బాణా కర్రలు, కత్తులతో విన్యాసాలు చేస్తారు. రాచరిక యుద్ధాన్ని తలపించే ఈ సాహసోపేత విన్యాసాలను తిలకించేందుకు దసరా రోజు రాత్రి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున జనం తరలివస్తారు. కళ్లకు గంతలు కట్టుకుని మనిషి శరీరంపైన, కంఠం, నుదురు, పొత్తికడుపుపై కొబ్బరికాయలు, కాయగూరలు పెట్టి నరకడం వంటి విన్యాసాలు తాలింఖానాలో ముఖ్య ఘట్టాలు. అగ్గి బరాటాలు, లేడి కొమ్ములు, పట్టా కత్తులను చురుగ్గా కదిలిస్తూ యువకులు చేసే విన్యాసాలు యుద్ధ సన్నివేశాలను తలపిస్తాయి. ప్రదర్శన ఆసాంతం ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తుంది. పట్టణానికి చెందిన ఏడు వీధులలో కొలువు తీరిన వాహనాలను సాయంత్రం ఆరు గంటల నుంచి తెల్లవారు జాము వరకు ఊరేగిస్తారు. త్వరలో వెబ్సైట్ చెడీ తాలింఖానాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్నదే నా ధ్యేయం. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా దీనికి విస్తృత స్థాయిలో ప్రచారం తీసుకువస్తున్నాం. త్వరలోనే తాలింఖానాకు ప్రత్యేక వెబ్సైట్ డిజైన్ చేస్తాం. – అబ్బిరెడ్డి మల్లేష్, అమలాపురం -
ట్రెడిషనల్ డిజైనర్ వేర్లో రష్మిక స్టన్నింగ్ లుక్..! (ఫొటోలు)
-
ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్..!
కొందరూ యువకులు వయసు ఎంతో కాకపోయినా వృద్ధులు మాదిరిగా ప్రవర్తిస్తుంటారు. అదీగాక చురుకుగా ఏ కార్యక్రమంలో పాల్గొనరు. కానీ కొందరు వృద్ధులను చూస్తే చూడముచ్చటేస్తుంది. అబ్బా ఏం ఎనర్జీ అనిపిస్తుంది. వాళ్లను ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అనే ఫీల్ వస్తుంది. గర్వంగా కూడా అనిపిస్తుంది. అలాంటి వృద్ధ జంట దాండియా డ్యాన్స్ చేస్తూ అలరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. ఆ వీడియోలో ఇద్దరు వృద్దులు చలాకీగా దాండియా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అందులో వారితో ఓ యువకుడి కూడా కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు. ఏదో నీరసంగా అడుగులు కదపలేదు. యువకులకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉషారుగా ఇరువురు దాండియా ఆడారు. ఇద్దరు ఎంత లయబ్ధంగా స్టెప్పులు కదిపారంటే..కనురెప్ప వాల్చ బుద్ధి కాదు. అంత అద్భుతంగా చేశారు ఇద్దరు. నవరాత్రి ఉత్సవాలతో దేశంలోని నలుమూలలు గార్బా, దాండియా వంటి నృత్యాలతో సందడిగా ఉంది. మరొకొన్ని చోట్ల మహిళలు ఇంధోని జ్వాలని మోస్తూ గార్బాని ప్రదర్శించారు. ఈ నృత్యం చేస్తున్న దృశ్యం ఎవ్వరినైనా మంత్రముగ్దుల్ని చేసి కట్టిపడేస్తుంది. View this post on Instagram A post shared by Tanish Shah (@theghotalaguy) (చదవండి: బలి తంతు లేకుండా జరిగే 'పూల తల్లి ఆరాధన'..! ఇక్కడ దసరా..) -
శ్రీశైలంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)
-
కరీంనగర్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
శ్రీనివాసుని గరుడ సేవ.. భక్తజనంతో కిక్కిరిసిన తిరుమల (ఫొటోలు)
-
మహాలక్ష్మీదేవిగా దుర్గమ్మ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజు మంగళవారం మహాలక్ష్మిదేవిగా దుర్గమ్మ దర్శనమిచ్చారు. సాయంత్రం నగరోత్సవం కనులపండువగా సాగింది. కనకదుర్గానగర్లో కళావేదికపై ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. బుధవారం మూలా నక్షత్రం కావడంతో సరస్వతీ దేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు మంగళవారం రాత్రి 11 గంటల నుంచే ఇంద్రకీలాద్రిపైకి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. మూలా నక్షత్రం నాడు 2 లక్షల మందికిపైగా భక్తులు రానున్న నేపథ్యంలో అందుకు తగినట్లు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. క్యూలైన్లలో మార్పులు చేసింది. వీఐపీ దర్శనాలనూ రద్దు చేసింది. బుధవారం తెల్లవారుజామున 2.00 గంటల నంచి రాత్రి 11 గంటల వరకు భక్తులందరికీ ఉచితంగా అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తోంది. ఫ్లైవోవర్ కింద వాహనాలకు అనుమతి రద్దు చేసింది. సీఎం చంద్రబాబు బుధవారం అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.నేడు శ్రీ సరస్వతిదేవిగా... ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్న దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు బుధవారం శ్రీ సరస్వతిదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. మూలా నక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం. ఈ రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీ అవతారంలో భక్తులను అమ్మవారు అనుగ్రహిస్తారు. -
పూల పండుగ..ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ
తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ. ఈ పండుగ సందడి తెలంగాణలోని ప్రతి వీధిలోనూ కనిపిస్తూ ఉంటుంది. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై..అప్పుడే ఎనిమిదో రోజుకి చేరుకున్నాయి. ఇక ఈ రోజున తెలంగాణ ఆడబిడ్లలంతా బతుకమ్మను వెన్నముద్దల బతుకమ్మగా ఆరాధిస్తారు.ప్రత్యేకత..ఇక బతుకమ్మ పండుగలో 8వ రోజును 'వెన్నముద్దల బతుకమ్మ'గా బతుకమ్మను ఆరాధిస్తారు. ఈరోజు తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, గడ్డి పువ్వు, మొదలైన పువ్వులతో ఎనిమిది అంతరాలను బతుకమ్మగా పేర్చి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఆట, పాటలతో బతుకమ్మ ఆడి చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు.ఈరోజు వాయనంగా నువ్వులు, బెల్లం కలిపి ప్రసాదంగా పెడుతారు. కొందరు వెన్న ముద్దలు అంటే..బియ్యపిండి, వెన్నతో చేసిన ముద్దలను డీప్ ఫ్రేచేసి చివరగా పానకంలో వేసి..నైవేద్యంగా సమర్పిస్తారు.(చదవండి: చరిత్రలో తొలిసారి..న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో దుర్గా పూజ..!) -
దుర్గాపూజ: ఈ క్రెడిట్ ‘నేతాజీ’కే దక్కుతుంది..!
కోల్కతాలో దుర్గాపూజ వేడుకలు ఎంత ఆర్భాటంగా ఘనంగా జరుగుతాయో తెలిసిందే. అంతేగాదు అక్కడ చేసే దుర్గా వేడుకలు యునెస్కో గుర్తింపును కూడా అందుకున్నాయి. అంతలా చరిత్రలో పేరుగాంచడానికి కారణం స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ చంద్రబోస్. ఆయన విశాల దృక్పథం సరొకొత్త పూజా ఆవిష్కరణకు నాంది పలికింది. దేశభక్తిని పెంపొందించే వేదికలా.. బహింరంగంగా అంతా కలిసి చేసుకునే వేడుకగా మలిచారు. అలా కోల్కతాలో ఈ వేడుకలు బహిరంగంగా పెద్ద కోలాహలంగా జరగడం ప్రారంభమయ్యింది. సామాన్యుడు కూడా ఈ పండుగలో పాలుపంచుకోవాలనే సంకల్పం నెరవేరేలా మార్పులు తీసుకొచ్చారు. నవరాత్రుల సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోల్కతాలో జరిగే దుర్గాపూజ వేడుకను ఎలా మార్చారు..? అంతలా గుర్తింపు వచ్చేందుకు కారణమైనవి ఏంటి?..తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.పశ్చిమ బెంగాల్లో ఈ వేడుకలు మొదట్లో జమిందార్లు నిర్వహించేవారు. ఆ తర్వాత 1610లో బరిషాకు చెందిన సవర్ణ చౌదరి కుటుంబం చేసే వేడుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలన్నీ ఘనంగా నిర్వహించినప్పటికీ ప్రజల్లోకి బలంగా వెళ్లేలా ప్రభావితం చేయలేకపోయాయి. అయితే నేతాజీ స్వాతంత్ర్యం కోసం రకరకాల ప్రణాళికతో ముందుకు పోతున్న ఆయనకు ఈ వేడుక ఎంతాగానో ఆకర్షించింది. ఈ వేడుకును అందర్ని కలుపుకునే నిర్వహించి దీంతో స్వాతంత్ర సమరయోధులను సంఘాన్ని ఏర్పరుచుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన పుట్టింది. ఆ క్రమంలో నేతాజి 'సర్బోజోనిస్' అనే పేరుతో 10 రోజుల వేడుకలు నిర్వహించారు. ఆయనే ఆ కమిటీ ఆధ్యక్షుడిగా ఉండి ఈ పండుగ జయప్రదమయ్యేలా ముందుండి నడిపించారు. ఇక్కడ సర్బోజోనిన్ అంటే సమాజంలోని అందరి పండుగ అని అర్థం. బెంగాల్ వారసత్వానికి నిలువెత్తు నిదర్శనంలా అంగరంగ వైభవంగా ఈ వేడుకలు ఇప్పటికి కొనసాగడం విశేషం. ఖైదీలు పూజించే హక్కు..1920లో బోస్ మాండలే జైలులో ఉన్నప్పుడు తన రాజకీయ గురువు బసంతీ దేవికి దుర్గాపూజ గురించి వివరిస్తూ లేఖ రాశారు. ప్రతి ఏడాది ఒకసారి వచ్చే ఈ నవరాత్రుల పండుగలో జైలులో ఉన్న తన బిడ్డల సందర్శించి వారి బాధలను తొలగిస్తుంది. అందువల్ల తాము కూడా పూజించుకునే హక్కు ఉందంటూ ఓ నినాదం లేవనెత్తారు నేతాజీ. ఆ కాలంలో క్రిస్మస్ వంటి పండుగలకు ప్రభుత్వం తరుపున రూ. 1200 గ్రాంట్ వచ్చేది. అలానే మాకు కూడా కావలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ వంతుగా రూ. 140లు, ప్రభుత్వం తరుఫు నుంచి రూ. 660లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అయితే దీన్ని ఖైదీల జీతం నుంచే మినహించమని బ్రిటిష్ అధికారులు ఆదేశించడం నచ్చక నేతాజీ బర్మాలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మెమోరాండం పంపారు. అయితే అది కూడా తిరస్కరింపబడింది. దీంతో ఆయన ఖైదీలకూ కూడా తమ మతపరమైన ఆచారాలను నిర్వహించుకునే హక్కు ఉందంటూ నిరాహార దీక్ష ప్రారంభించారు. అలాగే సరస్వతి పూజకు అదనంగా రూ. 60 ఇవ్వాలిన డిమాండ్ చేశారు. ఈ ఘటన దావనంలా వ్యాప్తి చెందడంతో బ్రిటిష్ ప్రభుత్వం దిగి వచ్చి ఖైదీలు ఒక్కొక్కరికి పూజ నిమిత్తం రూ. 30 మంజూరు చేసింది. ఇది తక్కువ మొత్తమే అయినా ఖైదీల హక్కులను హైలెట్ చేసింది. పూజా సంప్రదాయంలో మార్పులు..ఎచ్చల విగ్రహ సంప్రదాయంలో దుర్గా దేవత ఆరాధన తీసుకొచ్చారు. అంటే ఒకే పైకప్పుకింద పూజించటం అని చెప్పొచ్చు. దుర్గమ్మ ఆమె పిల్లలు అంతా ఒకే వేదికపై పూజలు చేసుకునేలా చేయడం. అలాగే విగ్రహా తయారీ సంప్రదాయ పద్ధతిలో కూడా మార్పులు తీసుకొచ్చారు. దుర్గమ్మ ఆమె పిల్లిలిద్దర్ని వేర్వేరు ఫ్రేమ్లలో తయారు చేయమని కళాకారులను కోరారు. దీని వల్ల సమయం ఆదా కావడమే గాక, ఏకకాలంలో వివిధ విగ్రహాలు రూపుదిద్దుకునే వెసులబాటు ఏర్పడింది. ఈ పండుగతో చిన్నా చితక పనులు చేసుకునే వారందర్నీ ఒకతాటిపైకి తీసుకొచ్చి మనమంతా ఒక్కటే అని చాటిచెప్పేలా ఈ పూజలో అందరూ భాగమయ్యేలా చేశారు. అట్టడుగు, ధనిక వర్గం అనేది దేవుడి సమక్షంలో ఉండదనే గొప్ప విషయాన్ని నేతాజీ ఆనాడే ప్రజల్లోకి బలంగా వెళ్లేలా చేసి, ఆ సంప్రదాయం నేటికీ కొనసాగేలా చేశారు. యావత్తు ప్రపంచం కోల్కతా దుర్గా పూజ సంపద్రాయానికి ఫిదా అయ్యి నమస్కరించేలా చేశారు. (చదవండి: కరణ్ జోహార్ 'టై' అంత ఖరీదా..? దేనితో డిజైన్ చేశారంటే..) -
తిరుమల : మోహినీ అవతారంలో శ్రీనివాసుడు.. మంత్రముగ్ధులైన భక్తులు (ఫొటోలు)
-
నవరాత్రుల్లో ముద్దుగుమ్మల స్టన్నింగ్ ట్రెడిషనల్ లుక్స్..! (ఫొటోలు)
-
శ్రీశైలంలో వైభవంగా దసరా శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
తిరుమల బ్రహ్మోత్సవాలు.. సర్వభూపాల వాహనంపై శ్రీవారి దర్శనం (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి : మహాచండీ దేవి అలంకారంలో దుర్గమ్మ (ఫొటోలు)
-
శరన్నవరాత్రులు..ఆరో రోజు మహాలక్ష్మీగా అలంకారం..
శరన్నవరాత్రుల్లో ఊరు, వాడ, అమ్మవారి ఆరాధనలతో ఒక్కసారిగా ఆధ్యాత్మిక ప్రదేశాలు మారిపోతాయి. అప్పుడే నవరాత్రుల వేడుకులు ఆరో రోజుకి చేరుకున్నాయి. ఈ ఆరో రోజు అమ్మవారు 'శ్రీ మహాలక్ష్మీ దేవి'గా దర్శనమిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవి స్వరూపంలో ఇరువైపులా గజ రాజులు ఉండగా, చతుర్భుజాలతో, ఒక హస్తం అభయ ముద్రతో, రెండు హస్తాలలో కమలాలతో, మరొక హస్తంతో కనకధార కురిపిస్తూ.. తన చల్లని చూపులతో త్రిలోకాలను కాపాడుతూ ఉంటుంది. మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతులలో ఈమె మధ్య శక్తి.మంగళ ప్రదాయినిఆదిపరాశక్తి మూడు శక్తులలో ఒక శక్తి అయిన మహాలక్ష్మీ అమిత పరాక్రమంతో మహిషుడనే రాక్షసుడిని సునాయాసంగా సంహరించి మహిషాసురమర్దినిగా పూజలందుకుంది. శరన్నవరాత్రుల సందర్భంగా అష్టలక్ష్ముల సమిష్టి రూపమైన దుర్గమ్మను మహాలక్ష్మీగా భక్తులు పూజిస్తారు.శ్లోకం: "యాదేవి సర్వ భూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా"! అని స్తుతిస్తూ అమ్మవారిని ఆరాధిస్తే దారిద్య్ర బాధలు తొలగిపోతాయి. అలాగే.."నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే శంఖ చక్ర గదా హస్తే! మహాలక్ష్మి నమోస్తుతే" అంటూ ఆ లక్ష్మీదేవిని కీర్తిస్తే అష్టైశ్వర్యాలు సొంతమవుతాయి. అలాగే ఈ రోజు అష్టలక్ష్మీ స్తోత్రం, కనకధారా స్తోత్రం పారాయణ చేసుకుంటే ఇంట్లో కనక వర్షం కురుస్తుంది.మరోవైపు ఆరోరోజు పలుచోట్ల దుర్గమ్మని కాత్యాయనీ దేవిగా ఆరాధిస్తారు. ఈమెను హృదయపూర్వకంగా ఆరాధిస్తే అన్ని రోగాలు, దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలను ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతేకాదు కాత్యాయని దేవి ఆరాధన చేయడం వలన వివాహం కానీ యువతులు కోరుకున్న వరుడిని పొందుతారని పురాణ వచనం.దుర్గామాత ఆరో రూపమే కాత్యాయని. కాత్యాయన మహర్షి పార్వతీమాత తన కుమర్తెగా జన్మించాలనే కోరికతో తపస్సు చేశాడు. అతని తపస్సుకి మెచ్చి కూతురుగా జన్మించింది. అందువల్లే దుర్గామాతకు కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుణ్ని వధించడానికి బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అశంతో ఒక దేవిని సృష్టిస్తారు. ఆమెనే ఈ కాత్యాయని దేవి. ఈమెను మొట్టమొదటగా కాత్యాయన మహర్షి పూజిస్తారు. ఈమె ఆశ్వయుజ శుక్లసప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలందుకుని విజయదశమినాడు మహిషాసురుణ్ని వధిస్తుంది.నైవేద్యం: పరమాన్నం, అప్పాలు, బూరెలు(చదవండి: దసరాలో తప్పక చూడాల్సిన ప్యాలెస్ ఇది..!) -
పూల పండుగ..ఆరో రోజు అలిగిన బతుకమ్మ..
తెలంగాణ ప్రకృతి పండుగ అయిన బతుకమ్మ సంబరాలు ఆరో రోజుకి చేరుకున్నాయి. ఆరో రోజు బతుకమ్మ అత్యంత స్పెషల్. ఎందుకంటే పేరుకి తగిన విధంగా ఆరోజు ఆరాధన విలక్షణంగా ఉంటుంది. మరీ ఇంతకీ ఈ రోజు ఏం చేస్తారంటే..ఆ రోజు ఎవరూ బతుకమ్మను ఆడరు. అంటే.. దీనికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. దేవి భాగవతంలో అమ్మవారి మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి రూపాలలో రాక్షస సంహారం చేశారు. బండాసురుడు ని, చండ ముండల్ని సంహరించిన తర్వాత రాక్షస సంహారం చేసిన అమ్మవారు బాగా అలసిపోయారు. ఆరోజు ఆమెకు విశ్రాంతి ఇవ్వాలని భావించి మహిళలు ఆరో రోజు బతుకమ్మను పేర్చరు. ఎవరు బతుకమ్మను ఆడరు. దీనినే అర్రెం అని, అలసిన బతుకమ్మ అని పిలుస్తారు. ఆరోజు అలిగిన బతుకమ్మ వల్ల ఎవరు వేడుకలు జరపరు.మళ్లీ ఏడవ రోజు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారు.మరొక కథనం ప్రకారం..దేవీభాగవతంలో మహాకాళి, మహాసరస్వతితో పాటు మహాలక్ష్మి రూపాలలో అమ్మవారు రాక్షసుల్ని సంహరించడంతో అమ్మవార్లు బాగా అలసిపోయారట. అందుకే అమ్మకి విశ్రాంతి కల్పించాలన్న ఉద్దేశంతోనే భక్తులు బతుకమ్మను ఒకరోజు వాయిదా వేసినట్టు చెబుతున్నారు. మరుసటి రోజు నుంచి యథావిధిగా బతుకమ్మలు పేర్చి వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. అలానే ఎప్పటిలానే అమ్మవారికి పలు నైవేద్యాలు సమర్పిస్తారు.నైవేద్యం: స్త్రీలంతా ఉపవాసం ఉండి ఆమె అలక తీరాలని ప్రార్థిస్తారు. పైగా ఈ రోజు అమ్మవారు అలకతో ఉండటం వల్ల బతుకమ్మకు ఎలాంటి నైవేద్యం సమర్పించరు.(చదవండి: శరన్నవరాత్రులు..ఐదోరోజు మహాచండీ అలంకారం..!) -
శరన్నవరాత్రులు..ఐదో రోజు మహాచండీ అలంకారం..!
చండీ అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే కోరికన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మాతృదేవత అనుగ్రహంతో లక్ష్మీదేవి, పార్వతీ దేవి, సరస్వతి దేవి కలిసి చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరించారు. త్రిశక్తి స్వరూపిణి అయిన మహాచండీని ప్రార్థిస్తే సర్వదేవతలనూ కొలిచినట్లేనని భక్తుల విశ్వాసం. సింహ వాహనంపై కొలువుదీరిన మహాచండీ రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ మహాచండీ రూపంలో ఉన్న అమ్మవారిని ప్రార్ధిస్తే విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారతారన్న ప్రతీతి ఉంది.మరోవైపు పలు పుణ్యక్షేత్రాల్లో ఈ రోజు అమ్మవారిని స్కందమాతగా ఆరాధిస్తారు. ఈ అవతారంలో బాల కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకుని అమ్మవారు దర్శనమిస్తుంది. శివగణాలకు స్కందుడు సైన్యాధిపతి. పైగా జ్ఞానానికి కూడా అధిపతి. ఇక అమ్మవారేమో తన చల్లని చూపుతో సకల ఐశ్వర్యాలనూ అనుగ్రహించే తల్లి. అందుకే ఈ స్కందమాతని పూజిస్తే అమ్మవారితో పాటూ కుమార స్వామి ఆశీస్సులూ లభిస్తాయని పండితులు చెబుతారు.‘స్కందయతీతి శత్రూన్ శోషయతీతి స్కందః’శత్రువులను శోషింపచేయువాడు కనుక పార్వతీ తనయుడికి స్కందుడు అని పేరు. ఈయనకే కార్తికేయుడు, కుమారస్వామి, సుబ్రహ్మణ్యుడు అని పలు పేర్లు కలవు. స్కందుని తల్లికావడం వల్లే అమ్మవారికి ‘స్కంద మాత’ అని పేరు. నవదుర్గలలో ఇది ఐదో రూపం.సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయాశుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ॥స్కందమాత వాహనం సింహం. తెల్లని రంగుతో ప్రకాశిస్తూ నాలుగు చేతులు, మూడు నేత్రాలు కలిగి ఉంటుంది. తన కుమారుడైన బాలస్కందుడిని ఒక చేతితో ఎత్తుకుని, రెండు చేతుల్లో పద్మాలు ధరించి, మరో చేతితో అభయమిస్తూ కనిపిస్తుంది. స్కందమాత సకల శుభాలనూ అనుగ్రహిస్తుంది. జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇంద్రియ నిగ్రహంతో, మానసిక ఏకాగ్రతతో, నిస్వార్థంగా ఆరాధించే భక్తులకు ఇహపర సుఖాలను, ముక్తిని ప్రసాదిస్తుంది. నైవేద్యం: పులిహోర, రవ్వకేసరి, గారెలు(చదవండి: శరదృతువులో అక్కడ పడవులతో పండుగ సందడి..ఏకంగా..!) -
ఐదో రోజు అట్ల బతుకమ్మ..!
తెలంగాణ పెద్ద పండుగగా పేరుగాంచిన పూల సంబురం సందడే వేరు. జీవితాన్ని ఎలా అద్బుతంగా మలుచుకోవాలో నేర్పించే కలర్ఫుల్ పండుగా ఈ బతుకమ్మ పండుగా. తొమ్మిది రోజుల పాటు సాగే పండుగను రోజుకో ప్రత్యేక పేరుతో అందంగా పూలను పేర్చుకుని ఆనందంగా ఆడిపాడి చేసుకునే పండుగా. బతుకమ్మ సంబరాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు ఆశ్వయుజ శుద్ధ చవితి (ఆదివారం) రోజున తెలంగాణ ఆడబిడ్డలంతా అట్ల బతుకమ్మగా ఆరాధిస్తారు. ఈ బతుకమ్మ ప్రత్యేకతలేంటి, ఏం నైవేద్యం సమర్పిస్తారు వంటివి తెలుసుకుందామా..!. బతుకమ్మ వేడుకల్లో అయిదో రోజైన ఆశ్వయుజ శుద్ధ చవితి (ఆదివారం) నాడు బియ్యాన్ని నానబెట్టి, దంచి చేసిన అట్లను గౌరమ్మకు నివేదిస్తారు. కాబట్టి ‘అట్ల బతుకమ్మ’ అని పిలుస్తారు. ఈ రోజున గునుగు, చామంతి, మందార, బీర, తంగెడు, గునుగు, గుమ్మడి తదితర పూలతో అయిదు ఎత్తుల్లో లేదా ఐదు అంతరాల్లో బతుకమ్మను పేరుస్తారు. నానబెట్టిన బియ్యం దంచి లేదా మర పట్టించి పిండిగా చేసి అట్లు పోస్తారు. అట్లను ముందుగా గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. బతుకమ్మ ఆట పూర్తయిన తర్వాత ముతైదువులు తాము దేవతకు సమర్పించిన అట్లను ఒకరికొకరు వాయినంగా ఇచ్చి పుచ్చుకుంటారు.(చదవండి: నవరాత్రులు..ఇవాళ లలితా త్రిపుర సుందరిగా అలంకారం..!) -
నవరాత్రులు..ఇవాళ లలితా త్రిపుర సుందరిగా అలంకారం..!
త్రిపురాత్రయంలో రెండవ శక్తి లలితా అమ్మవారు. దేవీ ఉపాసకులకు ఈమె ముఖ్య ఉపాస్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమె. పంచదశాక్షరీ మహామంత్రం అధిష్ఠాన దేవతగా లలితా త్రిపురసుందరిని ఆరాధిస్తారు. ఈ అమ్మవారినే త్రిపుర సుందరీ దేవి అని అంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులై త్రిమూర్తల కన్నా పూర్వం నుంచి జగన్మాత ఉంది కాబట్టి త్రిపుర సుందరీ అనే నామంతో పూజలందుకుంటోందని పురాణాలు చెబుతున్నాయి.సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె. చెరకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో, కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర్య దుఃఖాలను తొలగించి, సకల ఐశ్వర్య అభీష్టాలను సిద్ధింపచేస్తుంది. లలితా త్రిపురసుందరీ దేవి విద్యా స్వరూపిణి. సృష్టి, స్థితి, సంహార రూపిణి. కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసినులకు ఈ తల్లి మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీ చక్రానికి కుంకుమార్చన చేయాలి. లలితా అష్టోత్తరంతో పూజించాలి. "ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ:" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మాంగల్యభాగ్యం కోరుతూ సువాసినులకు పూజ చేయాలి.మరోవైపు శ్రీశైలం, అల్లంపురం వంటి పుణ్యక్షేత్రాల్లో నాలుగో రోజున కూష్మాండ అవతారంలో అమ్మవారిని పూజిస్తారు. ఈమె సూర్యుడిలో దాగి ప్రపంచాన్ని వెలుగునిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అందుచేత ఈ నవరాత్రుల్లో కూష్మాండ అవతారంలో అమ్మని ఆరాధిస్తే అపూర్వ శక్తి లభిస్తుంది. ధైర్యం సిద్ధిస్తుంది. ఈతి బాధలు తొలగిపోతాయి. దేవీ సింహంపై ఆశీనురాలై వుంటుంది. ఎనిమిది చేతులను కలిగివుంటుంది కనుకనే ఈ మాతను అష్టభుజదేవి అని పిలుస్తారు. ఆమె చేతిలోని జపమాల ద్వారా ప్రపంచంలోని ప్రజలకు సిద్ధి, నిధిని ప్రసాదిస్తుంది. అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి. కూష్మాండ అవతారాన్ని పూజిస్తారు. ఈ శక్తి అవతారమే విశ్వాన్ని సృష్టించిందని నమ్మకం. భౌమ చతుర్థిని ఆచరించి కూష్మాండ శక్తి రూపాన్ని ఎర్ర రంగు చీరతో అలంకరిస్తారు. ఈరోజు భక్తులు నారింజ రంగు దుస్తులు ధరించాలి. లలితా దేవి వ్రతాన్ని ఈ రోజున ఆచరించాలి. ఉపవాసముండి, పండ్లు పాలు తీసుకుని, ఒంటి పూట ఆహారం తీసుకుని.. లలితాదేవి పూజించినట్లైతే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. నైవేద్యం: అప్పాలు, పులిహోర నైవేద్యం పెట్టాలి. (చదవండి: దుర్గార్తిశమనీ దశదిశలా దసరా) -
వైభవంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
నవరాత్రికి కొలువుదీరిన ‘అమ్మ’: నటి భక్తి పారవశ్యం (ఫొటోలు)
-
మైసూర్ ప్యాలెస్లో మొదలైన దసరా ఉత్సవాలు..(ఫొటోలు)
-
శ్రీశైల మహాక్షేత్రంలో వైభవంగా దేవీ శరన్నవరాత్రులు (ఫొటోలు)
-
సికింద్రాబాద్ : దాండియా జోష్...స్టెప్పులు అదరహో (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు ప్రారంభం
-
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి : దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం (ఫొటోలు)
-
దసరా సందడి మొదలైంది.. సొంతూళ్లకు చలో చలో..(ఫొటోలు)
-
జూబ్లీహిల్స్ : భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్లో దసరా వేడుకలు (ఫొటోలు)
-
దసరా పండుగ : మొదలైన దేవీ నవరాత్రుల సందడి (ఫొటోలు)
-
ఫెస్టివ్ సీజన్లో చీరలే ప్రత్యేకం: నటి పిల్లుమణి చీరందం (ఫోటోలు)
-
ఇంద్రకీలాద్రి : బెజవాడ దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
పండగ సీజన్ యాంకర్ సుమ స్టైలిష్ వేర్ అదుర్స్ (ఫొటోలు)
-
ధూమ్.. ధామ్ దసరా : ఇక్కడ సందడే వేరు! (ఫొటోలు)
-
రంగీలా రాస్ అదిరేటి స్టెప్పులు.. వినసొంపైన గీతాలు (ఫోటోలు)