FASTag
-
ఫాస్ట్ట్యాగ్ కొత్త రూల్స్: ఆ టోల్ ప్లాజాలకు వర్తించదు
జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే వాహనదారులకు 'నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా' (NHAI) పెద్ద ఉపశమనం కల్పించింది. ఇటీవల అమలులోకి వచ్చిన 70 నిమిషాల ఫాస్ట్ట్యాగ్ రూల్స్.. జాతీయ రహదారులపై ఉండే టోల్ ప్లాజాలకు వర్తించవని స్పష్టం చేసింది. అయితే ఈ కొత్త రూల్స్ ఎక్కడ వర్తిస్తాయనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం.ఫాస్ట్ట్యాగ్ కొత్త రూల్స్నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ 'ఫాస్ట్ట్యాగ్' (FASTag)లో రెండు కొత్త మార్పులను జారీ చేసింది. ఈ నియమాలు ఫిబ్రవరి 17 నుంచి అమలులోకి వచ్చాయి. టోల్ చెల్లింపులను క్రమబద్ధీకరించడం, వివాదాలను తగ్గించడం లక్ష్యంగా లావాదేవీలు ఈ రూల్స్ ప్రవేశపెట్టారు.ఫాస్ట్ట్యాగ్లో తగిన బ్యాలెన్స్ లేకపోతే.. అది బ్లాక్లిస్ట్లోకి వెళ్తుంది. టోల్ప్లాజా రీడర్ వద్దకు చేరుకునే సమయానికి ఒక గంట లేదా 60 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఫాస్ట్ట్యాగ్ ఇన్యాక్టివ్లోనే ఉంటే కోడ్ 176 ఎర్రర్ను చూపి లావాదేవీలు క్యాన్సిల్ అవుతాయి. అంతే కాకుండా మీరు స్కాన్ చేసిన 10 నిమిషాల తరువాత ఇన్యాక్టివ్లోకి వెళ్లినా.. మళ్ళీ లావాదేవీలు రిజెక్ట్ అవుతాయి. ఇలా లావాదేవీలు క్యాన్సిల్ అయినప్పుడు.. వాహనదారుడు ఫెనాల్టీ కింద రెట్టింపు టోల్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.ఇక బ్లాక్లిస్ట్ నుంచి బయటపడాలంటే, తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవడం మాత్రమే కాకుండా.. ఎప్పటికప్పుడు కేవైసీ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి దూర ప్రయాణాలు ప్రారంభించే ముందు ఖాతాల్లో తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. టోల్ ప్లాజాలను చేరుకునే ముందు FASTag బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి. ''కొత్త ఫాస్ట్ట్యాగ్ రూల్స్ రాష్ట్ర రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలకు వర్తిస్తాయి''.FASTag అంటే ఏమిటి?దేశంలోని అన్ని రహదారులపై టోల్ కలెక్షన్ పాయింట్ల ద్వారా వాహనాల ప్రయాణాన్ని సులభతరం చేయాలనే లక్ష్యంతో 2019 డిసెంబర్లో దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ ట్యాగ్ - ఫాస్ట్ట్యాగ్ స్కీమ్ ప్రారంభించారు. ఇది నగదు రహిత ఆర్థిక లావాదేవీలకు ఇది అనుమతిస్తుంది. అంతే కాకుండా టోల్ ప్లాజాల ద్వారా రోడ్డు ప్రయాణ వేగాన్ని వేగవంతం చేయడానికి ఇది సహాయపడుతుంది. ఫాస్ట్ట్యాగ్ వచ్చిన తరువాత వసూళ్లు కూడా భారీగా పెరిగాయి. -
ఫాస్ట్ట్యాగ్ కొత్త రూల్స్: ఈ రోజు నుంచే..
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ 'ఫాస్ట్ట్యాగ్' (FASTag)లో రెండు కొత్త మార్పులను జారీ చేశాయి. టోల్ చెల్లింపులను క్రమబద్ధీకరించడం, వివాదాలను తగ్గించడం లక్ష్యంగా లావాదేవీలు ఈ రూల్స్ ప్రవేశపెట్టారు. కొత్త నియమాలు ఈ రోజు (ఫిబ్రవరి 17) నుంచి అమలులోకి వస్తాయి.తక్కువ బ్యాలెన్స్, చెల్లింపులలో ఆలస్యం లేదా బ్లాక్లిస్ట్ ఫాస్ట్ట్యాగ్లు కలిగిన వాహనదారులు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ జరిమానాలు చెల్లించకుండా.. ఉండాలంటే, ఫాస్ట్ట్యాగ్లో తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. అవి బ్లాక్లిస్ట్లో ఉన్నాయా.. లేదా.. అనే విషయాన్ని కూడా చెక్ చేసుకోవాలి.ఫాస్ట్ట్యాగ్లో తగిన బ్యాలెన్స్ లేకపోతే.. అది బ్లాక్లిస్ట్లోకి వెళ్తుంది. టోల్ప్లాజా రీడర్ వద్దకు చేరుకునే సమయానికి ఒక గంట లేదా 60 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఫాస్ట్ట్యాగ్ ఇన్యాక్టివ్లోనే ఉంటే కోడ్ 176 ఎర్రర్ను చూపి లావాదేవీలు క్యాన్సిల్ అవుతాయి. అంతే కాకుండా మీరు స్కాన్ చేసిన 10 నిమిషాల తరువాత ఇన్యాక్టివ్లోకి వెళ్లినా.. మళ్ళీ లావాదేవీలు రిజెక్ట్ అవుతాయి. ఇలా లావాదేవీలు క్యాన్సిల్ అయినప్పుడు.. వాహనదారుడు ఫెనాల్టీ కింద రెట్టింపు టోల్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: జీతాల పెంపుపై టీసీఎస్ ప్రకటన: ఈ సారి ఎంతంటే..ఇక బ్లాక్లిస్ట్ నుంచి బయటపడాలంటే, తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవడం మాత్రమే కాకుండా.. ఎప్పటికప్పుడు కేవైసీ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి దూర ప్రయాణాలు ప్రారంభించే ముందు ఖాతాల్లో తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. టోల్ ప్లాజాలను చేరుకునే ముందు FASTag బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి.ఫాస్ట్ట్యాగ్ లావాదేవీలు: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం.. గత సంవత్సరం నవంబర్లో రూ.6,070 కోట్ల ఫాస్ట్ట్యాగ్ లావాదేవీలు జరిగాయి. డిసెంబర్ నాటికి లావాదేవీలు రూ.6,642 కోట్లకు చేరింది. ఈ సంఖ్య ఈ ఏడాది మళ్ళీ పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఫాస్ట్ట్యాగ్ కొత్త రూల్స్.. ఆలస్యమైతే డబుల్ ఛార్జ్
టోల్ గేట్ వద్ద వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో 'నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా' (NHAI) ఫాస్ట్ట్యాగ్ (FASTag) ప్రవేశపెట్టింది. ఇప్పుడు తాజాగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI).. FASTag బ్యాలెన్స్ ధ్రువీకరణకు సంబంధించి ముఖ్యమైన మార్పులతో కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇవి ఫిబ్రవరి 17 నుంచి అమల్లోకి వస్తాయి.కొత్త మార్పులు టోల్ లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి మాత్రమే కాకుండా.. మోసపూరిత కార్యకలాపాలను తగ్గించడానికి రూపొందించారు. కొత్త నియమాలను పాటించడం వల్ల వాహన వినియోగదారుడు జరిమానాల నుంచి తప్పించుకోవచ్చు. టోల్ల ద్వారా సజావుగా ముందుకు సాగిపోవచ్చు.ఫాస్ట్ట్యాగ్ నిబంధనలలో మార్పులు60 నిమిషాల విండో: టోల్ ప్లాజాకు చేరుకోవడానికి ముందు ఫాస్ట్ట్యాగ్ 60 నిమిషాల కంటే ఎక్కువ కాలం ఫాస్ట్ట్యాగ్ బ్లాక్లిస్ట్లో ఉంటే.. అది తెలుసుకున్న తరువాత 10 నిమిషాల పాటు బ్లాక్లిస్ట్లోనే కొనసాగితే.. లావాదేవీలు రిజెక్ట్ అవుతాయి.డబుల్ ఫెనాల్టీ: టోల్ ప్లాజాకు చేరుకున్నప్పుడు ఫాస్ట్ట్యాగ్ బ్లాక్లిస్ట్లో ఉండి.. లావాదేవీ రిజెక్ట్ అయితే.. మీరు చెల్లించాల్సిన టోల్ ఛార్జ్ కంటే రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది.గ్రేస్ పీరియడ్: డబుల్ పెనాల్టీని నివారించడానికి వినియోగదారులు ట్యాగ్ చదివిన 10 నిమిషాలలోపు వారి FASTagని రీఛార్జ్ చేసుకోవచ్చు.ఉదాహరణలకు మీరు టోల్ చేరుకోవడానికి ముందే మీ ఫాస్ట్ట్యాగ్ బ్లాక్లిస్ట్ అయితే.. దానిని తెలుసుకున్న తరువాత కూడా టోల్ గుండా వెళ్తే.. లావాదేవీలు రిజెక్ట్ అవుతాయి. అప్పుడు డబుల్ టోల్ ఛార్జ్ చెల్లించాలి. అలా కాకుండా.. మీ ఫాస్ట్ట్యాగ్ బ్లాక్లిస్ట్లో చేరడానికి 60 నిమిషాల ముందు లేదా స్కాన్ చేసిన 10 నిమిషాలలోపు (మొత్తం 70 నిమిషాల్లో) మీరు దానిని రీఛార్జ్ చేస్తే లావాదేవీలు సక్సెస్ అవుతాయి. ఎలాంటి జరిమానాలు చెల్లించాల్సిన అవసరం లేదు.టోల్ ప్లాజాలో ఎక్కువ టోల్ ఫీజు చెల్లించకుండా తప్పించుకోవాలంటే.. టోల్ ప్లాజాలను చేరుకునే ముందు మీ ఫాస్ట్ట్యాగ్ బ్యాలెన్స్ తగినంత ఉండేలా చూసుకోవాలి. బ్లాక్లిస్టింగ్ వంటివి నివారించుకోవడానికి కేవైసీ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి.హైవేపై అన్లిమిటెడ్ టోల్ పాస్లువాహనదారులకు ఉపశమనం కలిగించడానికి.. టోల్ వసూల్లలో సరళీకరణను సాధించడానికి కేంద్రం టోల్ పాస్ల జారీలో కొత్త విధానం తీసుకురానుంది. ఇందులో వార్షిక టోల్ పాస్లు, లైఫ్ టైం టోల్ పాస్లు జారీ చేయడానికి సంకల్పించింది.వార్షిక ప్లాన్ కింద ఏడాది 3000 రూపాయలు, లైఫ్ టైం టోల్ పాస్ (15 సంవత్సరాలు) కోసం రూ. 30,000 చెల్లించాల్సి ఉంటుందని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 340 రూపాయలకు నెలవారీ టోల్ పాస్ అందుబాటులో ఉంది. ఈ లెక్కన తీసుకుంటే ఏడాదికి రూ. 4080 చెల్లించాలి. కానీ ఏడాదికి టోల్ పాస్ తీసుకుంటే.. 1080 రూపాయలు ఆదా చేయవచ్చు.ఇదీ చదవండి: మళ్ళీ పెరిగిన బంగారం ధరలు: ఇక కొనుగోలు కష్టమే!వార్షిక, లైఫ్ టైం పాస్లు ప్రస్తుత FASTag వ్యవస్థలో చేర్చనున్నారు. కాబట్టి దీనికోసం ప్రత్యేకించి డాక్యుమెంటేషన్ అవసరం లేదు. ఈ టోల్ పాస్ వ్యవస్థను త్వరలోనే తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. వార్షిక టోల్ పాస్ లేదా జీవిత కాల టోల్ పాస్ అనేది ఒక టోల్ గేటుకు మాత్రమే వర్తిస్తుందా? లేక అన్ని చోట్లా పనిచేస్తుందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. -
హైవేపై అన్లిమిటెడ్ టోల్ పాస్లు: ధరలు ఇవే..
భారత్ ఇప్పుడు అభివృద్ధి వైపు వేగంగా దూసుకెళ్తోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్ నెట్వర్క్ కలిగిన ఇండియాలో జాతీయ రహదారుల నిర్మాణం శరవేగంగా ఉంది. అయితే గత పదేళ్లలో జాతీయ రహదారులపైన టోల్ ప్లాజాలు పెరిగాయి, టోల్ ఫీజులు కూడా పెరిగాయి. దీనిపై వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం కూడా కొత్త చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు టోల్ ఫీజుల భారాన్ని తగ్గించడానికి వార్షిక టోల్ పాస్లు & జీవితకాల టోల్ పాస్లను అందించాలని యోచిస్తోంది.వాహనదారులకు ఉపశమనం కలిగించడానికి.. టోల్ వసూల్లలో సరళీకరణను సాధించడానికి కేంద్రం టోల్ పాస్ల జారీలో కొత్త విధానం తీసుకురానుంది. ఇందులో వార్షిక టోల్ పాస్లు, లైఫ్ టైం టోల్ పాస్లు జారీ చేయడానికి సంకల్పించింది.వార్షిక ప్లాన్ కింద ఏడాది 3000 రూపాయలు, లైఫ్ టైం టోల్ పాస్ (15 సంవత్సరాలు) కోసం రూ. 30,000 చెల్లించాల్సి ఉంటుందని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 340 రూపాయలకు నెలవారీ టోల్ పాస్ అందుబాటులో ఉంది. ఈ లెక్కన తీసుకుంటే ఏడాదికి రూ. 4080 చెల్లించాలి. కానీ ఏడాదికి టోల్ పాస్ తీసుకుంటే.. 1080 రూపాయలు ఆదా చేయవచ్చు.వార్షిక, లైఫ్ టైం పాస్లు ప్రస్తుత FASTag వ్యవస్థలో చేర్చనున్నారు. కాబట్టి దీనికోసం ప్రత్యేకించి డాక్యుమెంటేషన్ అవసరం లేదు. ఈ టోల్ పాస్ వ్యవస్థను త్వరలోనే తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. వార్షిక టోల్ పాస్ లేదా జీవిత కాల టోల్ పాస్ అనేది ఒక టోల్ గేటుకు మాత్రమే వర్తిస్తుందా? లేక అన్ని చోట్లా పనిచేస్తుందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.ఏకరీతి టోల్ విధానంవినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఏకరీతి టోల్ విధానంపై కసరత్తు చేస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలే తెలిపారు. ఇప్పుడు మనదేశంలోని రోడ్లు.. అమెరికాలోని రోడ్లకు సమానంగా ఉన్నాయని ఆయన అన్నారు.కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో రోడ్లు లేకపోవడం, అధిక టోల్ చార్జీల వసూలు వంటివి వాహనదారులలో అసంతృప్తిని నెలకొల్పాయి. కాబట్టి ఏకరీతి టోల్ ప్రవేశపెడితే.. ఇది అందరికి ప్రయోజనకారిగా ఉంటుందని నితిన్ గడ్కరీ అన్నారు. అయితే దీనికి సంబంధించిన చాలా వివరాలను ఆయన అధికారికంగా వెల్లడించలేదు. అంతకంటే ముందు GSS (గ్లోబల్ న్యావిగేషన్ శాటిలైట్ సిస్టం) ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: 2030 నాటికి ఈ రంగంలో 2.5 కోట్ల ఉద్యోగులు: నితిన్ గడ్కరీజాతీయ రహదారులపై గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్) ఆధారిత టోల్ వసూలు విధానం అమలు చేయడం ద్వారా ప్రయాణానికి ఎలాంటి అవరోధం ఉండదని ఆయన అన్నారు. అంతే కాకుండా.. సోషల్ మీడియాలో ప్రయాణికులు చేసే ఫిర్యాదులను చాలా సీరియస్గా తీసుకున్నామని.. దీనికి కారణమైన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని గడ్కరీ చెప్పారు. -
ఫాస్టాగ్ కొత్త డిజైన్.. దుర్వినియోగానికి ఇక చెక్!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫాస్ట్ట్యాగ్ కొత్త డిజైన్ను ఆవిష్కరించింది. వాహనదారులకు సమయం వృధాను తగ్గించడంతోపాటు చిన్న వాహనాల ట్యాగ్లతో భారీ వాహనాలు చేస్తున్న దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో దీన్ని ప్రారంభించింది."వెహికల్ క్లాస్ (VC-04) కేటగిరీలో ఫాస్ట్ట్యాగ్ కొత్త డిజైన్ను ప్రవేశపెట్టాం. అధునాతన ఫాస్ట్ట్యాగ్ డిజైన్ వాహన గుర్తింపు, టోల్ సేకరణ సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే వాహనదారుల సమయం ఆదా అవుతుంది" అని ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.కొత్త ట్యాగ్ ఆగస్టు 30 నుండి అందుబాటులో వచ్చింది.ఫాస్టాగ్ కొత్త డిజైన్ ప్రత్యేకంగా వెహికల్ క్లాస్-4 (VC-04) కోసం ఎస్బీఐ తీసుకొచ్చింది. ఇందులో కారు, జీప్, వ్యాన్ కేటగిరీలు ఉన్నాయి. ప్రస్తుతం, ట్రక్కుల వంటి భారీ వాహనాలపై VC-04 ట్యాగ్లను ఉపయోగిస్తున్నారు. దీంతో టోల్ ప్లాజాలు ఆదాయాన్ని కోల్పోతున్నాయి. కొత్త డిజైన్ వాహనాల కేటగిరీని సులభంగా గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. తప్పు కేటగిరీ వాహనాలపై తక్షణ చర్య తీసుకోవడానికి సహాయపడుతుంది. -
టోల్ ఫీజు మినహాయింపు ఉంటుందా? కేంద్రం క్లారిటీ
జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద క్యూ పొడవు లేదా వేచి ఉండే సమయాల ఆధారంగా ప్రస్తుత నిబంధనలు టోల్ ఫీజు మినహాయింపులను అందించవని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఎంపీలు లేవనెత్తిన ఆందోళనలను ఉద్దేశించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లోక్సభలో రెండు వేర్వేరు సమాధానాల్లో ఈ విషయాన్ని ధ్రువీకరించారు.60 కిలోమీటర్ల లోపే ఉన్నప్పటికీ రెండు ప్లాజాల్లో టోల్ వసూలు చేస్తున్నారని ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ "ఎన్హెచ్ ఫీజు నిబంధనలు, రాయితీ ఒప్పందం ప్రకారం 60 కి.మీ పరిధిలో ఉన్నప్పటికీ ఫీజు ప్లాజాలకు అనుమతి ఉంటుంది" అని గడ్కరీ స్పష్టం చేశారు. కాగా దీనికి సంబంధించి 2022 మార్చిలో గడ్కరీ మాట్లాడిన పాత వీడియో మళ్లీ తెరపైకి వచ్చింది. 60-కిమీ పరిధిలో ఒకే ఒక టోల్ ప్లాజా ఉంటుందని, అదనంగా ఉన్నవాటిని మూడు నెలల్లో మూసివేస్తామని అందులో ఆయన హామీ ఇచ్చారు.అయితే, లోక్సభలో ఆయన తాజాగా ఇచ్చిన సమాధానం దీనికి విరుద్ధంగా అలాంటి మినహాయింపు లేదని పేర్కొంది. ఎగ్జిక్యూటింగ్ అథారిటీ డాక్యుమెంట్ చేసిన దాని ప్రకారం, అవసరమైతే 60 కిలోమీటర్లలోపు అదనపు టోల్ ప్లాజాలకు నిబంధనలు అనుమతిస్తున్నట్లు గడ్కరీ వివరించారు.ఇక కొత్త టోల్ ప్లాజాల రూపకల్పనకు మార్గదర్శకాల్లో భాగంగా రద్దీ సమయాల్లో వాహనాల క్యూలు 100 మీటర్లు దాటితే బూమ్ బారియర్స్ను ఎత్తివేసే అంశంపై మరో ఎంపీ అడిగిన ప్రశ్నకూ గడ్కరీ స్పందించారు. “ఫీజు ప్లాజాల వద్ద నిర్ణీత దూరం లేదా సమయ పరిమితి దాటి వాహనాలను నిలిపివేసిన సందర్భంలో ఆ వాహనాలను యూజర్ ఫీజు నుంచి మినహాయించే నిబంధన లేదు” అని ఆయన స్పష్టం చేశారు. 2021 ఫిబ్రవరి 16 నుంచి ఫాస్ట్ట్యాగ్ తప్పనిసరి అమలును ఆయన గుర్తు చేశారు. ఇది టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గించింది. -
రేపటి నుంచే ఫాస్టాగ్ కొత్త రూల్స్.. అవి మార్చుకోవాల్సిందే!
వాహనాల ఫాస్టాగ్కు సంబంధించిన కొత్త రూల్స్ ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం ఫాస్టాగ్ యూజర్లు తప్పనిసరిగా కేవైసీ చేయించుకుకోవాలి. లేకుంటే టోల్ ప్లాజాల వద్ద చిక్కులు తప్పవు.నూతన నిబంధనలు ఇవే..ఆగస్టు 1 నుంచి ఫాస్టాగ్ సేవలను అందించే కంపెనీలు 3-5 సంవత్సరాల క్రితం జారీ చేసిన అన్ని ఫాస్టాగ్లకు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇందుకు అక్టోబర్ 31 వరకు గడువు ఉంటుంది. అదే ఐదేళ్లకు పైబడిన ఫాస్టాగ్ను తప్పనిసరిగా మార్చాలి. వాహన యజమానులు తమ ఫాస్టాగ్ల జారీ తేదీలను పరిశీలించుకుని తక్షణమే మార్చుకోవాలి.ఆగస్టు 1 నుంచి అన్ని ఫాస్టాగ్లను వాహన రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్తో అనుసంధానం చేయాలని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. నూతన వాహన యజమానులు కూడా వాహనాన్ని కొనుగోలు చేసిన 90 రోజుల్లోగా తమ రిజిస్ట్రేషన్ నంబర్ను అప్డేట్ చేయాలి. ఫాస్టాగ్ ప్రొవైడర్లు వారి డేటాబేస్ను ఖచ్చితమైనదిగా, తాజాగా ఉండేలా చూసుకోవాలి.ఈ మార్పులతో పాటు వాహనాలను సులభంగా గుర్తించడానికి వాహనానికి సంబంధించిన ముందు, వెనుక వైపుల స్పష్టమైన ఫోటోలను ఫాస్టాగ్ ప్రొవైడర్లు అప్లోడ్ చేయాలి. కమ్యూనికేషన్, అప్డేట్స్ సజావుగా సాగేందుకు ప్రతి ఫాస్టాగ్ను మొబైల్ నంబర్కు కనెక్ట్ చేయాలి. కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి చివరి గడువు అక్టోబర్ 31. టోల్ప్లాజాల వద్ద ఇబ్బందులు ఎదురవ్వకూడదంటే చివరి నిమిషం వరకు ఉండకుండా ముందుగానే కేవైసీ చేసుకోవడం మంచిది. -
ఎన్హెచ్ఏఐ కొత్త రూల్.. ఇలా చేస్తే రెట్టింపు టోల్ ఫీజు
టోల్ గేట్స్ వద్ద వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్ట్ట్యాగ్ ప్రవేశపెట్టింది. ఈ ఫాస్ట్ట్యాగ్ విధానం అమలులోకి వచ్చిన తరువాత టోల్ గేట్స్ వద్ద వేచి ఉండాల్సిన సమయం బాగా తగ్గింది. అయితే కొంతమంది వాహనదారులు ఫాస్ట్ట్యాగ్ను విండ్ స్క్రీన్ మీద కాకుండా.. ఇతర ప్రదేశాల్లో అంటించి టోల్ ప్లాజాల వద్ద అనవసర ఆలస్యాలకు కారణమవుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎన్హెచ్ఏఐ కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది.ఎన్హెచ్ఏఐ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. వెహికల్ విండ్స్క్రీన్ మీద కాకుండా ఫాస్ట్ట్యాగ్ను ఇతర ప్రదేశాలలో అంటిస్తే అలాంటి వారి నుంచి డబుల్ టోల్ ఫీజు వసూలు చేయనున్నట్లు సమాచారం. కాబట్టి తప్పకుండా వాహనదారులు ఫాస్ట్ట్యాగ్ను విండ్స్క్రీన్పై అంటించాలి.కొందరు వాహనదారులు విండ్స్క్రీన్ మీద ఫాస్ట్ట్యాగ్ను అంటించకపోవడం వల్ల టోల్ ప్లాజాలో అనవసరమైన ఆలస్యానికి కారణమవుతున్నారు. కాబట్టి ఇకపై అలా చేసేవారు రెట్టింపు టోల్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని వాహన వినియోగదారులు తప్పకుండా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.విండ్స్క్రీన్ మీద ఫాస్ట్ట్యాగ్ను అంటిస్తే టోల్ ప్లాజాలో తొందరగా ట్రాన్సక్షన్ జరుగుతుంది. అప్పుడు గేట్ వేంగంగా ఓపెన్ అవుతుంది. అప్పుడు వెనుక వచ్చే వాహనదారులు కూడా వేగంగా ముందుకు వెళ్ళవచ్చు. అలా కాకూండా ఫాస్ట్ట్యాగ్ అడ్డదిడ్డంగా, ఎక్కడపడితే అక్కడ అంటిస్తే వారికి మాత్రమే కాకుండా.. వెనుక వచ్చే ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. -
ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో కొత్త సర్వీసులు
భారతీయ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ తన డిజిటల్ చెల్లింపు సర్వీసులను విస్తరించేందుకు బిల్డెస్క్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని పేర్కొంది. ఇందులో భాగంగా ఫ్లిప్కార్ట్ యాప్లో ఫాస్టాగ్, డీటీహెచ్ రీఛార్జ్లు, ల్యాండ్లైన్, బ్రాడ్బ్యాండ్, మొబైల్ పోస్ట్పెయిడ్ బిల్లు చెల్లింపులను అందిస్తున్నట్లు తెలిపింది.ఈ సందర్భంగా ఫ్లిప్కార్ట్ పేమెంట్స్ అండ్ సూపర్కాయిన్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ అరోరా మాట్లాడుతూ..‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అభివృద్ధి చేసిన భారత్ బిల్ పేమెంట్స్ సిస్టమ్ (బీబీపీఎస్)తో కొత్త సేవలను ఏకీకృతం చేయడానికి బిల్డెస్క్తో కుదిదిన ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుంది. కంపెనీ అందిస్తున్న ఈ సేవలకు అదనంగా విద్యుత్ బిల్లు చెల్లింపులు, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఫ్లిప్కార్ట్ యూపీఐ ద్వారా లావాదేవీలు చేసి 10 శాతం వరకు సూపర్కాయిన్లను రెడీమ్ చేసుకోవచ్చు. కస్టమర్ల కోసం డిజిటల్ చెల్లింపులను సులభతరం చేయడానికి, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: వచ్చే 2-3 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు!2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారా దేశమంతటా సుమారు 1.3 బిలియన్(130 కోట్లు) లావాదేవీలు జరుగుతాయని సమాచారం. 2026 నాటికి ఈ సంఖ్య 3 బిలియన్ల(300 కోట్లు)కు పైగా ఉంటుందని అంచనా. -
FASTag: పార్క్ ప్లస్తో చేతులు కలిపిన స్విగ్గీ - 10 నిమిషాల్లో ఫాస్ట్ట్యాగ్..
భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన స్విగ్గీ ఇన్స్టామార్ట్.. పార్క్ ప్లస్తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యం ఏర్పడటానికి కారణం ఏంటి? దీని వల్ల ఉపయోగాలు ఎలా ఉన్నాయి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పది నిమిషాల్లోపు ఇండస్ఇండ్ బ్యాంక్ ఫాస్ట్ట్యాగ్ను స్విగ్గీ ఇన్స్టామార్ట్.. వినియోగదారులకు అందించడానికి ఈరోజు భారతదేశపు అతిపెద్ద ఫాస్ట్ట్యాగ్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ పార్క్ ప్లస్తో చేతులు కలిపింది. ఈ సౌలభ్యం ప్రస్తుతం 29 నగరాల్లోని స్విగ్గీ ఇన్స్టామార్ట్లోని వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. కస్టమర్లు ఇప్పుడు ఫాస్ట్ట్యాగ్ని నేరుగా వారి ఇంటి వద్దకే 10 నిమిషాల్లో డెలివరీ చేసుకునే సౌలభ్యాన్ని పొందవచ్చు. స్విగ్గీ ఇన్స్టామార్ట్ హెడ్ 'ఫణి కిషన్' మాట్లాడుతూ.. ఫాస్ట్ట్యాగ్ని కొనుగోలు చేయడానికి బ్యాంక్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేస్తారు. అయితే కార్డు డెలివరీ అండ్ యాక్టివేషన్ కోసం 3 నుంచి 7 రోజుల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఫాస్ట్ట్యాగ్ అందుబాటులో ఉండటం వల్ల వినియోగదారులు దీన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా కొనుగోలు చేయవచ్చు. డెలివరీ కేవలం 10 నిమిషాల్లో పూర్తవుతుందని అన్నారు. ఈ భాగస్వామ్యం గురించి పార్క్ ప్లస్ ఫౌండర్ అండ్ సీఈఓ 'అమిత్ లఖోటియా' మాట్లాడుతూ.. మా ప్రధాన లక్ష్యం కారు యజమానికి ఆనందాన్ని కలిగించడమే. ఈ ప్రయత్నంలో భాగంగానే ఫాస్ట్ట్యాగ్ కొనుగోలు చేసే వారు త్వరితగతిని డెలివరీ పొందటానికి స్విగ్గీ ఇన్స్టామార్ట్ సహకరిస్తుందని అన్నారు. -
పేటీఎంకు మరో బిగ్ షాక్..!
టోల్ ప్లాజాల దగ్గర ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తకుండా మార్చి 15లోగా ఇతర బ్యాంకుల నుంచి ఫాస్టాగ్లు తీసుకోవాలంటూ పేటీఎం ఫాస్టాగ్ యూజర్లకు నేషనల్ హైవేస్ అథారిటీ (ఎన్హెచ్ఏఐ) సూచించింది. తద్వారా జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు జరిమానాలు, డబుల్ ఫీజు చార్జీలను నివారించవచ్చని ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇతరత్రా సందేహాల నివృత్తి కోసం ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ (ఐహెచ్ఎంసీఎల్) వెబ్సైట్లోని ఎఫ్ఏక్యూ సెక్షన్ను సందర్శించాలని తెలిపింది. నిబంధనల ఉల్లంఘనల కారణంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై (పీపీబీఎల్) రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 15 తర్వా త నుంచి పేటీఎం ఫాస్టాగ్ యూజర్లు తమ ఖా తాలను రీచార్జ్ చేసుకునే వీలుండదు. అయితే, తమ ఖాతాల్లో బ్యాలెన్స్ను వాడుకోవచ్చు. ఇవి చదవండి: భారీగా పడుతున్న స్టాక్మార్కెట్లు.. కారణాలు ఇవే.. -
కేవైసీ అప్డేట్.. ఈ రోజే లాస్ట్ డేట్ - ఎలా చేయాలంటే?
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్ట్ట్యాగ్ వినియోగదారులను హెచ్చరిస్తూ.. కేవైసీ చేయడానికి ఈ రోజే (ఫిబ్రవరి 29) చివరి గడవని గతంలోనే వెల్లడించింది. కేవైసీ అప్డేట్ పూర్తి చేయకపోతే అటువంటి ఫాస్ట్ట్యాగ్స్ డీయాక్టివేట్ లేదా బ్లాక్లిస్ట్ చేసే అవకాశం ఉంది. ఫాస్ట్ట్యాగ్ కేవైసీ ఎలా చెక్ చేసుకోవాలంటే.. వినియోగదారుడు ముందుగా ఫాస్ట్ట్యాగ్కు సంబంధించిన అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. ఓటీపీ అథెంటికేషన్ పూర్తయిన తరువాత.. డాష్బోర్డ్లో 'మై ప్రొఫైల్' అనే సెక్షన్లో KYC స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సులభంగా ఇలా చెక్ చేసుకుని ఫాస్ట్ట్యాగ్ కేవైసీ అప్డేట్ అవ్వకపోతే.. అప్డేట్ చేసుకోవచ్చు. కేవైసీ అప్డేట్ ఎలా చేసుకోవాలంటే.. ఫాస్ట్ట్యాగ్ కేవైసీ చెక్ చేసుకున్న తరువాత.. పెండింగ్లో ఉన్నట్లు కనిపిస్తే.. కేవైసీ సబ్ సెక్షన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. దీని కోసం అవసరమైన ఐడెంటిటీ ప్రూఫ్.. వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ఫ్రూఫ్ వంటి వాటితో పాటు పాస్పోర్ట్ సైజు ఫోటో అవసరమవుతుంది. ఇవన్నీ సబ్మిట్ చేసిన తరువాత చెక్ చేసి, చివరిగా సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. తర్వాత 'కంటిన్యూ'పై క్లిక్ చేసి, ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి సబ్మిట్ చేస్తే కేవైసీ వెరిఫికేషన్ పూర్తవుతుంది. కేవైసీ అప్డేట్ఎందుకంటే.. కొందరు ఒకే ఫాస్ట్ట్యాగ్తో పలు వాహనాలను వినియోగిస్తున్నట్లు, మరి కొందరు కేవైసీ పూర్తి కాకుండానే ఫాస్ట్ట్యాగ్లను జారీ చేస్తున్నట్లు గుర్తించి, ఈ విధానికి చరమగీతం పాడాలని ఉద్దేశ్యంతో 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్ట్యాగ్' విధానానికి శ్రీకారం చుట్టారు. కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా ఫాస్ట్ట్యాగ్ వినియోగదారుడు KYC అప్డేట్ చేసుకోవాల్సిందే. -
మీ ఫాస్ట్ ట్యాగ్ KYC పూర్తి చేశారా? ఇంకా 3 రోజులే గడువు
-
వాహనదారులకు ముఖ్య గమనిక, ఫాస్టాగ్లపై కీలక అప్డేట్!
టోల్గేట్ల వద్ద సమయం ఆదా చేయడంతో పాటు, వాహనాల రద్దీని తగ్గించేందుకు కేంద్రం ఎలక్ట్రానిక్ పద్దతిలో ఫాస్టాగ్ వ్యవస్థని అందుబాటులోకి తెచ్చింది. దీన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) నిర్వహిస్తోంది. ఫాస్టాగ్లోని రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా ఫాస్టాగ్కు అనుసంధానం చేసిన ప్రీ ప్రెయిడ్ లేదా సేవింగ్ ఖాతా నుంచి నేరుగా టోల్ చెల్లింపులకు అవకాశం కల్పిచ్చింది. ఈ ఫాస్టాగ్ చెల్లింపులు పేమెంట్స్ పేటీఎం బ్యాంక్ (పీపీబీఎల్) ద్వారా జరిగేవి. కానీ సెంట్రల్ బ్యాంక్ పేటీఎంపై ఆంక్షలు విధించడంతో ఇప్పుడు ఫాస్టాగ్ యూజర్లు.. టోల్ చెల్లింపుల కోసం ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తరుణంలో పీపీబీఎల్లో ఫాస్టాగ్లను ఫిబ్రవరి 29 లోపు వినియోగించుకోవాలని ఎన్హెచ్ఏఐ సూచించింది. ఆ తర్వాత నుంచి తాము నిర్ధేశించిన బ్యాంకుల్లో మాత్రమే ఫాస్టాగ్లను కొనుగోలు చేయాలని తెలిపింది. నిర్ధేశించిన గడువు తర్వాత పీపీబీఎల్ మినహా బ్యాంకులు అందించే ఫాస్టాగ్లను పొందాలని వెల్లడించింది. ఇప్పుడు ఆయా బ్యాంకుల్లో నిర్ధేశించిన మొత్తాన్ని చెల్లించి ఫాస్టాగ్లను పొందవచ్చు. ఫాస్టాగ్ ఛార్జీలు? హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఫాస్టాగ్ యాక్టివేషన్ ఛార్జీలు నామమాత్రంగా ఉన్నాయి. అయితే, వినియోగదారులకు మూడు రకాల ఫాస్టాగ్ ఛార్జీలు ఉన్నాయని గుర్తించాల్సి ఉంటుంది. వాటిల్లో 1.ఫాస్టాగ్ జాయినింగ్ ఫీజు - ఫాస్టాగ్ యూజర్గా పేరు నమోదు చేసుకొని, మీ వాహనానికి ఫాస్టాగ్ను వినియోగించేలా యాక్టీవేట్ చేసేందుకు ఫాస్టాగ్ జాయినింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు ఒక్కసారే ఉంటుంది. 2.సెక్యూరిటీ డిపాజిట్ - ఫాస్టాగ్ అకౌంట్ మూసివేసే సమయంలో ఎలాంటి బకాయిలు లేకుండా పూర్తిగా వాపస్ చేసేందుకు అతితక్కువ మొత్తంలో సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించాల్సి ఉంటుంది. మీ వాహనాన్ని బట్టి ఆ మొత్తం మారుతూ ఉంటుంది. యూజర్ల ఫాస్టాగ్ ఖాతాలో తగినంత నిధులు లేకుంటే, ఏదైనా బకాయి ఉన్న టోల్ ఛార్జీలను సర్దుబాటు చేయడానికి సెక్యూరిటీ డిపాజిట్ని బ్యాంకులు ఉపయోగించుకోవచ్చు 3.ఫాస్టాగ్ యాక్టివేషన్ టైం : ఫాస్టాగ్ యాక్టివేషన్ అయిన వెంటనే ఏదైనా టోల్ ఛార్జీలు చెల్లించడానికి ఈ మొత్తం మీ ఫాస్టాగ్ ఖాతాలో ఉంటుంది. ఈ థ్రెషోల్డ్ మొత్తం వాహనం తరగతిపై ఆధారపడి ఉంటుంది. ఫాస్టాగ్లు జారీ చేసే బ్యాంకులు, వినియోగదారులు ఫాస్టాగ్ కోసం ఎంత చెల్లించాలో తెలిపే వివరాలు ఇలా ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వాహనదారుల నుంచి ట్యాక్స్ కింద రూ.100, సెక్యూరిటీ కింద రూ.100 వసూలు చేస్తుంది. కారు, జీప్, వ్యాన్, టాటా ఏస్ ఇలాంటి మినీ-లైట్ కమర్షియల్ వాహనాలకు విధిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ జాయినింగ్ ఫీజుగా బ్యాంక్ రూ. 99.12 (GSTతో సహా) వసూలు చేస్తుంది. సెక్యూరిటీ డిపాజిట్ రూ. 200, కారు, జీప్, వ్యాన్ థ్రెషోల్డ్ మొత్తం రూ. 200. ఈ మొత్తం చెల్లిస్తేనే మీ ఫాస్టాగ్ పనిచేస్తుంది. లేదంటే ఎలాంటి ఉపయోగం ఉండదు ఎస్బీఐ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్లు, జీప్లు, వ్యాన్లు, టాటా ఏస్, ఇతర కాంపాక్ట్ లైట్ కమర్షియల్ వాహనాలకు ఫాస్టాగ్ ఫీజులు లేదా సెక్యూరిటీ డిపాజిట్లకు ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయదు. కాకపోతే ఫాస్టాగ్ యాక్టివేషన్ కోసం కనీస బ్యాలెన్స్ రూ. 200 అవసరమని గుర్తించాలి. యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఫాస్టాగ్ జారీ చేసినందుకు కస్టమర్ నుంచి ఎలాంటి రుసుమును వసూలు చేయదు. అయితే, తిరిగి రెన్యువల్ చేసే సమయంలో బ్యాంక్ రూ.100 (అన్ని ట్యాక్స్లు కలిపి) వసూలు చేస్తుంది. కారు, జీపు, వ్యాన్ వంటి వాహనాలకు బ్యాంకు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.200 వసూలు చేస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా బరోడా ఫాస్టాగ్ వన్ టైమ్ ఫీ కింద జీఎస్టీతో కలిపి రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ వాహనం రకాన్ని బట్టి మారుతుంది. థ్రెషోల్డ్ పరిమితి రూ. 200తో పాటు కారు, జీప్, వ్యాన్లకు రూ. 200 సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేస్తుంది. కెనరా బ్యాంక్ కెనరా బ్యాంక్ రెన్యువల్ సమయంలో రీ-ఇష్యూషన్ ఫీజు కింద రూ.100 వసూలు చేస్తుంది. టాగ్ని ఆన్లైన్లో రీ-లోడ్ చేయడానికి కన్వీనియన్స్ ఫీజు రూ.10 అవుతుంది. కారు, జీప్, వ్యాన్ వంటి వాహనాలకు సెక్యూరిటీ డిపాజిట్ రూ.200, థ్రెషోల్డ్ మొత్తం రూ. 100 ఉంది. ఐడీబీఐ ఐడీబీఐ బ్యాంక్ పన్నులతో సహా రూ. 100 రీ-ఇష్యూషన్ ఫీజును వసూలు చేస్తుంది. బ్యాంక్ ట్యాగ్ డిపాజిట్ రూ. 200 వసూలు చేస్తుంది. కొటక్ మహీంద్రా వీసీ4 కోసం బ్యాంక్ రూ. 100 వసూలు చేస్తుంది. ఇతర వెహికల్ క్లాస్కు ఫాస్టాగ్ జాయినింగ్ ఫీజుగా, డిపాజిట్గా రూ. 200 కట్టాల్సి ఉంటుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ సెక్యూరిటీ డిపాజిట్గా రూ. 200, కస్టమర్ వాలెట్లో లోడ్ చేసే థ్రెషోల్డ్ మొత్తంగా రూ. 200 వసూలు చేస్తుంది. బ్యాంక్ వన్ టైమ్ ట్యాగ్ జాయినింగ్ ఫీజుగా రూ. 100 , రీఇష్యూన్స్ ఫీజు కోసం రూ. 100 వసూలు చేస్తుంది. పీఎన్బీ కారు, జీప్ , వ్యాన్ వంటి వాహనాలకు రూ. 200 సెక్యూరిటీ డిపాజిట్ ఛార్జ్ చేయబడుతుంది . థ్రెషోల్డ్ మొత్తం రూ. 100 ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఫాస్టాగ్కి ఒక్కసారి రుసుము రూ. GSTతో కలిపి 100. ట్యాగ్ జాయినింగ్ ఫీజు (వన్-టైమ్ ఫీజు) రూ. 99.99 (అన్ని వర్తించే పన్నులతో సహా), వన్-టైమ్ ట్యాగ్ రీ-ఇష్యూషన్ ఫీజు రూ. 99.99 (అన్ని వర్తించే పన్నులతో సహా). రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ వాహనం రకాన్ని బట్టి ఉంటుంది. కారు / జీప్ / వ్యాన్ కోసం వన్-టైమ్ సెక్యూరిటీ డిపాజిట్ (రిజర్వ్ చేయబడిన మొత్తం) మొత్తం రూ. 150. -
పేటీఎం ఫాస్టాగ్ పనిచేయదా..? డీయాక్టివేషన్ ఎలా..? కొత్తది ఎలా తీసుకోవాలి..?
-
మార్చి 15 తర్వాత పని చేసేవి.. పని చేయనివి ఇవే..
ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ముందుగా 2024 ఫిబ్రవరి 29 తరవాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని ఆదేశించిన ఆర్బీఐ తేదీని సవరించింది. ఈ నేపథ్యంలో ఆ గడువు తేదీని మార్చి 15, 2024కి పొడిగిస్తూ ఇటీవల ప్రకటన చేసింది. మార్చి 15 తర్వాత నిబంధనలు అమల్లోకి వస్తాయని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ స్థానంలో యాక్సిస్ బ్యాంక్తో ఒన్97 కమ్యునికేషన్స్ ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు కొన్ని ప్రశ్నలు మెదులుతున్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. రీఛార్జ్లు చేయడానికి, బిల్లులు చెల్లించడానికి, ఇతర ఆర్థిక కార్యకలాపాలకు పేటీఎంను ఉపయోగించవచ్చా? ప్రజలు అన్ని బిల్లు చెల్లింపులు, రీఛార్జ్ల కోసం పేటీఎం యాప్ని ఉపయోగించవచ్చని కంపెనీ తన FAQ పేజీలో ధ్రువీకరించింది. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ.. వంటి అధీకృత బ్యాంకులకు తమ పేటీఎంను లింక్ చేసిన వారిపై తాజా నిషేధం ఎలాంటి ప్రభావం చూపదు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో ఖాతా తెరిచిన వినియోగదారులపై మాత్రమే ఈ ప్రభావం ఉంటుంది. పేటీఎం క్యూఆర్ కోడ్, సౌండ్బాక్స్, కార్డ్ మెషిన్ ఎప్పటిలాగే పని చేస్తాయా? కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం పేటీఎం క్యూఆర్, సౌండ్బాక్స్, కార్డ్ మెషీన్లపై ఎలాంటి ప్రభావం చూపదు. మార్చి 15 తర్వాత కూడా ఇవి కొనసాగుతాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్ని ఉపయోగించవచ్చా? పేటీఎం వాలెట్లో బ్యాలెన్స్ అందుబాటులో ఉండే వరకు దాన్ని ఉపయోగించుకోవచ్చు.. ఉపసంహరించుకోవచ్చు.. మరొక వాలెట్ లేదా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. మార్చి 15, 2024 తర్వాత ఎలాంటి డిపాజిట్లు మాత్రం చేయలేరు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్/ ఎన్సీఎంసీ కార్డ్ని ఉపయోగించవచ్చా? ప్రస్తుతం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్/ ఎన్సీఎంసీ కార్డ్ని ఉపయోగించవచ్చు. అయితే, మార్చి 15, 2024 తర్వాత రీఛార్జ్ చేయలేరు. అందులో డబ్బును డిపాజిట్ చేయలేరు. అందులో ఉన్న నగదును ఉపయోగించవచ్చు. లేదా గడువులోపు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్/ ఎన్సీఎంసీ కార్డ్ని మూసివేయవచ్చు. అందులో ఉన్న నగదు రీఫండ్ కోసం బ్యాంక్ని కోరవచ్చు. ఇదీ చదవండి: మీ బైక్ మైలేజ్ ఇవ్వట్లేదా.. ఇవి పాటించాల్సిందే.. పేటీఎం పేమెంట్ బ్యాంక్లో ఉన్న బ్యాలెన్స్ ఎలా? వాలెట్లో ఉన్న నగదును ఉపయోగించడం, విత్ డ్రాయిల్ లేదా, బ్యాంక్ అకౌంట్కు బదిలీ చేయడం కొనసాగించవచ్చు. మార్చి 15, 2024 తర్వాత మీ పేటీఎం పేమెంట్ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయలేరు. డిపాజిట్ చేయలేరు. అయితే, ఖాతాల్లో ఉన్న బ్యాలెన్స్ వరకు యూపీఐ/ ఐఎంపీఎస్ ద్వారా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతా నుండి మీ డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. -
పేటీఎం ద్వారా ఫాస్టాగ్ టోల్ చెల్లిస్తున్నారా.. ఎన్హెచ్ఏఐ కీలక అప్డేట్
పేటీఎంకు దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంది. తాజాగా ఫాస్టాగ్ జారీ చేసే అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్)ను తొలగించారు. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) తరఫున టోల్ రుసుము వసూలు చేసే భారతీయ రహదారుల నిర్వహణ కంపెనీ(ఐహెచ్ఎంసీఎల్) ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాము తెలిపిన బ్యాంకుల నుంచే ఫాస్టాగ్లు కొనుగోలు చేయాలని చెప్పింది. ఐహెచ్ఎంసీఎల్ పేర్కొన్న జాబితా ఇదే.. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అలహాబాద్ బ్యాంక్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కెనరా బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిటీ యూనియన్ బ్యాంక్ కాస్మోస్ బ్యాంక్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ ఫినో పేమెంట్స్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఐడిబిఐ బ్యాంక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ జె అండ్ కె బ్యాంక్ కర్ణాటక బ్యాంక్ కరూర్ వైశ్యా బ్యాంక్ కొటక్ మహీంద్రా బ్యాంక్ నాగ్పూర్ నాగరిక్ సహకారి బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సారస్వత్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రిసూర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ యుకో బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యెస్ బ్యాంక్ ఫిబ్రవరి 29 తర్వాత వినియోగదారుల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్లలో డిపాజిట్లు, టాప్-అప్లు స్వీకరించవద్దని పీపీబీఎల్ను ఆర్బీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఆయా ఖాతాల్లో ఇప్పటి వరకు ఉన్న నగదును మాత్రం గడువులోపు వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఫాస్ట్ట్యాగ్ అనేది వాహనం కదులుతున్నపుడు నేరుగా టోల్ చెల్లింపులు చేయడానికి ఉపయోగించే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ పరికరం. దేశవ్యాప్తంగా 100కి పైగా రాష్ట్ర రహదారి టోల్ ప్లాజాలు సహా అన్ని జాతీయ రహదారి టోల్ ప్లాజాల్లో కలిపి 750కి పైగా టోల్లు పనిచేస్తున్నాయి. -
ఎయిర్టెల్ నెత్తిన పాలు పోసిన పేటీఎం!
గత కొద్ది రోజులు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్కు యూజర్ల తాకిడి ఎక్కువైనట్లు తెలుస్తోంది. బ్యాంక్ అకౌంట్లు తెరవడం, ఫాస్టాగ్ వంటి ఆఫర్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే కొత్త కస్టమర్ల సంఖ్య బాగా పెరిగిందని సీఈఓ అనుబ్రత బిస్వాస్ తెలిపారు. అయితే, మరో పేమెంట్ బ్యాంక్ పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలతోనే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్కు యూజర్లు క్యూకట్టారా? లేదంటే ఇంకేవైనా కారణాలున్నాయా? అనేది తెలియాల్సి ఉంది. ఫిబ్రవరి 29 తర్వాత డిపాజిట్ల స్వీకరణ, ఫాస్టాగ్ కార్యకలాపాల్ని నిలిపివేయాలని ఆర్బీఐ పేటీఎంను ఆదేశించింది. అయితే, ఇది ఆర్బీఐ ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం కాదని, రెగ్యులేటరీ నిబంధనల్ని పేటీఎం పాటించకపోవడం వల్లే కఠిన చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. 5 నుంచి 7 రెట్లు పెరిగిన యూజర్లు అదే సమయంలో పేటీఎం యూజర్లు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ను వినియోగించుకునేందుకు పోటెత్తారు. ఫలితంగా లావాదేవీలు సంఖ్య పెరిగింది. ఫిక్స్డ్ డిపాజిట్లు, కరెంట్ అకౌంట్స్, యూపీఐ, ఫాస్టాగ్తో పాటు ఇతర సర్వీసుల్ని వినియోగించుకునే కస్టమర్ల సంఖ్య జనవరి నుంచి 5-7 రెట్లు ఎక్కువ చేరిందని సీఈఓ బిశ్వావ్ తెలిపారు. 59మిలియన్లకు పెరిగి ఇదిలా ఉండగా,ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ డిసెంబరు 2023 త్రైమాసికంలో రూ. 469 కోట్ల ఆదాయంలో వృద్ధిని కనబరించింది. దీంతో ఏడాది ప్రాతిపదికన 47 శాతం పెరిగి నికర లాభం రూ.11 కోట్లకు చేరిందని పేర్కొంది. సంవత్సరం క్రితంతో పోలిస్తే ఈ మొత్తం 120 వృద్దిని నమోదు చేసింది. బ్యాంక్ నెలవారీ లావాదేవీలు జరిపే యూజర్లు 59 మిలియన్లకు పెరిగారు. భారీ స్థాయిలో డిపాజిట్లు చేశారు. ఇది త్రైమాసికంలో సంవత్సరానికి 50 శాతం పెరిగి రూ.2,339 కోట్లకు చేరుకుంది. అంతకంతకూ ఎయిర్టెల్ ఆదాయం బ్యాంక్ గ్రాస్ మెర్చండైజ్ వ్యాల్యూ రూ. 2,62,800 కోట్లకు చేరింది. ఇక డెబిట్ కార్డ్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాతో సహా కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఇతర సేవల వల్ల.. కస్టమర్ల నుంచి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవల్ని వినియోగించుకున్నందుకు గాను ఎయిర్టెల్ ఆదాయం అంతకంతకూ పెరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. -
పేటీఎం, ఫాస్టాగ్పై ఆందోళనలు.. ఆర్బీఐ మరో కీలక నిర్ణయం!
ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎం సంక్షోభం నుంచి వినియోగదారులను సురక్షితంగా ఉంచేందుకు ఆర్బీఐ సిద్ధమైంది. ఇందులో భాగంగా వచ్చే వారం నేషనల్ హైవే అథారిటీ (ఎన్హెచ్ఏఐ), కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రతినిధులతో భేటీ కానుంది. ఈ సమావేశంలో పేటీఎంపై విధించిన ఆంక్షల నేపథ్యంలో ఆ సంస్థ యూజర్ల భద్రతపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ భేటీలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్(యూపీఐ) ద్వారా ఫాస్టాగ్ వ్యవస్థని నిర్వహిస్తున్న నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)తో పాటు ఇతర వాటాదారులు ఆర్బీఐ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. పేటీఎంపై ఆర్బీఐ గత వారం ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలపై పేటీఎం యూజర్లు ఫాస్టాగ్ గురించి, ఇతర చెల్లింపులు గురించి ఆర్బీఐని ప్రశ్నించారు. ఆ ప్రశ్నలన్నింటికి ఆర్బీఐ వచ్చే వారం ఎన్హెచ్ఏఐ, ఎన్సీపీఐతో భేటీ అనంతరం వివరణ ఇవ్వనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. టోల్ చెల్లింపుల కోసం ఫాస్టాగ్ మన దేశంలోని టోల్ వసూళ్ల కోసం కేంద్రం ఎలక్ట్రానిక్ పద్దతిలో ఫాస్టాగ్ వ్యవస్థని అందుబాటులోకి తెచ్చింది. దీన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ ఏ ఐ) నిర్వహిస్తోంది. ఫాస్టాగ్లోని రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా ఫాస్టాగ్కు అనుసంధానం చేసిన ప్రీ ప్రెయిడ్ లేదా సేవింగ్ ఖాతా నుంచి నేరుగా టోల్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తుంది. ఈ ఫాస్టాగ్ చెల్లింపులు పేటీఎం ద్వారా జరుగుతున్నాయి. కానీ సెంట్రల్ బ్యాంక్ పేటీఎంపై ఆంక్షలు విధించడంతో ఇప్పుడు ఫాస్టాగ్ యూజర్లు.. టోల్ చెల్లింపులపై ప్రత్యామ్నాయ మార్గాల్ని అందుబాటులోకి తీసుకుని రావాలని కోరుతున్నారు. -
ఏప్రిల్ నుంచి ఫాస్ట్ట్యాగ్లు పనిచేయవు! కారణం ఇదే..
టోల్ గేట్ల వద్ద వాహనదారులు వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి, త్వరితగతిన పేమెంట్స్ పూర్తి చేయడానికి ఫాస్ట్ట్యాగ్ విధానం అమలు చేశారు. ఈ విధానానికి కేంద్ర ప్రభుత్వం త్వరలో మంగళం పాడే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫాస్ట్ట్యాగ్ విధానం తొలగించడానికి ప్రధాన కారణం 'జీపీఎస్' బేస్డ్ విధానం అమలులోకి రావడమే. జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టెమ్ను ఏప్రిల్ నాటికి దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలో 2024 లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి, దీంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రానుంది. అంతకంటే ముందు దేశంలో ఈ జీపీఎస్ బేస్డ్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టెమ్ను అమలులోకి తీసుకురావడానికి నితిన్ గడ్కరీ కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రం కన్సల్టెంట్ను కూడా నియమించినట్లు సమాచారం. 2021లో ఫాస్ట్ట్యాగ్ అమల్లోకి వచ్చింది, అప్పటి నుంచి ప్రతి వాహననానికి తప్పనిసరిగా ఫాస్ట్ట్యాగ్ ఉండాలని కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం దాదాపు అన్ని వాహనాలకు ఫాస్ట్ట్యాగ్ ఆధారిత టోల్ వసూళ్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ తరువాత వీటన్నింటిని దశల వారీగా తొలగించనున్నట్లు చెబుతున్నారు. ఇదీ చదవండి: ఇష్టమైన జాబ్ పోయింది.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు - ఎలా అంటే? జీపీఎస్ బేస్డ్ విధానం అమలులోకి వచ్చిన తరువాత ఆటోమెటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నీషన్ సిస్టెమ్ ద్వారా టోల్ కట్ అవుతుంది. ఈ ప్రక్రియ మొత్తం శాటిలైట్తో ముడిపడి ఉంటుంది. టోల్ విషయంలో కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టాలనే ఉద్దేశ్యంతో కొత్త సిస్టం అమలుచేయడానికి కేంద్రం సిద్ధమైంది. -
FASTag: వాహనదారులకు గుడ్న్యూస్.. ఫాస్టాగ్ కేవైసీ గడువు పొడిగింపు
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వాహనదారులకు శుభవార్త చెప్పింది. రహదారి టోల్ వసూలుకు సంబంధించిన ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ గడువును పొడిగించింది. వాహనదారులు తమ ఫాస్టాగ్ అకౌంట్లకు ఫిబ్రవరి 29వ తేదీలోపు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ కోసం గతంలో విధించిన గడువు జనవరి 31తో ముగియగా ఎన్హెచ్ఏఐ మరోసారి పొడిగించింది. జాతీయ రహదారులపై సాఫీగా, నిరంతరాయమైన టోల్ చెల్లింపు అనుభవం కోసం సకాలంలో కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సిన ఆవశ్యకతను ఎన్హెచ్ఏఐ తెలియజేసింది. కమర్షియల్ లేదా ప్రైవేట్ వాహనాలు ఉన్నవారు ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థలో ఎలాంటి అంతరాయాలను నివారించడానికి వెంటనే కేవైసీ అప్డేట్ చేసుకోవడం చాలా అవసరం. ఫిబ్రవరి 29 గడువులోపు కేవైసీ వివరాలను అప్డేట్ చేయడంలో విఫలమైతే ఫాస్ట్ట్యాగ్ అకౌంట్ పనిచేయకుండాపోవచ్చు. కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు వాహన యజమానులు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, ఓటరు ఐడీ కార్డ్ వంటి ప్రూఫ్స్తో సహా నిర్దిష్ట పత్రాలను సమర్పించాలి. అదనంగా, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, పాస్పోర్ట్-సైజ్ ఫోటోగ్రాఫ్లు వంటివి చిరునామా రుజువు ప్రక్రియకు అవసరం. -
కేవైసీ అప్డేట్.. రేపే లాస్ట్ డేట్ - ఇలా అప్డేట్ చేసుకోండి
ఇప్పటికే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్ట్ట్యాగ్లను కేవైసీతో అప్డేట్ చేసుకోవాలని, దీని కోసం జనవరి 31ని తుది గడువుగా నిర్ణయించింది. ఎన్హెచ్ఏఐ ఇచ్చిన గడువు రేపటితో (జనవరి 31) ముగుస్తుంది. ఈ కథనంలో ఫాస్ట్ట్యాగ్ కేవైసీ చెక్ చేసుకోవడం ఎలా? అప్డేట్ చేయడం ఎలా? ఎందుకు అప్డేట్ చేసుకోవాలని అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం. ఫాస్ట్ట్యాగ్ కేవైసీ ఎలా చెక్ చేసుకోవాలంటే.. వినియోగదారుడు ముందుగా ఫాస్ట్ట్యాగ్కు సంబంధించిన అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. ఓటీపీ అథెంటికేషన్ పూర్తయిన తరువాత.. డాష్బోర్డ్లో 'మై ప్రొఫైల్' అనే సెక్షన్లో KYC స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సులభంగా ఇలా చెక్ చేసుకుని ఫాస్ట్ట్యాగ్ కేవైసీ అప్డేట్ అవ్వకపోతే.. అప్డేట్ చేసుకోవచ్చు. కేవైసీ అప్డేట్ ఎలా చేసుకోవాలంటే.. ఫాస్ట్ట్యాగ్ కేవైసీ చెక్ చేసుకున్న తరువాత.. పెండింగ్లో ఉన్నట్లు కనిపిస్తే.. కేవైసీ సబ్ సెక్షన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. దీని కోసం అవసరమైన ఐడెంటిటీ ప్రూఫ్.. వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ఫ్రూఫ్ వంటి వాటితో పాటు పాస్పోర్ట్ సైజు ఫోటో అవసరమవుతుంది. ఇవన్నీ సబ్మిట్ చేసిన తరువాత చెక్ చేసి, చివరిగా సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. తర్వాత 'కంటిన్యూ'పై క్లిక్ చేసి, ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి సబ్మిట్ చేస్తే కేవైసీ వెరిఫికేషన్ పూర్తవుతుంది. ఇదీ చదవండి: మంటల్లో కాలి బూడిదైన రూ.63 లక్షల ఎలక్ట్రిక్ కారు - వీడియో వైరల్ కేవైసీ అప్డేట్ఎందుకంటే.. కొందరు ఒకే ఫాస్ట్ట్యాగ్తో పలు వాహనాలను వినియోగిస్తున్నట్లు, మరి కొందరు కేవైసీ పూర్తి కాకుండానే ఫాస్ట్ట్యాగ్లను జారీ చేస్తున్నట్లు గుర్తించి, ఈ విధానికి చరమగీతం పాడాలని ఉద్దేశ్యంతో 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్ట్యాగ్' విధానానికి శ్రీకారం చుట్టారు. కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా ఫాస్ట్ట్యాగ్ వినియోగదారుడు KYC అప్డేట్ చేసుకోవాల్సిందే. -
ఫిబ్రవరి 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!
2024 ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ఆర్ధిక అంశాలకు సంబంధించిన అనేక మార్పులు ఉండనున్నాయి. బ్యాంకుల వడ్డీ రేట్లు, పథకాలకు సంబంధించిన కొన్ని మార్పులు జరుగుతాయి, ఇవన్నీ వచ్చే నెల ప్రారంభం నుంచే అమలులోకి వస్తాయి. ఈ కథనంలో ఫిబ్రవరి 1నుంచి ఎలాంటి అంశాలలో మార్పులు రానున్నాయో వివరంగా తెలుసుకుందాం. ఫాస్ట్ట్యాగ్ ఈ-కేవైసీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రకారం.. ఈ నెల చివరి (2024 జనవరి 31) నాటికి ఫాస్ట్ట్యాగ్ KYC అసంపూర్తిగా ఉంటే అలాంటి వాటిని డీయాక్టివేట్ చేసే అవకాశం ఉంది. 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్ట్యాగ్' ప్రచారంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికి దాదాపు 7 కోట్ల ఫాస్ట్ట్యాగ్లు జారీ చేసినట్లు, ఇందులో కేవలం 4 కోట్లు మాత్రమే యాక్టివ్గా కనిపిస్తున్నాయని చెబుతున్నాయి. అంతే కాకుండా 1.2 కోట్ల డూప్లికేట్ ఫాస్ట్ట్యాగ్లు వినియోగంలో ఉన్నట్లు సమాచారం. ఈ నెల చివరి నాటికి ఫాస్ట్ట్యాగ్ KYC పూర్తి కాకుంటే అలాంటి ఫాస్ట్ట్యాగ్లను డీయాక్టివేట్ లేదా బ్లాక్లిస్ట్ చేస్తారు. సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) 2023-24 సిరీస్ 4 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 2024లో 2023-24 సిరీస్లో సావరిన్ గోల్డ్ బాండ్ల(SGB) చివరి విడతను జారీ చేస్తుంది. సావరిన్ గోల్డ్ బాండ్ సిరీస్ 4 ఫిబ్రవరి 12న ప్రారంభమై.. ఫిబ్రవరి 16న ముగుస్తుంది. గత సిరీస్ డిసెంబర్ 18న ప్రారంభమై.. డిసెంబర్ 22కు ముగిసింది. నేషనల్ పెన్షన్ సిస్టం నిధుల పాక్షిక ఉపసంహరణ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) జనవరిలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద పెట్టుబడి పెట్టిన నిధులను పాక్షిక ఉపసంహరణకు సంబంధించిన మార్గదర్శకాలను హైలైట్ చేస్తూ ఒక మాస్టర్ సర్క్యులర్ను జారీ చేసింది. ఈ నిబంధనలు ఫిబ్రవరి 1, 2024 నుంచి అమలులోకి వస్తాయి. మొదటి ఇంటి కొనుగోలు లేదా నిర్మాణం కోసం మాత్రమే చందాదారులు పాక్షిక ఉపసంహరణలు చేసుకోవచ్చని పెన్షన్ బాడీ స్పష్టం చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్ రాయితీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం తన కస్టమర్లకు గృహ రుణ రాయితీలను అందిస్తోంది. హోమ్ లోన్ మీద ప్రాసెసింగ్ ఫీజులు, రాయితీలకు చివరి తేదీ జనవరి 31, 2024. ఫ్లెక్సీపే, ఎన్ఆర్ఐ, నాన్ శాలరీడ్, ప్రివిలేజ్, అపాన్ ఘర్ కస్టమర్లకు రాయితీ అందుబాటులో ఉంది. సిబిల్ స్కోర్పై ఆధారపడి గృహ రుణాల వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. ఇదీ చదవండి: ఐఫోన్ కొనుగోలుపై రూ.13000 డిస్కౌంట్! - పూర్తి వివరాలు ధన్ లక్ష్మి ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (PSB) 'ధన్ లక్ష్మి 444 డేస్' పేరుతో తీసుకు వచ్చిన ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ (FD) పథకానికి చివరి తేదీ జనవరి 31, 2024. ఈ స్కీమ్ లాస్ట్ డేట్ 2023 నవంబర్ 30 అయినప్పటికీ.. ఆ సమయంలో గడువును జనవరి 31 వరకు పొడిగించారు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టేవారు సాధారణ పౌరులైతే 7.4 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు 7.9%, సూపర్ సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు 8.05 శాతంగా ఉంటుంది. -
FASTag: వాహనదారులకు అలర్ట్.. ఫాస్ట్ట్యాగ్పై NHAI కీలక ప్రకటన
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి ఫాస్ట్ట్యాగ్ (FASTag) ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఫాస్ట్ట్యాగ్లను డీయాక్టివేట్ చేస్తామని ప్రకటించింది. ఫాస్ట్ట్యాగ్లను డీయాక్టివేట్ చేయడానికి కారణం ఏంటి? ఆలా జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలు ఇక్కడ చూసేద్దాం.. ఈ నెల చివరి (2024 జనవరి 31) నాటికి ఫాస్ట్ట్యాగ్ KYC అసంపూర్తిగా ఉంటే అలాంటి వాటిని డీయాక్టివేట్ చేసే అవకాశం ఉంది. 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్ట్యాగ్' ప్రచారంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్హెచ్ఏఐ ప్రకటించింది. NHAI ప్రకారం KYC జనవరి 31 నాటికి పూర్తి కాకుండా ఫాస్ట్ట్యాగ్లో బ్యాలెన్స్ ఉన్నా.. అలంటి వాటిని డీయాక్టివేట్ లేదా బ్లాక్ లిస్ట్లో పెట్టే అవకాశం ఉంది. సదరు వినియోగదారుడు తమ ఫాస్ట్ట్యాగ్ డీ యాక్టివేట్ కాకుండా ఉండాలంటే జనవరి 31 లోపల కేవైసీ చేయించుకోవాల్సిందే. ఫాస్ట్ట్యాగ్ అనేది వాహనాలకు తప్పనిసరి చేసినప్పటి నుంచి ఇప్పటి వరకులు ఎనిమిది కోట్ల మంది దీనిని వినియోగిస్తున్నారని తెలుస్తోంది. అయితే చాలామంది ఫాస్ట్ట్యాగ్ వినియోగదారులు వాహనం ముందు భాగంలో కాకుండా ఇష్టానుసారంగా అతికించుకోవడం వల్ల టోల్ ప్లాజాలో ఇతరులకు ఇబ్బందులు కలుగుతున్నాయి గతంలో వెల్లడించారు. ఇదీ చదవండి: 60 వేలమందికి మొబైల్ నెంబర్ ఇచ్చిన సీఈఓ - ఎందుకంటే? కొందరు ఒకే ఫాస్ట్ట్యాగ్తో పలు వాహనాలను వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వాటిని అరికట్టడానికి 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్ట్యాగ్' విధానానికి శ్రీకారం చుట్టారు. దీంతో తప్పనిసరిగా ఫాస్ట్ట్యాగ్ వినియోగదారుడు KYC చేసుకోవాల్సిందే. ఇది మాత్రమే కాకుండా కొందరు కేవైసీ పూర్తి కాకుండానే ఫాస్ట్ట్యాగ్లను జారీ చేస్తున్నారు. ఈ విధానికి కూడా జనవరి 31 తరువాత మంగళం పాడనున్నారు. -
ఫాస్టాగ్ అకౌంట్ల నుంచి జరిమానాలు కట్.. ట్రాఫిక్ ఉల్లంఘనుల ఆటకట్టు!
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారి ఆటకట్టించేందుకు బెంగళూరు పోలీసులు సూపర్ ఐడియా వేశారు. బెంగళూరు-మైసూరు ఎక్స్ప్రెస్వేలో ఓవర్ స్పీడ్తో వెళ్లే వాహనదారులకు వారి ఫాస్ట్ట్యాగ్ ఖాతాలను ఉపయోగించి జరిమానా విధించాలని ప్రతిపాదించారు. అతివేగం కారణంగా ఎక్స్ప్రెస్వేపై జరుగుతున్న ప్రమాదాలను అరికట్టడానికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు కొన్ని రోజులుగా పలు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వీటిలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆధారిత కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి సాయంతో రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, హెల్మెట్ లేకుండా రైడింగ్, వాహనం నడుపుతున్నప్పుడు స్మార్ట్ఫోన్ ఉపయోగించడం వంటి ఉల్లంఘనలను గుర్తిస్తున్నారు. ఇదీ చదవండి ➤ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్న వారికి షాక్! డిస్కౌంట్ డబ్బు వెనక్కి కట్టాలి? ఇక టూవీలర్లు, ట్రాక్టర్లు, ఆటోలు వంటి నెమ్మదిగా కదిలే వాహనాల వల్ల ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకుండా వాటిని ఎక్స్ప్రెస్వేపై వెళ్లకుండా నిషేధించారు. తాజాగా ఎక్స్ప్రెస్వేపై ఓవర్స్పీడ్కు కళ్లెం వేయడానికి వాహనాల ఫాస్ట్ట్యాగ్ ఖాతాల నుంచి జరిమానాలను వసూలు చేసేందుకు ప్రతిపాదించారు. ఈ ఆలోచన ఇంకా ప్రతిపాదన స్థాయిలో ఉండగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఇటువంటి ఆలోచనను అమలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తోంది. దీన్ని సమర్ధవంతంగా అమలు చేస్తే జరిమానా వసూలు సులభతరంగా మారుతుంది. వాహనాలను మాన్యువల్గా ఆపి జరిమానాలు విధించే అవసరం ఉండదు. అయితే నేరుగా ఫాస్ట్ట్యాగ్ ఖాతా ద్వారా జరిమానాలను వసూలు చేయడం అనేది ప్రధాన గోప్యతా సమస్యను లేవనెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫాస్ట్ట్యాగ్ ఖాతాల నుంచి వసూలు చేస్తున్న జరిమానాల మొత్తం ఎన్హెచ్ఏఐకి వెళుతోందని, అలా కాకుండా ప్రభుత్వానికి జమ చేయాలనేది తమ ప్రణాళిక అని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ పేర్కొన్నారు. -
ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్ట్యాగ్ వసూళ్ల రికార్డు
న్యూఢిల్లీ: ఫాస్ట్ట్యాగ్ సిస్టమ్ ద్వారా రోజువారీ టోల్ వసూళ్లు రూ.193.15 కోట్లకు చేరాయని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) మంగళవారం తెలిపింది. ఏప్రిల్ 29న ఒక్క రోజులో 1.16 కోట్ల లావాదేవీల ద్వారా ఈ రికార్డు నమోదయినట్లు పేర్కొంది. 2021 ఫిబ్రవరిలో ఫాస్ట్ట్యాగ్ విధానాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఫాస్టాగ్ లేని వాహనాల నుంచి రెట్టింపు టోల్ ఫీజులు వసూలు చేస్తోంది. అప్పటి నుంచి ఒక్క రోజులో ఫాస్టాగ్ ద్వారా ఇంత భారీ మొత్తంలో వసూళ్లు జరగడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమం కింద టోల్ ప్లాజాల సంఖ్యను 770 నుంచి 1,228కి పెంచినట్లు ఎన్హెచ్ఏఈ తెలిపింది. ఇందులో 339 రాష్ట్ర టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 6.9కోట్ల ఫాస్టాగ్ కార్డులను జారీ చేసినట్లు ఎన్హెచ్ఏఐ వెల్లడించింది.టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు కేంద్రం ఈ ఫాస్టాగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో అటవీ సందర్శకులకు గుడ్ న్యూస్.. ఇక దూసుకెళ్లడమే! -
తెలుగు రాష్ట్రాల్లో అటవీ సందర్శకులకు గుడ్ న్యూస్..
తెలుగు రాష్ట్రాల్లో అటవీ ప్రాంతాలను సందర్శించే వారి కోసం ఎన్హెచ్ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ అధికారులు, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అనుబంధ సంస్థ ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ తాజాగా ఒప్పందం చేసుకున్నాయి. రెండు సంస్థల మధ్య కుదిరిన ఈ అవగాహన ఒప్పందం అటవీ ప్రాంతంలోకి వాహనాలు ప్రవేశించే ప్రక్రియను సులభతరం చేయడానికి మార్గం సుగమం చేస్తుందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం.. ఫారెస్ట్ ఎంట్రీ పాయింట్ల వద్ద ఫాస్ట్ట్యాగ్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. టైగర్ రిజర్వ్లోని వివిధ ప్రవేశ ద్వారాల వద్ద వసూలు చేసే ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్ కోఆర్డినేషన్ (ఈఎంసీ) రుసుమును ఫాస్ట్ట్యాగ్ ద్వారా వసూలు చేయనున్నారు. ఫారెస్ట్ ఎంట్రీ పాయింట్ల వద్ద ఫాస్ట్ట్యాగ్ ఆధారిత చెల్లింపులను ప్రారంభించడం వల్ల వాహనాల సుదీర్ఘ క్యూలు, జాప్యాలను నివారించవచ్చు. తద్వారా సందర్శకులు అటవీ ప్రాంతాలలోని అందాలను, ఆహ్లాదకర వాతావరణాన్ని, వన్యప్రాణులను ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆస్వాదించవచ్చు. టోల్ ప్లాజాల వద్ద ఆటోమేటిక్ టోల్ చెల్లింపుల కోసం ఎన్హెచ్ఏఐ ఫాస్ట్ట్యాగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సాంకేతికత ఆధారంగా పనిచేస్తుంది. దేశంమంతటా అన్ని ఫోర్-వీలర్లు, భారీ వాహనాలకు ఫాస్ట్ట్యాగ్ తప్పనిసరి. -
ఫాస్టాగ్తో టోల్ కలెక్షన్ అదుర్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదార్లలో ఫాస్టాగ్ ద్వారా టోల్ వసూళ్లు గతేడాది రూ.50,855 కోట్లు నమోదయ్యాయి. 2021తో పోలిస్తే ఇది ఏకంగా 46 శాతం అధికం కావడం విశేషం. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ప్రకారం డిసెంబర్లో ఫాస్టాగ్ ద్వారా సగటున రోజుకు రూ.134.44 కోట్ల టోల్ ఫీజు వసూలైంది. గత నెల 24న గరిష్టంగా రూ.144.19 కోట్లు నమోదైంది. 2022లో ఫాస్టాగ్ లావాదేవీలు 48 శాతం అధికమై 324 కోట్లకు చేరుకున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 6.4 కోట్ల ఫాస్టాగ్స్ జారీ అయ్యాయి. ఫాస్టాగ్ ఆధారంగా ఫీజును స్వీకరించే టోల్ ప్లాజాల సంఖ్య 922 నుంచి గతేడాది 1,181కి చేరింది. -
పొగమంచుతో విమానాలకు ల్యాండింగ్ కష్టాలు
విమానాశ్రయం (గన్నవరం): దట్టమైన పొగమంచు రన్వే ప్రాంతాన్ని పూర్తిగా కప్పి వేయడంతో గన్నవరం విమానాశ్రయంలో గురువారం విమానాల ల్యాండింగ్కు ఇబ్బందులు ఎదురయ్యాయి. తొలుత హైదరాబాద్ నుంచి ఉదయం 7.35 గంటలకు వచ్చిన ఇండిగో విమానం రన్వేపై దిగేందుకు విజిబిలిటీ లేకపోవడంతో 40 నిమిషాలు గాలిలో చక్కర్లు కొట్టింది. అయినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచన మేరకు విమానం తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయింది. ఉదయం 8.15 గంటలకు న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం కూడా ల్యాండింగ్కు అనుకూలంగా లేకపోవడంతో అరగంట పాటు గాలిలో చక్కర్లు కొట్టింది. ఒకసారి రన్వేపై విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలెట్లు ప్రయత్నించినప్పటికి విజిబిలిటీ లేకపోవడంతో టేకాఫ్ తీసుకున్నారు. మరో ప్రయత్నంలో సురక్షితంగా విమానాన్ని ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. పొగమంచు ప్రభావం తగ్గిన తర్వాత హైదరాబాద్ తిరిగి వెళ్లిన ఇండిగో విమానం కూడా గన్నవరం ఎయిర్పోర్టుకి ఉదయం 10 గంటలు దాటిన తరువాత చేరుకుంది. ఫాస్టాగ్ సేవలు ప్రారంభం గన్నవరం విమానాశ్రయంలోని టోల్గేట్లో ఫాస్టాగ్ సేవలు గురువారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. రద్దీ సమయాల్లో టోల్గేట్ వద్ద ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఈ సేవలను వినియోగంలోకి తీసుకువచ్చారు. టోల్గేట్ వద్ద జరిగిన పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న విమానాశ్రయ ఇన్చార్జ్ డైరెక్టర్ పీవీ రామారావు ఈ సేవలను ప్రారంభించారు. -
వాహనదారులకు భారీ ఊరట?..ఫాస్టాగ్పై కోర్టులో పిటిషన్..అదే జరిగితే..
ఫాస్ట్ట్యాగ్ లేని వాహనాలకు రెట్టింపు టోల్ ట్యాక్స్ చెల్లించాలనే నిబంధనను తప్పనిసరి చేయడాన్ని సవాలు చేస్తూ రవీందర్ త్యాగి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై చీఫ్ జస్టీస్ సతీష్ చంద్ర శర్మ, జస్టీస్ సుబ్రమణియం ప్రసాద్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా...ఈ నిబంధన వివక్షపూరితంగా, ఏకపక్షంగా ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని చీఫ్ జస్టీస్ సతీష్ చంద్ర శర్మ బెంచ్ వాదించింది. వాహనదారులు ఫాస్టాగ్ వినియోగించకుండా నగదు రూపంలో చెల్లించినట్లయితే..వారి వద్ద నుంచి రెట్టింపు రేటుతో టోల్ వసూలు చేస్తున్నారనే పిటిషన్పై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ), కేంద్రం ప్రతిస్పందనను కోరింది. అధికారులు తమ ప్రత్యుత్తరాలను దాఖలు చేసేందుకు నాలుగు వారాల గడువు ఇచ్చిన హైకోర్టు..తదుపరి విచారణను ఏప్రిల్ 18న వాయిదా వేసింది. ఫాస్ట్ట్యాగ్ లేని వాహనదారుల నుంచి డబుల్ టోల్ ఛార్జీలు వసూలు చేసేలా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ ఆఫ్ ఇండియా(ఎంఓఆర్టీ అండ్ హెచ్), నేషనల్ హైవే అథారటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)తో కూడిన నేషనల్ హైవే ఫీజ్ అమాండ్మెంట్ రూల్స్ -2020 యాక్ట్ను రద్దు చేయాలని పిటిషన్ రవీందర్ త్యాగి కోరారు. చదవండి👉 పద్మభూషణ్ నుంచి.. కటకటాల్లోకి, ‘ఎంత పనిచేశావయ్యా అరవింద్’ ఈ నిబంధనలు, సర్క్యులర్ వల్ల టోల్ లేన్లను 100 శాతం ఫాస్ట్ట్యాగ్ లేన్లుగా మారుస్తున్నాయని, దీని ఫలితంగా ఫాస్ట్ట్యాగ్ లేని ప్రయాణికులు టోల్ మొత్తాన్ని రెట్టింపు చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పిటిషనర్, న్యాయవాది సైతం..టోల్ కంటే రెట్టింపు నగదు చెల్లించాల్సిన అవసరం ఉన్నందున తన కారులో ఫాస్ట్ట్యాగ్ పరికరాన్ని ఇన్స్టాల్ చేయవలసి వచ్చిందని పేర్కొన్నారు. ఫాస్ట్ట్యాగ్ను ఇన్స్టాల్ చేసే ముందు రెట్టింపు రేటుతో టోల్ ట్యాక్స్ చెల్లించానని చెప్పారు. ఢిల్లీ నుంచి హర్యానాలోని ఫరీదాబాద్ పర్యటనలో తాను చూసిన ప్రయాణికుల వేదనను ఆయన ప్రస్తావించారు. అంతేకాదు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (చట్టం ముందు సమానత్వం), 19 (వాక్ మరియు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ)లను ఉల్లంఘించడమేనని, డబుల్ టోల్ టాక్స్ వసూలు చేసే పద్ధతిని నిలిపివేయాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు. కాగా, ఈ పిటిషన్పై కేంద్రం సానుకూలంగా స్పందింస్తే డబుల్ టోల్ ట్యాక్స్ రద్దు చేయడం లేదంటే.. ఫాస్టాగ్ను వినియోగించేలా మరింత సమయం ఇచ్చే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే డబుల్ టోల్ ఛార్జీల నుంచి వాహనదారులకు ఊరట లభించనుంది. డబుల్ టోల్ ఛార్జీలు టోల్ గేట్ల వద్ద వాహనదారులు గంటల తరబడి వేచి ఉంచే సమయాన్ని తగ్గించేందుకు కేంద్రం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) తరహాలో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ (ఫాస్టాగ్)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఫిబ్రవరి 14, 2021న ఫాస్టాగ్ విషయంలో వాహనదారులకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. నేటి అర్ధరాత్రి నుంచి వాహనదారులకు ఫాస్టాగ్ తప్పని సరిగా వినియోగించాలని, లేదంటే రెట్టింపు టోల్ పే చెల్లించాల్సిందే. వాహన దారులు తప్పని సరిగా ఫాస్టాగ్ విధానంలోకి మారాల్సిందేనని కేంద్ర రవాణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వాహన యజమానులు వెంటనే ఫాస్టాగ్ తీసుకోవాలని సూచించింది. చదవండి👉 టోల్ప్లాజా, ఫాస్టాగ్ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు! -
టోల్ప్లాజా, ఫాస్టాగ్ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు!
టోల్ ప్లాజాల వద్ద పొడవైన క్యూలను నివారించేందుకు కేంద్రం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) తరహాలో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ (ఫాస్టాగ్)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సాంప్రదాయ టోల్ వసూళ్ల విషయంలో కేంద్రం మార్పులు చేయాలని భావిస్తోంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలపై నంబర్ ప్లేట్లను గుర్తించేలా కెమెరా ఎయిడెడ్ టోల్ కలెక్షన్ సిస్టమ సాంకేతికతను ఉపయోగించనుంది. ఇందుకోసం ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్ (ఏఎన్పీఆర్) కెమెరాలను అమర్చనుంది. నిరీక్షణ తప్పనుంది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ (ఎంఓఆర్టీహెచ్) శాఖ టోల్ ప్లాజాల వద్ద చెల్లింపుల కోసం వాహనాలు నిరీక్షించే సమయాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ఈ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. మరి ఫాస్టాగ్ ప్రస్తుతం, దేశం అంతటా దాదాపు 97 శాతం టోల్ వసూలు ఫాస్టాగ్ ద్వారా జరుగుతున్నాయి. అయినప్పటికీ టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉందని, వాహనాల రాకపోకలు నిలిచిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంఓఆర్టీహెచ్ తెలిపింది. ఈ ఏఎన్పీఆర్ కెమెరాలను సెటప్ చేయడం వల్ల టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించవచ్చు’ అని సూచించింది. ఏఎన్పీఆర్ ఎలా పనిచేస్తుంది? కేంద్ర హైవే రవాణా శాఖ వివరాల ప్రకారం..దేశంలో జాతీయ ప్రధాన రహదారుల్లో ఉన్న టోల్ గెట్లను తొలగించి...వాటి స్థానంలో లేటెస్ట్ టెక్నాలజీ ఏఎన్పీఆర్ కెమెరాల్ని ఇన్ స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఈ సాంకేతికత వాహనం నంబర్ ప్లేట్ మీద నెంబర్ను చదివి, సదరు వాహన యజమాని లింక్ ఫోన్ నెంబర్కు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుంచి టోల్కు చెల్లించాల్సిన అమౌంట్ను డిడక్ట్ చేస్తుంది. వాహనాల నంబర్ ప్లేట్ల ఫోటోను క్యాప్చర్ చేయడానికి సిస్టమ్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏఎన్పీఆర్ కెమెరాలతో సన్నద్ధం చేస్తుంది. ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు కెమెరా వాహనదారుడి బ్యాంక్ ఖాతా నుండి టోల్ మొత్తాన్ని వసూలు చేసేలా సిస్టమ్కు సిగ్నల్ ఇస్తుంది. ఏఎన్పీఆర్ సమర్థవంతంగా పనిచేస్తుందా? ఏఎన్పీఆర్తో టోల్ గేట్ల వద్ద రద్దీని తగ్గిస్తామని కేంద్రం చెబుతున్నప్పటికీ..దీనిపై అనేక సందేహాలు వ్యక్త మవుతున్నాయి. ఈ పద్దతిలో 2019 తర్వాత కేటాయించిన నెంబర్ ప్లేట్లను మాత్రమే గుర్తించే అవకాశం ఉంది. ఎందుకంటే, భారత ప్రభుత్వం 2019లో ప్రయాణీకుల వాహనాలకు ఓఈఎం (Original Manufacturer Number ) నెంబర్ను అమలు చేసింది. కెమెరాలు ఈ కంపెనీ అమర్చిన నంబర్ ప్లేట్లను మాత్రమే చదవగలవు. దీంతో పాటు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్ (ఏఎన్పీఆర్ ) కెమెరాలు నంబర్ ప్లేట్ తొమ్మిది అంకెల రిజిస్ట్రేషన్ నంబర్ను మించి ఉన్నప్పుడు చదవడం సవాలుగా మారనుంది. దేశంలో చాలా మంది వాహన యజమానులు నంబర్ ప్లేట్పై పేర్లు రాస్తుంటారు. దీని వల్ల సదరు నెంబర్ ప్లేట్లను గుర్తించడం కష్టం నెంబరు ప్లేట్లు మురికిగా ఉంటే వాటిని గుర్తించలేం. అలాంటి వాహనాలకు టోల్ వసూలు చేయడం చాలా కష్టం. అలాగే, ఏఎన్పీఆర్ కింద టోల్ చెల్లించకుండా టోల్ ప్లాజాలను దాటేందుకు ప్రయత్నించే వాహన యజమానులకు జరిమానా విధించే నిబంధన లేదు. -
కస్టమర్ల కోసం ఎస్బీఐ సరికొత్త సేవ.. ఒక్క మెసేజ్ పెడితే చాలు..
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(SBI) మరో సేవను తన కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం ఒక మెసేజ్తో ఫాస్టాగ్( FASTag) బ్యాలెన్స్ను చెక్ చేసుకునే సర్వీసును లాంచ్ చేసింది. దీని ద్వారా ఎస్బీఐ కస్టమర్లు ఫాస్టాగ్( FASTag) బ్యాలెన్స్ను సెకన్లలో తెలుసుకోగలుగుతారు. అందులో.. ఫాస్ట్ట్యాగ్ని ఉపయోగించే ఎస్బీఐ కస్టమర్లు వారి రిజిస్టర్ అయిన నంబర్ నుంచి 7208820019కి ఎస్ఎంఎస్ (SMS) పంపడం ద్వారా వారి ఫాస్ట్ట్యాగ్ బ్యాలెన్స్ను తెలుసుకోవచ్చని తెలిపింది. అయితే దీని కోసం ఎస్బీఐ కస్టమర్లు తమ మొబైల్ నెంబర్ను బ్యాంకు వద్ద రిజిస్టర్ చేసుకుని ఉండాలి. టోల్ గేట్ల వద్ద వాహనదారుల సమయం వృథా కాకుండా.. వారి సేవింగ్స్ అకౌంట్ల నుంచే నేరుగా నగదు కట్టేలా కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ సర్వీసులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా చేస్తే చాలు సెకనులో.. మీ వాహనంలో ఇన్స్టాల్ చేసిన ఫాస్టాగ్ బ్యాలెన్స్ వివరాలు.., మీరు FTBAL అని వ్రాసి 7208820019 నంబర్కు ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. అదే సమయంలో, మీకు చాలా వాహనాలు ఉంటే అప్పుడు మీరు FTBAL అని వ్రాసి 7208820019కి పంపాలి. Dear SBI FASTag Customer, send an SMS to 7208820019 from your registered mobile number to quickly know your SBI FASTag balance. #SBIFastag #SBI #AmritMahotsav pic.twitter.com/mDQQgDl7Mv — State Bank of India (@TheOfficialSBI) September 10, 2022 చదవండి: టెక్నాలజీ అంటే ఇష్టం.. రూ.13వేల ఖర్చు, పాత ఇనుప సామగ్రితో బైక్! -
బుడ్డోడి చేతికి స్మార్ట్ వాచ్..ఫాస్టాగ్తో అకౌంట్లలో మనీని దొంగిలించవచ్చా?
టోల్ ప్లాజాల వద్ద పొడవైన క్యూలను నివారించేందుకు కేంద్రం ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ (ఫాస్టాగ్)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనివల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురి కాకుండా ఈజీగా టోల్ పేమెంట్ చేయోచ్చు. అయితే ఇప్పుడీ ఫాస్టాగ్ పేమెంట్ విషయంలో సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ బాలుడు ఫాస్టాగ్ స్టిక్కర్ అంటించి ఉన్న కారు అద్దాలు తుడిచేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఆ సమయంలో తన చేతికి ఉన్నవాచ్ను..ఆ ఫాస్టాగ్ స్టిక్కర్ మీద ట్యాప్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో అనుమానం వచ్చిన కారులోని ప్రయాణికులు సదరు బాలుడ్ని " ఏం చేస్తున్నావు. ఇటు రా అంటూ" పిలుస్తారు. దీంతో కారు అద్దం తుడుస్తున్న బాలుడు..కారు యజమానికి దగ్గరికి రాగా..ఫాస్టాగ్ స్టిక్కర్ మీద ఎందుకు ట్యాప్ చేస్తున్నావు? అని ఆ వాచ్ గురించి అడగ్గా.. బాలుడు సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళతాడు. A video is spreading misinformation about Paytm FASTag that incorrectly shows a smartwatch scanning FASTag. As per NETC guidelines, FASTag payments can be initiated only by authorised merchants, onboarded after multiple rounds of testing. Paytm FASTag is completely safe & secure. pic.twitter.com/BmXhq07HrS — Paytm (@Paytm) June 25, 2022 ఆ బాలుడిని పట్టుకునేందుకు కారులో ఉన్న ప్రయాణికుడు వెంబడిస్తాడు. కానీ ఆ బాలుడు తప్పించుకోవడంతో వెంబడించిన వ్యక్తి నిరాశతో తిరిగి వచ్చి ఇదంతా ఫాస్టాగ్ స్కామ్, ఆ బాలుడిని ఉద్దేశిస్తూ.. ఇలాంటి వారు కారు అద్దాలు తుడుస్తూ స్మార్ట్ వాచ్తో ఫాస్టాగ్ ద్వారా డ్రైవర్లు, యజమానుల బ్యాంక్ అకౌంట్లలో ఉన్న మనీని కాజేస్తారని ఆరోపిస్తాడు. ఫాస్టాగ్ అనేది ఫాస్టాగ్ అనేది ప్రీపెయిడ్ రీఛార్జబుల్ ట్యాగ్ సర్వీస్. దీంతో కారు డ్రైవర్లు లేదా, యజమానులు టోల్ ప్లాజాల వద్ద ఆటోమెటిక్ పేమెంట్ చేసేందుకు ఉపయోగపడుతుంది. టోల్ గేట్ల వద్ద కారు ముందు అద్దానికి దగ్గరలో అంటించిన స్కానర్పై ట్యాప్ చేస్తే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) టెక్నాలజీతో సదరు ఫాస్టాగ్ అకౌంట్లో నుంచి ఆటోమెటిగ్గా డబ్బులు డిడక్ట్ అవుతాయి. ఇప్పుడీ బాలుడు కూడా ఆ స్కానర్పై వాచ్తో ట్యాప్ చేశాడని, అలా చేయడం వల్ల డబ్బులు అకౌంట్ల నుంచి ట్రాన్స్ఫర్ అవుతాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇది నిజమా? కాదా? అయితే ఇది నిజమా? కాదా? అని ప్రశ్నిస్తూ ఐఏఎస్ అధికారి అవానిష్ శరాణ్ ఆ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుండగా..ఫాస్టాగ్ సర్వీసుల్ని అందిస్తున్న పేటీఎం ఆ వీడియోపై స్పందించింది. స్పందించిన పేటీఎం వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఏమాత్రం వాస్తవం లేదని పేటీఎం కొట్టి పారేసింది.నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ప్రకారం(ఎన్ఈటీసీ)..ఫాస్టాగ్ చెల్లింపులు చాలా సురక్షితం. ఫాస్టాగ్ లావా దేవీలు పూర్తిగా రిజిస్టర్డ్ మర్చంట్లు మాత్రమే స్కాన్ చేసుకోవచ్చు. మినహాయించి ఎవరు చేసినా ఆ బార్ కోడ్లు స్కాన్ చేయలేవు అంటూ వివరణ ఇచ్చింది. -
ఫాస్ట్ ట్యాగ్ చరిత్రలో రికార్డు స్థాయి వసూళ్లు..!
న్యూఢిల్లీ: 2019-20 ముందు సంవత్సరంతో పోలిస్తే ఏప్రిల్ 2021 నుంచి జనవరి 2022 మధ్య కాలంలో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ ఫాస్ట్ ట్యాగ్ ద్వారా సేకరించిన ఆదాయం 148% పెరిగినట్లు కేంద్ర రోడ్డు & రవాణా మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఎఐ) 2016లో ఫాస్ట్ ట్యాగ్ ప్రవేశ పెట్టిన తర్వాత మొదటిసారి రికార్డు స్థాయిలో ఈ ఏడాది ₹26,622.93 కోట్ల టోల్ వసూలైంది. 2022-23 సంవత్సరంలో ఫాస్ట్ ట్యాగ్ ద్వారా టోల్ సేకరణ రూ.35,000 కోట్ల వరకు పెరుగుతుందని ఆ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ ఫాస్ట్ ట్యాగ్ ద్వారా ఎన్హెచ్ఎఐ 2019-20లో ₹10,728.52 కోట్లు ఆర్జించింది. ఈ టోల్ వసూళ్లు 2020-21లో ₹20,837.08 కోట్లకు చేరుకున్నట్లు పేర్కొంది. జనవరి 31 వరకు 45 మిలియన్లకు పైగా ఫాస్ట్ ట్యాగ్లు జారీ చేసినట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం పార్లమెంటులో తెలిపారు. 2025 నాటికి ₹50,000 కోట్లను టోల్ ద్వారా సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిందని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి గిరిధర్ అరామానే తెలిపారు. ఫిబ్రవరి 5 నాటికి 1.2 మిలియన్ ఫాస్ట్ ట్యాగ్ రీఫండ్ కేసులను జనవరి 202 నుంచి పరిష్కరించినట్లు గడ్కరీ రాజ్యసభకు తెలిపారు. 2020-21 వరకు సుమారు ₹3,36,661 కోట్ల విలువైన హైవే ప్రాజెక్టులను మంత్రిత్వ శాఖ మంజూరు చేసినట్లు గడ్కరీ ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 2020లో జాతీయ రహదారులపై జరిగిన 1,16,496 రోడ్డు ప్రమాదాల్లో 47,984 మంది మరణించారని ఆయన తెలిపారు. (చదవండి: శాలరీ రూ.7.3లక్షలు!! విద్యార్ధులకు టీసీఎస్ బంపరాఫర్!) -
భారీగా పెరిగిన టోల్ వసూళ్లు.. రోజుకు రూ. 4 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఫాస్టాగ్ తప్పనిసరి కావడం, ఇంటి దొంగల ఆట కట్టు కావటంతో జాతీయ రహదారులపై టోల్ రూపంలో భారీగా ఆదాయం వచ్చిపడుతోంది. ఇంతకాలం జవాబుదారీ విధానం లేకపోవటంతో ఎన్ని వాహనాలు టోల్ప్లాజాలను దాటుతున్నాయి, వాటి ద్వారా ఎంత ఆదాయం వస్తోంది.. సరైన లెక్కాపత్రం లేకుండా పోయింది. సిబ్బంది హస్తలాఘవం బాగా ఉండటంతో దాదాపు సగానికి సగం మొత్తం గాయబ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు వారి ప్రమేయం లేకుండా ఫాస్టాగ్ ద్వారా టోల్ రుసుము ఆటోమేటిక్గా వసూలవుతుండటంతో భారీ మొత్తం జమవుతోంది. ఇంతకాలం ఫాస్టాగ్ లేని వాహనాల సంఖ్య కూడా గణనీయంగా కనిపిస్తూండేది. కానీ గత రెండు మూడు నెలల్లో ఫాస్టాగ్ పొందిన వాహనాల సంఖ్య గరిష్టస్థాయికి చేరింది. తాజా లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలోని జాతీయ రహదారుల మీద పరుగుపెడుతున్న వాహనాల్లో 98 శాతం వాహనాలకు ఫాస్టాగ్ ఉంది. దీంతో నిత్యం రాష్ట్రంలోని 27 టోల్ కేంద్రాల ద్వారా రూ.మూడున్నర కోట్ల నుంచి రూ.నాలుగు కోట్ల వరకు ఆదాయం నమోదవుతుండటం విశేషం. ఫాస్టాగ్ తప్పనిసరితో.. మూడేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చింది. కానీ గతేడాది ఫిబ్రవరి నుంచి తప్పనిసరి చేసింది. ఫాస్టాగ్ లేని వాహనం వస్తే అప్పటికప్పుడు ట్యాగ్ కొని అతికించుకోవటమో, లేదా రెట్టింపు రుసుమును పెనాల్టీగా చెల్లించి ముందుకు వెళ్లటమో, లేదా వెనుదిరిగి వెళ్లిపోవటమో చేయాల్సిన పరిస్థితిని గత ఫిబ్రవరి నుంచి అమలులోకి తెచ్చారు. దీంతో వాహనదారులందరూ ఫాస్టాగ్ కొనుగోలు చేయటం ప్రారంభించారు. తాజాగా.. సంక్రాంతి ప్రయాణాల కోసం ఎక్కువ మంది ఫాస్టాగ్ కొనేశారు. ప్రస్తుతం 98 శాతం వాహనాలకు ట్యాగ్ కనిపిస్తోంది. -
వాణిజ్య భవనాలు, నివాస సముదాయాల్లో ఫాస్టాగ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చాలా మందికి ఫాస్టాగ్ చెల్లింపులు అంటే టోల్గేట్ ఫీజు వేగంగా చెల్లించే విధానంగానే పరిచయం. కానీ ఇప్పుడు ఫాస్టాగ్ విధానాన్ని అనేక కమర్షియల్, రెసిడెన్షియల్ కాంప్లెక్సులలో కూడా అమలు చేస్తున్నారు. ఈ సేవలు మరింత సమర్థంగా సులువుగా అందించేందుకు వీలుగా ఎయిర్టెల్ సంస్థ రంగంలోకి దిగింది. పార్కింగ్ ఫీజుల చెల్లింపు విభాగంలో అగ్రగామిగా ఉన్న పార్క్ ప్లస్తో జట్టుకట్టింది. ఇందులో భాగంగా వాణిజ్య భవనాలు, నివాస సముదాయాల్లో ఫాస్టాగ్ ఆధారిత స్మార్ట్ పార్కింగ్ సేవలను విస్తరిస్తారు. దేశవ్యాప్తంగా పార్క్ ప్లస్ యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్స్ 1,500 సొసైటీలు, 30కిపైగా మాల్స్, 150 పైచిలుకు కార్పొరేట్ కార్యాలయాల్లో వినియోగిస్తున్నారు. ఫాస్టాగ్ జారీలో దేశంలో టాప్–5లో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ నిలిచింది. వేచి ఉండక్కర్లేదు దేశవ్యాప్తంగా చాలా కమర్షియల్ కాంప్లెక్సులో మెట్రో సిటీల్లో అనేక రెసిడెన్షియల్ కాంప్లెక్సుల్లో పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ పార్కింగ్ ప్లేస్లో ఫీజు చెల్లింపు సేవలను పార్క్ వన్ సంస్థ అందిస్తోంది. తాజాగా ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్తో జత కట్టింది. దీంతో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి నేరుగా పార్కింగ్ ఫీజును చెల్లింపు జరిగిపోతుంది. దీని వల్ల పార్కింగ్ ప్లేస్లో ఫీజు చెల్లింపు కోసం ఎక్కువ సమయం వేచి ఉండక్కర్లేదు. చదవండి: పార్కింగ్లోనూ ఫాస్టాగ్, ప్రారంభించిన పేటీఎం -
ఇంటి వద్దే కారు.. అయినా టోల్ కట్
సాక్షి, ద్వారకాతిరుమల: ఇంట్లోనే కారు ఉన్నా ఫాస్టాగ్ ద్వారా టోల్ వసూలు చేసినట్లు ఫోన్కు మెస్సేజ్ రావడంతో ద్వారకాతిరుమలకు చెందిన ఓ కారు యజమాని తెల్లబోయాడు. వివరాలిలా ఉన్నాయి. ద్వారకాతిరుమలకు చెందిన ఒబిలిశెట్టి గంగరాజుకుమార్ సెల్ఫోన్కు సోమవారం ఉదయం 11.23 గంటలకు ఒక మెసేజ్ వచ్చింది. దీనిని పరిశీలించగా, ఏపీ 37 సీఏ 4747 నంబర్ గల తన రెనాల్ట్ స్కాలా కారుకు ప్రకాశం జిల్లాలోని మేకలవారిపల్లి టోల్ ప్లాజా నుంచి ఫాస్టాగ్ ద్వారా రూ.40 లు టోల్ రుసుము కట్ అయ్యినట్లు అందులో ఉంది. అపార్ట్ మెంట్ లో తన ఇంటి వద్దే ఉన్న కారుకు అక్కడ టోల్ ఎలా కట్ చేశారో తెలియక అయోమయంలో పడ్డాడు. కనీసం కారు రోడ్డు మీదకు వెళ్లకుండా టోల్ రుసుము వసూలు చేయడంపై ఆందోళన వ్యక్తం చేశాడు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. కారు యజమానికి ఫాస్టాగ్ ద్వారా డబ్బులు కట్ అయినట్లు వచ్చిన మెసేజ్, అపార్ట్మెంట్లో ఉన్న కారు -
టోల్గేట్ బాదుడు.. అక్టోబరు ఫాస్టాగ్ వసూళ్లు రూ.3,356 కోట్లు
న్యూఢిల్లీ: పండుగ సీజన్లో ప్రయాణాలు ఊపందుకోవడం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడాన్ని సూచిస్తూ అక్టోబర్లో ఫాస్టాగ్ టోల్ లావాదేవీలు రికార్డు స్థాయిలో జరిగాయి. 21.42 కోట్ల లావాదేవీల ద్వారా రూ. 3,356 కోట్లు వసూలయ్యాయి. శనివారం ఒక్క రోజే ఏకంగా రూ. 122.81 కోట్లు ఫాస్టాగ్ టోల్ వసూళ్లు నమోదయ్యాయి. ఇది ఆల్–టైం గరిష్టం కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో అభివృద్ధి అంతా పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్లో జరుగుతోంది. దీంతో రోడ్డు అందుబాటులోకి వచ్చిన తర్వాత టోల్గేట్లు వస్తున్నాయి. సగటున ప్రతీ 50 కిలోమీటర్లకు ఒక టోల్గేట్ ఉంటోంది. దీంతో జాతీయ రహదారి ఎక్కితే చాలు టోల్ వలిచేస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వం సైతం ఫాస్టాగ్ పేరుతో ఆటోమేటిక్ టోల్ సిస్టమ్ని నిర్బంధగా అమలు చేస్తోంది. -
ఫాస్టాగ్: ప్రయోజనాలెన్నో.. సద్వినియోగం చేసుకుందాం
ఏఎన్యూ: జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారుల సమయం, శ్రమ ఆదా చేయడంతోపాటు సులభతరమైన నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి దేశ వ్యాప్తంగా ఫాస్టాగ్ను తప్పనిసరి చేసింది. దీంతో చాలా టోల్ ప్లాజాలు ఫాస్టాగ్ విధానాన్ని తప్పని సరిగా అమలు చేస్తుండగా, కొన్ని టోల్ ప్లాజాల వద్ద కొంత సడలింపునిచ్చి నగదు లావాదేవీలు జరపుతుండగా, మరికొన్ని పాజాల వద్ద ఫాస్టాగ్ లేని వాహనాలకు జరిమానా రూపంలో అధిక ఫీజులు కూడా వసూలు చేస్తున్నారని వాహన దారులు చెబుతున్నారు. ఫాస్టాగ్ పొందడం ఎలా.. ఫాస్టాగ్ను టోల్ ప్లాజాల వద్ద గుర్తింపు పొందిన బ్యాంకులు, వాలెట్ సంస్థలు టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాలు, లేదా ఫాస్టాగ్ సేవలకు అనుమతించిన జాతీయ బ్యాంకుల్లోనూ ఫాస్టాగ్ను వాహన దారుడు పొందవచ్చు. ఫాస్టాగ్ అనుమతి ఉన్న బ్యాంకులు, వాలెట్ సంస్థలు.. దేశ వ్యాప్తంగా 22 జాతీయ బ్యాంకులు పలు వాలెట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ సేవలకు అనుమతించింది. బ్యాంకుల్లో.. ఐసీఐసీఐ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐడీఎఫ్సీ, కరూర్ వైశ్యా బ్యాంక్, కోటక్ మహీంద్రా, ఐడీబీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సెస్ బ్యాంక్, కెనరా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సిటీ యూనియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆర్బీఎల్, సౌత్ ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్లతోపాటు ఎయిర్టెల్, పేటీఎం, ఈక్విటాస్, ఐహెచ్ఎంసీఎల్, పాల్ మర్చెంట్స్ వంటి వాలెట్లలో ఫాస్టాగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఫాస్టాగ్ పొందేందుకు ఏ పత్రాలు సమర్పించాలి... ఫాస్టాగ్ పొందేందుకు వాహనదారుడు తన వాహనానికి సంబంధించిన ఆర్సీ, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ జిరాక్స్లను సంబంధిత ధరఖాస్తుకు జత చేయాలి. సంబంధిత సంస్థ లేదా బ్యాంకు కేంద్రం వారు సంబంధిత పత్రాలను పరిశీలించిన వెంటనే ఫాస్టాగ్ జారీ చేస్తారు. రీఛార్జ్ ఎలా.. ఫాస్టార్ రీఛార్జ్ను వాహన దారుడు ప్రభుత్వం గుర్తించిన 22 బ్యాంకుల్లో ఏదైనా బ్యాంకులో ఖాతా కలిగి ఉంటే ఆ ఖాతాకు ఫాస్టాగ్ను జత చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతా నుంచి ఫాస్టాగ్ ద్వారా టోల్ ప్లాజా వద్ద ఆటోమేటిక్గా చెల్లింపులు చేయబడతాయి. లేదా ఫోన్ పే, గూగుల్ పే, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, టోల్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన ఫాస్టాగ్ కేంద్రాల ద్వారా ప్రీపెయిడ్ విధానంలో ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవచ్చు. చెల్లింపులు ఎలా జరుగుతాయి.. వాహన దారుడు దాటుటున్న టోల్ ప్లాజా వద్ద నిర్ధేశించిన టారిఫ్ను బట్టి ఫాస్టాగ్ ఎకౌంట్ నుంచి నగదు ఆటోమేటిక్గా కట్ అవుతుంది. సింగిల్ ప్రయాణమా, అప్ అండ్ డౌన్ కావాలా అనేది చెప్పాల్సినవసరం లేదు. ఒక సారి టోల్ ప్లాజా దాటుతుంటే సింగల్ జర్నీ క్రింద నిర్థేశించిన మొత్తం కట్ అవుతుంది. అదే వాహన దారుడు 24 గంటల లోపు మరలా అదే టోల్ గేట్ నుంచి తిరిగి వెనుకకు వెళితే సింగిల్ ప్రయాణంలో సగం మొత్తం మాత్రమే కట్ అవుతుంది. లోకల్ పాస్ విధానమూ అందుబాటులో... ఫాస్టాగ్ సౌకర్యం ఉన్న వాహన దారుడు తమకు దగ్గర్లోని టోల్ ప్లాజా వద్ద లోకల్ పాస్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. వాహనదారుడు ఆ టోల్ ప్లాజా నుంచి నిర్థేశించిన కిలోమీటర్లలోపు ప్రాంతంలో నివసిస్తున్నట్లు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, వాహనం ఆర్సీతోపాటు మూడు నెలల లోపు చెల్లింపులు జరిగిన గ్యాస్ బిల్లు వంటి అడ్రస్ ఫ్రూఫ్ జిరాక్సులను సంబంధిత టోల్ ప్లాజా వద్ద కేంద్రంలో సమర్పించాలి. లోకల్ పాస్ కోసం ఆ టోల్ ప్లాజా నిర్ధేశించిన మొత్తాన్ని చెల్లించాలి. లోకల్ పాస్ ఉన్న వాహనదారుడు నెలలో ఎన్నిసార్లయినా ఆ టోల్ప్లాజా నుంచి ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఐసీఐసీఐ ఫాస్టాగ్ లోకల్ పాస్ వినియోగదారులకు 11 నెలల ఆటో రెన్యువల్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. పదకొండు నెలల తరువాత మరలా నిర్ధేశిత పత్రాలు సమర్పించి ఆటో రెన్యువల్ పొందవచ్చు. లేదా టోల్ ప్లాజా వద్ద ఉన్న కేంద్రంలో ప్రతి నెలా ఒకటవ తారీఖు కల్లా నిర్ధేశించిన నగదు చెల్లించి మంత్లీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆటోరెన్యువల్ లోకల్ పాస్ సౌకర్యం ఉన్న ఫాస్టాగ్ వినియోగదారుడు ప్రతినెలా 27వ తేదీకల్లా తమ ఫాస్టాగ్ ఎకౌంట్లో నిర్ధేశించిన మొత్తం బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఒక వేళ ఆ ఎకౌంట్లో బ్యాలెన్స్ లేకపోతే ఆటోరెన్యువల్ జరగదు. -
పార్కింగ్లోనూ ఫాస్టాగ్, ప్రారంభించిన పేటీఎం
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్ సేవల సంస్థ పేటీఎం తాజాగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్తో కలిసి ఫాస్టాగ్ ఆధారిత పార్కింగ్ సర్వీసులు ప్రారంభించింది. వీటిని త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) తెలిపింది. కష్మీర్ గేట్ మెట్రో స్టేషన్లో ఏర్పాటు చేసిన ఈ తరహా విధానంలో ఫాస్టాగ్ స్టికర్ గల కార్లు.. పార్కింగ్ ఏరియాలోకి వచ్చినప్పుడు నగదు చెల్లించేందుకు ప్రత్యేకంగా కౌంటర్ దగ్గర ఆగాల్సిన అవసరం ఉండదని వివరించింది. ఇక ద్విచక్ర వాహనాల కోసం యూపీఐ ఆధారిత చెల్లింపుల విధానాన్ని కూడా అందుబాటులోకి తెచ్చినట్లు పీపీబీఎల్ తెలిపింది . చదవండి: ‘ఫాస్ట్’గా దోచేస్తున్నారు.. -
UPI Payments: ఆగస్టులో ఎంతమంది ఉపయోగించారంటే..
కరోనా కారణంగా డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగాయి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. రూరల్కు సైతం చేరడం, దాదాపు ఇంటికొక్కరు చొప్పున ఆన్లైన్ పేమెంట్లే చేస్తుండడంతో కోట్ల విలువైన చెల్లింపులు రోజూ జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆగష్టులో అన్ని పేమెంట్ యాప్ల నుంచి డిజిటల్ చెల్లింపులు రికార్డు స్థాయికి చేరుకోవడం విశేషం. యూపీఐ సంబంధిత లావాదేవీలు రికార్డు లెవెల్ను చేరుకున్నాయి. ఒక్క ఆగష్టు నెలలోనే 6.39 ట్రిలియన్ రూపాయల విలువైన చెల్లింపులు జరిగాయి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఒక ప్రకటన విడుదల చేసింది. ఆగష్టు నెలలో సుమారు 3.5 బిలియన్ల ట్రాన్జాక్షన్స్ యూపీఐ యాప్ చెల్లింపుల ద్వారా జరిగినట్లు తెలుస్తోంది. తద్వారా కిందటి నెలతో పోలిస్తే ట్రాన్జాక్షన్స్ రేటు 9.5 శాతం పెరగ్గా.. ట్రాన్జాక్షన్స్ విలువ 5.4 శాతం పెరిగింది. ►ఏప్రిల్ మే నెల మధ్య సెకండ్ వేవ్ ప్రభావంతో కొంతవరకు తగ్గినా.. తిరిగి మళ్లీ పుంజుకుంది. ఇక యూపీఐ మోడ్లో చెల్లింపులు జులైలో 3.24 బిలియన్ ట్రాన్జాక్షన్స్(జూన్తో పోలిస్తే 15.7 శాతం) జరగ్గా.. ఆగష్టులో అది మరింత పెరిగింది. 2016లో మొదలైన యూపీఐ సర్వీస్ చెల్లింపులు.. కరోనా కారణంగా పుంజుకున్నాయి. భారత్లో మొత్తం 50 థర్డ్పార్టీ యూపీఐ యాప్స్ ఉండగా.. అందులో ఫోన్పే(వాల్మార్ట్), గూగుల్పే(గూగుల్) ఆ తర్వాత పేటీఎం, అమెజాన్ పే.. డిజిటల్ మార్కెట్లో టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాయి. ►యూపీఐతో పాటు ఇమ్మిడియట్ పేమెంట్స్ సర్వీసెస్(IMPS) ద్వారా ఆగష్టులో 377.94 మిలియన్ ట్రాన్జాక్షన్స్ జరిగాయని, జులైతో పోలిస్తే అది 8.5 శాతం పెరుగుదలగా ఉందని, ట్రాన్జాక్షన్స్ విలువ 3.18 ట్రిలియన్ రూపాయలుగా పేర్కొంది. ►ఎన్పీసీఐ డెవలప్ చేసిన ఫాస్ట్ట్యాగ్(టోల్ కలెక్షన్ కోసం రూపొందించిన ప్రోగ్రాం).. ద్వారా ఆగష్టులో 201.2 మిలియన్ ట్రాన్జాక్షన్స్ జరగ్గా.. విలువ మూడువేల కోట్ల రూపాయలుగా ఉంది. అదే విధంగా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా 58.88 మిలియన్ ట్రాన్జాక్షన్స్ జరగ్గా.. వాటి విలువ పది వేల కోట్లకుపైనే ఉంది. చదవండి: అకౌంట్ లేకుండానే ఫిక్స్డ్ డిపాజిట్! -
Toll Gate: ‘ఫాస్ట్’గా దోచేస్తున్నారు..
సాక్షి, తిమ్మాపూర్(కరీంనగర్): ఫాస్టాగ్ పనిచేయడం లేదంటూ వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఘటన తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్గేట్ వద్ద ఆదివారం వెలుగు చూసింది. టోల్గేట్ వద్ద ఇటీవల ఫాస్టాగ్ ఏర్పాటు చేశారు. కొన్ని రోజులుగా ఫాస్టాగ్ పనిచేయడం లేదని నిర్వాహకులు వాహనదారుల నుంచి నేరుగా డబ్బులు తీసుకుంటున్నారు. ఆదివారం ఓ వాహనదారుడు డబ్బులు చెల్లించి కొంత దూరం వెళ్లిన తర్వాత అతడి ఫాస్టాగ్ ఖాతా నుంచి డబ్బులు కట్ అయినట్లు సెల్ఫోన్కు మెస్సేజ్ వచ్చింది. వెంటనే వెనక్కువచ్చి నిర్వాహకులను నిలదీశాడు. వారు సరైన సమాధానం చెప్పకుండా టోల్ప్రీ నంబర్కు ఫోన్చేసుకోండి. లేదంటే కౌంటర్లో వెళ్లి అడగండి అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. ఇంతలో మరో ఫాస్టాగ్ ఉన్న కారు వచ్చింది. సిబ్బంది అతడి నుంచి కూడా డబ్బులు వసూలు చేశారు. కాసేపటికే అతడి ఫోన్కు కూడా ఫాస్టాగ్ నుంచి డబ్బులు కట్ అయినట్లు మెస్సేజ్ వచ్చింది. అయినా సిబ్బంది సరిగా స్పందించలేదు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సాంకేతిక లోపంతో కొంతమందికి ఫాస్టాగ్ నుంచి డబ్బులు కట్ అయినట్లు మెస్సేజ్ వస్తోందని సిబ్బంది తెలిపారు. చదవండి: Petrol, diesel price today: కొనసాగుతున్న పెట్రో సెగ -
టోల్ గేట్ల వద్ద పసుపు గీతలు.. భారీగా క్యూ ఉంటే నో టోల్ ఫీజు..!
సాక్షి, హైదరాబాద్: పసుపు గీతలు.. టోల్గేట్ల వద్ద వాహనదారుల కష్టాల పరిష్కారానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) తాజాగా ముందుకు తెచ్చిన ప్రతిపాదన. ఈ పసుపు గీతలు టోల్ గేట్ల వద్ద వాహనాలు క్యూ ఏర్పడకుండా చేస్తాయని సంస్థ చెబుతోంది. సాధారణ రోజుల్లో సమస్య లేకున్నా.. పండగలు, రద్దీ ఎక్కువగా ఉండే ఇతర రోజుల్లో టోల్ గేట్ల వద్ద పెద్దయెత్తున వాహనాలు బారులు తీరుతూ గేటు దాటడం విసుగుగా మారుతోంది. ఇటీవల పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చిన ఫాస్టాగ్ కూడా దీనికి పూర్తిస్థాయి పరిష్కారం చూపలేకపోతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్హెచ్ఏఐ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచి్చంది. ఈ మేరకు మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలకు పంపింది. తెలంగాణ ఎన్హెచ్ఏఐ అధికారులు కూడా వీటిని అందుకున్నారు. కానీ దీని అమలు విషయంలో వారిలో కొంత అయోమయం నెలకొంది. ఫాస్టాగ్లో కోత పడదు జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద గేట్లను ఆనుకుని వంద మీటర్ల దూరంలో పసుపు రంగులో జీబ్రాలైన్స్ తరహా గీతలు ఏర్పాటు చేస్తారు. గేటు వద్ద ఆగే క్రమంలో ఈ వంద మీటర్ల దూరంలో ఉండే పసుపు రంగు గీతలకు మించి వాహనాలు బారులు తీరితే ఈ కొత్త విధానం అమలవుతుంది. అలాంటి సమయంలో పసుపు గీతలు ఉండే వంద మీటర్ల లోపు ఉన్న వాహనాలన్నింటినీ ఒకేసారి గేటు ఎత్తి ముందుకు వదులుతారు. అది కూడా ఎలాంటి టోల్ రుసుము వసూలు చేయకుండానే. అంటే ఫాస్టాగ్ మొత్తంలో ఎలాంటి కోతా పడదన్న మాట. అలా ఎప్పుడు పసుపు గీతలకు మించి క్యూలు ఏర్పడినా వదిలేయడం వల్ల భారీ క్యూలు ఏర్పడవనేది ఎన్హెచ్ఏఐ ఉద్దేశం. అలా అయితే టోల్ గేటు ఎందుకు? ఈ విషయమై స్థానిక అధికారుల్లో పూర్తిస్థాయి స్పష్టత లేదు. పసుపు రంగు గీత దాటి వాహనాలు క్యూగా ఏర్పడితే.. ముందున్న వాటిని గేటు ఎత్తి పంపించేస్తారు..సరే. కానీ అవి వెళ్లిన వెంటనే మళ్లీ వెనక క్యూ ఏర్పడితే వాటినీ అలాగే పంపాలి. అలా రద్దీ ఉన్న సమయంలో వంద మీటర్ల మేర వాహనాల వరస ఏర్పడటం సాధారణమేనని అధికారులు అంటున్నారు. అలా పంపుతూ అన్ని వాహనాలూ వదిలేస్తే ఇక టోల్ గేటు ఎందుకనేది అధికారుల ప్రశ్న. దీంతో దీనిపై ఢిల్లీ అధికారుల నుంచి స్పష్టత తీసుకున్నాక ఈ విధానం అమలులోకి తేవాలని భావిస్తున్నారు. -
ఇక టోల్ప్లాజాలు తొలగిస్తాం!
న్యూ ఢిల్లీ: ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్ప్లాజాలను పూర్తిగా తొలగిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపారు. టోల్ ప్లాజాల స్థానంలో పూర్తి జీపీఎస్ ఆధారిత టోల్ సేకరణను తీసుకొస్తున్నట్లు చెప్పారు. లోక్సభలో నితిన్ గడ్కరీ “వెహికల్స్ స్క్రాపింగ్ పాలసీ”పై ఒక ప్రకటన చేశారు. "ఒక సంవత్సరంలో దేశంలోని అన్ని టోల్ ప్లాజాలు తొలగిస్తామని సభా వేదికగా హామీ ఇస్తున్నా. అంటే ఇకపై జీపీఎప్ ఆధారంగా టోల్ వసూళ్లు చేపట్టనున్నాం. వాహనానికి ఉన్న జీపీఎస్ ఆధారంగా వాహనదారుల బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్ మొత్తాన్ని మినహాయించుకునే కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నాం’’ అని గడ్కరీ వివరించారు. ప్రస్తుతం 93 శాతం వాహనాలు ఫాస్ట్ ట్యాగ్ ఉపయోగించి టోల్ చెల్లిస్తున్నారు, మిగిలిన 7 శాతం మంది రెట్టింపు టోల్ చెల్లిస్తున్నప్పటికీ ఇంకా ఫాస్ట్ ట్యాగ్ తీసుకోలేదని పేర్కొన్నారు. ఫాస్ట్ ట్యాగ్స్ ఉపయోగించి టోల్ చెల్లించని వాహనాల కోసం పోలీసు విచారణకు ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. వాహనాల్లో ఫాస్ట్ట్యాగ్లు అమర్చకపోతే టోల్ దొంగతనం, జీఎస్టీ ఎగవేత కేసులు పెట్టనున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు. టోల్ ప్లాజాలలో నగదు చెల్లింపు రుసుమును సులభతరం చేసేందుకు ఫాస్ట్ ట్యాగ్స్ వ్యవస్థను దేశంలో మొదటి సారిగా 2016లో ప్రవేశపెట్టారు. 2021 ఫిబ్రవరి 16 నుంచి వాహనాలకు దేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్యాగ్ వ్యవస్థను తప్పనిసరి చేసింది. ఒకవేల ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే టోల్ ప్లాజాలలో రెట్టింపు టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కొత్త వాహనాల్లో ఫాస్ట్యాగ్లు అమర్చినట్లు గడ్కరీ చెప్పారు. పాత వాహనాలకు ఉచిత ఫాస్ట్యాగ్లను ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. చదవండి: 2020లోనూ స్టార్టప్లలో పెట్టుబడుల జోరు