first look launch
-
పల్లెటూరిలో నవ్వులు
మహేశ్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘బద్మాషులు’. శంకర్ చేగూరి దర్శకత్వంలో బి. బాలకృష్ణ, సి. రామశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ని రిలీజ్ చేశారు. ‘‘పల్లెటూరి నేపథ్యంలో సాగే హాస్యభరిత చిత్రం ‘బద్మాషులు’. ప్రతి సన్నివేశంలో కడుపుబ్బా నవ్వుకుని, ఆ అనుభూతిని నలుగురూ పంచుకునేలా ఉంటుంది. ఈ చిత్రంలోని ప్రతి పాత్ర నిజ జీవితంలో మనకి తారసపడే వారిలాగే ఉంటూ నవ్విస్తుంటుంది. పూర్తి వినోదంతో పాటు గొప్ప సందేశం ఇచ్చే సినిమా ఇది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: తేజ కూనూరు, కెమేరా: వినీత్ పబ్బతి. -
వీణా రావుకి ఈ అవకాశం రావడం అదృష్టం: నిర్మాత సుప్రియ
‘‘నా తొలి సినిమాని అశ్వినీదత్గారి బేనర్లోనే చేయాలి. కానీ అన్నపూర్ణ స్టూడియోస్లో నాగార్జునగారు డైరెక్టర్గా తొలి అవకాశం ఇచ్చారు. ఈ ఇద్దరూ నాకు చిరస్మరణీయులు. వారి కుటుంబం నుంచి వచ్చి, మహిళా శక్తులుగా ఎదిగారు సుప్రియ, స్వప్నా దత్. నేను కథానాయికగా పరిచయం చేస్తున్న తెలుగు అమ్మాయి వీణా రావు ఫస్ట్ లుక్ దర్శన్ని సుప్రియ, స్వప్న విడుదల చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను వీణా రావు మంచి కూచిపూడి డ్యాన్సర్. తనకి ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు ఉండాలి’’ అని డైరెక్టర్ వైవీఎస్ చౌదరి అన్నారు. తారక రామారావు హీరోగా, తెలుగు అమ్మాయి వీణా రావుని హీరోయిన్గా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి ఓ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే.న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్పై యలమంచిలి గీత ఈ చిత్రం నిర్మిస్తున్నారు. శనివారం హైదరాబాద్లో జరిగిన ప్రెస్మీట్లో వీణా రావు ఫస్ట్ దర్శన్ని నిర్మాతలు సుప్రియ యార్లగడ్డ, స్వ΄్నా దత్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా స్వప్నా దత్ మాట్లాడుతూ– ‘‘వీణారావు చాలా అందంగా ఉంది. తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా రావాల్సిన సమయం ఇది. చౌదరి అన్న ఈ విషయంలో ఓ అడుగు ముందుకేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు.సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ– ‘‘వైవీఎస్ చౌదరిగారు డైరెక్టర్గా తీసిన తొలి చిత్రం ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి’ చూసిన తర్వాత తాతగారు (అక్కినేని నాగేశ్వరరావు) చాలా సంతోషపడ్డారు. కొత్తవారిని పరిచయం చేయడంలో ఆయనెప్పుడూ ముందుంటారు. వీణా రావుకి ఈ అవకాశం రావడం అదృష్టం’’ అని చెప్పారు. ‘‘వీణా రావు ఫస్ట్ దర్శన్ని లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నగార్లకు థ్యాంక్స్’’ అన్నారు యలమంచిలి గీత. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి. -
సంక్రాంతికి మజాకా
సందీప్ కిషన్ హీరోగా నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రానికి ‘మజాకా’ అనే టైటిల్ ఖరారైంది. ఏకే ఎంటర్టైన్ మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ పతాకాలపై రాజేష్ దండా ఈ సినిమా నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా టైటిల్ని ప్రకటించి, ఫస్ట్లుక్ని విడుదల చేయడంతో పాటు సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.‘‘మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘మజాకా’. ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీగా అలరిస్తుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. రావు రమేశ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సహ–నిర్మాత: బాలాజీ గుత్తా. -
మహాశివరాత్రికి జటాధర
సుధీర్బాబు హీరోగా నటించనున్న ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం ‘జటాధర’. సూపర్ నేచురల్ ఫ్యాంటసీ అంశాలతో వెంకట్ కల్యాణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. హిందీలో ‘రుస్తుమ్, టాయ్లెట్: ఏక్ ప్రేమ్కథ, ప్యాడ్మ్యాన్, పరి’లాంటి చిత్రాలను నిర్మించిన ప్రేరణ అరోరాతో కలిసి శివిన్ నారంగ్, నిఖిల్ నందా, ఉజ్వల్ ఆనంద్లు ఈ సినిమాను నిర్మించనున్నారు.‘జటాధర’ను శనివారం ప్రకటించి, ఫస్ట్ లుక్ను విడుదల చేయడంతో పాటు ఈ సినిమాను వచ్చే ఏడాది మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు మేకర్స్. ‘‘ఈ చిత్రంలో సుధీర్బాబు ఓ పవర్ఫుల్ రోల్లో కనిపిస్తారు. త్వరలోనే షూటింగ్ ఆరంభిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
క్రైమ్... థ్రిల్
విశ్వంత్, శిల్పా మంజునాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘హైడ్ న్ సిక్’. బసిరెడ్డి రానా దర్శకత్వంలో నిశాంత్, ఎంఎన్ఓపీ సమర్పణలో సహస్ర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నరేంద్ర బుచ్చిరెడ్డి నిర్మించిన చిత్రం ఇది. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ను ఆవిష్కరించిన నటుడు శివాజీ మాట్లాడుతూ– ‘‘ఇటీవల ఇండస్ట్రీకి కొత్త ప్రతిభ ఎక్కువగా వస్తోంది.ఇది మంచి పరిణామం. ‘హైడ్ న్ సిక్’ సినిమాకు ప్రేక్షకులు విజయం చేకూర్చాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమా విజయం సాధిస్తుంది’’ అని తెలిపారు విశ్వంత్. ‘‘ఎన్ని కష్టాలొచ్చినా ఈ సినిమాను ఆపేది లేదని నిర్మాత భరోసా ఇచ్చారు. ఆ ధైర్యంతో ఈ సినిమాను పూర్తి చేశాం’’ అని పేర్కొన్నారు బసిరెడ్డి రానా. దర్శకులు మల్లి అంకం, ఆదిత్యా హాసన్, నవీన్ మేడారం అతిథులుగా హాజరై, ‘హైడ్ న్ సిక్’ విజయాన్ని ఆకాంక్షించారు. -
లవ్ స్కోర్ ఎంత?
లవ్ స్కోర్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నారు కృతీ శెట్టి. మరి... స్కోర్ ఎంత అంటే ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’లో చూడాలంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే... ‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. విఘ్నేష్ శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్, విఘ్నేష్ భార్య నయనతార ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాలోని ప్రదీప్ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. తాజాగా కృతీ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ను చూస్తుంటే 2035 సెప్టెంబరు 9న ఓ హై ఎండ్ టెక్నాలజీ మొబైల్ ఫోన్లో కృతీ శెట్టి లవ్ స్కోర్ను చెక్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీన్నిబట్టి భవిష్యత్లో సోషల్ మీడియా ప్రభావం, యువతీ యువకుల తీరు, మానవీయ సంబంధాలు వంటి అంశాలను ఈ చిత్రంలో దర్శకుడు విఘ్నేష్ ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. -
సమ్మర్లో ఎఫ్1 రేసింగ్
హాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రాడ్ పిట్ తాజా చిత్రంగా ‘ఎఫ్1’ ఖరారైంది. ‘ఓన్లీ ది బ్రేవ్, టాప్గన్: మేవరిక్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన జోసెఫ్ కొసిన్క్సి ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమాను తెరకెక్కించనున్నారు. ‘ఎఫ్1’ని అధికారికంగా ప్రకటించి, ఫస్ట్ లుక్ను విడుదల చేశారు మేకర్స్. ఫార్ములా వన్ రేసింగ్ నేపథ్యంలో ఓ రేసర్ కథగా ఈ సినిమా రూపొందనుంది. ఫార్ములా వన్ రేసింగ్లో ఉండే సవాళ్లు, రేసర్ల వ్యక్తిగత, వృత్తిపరమైన జీవన విధానాలను ఈ సినిమాలో చూపించనున్నారట జోసెఫ్. జెర్నీ బ్రూక్హైమర్, బ్రాడ్ పిట్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘ఎఫ్1’ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుంది. -
డబ్బు ఎవరిది?
ఇక్కడ రష్మికా మందన్నా చేతిలో ఉన్న పెద్ద సూట్ కేసును చూశారుగా! ఈ సూట్కేసు నిండా డబ్బు కట్టలే. ఈ సూట్కేసును రాత్రి వేళ తవ్వి బయటకు తీశారు రష్మిక. మరి... ఈ డబ్బు ఎవరిది? రష్మికా మందన్నా ఇంత రహస్యంగా డబ్బును ఎందుకు తవ్వి తీశారు? అనే విషయాలు ‘కుబేర’ సినిమాలో తెలుస్తాయి.నాగార్జున, ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా, జిమ్ సర్ఫ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ సోషల్ డ్రామాను సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. శుక్రవారం రష్మికా మందన్నా ఫస్ట్ లుక్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. -
ఫస్ట్ లుక్ చూసి ఆశ్చర్యపోతారు: వరుణ్ సందేశ్
‘‘నా 17 ఏళ్ల కెరీర్లో చేయని ఒక డిఫరెంట్ మూవీ ‘విరాజి’. ఈ చిత్రంలో ఓ క్రేజీ పాత్ర చేస్తున్నాను. ఈ నెల 10న విడుదల చేయనున్న ‘విరాజి’ ఫస్ట్ లుక్ చూడగానే అందరూ ఆశ్చర్యపోతారు. మీ అందరికీ తప్పకుండా నచ్చే సినిమా అవుతుంది. ఈ మూవీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని హీరో వరుణ్ సందేశ్ అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘విరాజి’. ఈ చిత్రంతో ఆద్యంత్ హర్ష దర్శకుడిగా పరిచయమవుతున్నారు.మహా మూవీస్తో కలిసి ఎమ్ 3 మీడియా బ్యానర్పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 2న రిలీజ్ కానుంది. మంగళవారం జరిగిన ‘విరాజి’ టైటిల్ ప్రకటన కార్యక్రమంలో ఆద్యంత్ హర్ష మాట్లాడుతూ– ‘‘విరాజి’కి చాన్స్ ఇచ్చిన మా మూవీ ప్రాజెక్ట్ హెడ్ సుకుమార్ కిన్నెర, నిర్మాత మహేంద్రగారు, వరుణ్ సందేశ్లకు కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘వరుణ్ సందేశ్ని కొత్త అవతారంలో చూపించే చిత్రమిది. మాలాంటి కొత్తవాళ్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ప్రేక్షకుల సపోర్ట్ కావాలి’’ అన్నారు మహేంద్రనాథ్ కూండ్ల. సంగీతదర్శకుడు ఏబీ నెజర్ పాల్ (ఏబీ), నటీనటులు ప్రమోదిని, రఘు కారుమంచి, ఫణి తదితరులు పాల్గొన్నారు. -
సింహాసనం దక్కాలి కానీ...
ఉత్పలదేవిగా మారిపోయారు మీరా జాస్మిన్. ఉత్పలదేవి దయాగుణం వల్ల రాణి కావాల్సిన ఆమెకు సింహాసనం దక్కదు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ‘శ్వాగ్’ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. శ్రీవిష్ణు హీరోగా హసిత్ గోలీ దర్శకత్వంలో ‘శ్వాగ్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో వింజమర వంశంలోని రాణి రుక్మిణి దేవిగా రీతూ వర్మ ఓ లీడ్ రోల్లో నటిస్తుండగా, మరో లీడ్ రోల్లో ఉత్పలదేవిగా మీరా జాస్మిన్ కనిపిస్తారు. ఆదివారం ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. -
ఆకట్టుకుంటున్న 'శివం భజే' ఫస్ట్ లుక్
అశ్విన్బాబు హీరోగా అప్సర్ దర్శకత్వంలో మహేశ్వర్ రెడ్డి మాలి నిర్మించిన చిత్రం ‘శివం భజే’. దిగంగనా సూర్యవన్షీ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, కాశీ విశ్వనాథ్ కీలక పాత్రల్లో నటించారు.తాజాగా ఈ సినిమా నుంచి అశ్విన్బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. సరికొత్త కథతో ఈ సినిమాను రూపొందించాం. త్వరలోనే ఈ సినిమా టీజర్, ట్రైలర్, రిలీజ్ డేట్ వివరాలను వెల్లడిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు వికాస్ బాడిస స్వరకర్త. -
సైంటిఫిక్ థ్రిల్లర్
శ్రీకాంత్ (శ్రీరామ్) ప్రధాన పాత్రలో సుగి విజయ్, రూపాలీ భూషణ్ జంటగా రూపొందిన చిత్రం ‘మాత్రు’. జాన్ జక్కీ దర్శకత్వంలో శ్రీ పద్మినీ సినిమాస్పై బి. శివప్రసాద్ నిర్మించారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్పోస్టర్ని రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ లాంచ్ చేసి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.‘‘యాక్షన్ సైంటిఫిక్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘మాత్రు’.పోస్ట్ ప్రోడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ని ప్రకటిస్తాం’’ అన్నారు మేకర్స్. అలీ, ఆమని ఇతర కీలక పాత్రలుపోషించిన ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: రాహుల్ శ్రీవాస్తవ్. -
‘లక్కీ భాస్కర్’తో దుల్కర్ అసాధారణమైన ప్రయాణం
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కెరీర్ ఆరంభమై పుష్కర కాలం అయింది. ఇన్నేళ్లల్లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వినూత్న చిత్రాలు, పాత్రలు చేస్తూ వస్తున్నారు దుల్కర్. ఇక పన్నెండేళ్లయిన సందర్భంగా దుల్కర్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’ ఫస్ట్ లుక్ని విడుదల చేశారు చిత్ర నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మీనాక్షి చౌదరి కథానాయిక. ‘‘ఈ చిత్రంలో మగధ బ్యాంక్లో క్యాషియర్గా పని చేసే దుల్కర్ లుక్ని విడుదల చేశాం. 1980ల నాటి బొంబాయి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఒక సాధారణ మనిషి తాలూకు అసాధారణమైన ప్రయాణమే ఈ సినిమా. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది’’ అని యూనిట్ పేర్కొంది. తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
తెలుగు, నేపాలీ భాషల్లో...
ప్రముఖ నటుడు బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్న తొలి తెలుగు, నేపాలీ చిత్రం ‘హ్రశ్వదీర్ఘ’. చంద్ర పంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హరిహర్ అధికారి, నీతా దుంగన లీడ్ రోల్స్ చేస్తున్నారు. నీతా ఫిలిమ్స్ ప్రోడక్షన్పై నీతా దుంగన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఫిబ్రవరి 1న బ్రహ్మానందం పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘హ్రశ్వదీర్ఘ’లోని ఆయన పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ని విడుదల చేయడంతో పాటు ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
సస్పెన్స్ బహుముఖం
హర్షివ్ కార్తీక్ హీరోగా నటించి, రచించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘బహుముఖం’. ‘గుడ్, బ్యాడ్ – యాక్టర్’ అనేది ట్యాగ్లైన్. క్రిస్టల్ మౌంటైన్ ప్రోడక్షన్స్పై రూపొందిన ఈ చిత్రంలో స్వర్ణిమా సింగ్, మరియా మార్టినోవా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం నుంచి హర్షివ్ కార్తీక్ ఫస్ట్ లుక్ని విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా హర్షివ్ కార్తీక్ మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్, డ్రామా, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘బహుముఖం’. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: అరవింద్ రెడ్డి, కెమెరా: ల్యూక్ ఫ్లెచర్, నేపథ్య సంగీతం: శ్రీచరణ్ పాకాల, సంగీతం: ఫణి కల్యాణ్. -
నవ్విస్తూ...భయపెడుతూ..
అంజలి టైటిల్ రోల్ చేసిన తాజా చిత్రం ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. ‘గీతాంజలి’ సినిమాకు ఇది సీక్వెల్. శ్రీనివాస్ రెడ్డి, ‘సత్యం’ రాజేశ్, ‘షకలక’ శంకర్, అలీ, సునీల్, సత్య ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. రచయిత–నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది ప్రథమార్ధంలో విడుదల కానుంది. శనివారం ఈ సినిమాలోని క్యారెక్టర్స్ను పరిచయం చేస్తూ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ– ‘‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అంతా ఒక ఎత్తైతే.. క్లైమాక్స్ మరో రేంజ్లో ఉంటుంది. ‘గీతాంజలి’ని ఫ్రాంచైజీగా చేస్తూ, కోనగారు ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ చేశారు. కోనగారి కామెడీ ట్రాక్, ఈ సినిమాను ఆయన డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. దర్శకుడు శివగారికి ఈ సినిమాతో పెద్ద బ్రేక్ వస్తుంది’’ అన్నారు. ‘‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’’ని అమెరికాలో చేద్దామనుకున్నాం. కొన్ని ్రపాక్టికల్ కారణాల వల్ల ఊటీ బ్యాక్డ్రాప్కి మార్చాం. ప్రేక్షకులు వారి అంచనాలకు మించి ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు కోన వెంకట్. ‘‘ప్రేక్షకులను భయపెడుతూ, నవ్విస్తూ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు శ్రీనివాస్ రెడ్డి. ‘‘బ్లాక్బస్టర్ మూవీ ‘గీతాంజలి’కి సీక్వెల్ చేసే అవకాశాన్ని కల్పించిన కోనగారికి, ఎంవీవీగారికి థాంక్స్’’ అన్నారు శివ తుర్లపాటి. నటుడు రవికృష్ణ, ఎడిటర్ చోటా కె. ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ సుజాత సిద్ధార్థ్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు మాట్లాడారు. -
వినోదాల పొట్టేల్
యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పొట్టేల్’. ‘బందం రేగడ్’, ‘సవారీ’ చిత్రాల ఫేమ్ సాహిత్ మోతుకూరి దర్శకత్వంలో నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్నారు. హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ఫస్ట్ ఇంపాక్ట్ లాంచ్ ఈవెంట్కు అతిథిగా హాజరైన నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ– ‘‘పొట్టేల్’ సినిమా ఫస్ట్ లుక్ వీడియో చాలా ఇంపాక్ట్ఫుల్గా అనిపించింది. ఈ సినిమా షూటింగ్ను చూసేందుకు సెట్స్కు వెళ్లాను. ప్రేక్షకులకు ఓ మంచి కథని చూపించడానికి టీమ్ చాలా కష్టపడి పని చేసింది. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చి, పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు. ‘‘వినోదంతో పాటు మంచి ప్రయోజనం కోసం చేసిన చిత్రమిది’’ అన్నారు యువ చంద్రకృష్ణ. ‘‘పొట్టేల్’ కథ రాసినప్పుడు ఎంత హై ఫీలయ్యానో అదే హై ఈ రోజు వరకూ వుంది. నిశాంక్, సురేష్ చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. యువ చంద్ర, అనన్య బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ చిత్రంలో అజయ్గారు కీ రోల్ చేశారు’’ అన్నారు సాహిత్ మోతుకూరి. ‘‘సినిమా అద్భుతంగా వచ్చింది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు నిశాంక్, సురేష్. ‘‘అందరూ గుర్తుంచుకునే చిత్రం అవుతుంది’’ అన్నారు అనన్య. -
శబ్దంతో థ్రిల్
దాదాపు పదిహేనేళ్లకు హీరో ఆది పినిశెట్టి–డైరెక్టర్ అరివళగన్–మ్యూజిక్ డైరెక్టర్ తమన్ల కాంబినేషన్ కుదిరింది. గతంలో ఈ ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఈరమ్’ (2009) మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో ‘వైశాలి’గా విడుదలైంది. ఇక తాజాగా వీరి కాంబోలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా ‘శబ్దం’ తెరకెక్కుతోంది. ఇది కూడా సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ కావడం విశేషం. 7ఎ ఫిలింస్ శివ, ఆల్ఫా ఫ్రేమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ని హీరో నాని విడదల చేశారు. ‘‘ఈ ‘శబ్దం’లో శబ్దానికి సంబంధించి ప్రత్యేక సన్నివేశాలు ఉంటాయి. ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసమే రూ. 2 కోట్లతో 120 ఏళ్ల నాటి లైబ్రరీ సెట్ను నిర్మించాం. ఈ సినిమా కోసం తమన్ ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్స్, ఆర్ఆర్ చేయడానికి హంగేరీకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు’’ అని యూనిట్ పేర్కొంది. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి కెమెరా: అరుణ్ పద్మనాభన్, సహనిర్మాత: భానుప్రియ శివ, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: ఆర్. బాలకుమార్. -
గ్యాంగ్స్టర్ రాక్షస రాజా
రానా హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ (2017) సూపర్ హిట్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ కాంబినేషన్లో రెండో చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. రానా పుట్టినరోజు (డిసెంబర్ 14) సందర్భంగా ఈ చిత్రం టైటిల్ని ‘రాక్షస రాజా’గా ప్రకటించి, రానా ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. ‘‘ఇప్పటివరకూ చూడని క్రైమ్ వరల్డ్ని ఆవిష్కరిస్తూ ఇంటెన్స్ ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామాల సమ్మేళనంతో ఈ చిత్రం ఉంటుంది. గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందించనున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఓ అద్భుతమైన అనుభూతికి గురి చేస్తుంది. గ్రిప్పింగ్ కథనం, వండర్ఫుల్ విజువల్స్తో ‘రాక్షస రాజా’ తెలుగు పరిశ్రమలో కొత్త బెంచ్ మార్క్ను సెట్ చేయడానికి రెడీ అవుతోంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
నవ్వుల నమో
విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి హీరోలుగా, విస్మయ శ్రీ హీరోయిన్గా నటించిన చిత్రం ‘నమో’. ఈ చిత్రం ద్వారా ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఎ. ప్రశాంత్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ను దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఆదిత్య నా దగ్గర అసిస్టెంట్గా చేశాడు. ఏదో చేయాలనే, నేర్చుకోవాలనే తపన తనలో ఉంది. ‘నమో’ పేరు వినగానే ప్రధాని నరేంద్ర మోదీగారి మీద కథ అనుకున్నాను. హీరోల పాత్రల పేర్లలోని (నగేశ్, మోహన్) తొలి అక్షరాలతో టైటిల్ పెట్టినట్లు చెప్పాడు. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘నమో’ ప్రేక్షకులు హాయిగా నవ్వుకునేలా ఉంటుంది’’ అన్నారు ఆదిత్య రెడ్డి కుందూరు. ‘‘ఇదొక వైవిధ్యమైన చిత్రం’’ అన్నారు విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి, విస్మయ. -
స్నేహానికి హద్దు లేదురా
ఆశిష్ గాంధీ, అశోక్, వర్ష, హ్రితిక హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘హద్దు లేదురా..’. రాజశేఖర్ రావి దర్శకత్వంలో వీరేష్ గాజుల బళ్లారి నిర్మించారు. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ని దర్శకుడు క్రిష్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘హద్దు లేదురా..’ టైటిల్ బాగుంది. ఫస్ట్ లుక్, సినిమా థీమ్ వైవిధ్యంగా ఉన్నాయి. సినిమా హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘అలనాటి కృష్ణార్జునులు స్నేహితులు అయితే ఎలా ఉంటారో తెలిపే కథ, కథనంతో ‘హద్దు లేదురా..’ రూ΄పొందింది. ఫైట్స్, పాటలు, సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు, క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అన్నారు రాజశేఖర్ రావి. ‘‘జనవరిలో మా సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు గాజుల వీరేశ్. ‘‘స్నేహం నేపథ్యంలో రూ΄పొందిన ‘హద్దు లేదురా..’ మా యూనిట్కి మంచి పేరు తీసుకొస్తుంది’’ అన్నారు ఆశిష్ గాంధీ. తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాత: రావి మోహన్ రావు. -
కిడ్నాప్ చేయడం ఓ కళ
చైతన్యా రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవికా సతీశన్ ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘పారిజాత పర్వం’. కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్ అనేది ట్యాగ్ లైన్ (కిడ్నాప్ చేయడం అనేది ఓ కళ). సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహిధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలయ్యాయి. ఒక పోస్టర్లో చైతన్యా రావు, సునీల్, శ్రద్ధా దాస్, శ్రీకాంత్ అయ్యంగార్లు చేతిలో గన్తో, ఇతర పాత్రలు ఆశ్చర్యంగా చూస్తున్నట్లు కనిపించారు. ఇంకో పోస్టర్లో శ్రద్ధా దాస్ చేతిలో గన్తో స్టయిలిష్గా కనిపించారు. -
యూత్ఫుల్ ప్రేమకథ
కిశోర్ కేఎస్డీ, దియా సితెపల్లి జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమకథ’. టాంగాప్రోడక్షన్స్ ఎల్ఎల్పీ, సినీ వ్యాలీ మూవీస్ పతాకాలపై విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ను దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేసి, లుక్ బాగుందని, ఈ సినిమా విజయం సాధించాలని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘వైవిధ్యమైన లవ్స్టోరీతో నేటితరం యువ ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: రథన్ , సహనిర్మాత: ఉపేంద్ర గౌడ్ ఎర్ర. -
ఒక్కటి గుర్తు పెట్టుకోండి!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో దర్శకుడు మహి వి.రాఘవ్ తెరకెక్కించిన చిత్రం ‘యాత్ర’. వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి నటించారు. 2019 ఫిబ్రవరి 8న విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘యాత్ర 2’ మూవీని తెరకెక్కిస్తున్నారు మహి వి.రాఘవ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలోని కొన్ని ఘటనల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో వైఎస్ జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటిస్తున్నారు. ‘యాత్ర’లో వైఎస్ఆర్ పాత్ర పోషించిన మమ్ముట్టి ‘యాత్ర 2’ లోనూ అదే పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలోని వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ను మేకర్స్ విడుదల చేశారు. ‘నేనెవరో ఇంకా ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ, ఒక్కటి గుర్తు పెట్టుకోండి... నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని’ అనే అనే డైలాగ్స్ ఫస్ట్ లుక్ పోస్టర్లో ఉన్నాయి. మహి వి.రాఘవ్ మాట్లాడుతూ–‘‘వైఎస్ జగన్గారు ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ ఘటనల నేపథ్యంలో ‘యాత్ర 2’ రూపొందుతోంది. ఈ సినిమాని 2024 ఫిబ్రవరి 8న రిలీజ్ చేస్తాం’’ అన్నారు. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యులాయిడ్పై శివ మేక నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మధి, సంగీతం: సంతోష్ నారాయణన్. -
ఫైట్.. హైలైట్
మంచు లక్ష్మి లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఆదిపర్వం’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్–అమెరికా ఇండియా ఎంటర్టైన్మెంట్స్పై రూ΄పొందింది. కాగా ఆదివారం (అక్టోబర్ 8) మంచు లక్ష్మి పుట్టినరోజుని పురస్కరించుకుని ‘ఆదిపర్వం’లోని ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా సంజీవ్ మేగోటి మాట్లాడుతూ– ‘‘1974–1990 మధ్యకాలంలో జరిగిన వాస్తవ ఘటనలతో ఈ చిత్రం రూపొందింది. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో పాటు ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో మంచు లక్ష్మి పాత్ర ఆమె కెరీర్లోనే చిరస్థాయిగా నిలిచిపోతుంది. తను చేసిన రెండు ఫైట్స్ సినిమాకి హైలెట్గా నిలుస్తాయి. ‘అమ్మోరు, అరుంధతి’ చిత్రాల తరహాలో కథ, గ్రాఫిక్స్ ఉంటాయి’’ అన్నారు. ‘‘రెట్రో ఫీల్తో ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మొదలై కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రం అలరిస్తుంది’’ అన్నారు చిత్ర ఎగ్జిక్యూటివ్ప్రోడ్యూసర్ ఘంటా శ్రీనివాస రావ్, సహనిర్మాత గోరెంట శ్రావణి. ఈ చిత్రంలో ఆదిత్య ఓం, ఎస్తేర్, సుహాసిని తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. -
థ్రిల్ చేసే విధి
రోహిత్ నందా, ఆనంది జంటగా శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ రచన, దర్శకత్వంలో ఎస్. రంజిత్ నిర్మించిన చిత్రం ‘విధి’. ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్లో హీరో రోహిత్ నందా మాట్లాడుతూ– ‘‘విధి’ మాకెంతో స్పెషల్ మూవీ. ఆడియో డిస్క్రిప్టివ్ టెక్నాలజీతో ఈ సినిమాను చేశాం. దీంతో కంటి చూపు లేనివాళ్లు కూడా మా సినిమాను అనుభూతి చెందగలరు. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాలగారు అద్భుతమైన ఆర్ఆర్, సంగీతం ఇచ్చారు’’ అన్నారు. ‘‘ఓ డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపొందిన మూవీ ‘విధి’’ అన్నారు నిర్మాత రంజిత్. ‘‘మాకు ఇది తొలి సినిమా. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు శ్రీకాంత్, శ్రీనాథ్. ‘‘వినోదం మాత్రమే కాదు.. థ్రిల్లింగ్ అంశాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయి’’ అన్నారు హీరోయిన్ ఆనంది. ‘‘ఈ సినిమాలో ట్విస్ట్లు బాగుంటాయి’’ అన్నారు శ్రీ చరణ్ పాకాల. నటుడు ‘రంగస్థలం’ మహేశ్ మాట్లాడారు. -
అందమైన మోసం
పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే తనయుడు సూర్య తేజ ఏలే హీరోగా పరిచయం అవుతున్న క్రైమ్ కామెడీ ఫిల్మ్ ‘భరత నాట్యం’. ‘సినిమా ఈజ్ ది మోస్ట్ బ్యూటీఫుల్ ఫ్రాడ్ ఇన్ ది వరల్డ్’ (సినిమా అనేది ప్రపంచంలో అత్యంత అందమైన మోసం) ఉపశీర్షిక. ఈ చిత్రంలో మీనాక్షీ గోస్వామి హీరోయిన్. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో పాయల్ సరాఫ్ నిర్మించారు. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ‘‘కేవీఆర్ మహేంద్రతో కలిసి సూర్య తేజ ఈ సినిమాకు కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ అందించారు.పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ‘భరత నాట్యం’ టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమాలో తెలుస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, కెమెరా: వెంకట్ ఆర్. శాఖమూరి. -
కేబుల్రెడ్డి కథ
సుహాస్ టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘కేబుల్ రెడ్డి’. షాలిని కొండేపూడి హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో బాలు వల్లు, ఫణి ఆచార్య, మణికంఠ జేఎస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను గురువారం విడుదల చేశారు. ‘‘2000 సమయంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో గ్రామీణ యువకుడిగా కనిపిస్తారు సుహాస్’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్ సాయి, కెమెరా: మహి రెడ్డి పండుగుల. -
మొదటి ప్రయాణం మరచిపోకూడదు: త్రినాథరావు నక్కిన
‘‘నాది, బెక్కెం వేణుగోపాల్గారి ప్రయాణం చిన్న సినిమా నుంచే ప్రారంభమైంది. అప్పట్లో మా సినిమా పొస్టర్, టీజర్, ట్రైలర్లను ఎవరు రిలీజ్ చేస్తారా? అని ఎదురు చూసే వాళ్లం. ఇప్పుడు పెద్ద సినిమాలు చేస్తున్నామని మా మొదటి ప్రయాణం మరచిపొకూడదు కదా?. అందుకే ఎవరైనా సపొర్ట్ కావాలని అడిగితే మా వంతు సపొర్ట్ చేయటానికి,ప్రొత్సహించటానికి వెనుకాడం’’ అని డైరెక్టర్ త్రినాథరావు నక్కిన అన్నారు. చంటి, లహరి జంటగా కేవీఆర్ దర్శకత్వంవహిస్తున్న చిత్రం ‘ఏపీ 31’. ‘నెంబర్ మిస్సింగ్’ అన్నది ట్యాగ్ లైన్. అన్నపూర్ణేశ్వరి సినీ క్రియేషక్స్ పై నారాయణ స్వామి.ఎం నిర్మిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పొస్టర్ను త్రినాథరావు నక్కిన, ఫస్ట్ లుక్ని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ రిలీజ్ చేసి, ‘ఏపీ 31’ హిట్ కావాలన్నారు. ‘‘అందరి సపొర్ట్తో సినిమాను పూర్తి చేస్తున్నాం’’ అన్నారు కేవీఆర్. -
చాలా విలువైనది
హృతిక్ శౌర్య, తన్వి నేగి జంటగా రవి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓటు’. ‘చాలా విలువైనది’ అనేది ట్యాగ్ లైన్. ఫ్లిక్ నైన్ స్టూడియోస్పై ఫ్లిక్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమాకి ‘ఓటు’ అనే టైటిల్ ఖరారు చేసి, ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ‘‘ఓటు విలువ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచింది. త్వరలో మా చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: అగస్త్య, కెమెరా: ఎస్. రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: రామకృష్ణ. -
రహస్యాలు ఏంటి?
‘మల్లేశం’ చిత్రం ఫేమ్ అనన్య నాగళ్ల ప్రధాన పాత్ర చేస్తున్న చిత్రం ‘తంత్ర’. ఈ సినిమా ద్వారా శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకునిగా పరిచయమవుతున్నారు. దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్ ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. పి. నరేష్ బాబు, రవి చైతన్య నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. ‘‘హారర్ థ్రిల్లర్గా రూపొందుతున్న చిత్రం ‘తంత్ర’. భారత తంత్ర శాస్త్రానికి చెందిన విస్తు గొలిపే రహస్యాలను ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
మెడికో థ్రిల్లర్.. యంగ్ హీరో ప్రయోగం
అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘వచ్చినవాడు గౌతం’ అనే టైటిల్ ఖరారు చేశారు. మామిడాల ఎంఆర్ కృష్ణ దర్శకత్వంలో ఆలూరి సురేష్ నిర్మిస్తున్నారు. మంగళవారం (ఆగస్టు 1) అశ్విన్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం టైటిల్ను ప్రకటించి, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ‘‘మెడికో థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ సినిమా కోసం అశ్విన్ ఫిజికల్గా మేకోవర్ అయ్యారు’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె. నాయుడు, సంగీతం: గౌర హరి. -
మదర్ సెంటిమెంట్తో సదా `నంద`
సదా హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నంద’. గోణుగుంట్ల విజయ్ కుమార్ సమర్పణలో కళ్యాణ్ ఎర్రగుంట్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు, దర్శకుడు మాట్లాడుతూ..‘నేను హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో `నంద` చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నా. మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుతం మా చిత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చరణ్ అర్జున్ మా చిత్రానికి నాలుగు అద్భుతమైన పాటలు సమకూర్చారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం ` అన్నారు. ఈ చిత్రానికి డిఓపీః జైపాల్ రెడ్డి నిమ్మల; సంగీతంః చరణ్ అర్జున్. -
కామెడీ హారర్గా ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’
తల్లాడ సాయికృష్ణ, మాధురి చిగురు జంటగా నటిస్తున్న కామెడీ హారర్ మూవీ ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ ,శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫిలిమ్స్, క్రియేటివ్ థింగ్స్ గ్యాంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్లుక్ని మదర్స్ డే సందర్భంగా నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ.. నేను చేసే ప్రతి సినిమా టైటిల్ ప్రేక్షకులకు చాలా దగ్గరగా ఉన్న పేరు నే తీసుకుంటాను. అలానే మనం చిన్నప్పటి నుండి వింటున్న టైటిల్ ఇది. హారర్ కామెడీ అంశాలు జోడించి సినిమా తీయడం జరిగింది. పిల్లలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుంది’ అన్నారు. (చదవండి: నా నిజాయతీని అపహాస్యం చేశారు.. ‘ది కేరళ స్టోరీ’పై అదా శర్మ ఆసక్తికర పోస్ట్) ‘నా యాక్టింగ్ కి చాలా స్కోప్ ఉన్న కథ ఇది. ఈ మధ్య అసలు హారర్ కామెడీ నేపథ్యంలో సినిమాలు రాలేదు, మా సినిమా పక్క అందరికి నచ్చుతుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు’ అని హీరోయిన్ మాధురి చిగురు అన్నారు. కామెడీతో పాటు ఈ సినిమాలో మంచి మెజేజ్ ఉంది’అని దర్శకుడు జానీ అన్నారు. -
Malaikottai Vaaliban: మోహన్లాల్ యువకుడు!
ఆరు పదుల వయసులో ఉన్న మోహన్లాల్ని యువకుడు అంటున్నారు దర్శకుడు లిజో జోస్ పెల్లిసరీ. మోహన్లాల్ టైటిల్ రోల్లో లిజో జోస్ పెల్లిసరీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మలైకోట్టై వాలిబన్’ (మలైకోట యువకుడు అని అర్థం). ఈ చిత్రంలోని మోహన్లాల్ లుక్ని విడుదల చేశారు. ఓ యాక్షన్ సీన్కి సంబంధించిన లుక్ ఇది. ‘‘జనవరి 18న రాజస్థాన్లోని జై సల్మేర్లో ఈ చిత్రం షూటింగ్ని ఆరంభించాం. హై బడ్జెట్తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు ఇతర ప్రముఖ భాషల్లో విడుదల చేస్తాం’’ అని చిత్రనిర్మాతలు షిబు బేబీ జాన్, కొచుమొన్, అనూప్ పేర్కొన్నారు. -
వైవిధ్యమైన టైటిల్తో తనిశ్ కొత్త సినిమా
నటుడు, బిగ్బాస్ ఫేం తనిశ్ హీరోగా వేద ఎంటర్ప్రైజెస్ బ్యానర్ ఓ చిత్రం రూపొందుతోంది. లవ్స్టోరీగా రాబోతున్న ఈ చిత్రం టైటిల్ను వాలంటైన్స్ డే సందర్భంగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాకు కేసీపీడి(కొంచ చూసి ప్రేమించు డూడ్) అనే సరికొత్త టైటిల్ను ఖరారు చేశారు. గౌతమ్ మన్నవ దర్శకత్వం తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని వేద ఎంటర్ప్రైజెస్ పతాకంపై గోదావరి రెస్టారెంట్ దుబాయ్ సహా నిర్మాణంలో కార్తిక్ రెడ్డి , వరుణ్ దగ్గుబాటి సంయుక్తంగా నిర్మించబోతున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్లుక్, టైటిల్ను రిలీజ్ చేసన అనంతరం మేకర్స్ మాట్లాడుతూ.. అ ఈ సినిమా షూటింగ్ని మార్చిలో ప్రారంభిస్తామన్నారు. అలాగే ఈఏడాది వేసవికే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ప్రజెంట్ జనరేషన్లో యువత మనస్తత్వం, వారి ఆలోచనల ధోరణి నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని చిత్రీకరించనున్నామన్నారు. -
ఆంధ్ర , కర్ణాటక సరిహద్దులో జరిగే స్వచ్ఛమైన ప్రేమ కథ ‘లవ్ రెడ్డి’
అంజన్ రామచంద్ర, శ్రావణీ రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘లవ్ రెడ్డి’. స్మరన్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ హేమలతా రెడ్డి, మదన్ గోపాల్ రెడ్డి, ప్రభంజనం రెడ్డి, నాగరాజు బీరప్ప నిర్మించారు. ఈ చిత్రం గ్లింప్స్ను హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘లవ్ రెడ్డి’ గ్లింప్స్ చాలా ఫ్రెష్ గా ఉంది. ఈ గ్లింప్స్ చూశాక నాకు కూడా ఒక లవ్స్టోరీ చెయ్యాలనిపిస్తోంది. యంగ్ టీమ్ చేసిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ఆంధ్ర , కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందించాం. అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా సినిమా ఉంటుంది’ అన్నారు స్మరన్ రెడ్డి. ‘‘ఒక మంచి సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉంది అన్నారు’’ అంజన్ రామచంద్ర. -
ఎస్వీ కృష్ణారెడ్డి చేతుల మీదుగా ‘గణా’ ఫస్ట్లుక్
దుర్మార్గుడు ఫేం విజయ్ కృష్ణ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం గణా. సుకన్య తేజు హీరోయిన్స్ నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్లుక్ తాజాగా రిలీజ్ అయ్యింది. ప్రముఖ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఈ మూవీ ఫస్ట్లుక్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఎస్వీ కృష్ణారెడఇ మాట్లాడుతూ.. ‘నేను పుట్టింది తూర్పుగోదావరి జిల్లా. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన మరో వ్యక్తి పేరు కూడా క్రిష్ణారెడ్డే. కాకపోతే విజయ్ క్రిష్ణా రెడ్డి. విజయ క్రిష్ణా రెడ్డి కృషితో, పట్టుదలతో, దీక్షతో గణా చిత్రాన్ని రూపొందించారు. ఆయన హీరోగా నటిస్తూ కథ, స్క్రీన్ ప్లే, ప్లస్ డైరెక్షన్ కూడా చేశారు. అంతేకాదు ఆయన ప్రొడ్యూసర్గా కూడా. అన్నీ ఆయనే చేస్తూ సినిమా తీయడమంటే మామూలు విషయం కాదు’ అని అన్నారు. కాగా రాధా మమతా ప్రెజెంట్స్, ఎస్.కె. ఆర్ట్స్ బ్యానర్స్పై విజయ్ కృష్ణ నిర్మించారు. -
క్రిష్ చేతుల మీదుగా ‘రణస్థలి’ ఫస్ట్లుక్
మాటల రచయిత పరుశురాం శ్రీనావాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రణస్థలి. ఏజే ప్రొడక్షన్ పతాకంపై సురెడ్డి విష్ణు నిర్మిస్తున్నారు. ఇందులో ధర్మ, ప్రశాంత్, శివజామి, నాగేంద్ర, విజయ్ రాగం తదీతరులు నటిస్తున్నారు. యాక్షన్ సినిమా రూపొందిన ఈ మూవీ ఇటీవల షూటింగ్ను పూర్తి చేసుకుని ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఫస్ట్లుక్ను విడుదల చేశారు మేకర్స్. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి చేతుల మీదు రణస్థలి ఫస్ట్లుక్ను రిలీజ్ చేశారు. అనంతరం క్రిష్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా టీజర్ను చూశాను. అద్భుతంగా ఉంది. పరశురాం శ్రీనివాస్ యాక్షన్ సీన్స్ తెరకెక్కించిన విధానం చాలా బాగుతుంది. చిన్న సినిమాలో ఈ ఇలాంటి యాక్షన్ సీన్స్ చేయడమంటే మామూలు విషయం కాదు. ఇక డైలాగ్స్ అయితే కేజీయఫ్ సినిమాను గుర్తు చేస్తున్నాయి. ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా’ అని అన్నారు. అలాగే నిర్మాత సురెడ్డి విష్ణు మాట్లాడుతూ.. డిఫరెంట్ కాన్సెప్ట్లో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని, ఖచ్చితంగా రణస్థలి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి అందిస్తుందని ఆశిస్తున్నా అన్నారు. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదిరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక త్వరలోనే మూవీ ట్రైలర్, టీజర్ విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
ఆసక్తిగా సుమంత్ ‘అహం రీబూట్’ ఫస్ట్లుక్
సుమంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అహాం రీబూట్’. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్లో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈమూవీ ఫస్ట్లుక్ విడదుల చేశారు మేకర్స్. ప్రముఖ సినీ రచయిత విజయంద్ర ప్రసాద్ చేతుల మీదుగా సుమంత్ లుక్ను లాంచ్ చేశారు. ఈ పోస్టర్లో సుమంత్ లుక్ను సరికొత్తగా డిజైన్ చేశారు. ఫేస్ మీద ఒకవైపు హెల్ప్ మీ అనే అక్షరాలు రోల్ అవుతుండగా.. సుమంత్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని కకినిపంచాడు. చదవండి: సూరారై పోట్రు హిందీ రీమేక్లో అక్షయ్, షూటింగ్ స్టార్ట్ చూస్తుంటే ఇందులో సుమంత్... సాయం కోరే వాళ్లతో మాట్లాడుతూ వారి సమ్యలు తీర్చే వ్యక్తిగా కనిపించనున్నాడని తెలుస్తోంది! ఈ సందర్బంగా రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కాన్సెప్ట్ వినగానే చాలా ఎగ్జయిట్ అయ్యాను. చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఇలాంటి కథలకు ఇప్పుడు డిమాండ్ మరింత పెరిగింది. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా లో నటిస్తున్న సుమంత్ కి అభినందనలు’ అన్నారు. అనంతరం నిర్మాతలు రఘువీర్, సృజన్ యరబోలు దర్శకుడు ప్రశాంత్ సాగర్తో పాటు మూవీ టీంకు ఆయన ఆల్ ద బెస్ట్ చెప్పారు. చదవండి: లీకైన నిహారిక న్యూలుక్ ఫోటోలు.. నెట్టింట వైరల్ దర్శకుడు ప్రశాంత్ సాగర్ అట్లూరి మాట్లాడుతూ.. ‘అహాం రీ బూట్తో ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ను అందించబోతున్నాం. అనుకోని సంఘటలను మనిషిలోని కొత్త కోణాలను , శక్తులకు బయటకు తెస్తాయి. అవి చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. అలాంటి కథే అహాం రిబూట్. సుమంత్ నటన చాలా హైలెట్గా ఉంటుంది. దర్శకునిగా ఈ కథను ప్రేక్షకులకు ముందుకు ఎప్పుడు తెస్తానా అనే ఎగ్జయిట్మెంట్ మా టీం ఉంది’ అని పేర్కొన్నారు. ఈ మూవీకి శ్రీరామ్ మద్దూరి సంగీతం అందిస్తున్నారు. -
డైరెక్టర్ పరశురాం చేతుల మీదులుగా ‘కరణ్ అర్జున్’ ఫస్ట్లుక్
ఇటీవల కాలంలో కంటెంట్ నచ్చితే చాలు కొత్తవారా, పాతవారా అని చూడకుండా సినిమాలు సక్సెస్ చేస్తున్నారు ఆడియన్స్. ఈ నేపథ్యంలో కంటెంట్ను మాత్రమే నమ్ముకుని వస్తోన్న చిత్రం రోడ్ థ్రిల్లర్ ‘కరణ్ అర్జున్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. రెడ్ రోడ్ థ్రిల్లర్స్ పతాకంపై సోమేశ్వరరావు పొన్నాన ,బాలక్రిష్ణ ఆకుల, సురేష్ ,రామకృష్ణ ,క్రాంతి కిరణ్లు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్లుక్ను ప్రముఖ దర్శకుడు దర్శకుడు పరశురామ్ విడుదల చేశాడు. ఈ సందర్భంగా దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ... ‘‘కరణ్ అర్జున్’ టైటిల్తో పాటు ఫస్ట్లుక్ చాలా ఇంట్రస్టింగ్గా ఉంది. దర్శకుడు స్టోరి లైన్ కూడా చెప్పారు. ప్రజంట్ ట్రెండ్కి కనెక్టయ్యే స్టోరి. టీమ్ అందరూ కూడా ఎంతో ప్యాషన్తో సినిమా తీసినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు’’ అన్నారు. చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ.. ‘మా సినిమా ఫస్ట్ లుక్ పరశురామ్ గారు లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. వారికి నా ధన్యవాదాలు. ఇంత వరకు ఎవరూ చేయని లొకేషన్స్లో పాకిస్థాన్ బార్డర్లో ఎంతో రిస్క్ తీసుకుని మా సినిమా షూటింగ్ చేశాం. మూడు పాత్రలతో ఊహించని మలుపులతో ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా సాగే చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఎమోషన్స్ ఉన్నాయి. ఈ సినిమా ఇంత క్వాలిటీగా రావడానికి మా నిర్మాతలే కారణం. వారు ఎక్కడా రాజీ పడకుండా నాకు పూర్తి స్వేచ్ఛనివ్వడంతో అనుకున్నట్లు గా తీయగలిగాను. మా నిర్మాతలందరికీ పేరు పేరునా నా ధన్యవాదాలు. సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయింది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’ అన్నారు. కాగా ఈ మూవీలో అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా , మాస్టర్ సునీత్ , అనిత చౌదరి, రఘు . జి, జగన్, ప్రవీణ్ పురోహిత్, మోహిత్, వినోద్ బాటి, ప్రసన్న తదితరులు నటిస్తున్నారు. -
'గీత' ఫస్ట్ లుక్ విడుదల.. గురువుకు తగ్గ శిష్యుడని ప్రశంస
Geetha Movie First Look Poster Released By VV Vinayak: ‘‘గీత’ సినిమా ఫస్ట్ లుక్ బాగుంది. నా శిష్యుడు విశ్వ దర్శకుడిగా, నా మిత్రుడు రాచయ్య నిర్మాతగా పరిచయమవుతున్న ఈ సినిమా విజయం సాధించాలి. యూనిట్కి మంచి పేరు రావాలి’’ అని డైరెక్టర్ వీవీ వినాయక్ అన్నారు. కుమారి 21F ఫేమ్ హెబ్బా పటేల్ టైటిల్ రోల్, సునీల్ ముఖ్యపాత్ర చేసిన చిత్రం ‘గీత’. ‘మ్యూట్ విట్నెస్’ (మూగ సాక్ష్యం) అన్నది ఉప శీర్షిక. ‘నువ్వే కావాలి, ప్రేమించు’ సినిమాల ఫేమ్ సాయికిరణ్ ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించారు. డైరెక్టర్ వీవీ వినాయక్ శిష్యుడు విశ్వని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్. రాచయ్య నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ని వినాయక్ విడుదల చేశారు. రాచయ్య మాట్లాడుతూ ‘‘గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా విశ్వ ‘గీత’ చిత్రాన్ని తెరకెక్కించాడు. మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావొచ్చాయి’’ అన్నారు. ‘‘గీత’ సినిమా అవకాశం మా గురువు వినాయక్గారే ఇప్పించారు. రాచయ్యగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అన్నారు విశ్వ. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్ అందించగా బ్యాక్గ్రౌండ్ స్కోర్: ఎస్. చిన్నా, కెమెరా: క్రాంతికుమార్.కె. -
‘యుద్ధం శరణం గచ్చామి’ అని చాటి చెప్పేలా..
రవి వర్మ, సంజనా సింగ్, అలోక్ జైన్, మనీషా దేవ్, జీవ ముఖ్య పాత్రల్లో చౌడప్ప దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బుల్లెట్’. సోమిశెట్టి హరికృష్ణ సమర్పణలో ఎంసీ రావు, జి. గోపాల్, ఎమ్.వి మల్లికార్జునరావు, కోసూరి సుబ్రహ్మణ్యం, మణి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్లో విడుదలకానుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ని నిర్మాత ఏయం రత్నం విడుదల చేశారు. చౌడప్ప మాట్లాడుతూ– ‘‘దేశానికి పట్టిన చీడ పురుగులను ఏరేసే ప్రయత్నంలో బుద్ధుడు కూడా రుద్రుడౌతాడు. ‘బుద్ధం శరణం గచ్చామి’ కాదు.. ‘యుద్ధం శరణం గచ్చామి’ అని చాటి చెప్పే సినిమా ఇది. రవి వర్మ కొత్తవాడైనా బాగా చేశాడు’’ అన్నారు. ‘‘హీరోగా నాకిది తొలి చిత్రం. ప్రేక్షకుల ఆదరణ కావాలి’’ అన్నారు రవి వర్మ. -
Thalapathy 65: దుమ్మురేపుతున్న ఫస్ట్లుక్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ పుట్టిన రోజు(జూన్ 22) సందర్భంగా ఆయన కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ఈ రోజు రానున్నట్లు సన్పిక్చర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగానే తాజాగా సన్ పిక్చర్స్ సోమవారం (జూన్ 21) సాయంత్రం 6 గంటలకు ఫస్ట్లుక్ను విడుదల చేసింది. దీంతో విజయ్ కొత్తమూవీ ఫస్ట్లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. ఈ మూవీ టైటిల్ను ‘బీస్ట్’గా ఖారారు చేశారు. బీస్ట్ అని ఇంగ్లిష్లో రాసి ఉన్న ఈ పోస్టర్లో విజయ్ తుపాకి పట్టుకుని కనిపించాడు. ఇందులో విజయ్ సరికొత్త లుక్లో దర్శనమిచ్చాడు. దీంతో విజయ్ ఈ లుక్ సినిమాపై మరింత హైప్ను క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ నెల్సన్ ట్వీట్ చేస్తూ.. ‘నా ఫేవరేట్ హీరో దళపతి కొత్త మూవీ ఫస్ట్లుక్ లాంచ్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ సన్పిక్చర్స్, హీరోయిన్ పూజా హెగ్డే, మ్యూజిక్ డైరెక్టర్ అనిరూధ్కు ధన్యవాదాలు తెలిపాడు. #Thalapathy65 is #BEAST@actorvijay @Nelsondilpkumar @anirudhofficial @hegdepooja#BEASTFirstLook #Thalapathy65FirstLook pic.twitter.com/Wv7wDq06rh — Sun Pictures (@sunpictures) June 21, 2021 అంతేగాక ఈ సందర్భంగా హీరో విజయ్కి బర్త్డే విషెష్ కూడా తెలిపాడు. కాగా ఈ చిత్రంలో విజయ్ సరసన బుట్ట బోమ్మ పూజా హెగ్డే రొమాన్స్ చేయనుంది. ఈ సినిమాతోనే పూజా హెగ్డే కోలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. నెల్సన్ డైరెక్షన్లో రూపోందుతున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉండగా విజయ్ త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడు. ఇప్పటికే కథను సిద్ధం చేసిన వంశీ.. త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. #BEAST it is 🔥 Happy to unveil the first look of this special film with my favourite and sweetest #thalapathy @actorvijay sir ♥️😘🤗 hearty thanks to @sunpictures 🙏♥️ @hegdepooja @anirudhofficial #HBDTHALAPATHYVijay pic.twitter.com/NcCmUGpZne — Nelson Dilipkumar (@Nelsondilpkumar) June 21, 2021 -
‘గని’గా వరుణ్ తేజ్.. పంచ్ మాములుగా లేదుగా
వరుణ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ఈ మూవీ సినిమా టైటిల్తో మోషన్ పోస్టర్ను విడుదల చేసింది చిత్ర బృందం. బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమాకు ‘గని’అని టైటిల్ ఖరారు చేశారు. బాక్సింగ్ రింగ్ లో పంచ్లు కొడుతున్న వరుణ్ లుక్ని మోషన్ పోస్టర్లో చూపించారు. (చదవండి : తేజ కొత్త సినిమా.. అలిమేలు ఆవిడే!) ఈ చిత్రంలో హీరో పేరు గని అందుకే సినిమాకి కూడా అదే పేరు పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో ఫాదర్ సెంటిమెంట్ కూడా ఉంటుందట. ఈ పాత్రలో స్టార్ హీరో ఉపేంద్ర చేయనున్నాడు. వరుణ్ తేజ్ కి కోచ్ గా.. సునీల్ శెట్టి, ప్రతినాయకుడిగా జగపతిబాబు కనిపించనున్నాడు. అందాల రాక్షసి ఫేమ్… నవీన్ చంద్రకు కీలకమైన పాత్ర దక్కింది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. -
ఆర్ఆర్టీఎస్ రైలు ఫస్ట్లుక్ ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ ప్రాంతీయ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్) రైలు తొలి డిజైన్ను పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ శుక్రవారం విడుదల చేసింది. 82 కిలోమీటర్ల పొడవున గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్లతో ఆర్ఆర్టీఎస్ క్యారిడార్ దేశంలో ఇదే మొదటిది కావడం గమనార్హం. జాతీయ రాజధాని ప్రాంతం వెంట ఆర్ఆర్టీఎస్ ప్రాజెక్టును అమలుచేసేందుకు ఢిల్లీ, హర్యానా, రాజస్తాన్, యూపీ ప్రభుత్వాలు కలిసి ఎన్సీఆర్టీసీ పేరిట జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేశాయి. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందే ఆర్ఆర్టీఎస్ రైళ్లు స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో నిర్మాణమై తేలికపాటి బరువును కలిగిఉంటాయి. ఈ రైళ్లు పూర్తిగా ఏసీ సౌకర్యాన్ని కలిగిఉంటాయి. చదవండి : యాదాద్రికి ఎంఎంటీఎస్ ఏదీ? -
నాగశౌర్య లుక్ అదుర్స్
సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య నటిస్తున్న చిత్రం ప్రీ లుక్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘ది గేమ్ విల్ నెవర్ బీ ది సేమ్’ (ఆట ఎప్పుడూ ఒకేలా ఉండదు) అనే క్యాప్షన్తో దీనిని రిలీజ్ చేశారు. ఇక ఇందులో నాగశౌర్య మునుపెన్నడు చూడని విధంగా సిక్స్ ప్యాక్ బాడీతో డిఫరెంట్ లుక్తో కనిపిస్తున్నాడు. ఈ లుక్ చూసి ఆయన అభిమానులు మురిసిపోతున్నారు . లవర్ బాయ్లా కనిపించే నాగ శౌర్య పూర్తిగా మారిపోయాడంటూ కామెంట్ చేస్తున్నారు. బాడీ షేప్ బాగుందంటూ కితాబిస్తున్నారు. చదవండి: ఆట ఎప్పుడూ ఒకేలా ఉండదు! This can't be any better. My dear bro @IamNagaShaurya you are unmatchable.. Wishing the entire team of #NS20 all the best ! https://t.co/5CrjOtWeQ8 — Rohith Nara (@IamRohithNara) July 27, 2020 ఇక అభిమానులతో పాటు సెలబ్రెటీలు కూడా నాగశౌర్య కొత్త సినిమా ప్రీ లుక్పై స్పందిస్తున్నారు. నారా లోహిత్ ‘లుక్ డిఫరెంట్, ఇంకా నువ్వు బెటర్ అవ్వాల్సింది ఏం లేదు. నీతో ఎవరు మ్యాచ్ అవలేరు. టీం అందరికి ఆల్ ద బెస్ట్’ అంటూ ట్వీట్ చేశాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు ‘ఇది చూస్తుంటే అప్పుడే గెలిచినట్టు అనిపిస్తోంది. ఈ ఫోటోలో అద్భుతంగా కనిపిస్తున్నారు’ అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు దర్శకుడు శేఖర్ కమ్ముల ‘నారాయణదాస్ పుట్టిన రోజు నాడు ఫస్ట్ లుక్ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. On Narayan Das Ji’s Birthday, delighted to launch the Superb FIRST LOOK of @IamNagashaurya’s next #NS20. Wishing the entire team a grand success!#NarayanDas #RamMohan @sharrath_marar @SVCLLP @nseplofficial @Santhosshjagar1 #KetikaSharma @kaalabhairava7 #NS20FirstLook pic.twitter.com/F245JJZ6b1 — Sekhar Kammula (@sekharkammula) July 27, 2020 -
విభిన్నంగా రెజీనా ‘నేనే నా..?’
ఎస్ఎమ్ఎస్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమయ్యారు చెన్నై బ్యూటీ రెజీనా కసండ్ర. తెలుగుతో పాటు తమిళ, హిందీ వంటి పలు భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్నారు. అయితే పలు హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ రెజీనాకు సరైన గుర్తింపు దక్కలేదు. కాగా గతేడాది ఎవరు చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించారు. తెలుగులో సరైన అవకాశాలు లేనప్పటికీ తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రెజీనా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం నేనే నా..?. మిస్టరీ థ్రిల్లర్గా వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతుంది. ‘నిను వీడని నీడను నేనే’ డైరెక్టర్ కార్తీక్ రాజు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రెజీనా ఆర్కియాలజిస్ట్గా కనిపించనున్నారు. (ఆర్ఆర్ఆర్ టైటిల్ ఇదే..) తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంగళవారం విడుదల చేశారు. ఇనుప చువ్వలతో కప్పి ఉన్న ఓ గదిలో.. కట్టు బొట్టుతో రాణిలా కనిపిస్తున్న రెజీనా. పోస్టర్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. మరోవైపు తమిళ ఫస్ట్ పోస్టర్ను విజయ్ సేతుపతి ట్విటర్ ద్వారా విడుదల చేశారు. తమిళంలో ఈ చిత్రానికి శూర్పణగై అనే టైటిల్ పెట్టారు. అంటే, తెలుగులో శూర్పణఖ అని అర్థం. రాజ శేఖర్ వర్మ నిర్మిస్తున్న ఈ సినిమాకు సామ్ సీఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. పీకే వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. (నా భార్య కోసం బతకాలనుకుంటున్నాను: నటుడు) Here is the first look of #NeneNaa Starring @ReginaCassandra Directed by @caarthickraju Produced by #AppleTreeStudios @vennelakishore @samCSMusic @iAksharaGowda @sathishoffl @SureshChandraa Goodluck to the entire team!👍🏽👍🏽 pic.twitter.com/ujx3enFvwi — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) March 3, 2020 Terrific 🔥#Soorpanagai #NeneNaa Directed by @caarthickraju @ReginaCassandra Tamil/Telugu Bilingual Produced by #RajShekarVarma #AppleTreeStudios@vennelakishore @samCSMusic @iAksharaGowda @sathishoffl @SureshChandraa @vamsikaka @Pk_dop @editorsabu @tuneyjohn 💐💐 pic.twitter.com/74z0SFSafh — VijaySethupathi (@VijaySethuOffl) March 3, 2020 -
అజయ్ ‘మైదాన్’ ఫస్ట్లుక్ అదిరింది
తాన్హాజీ అనే చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకున్న అజయ్ దేవ్గన్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు ‘మైదాన్’ అనే సినిమా చేస్తున్నారు.ప్రపంచంలో అత్యధిక మంది ఆదరించే ఫుట్ బాల్ ఆట నేపథ్యంలో యధార్థ కథ ఆధారంగా ‘మైదాన్’ సినిమా రూపొందుతుంది. బధాయి హో వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి, బధాయి హో ఫేమ్ గజరాజ్ రావు, పాపులర్ బెంగాలీ యాక్టర్ రుద్రనిల్ ఘోష్ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో అజయ్ దేవగణ్ ఫుల్బాల్ కోచ్గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను గురువారం విడుదల చేసింది చిత్ర బృందం. ఫుట్ బాల్ కోచ్గా అజయ్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. 1952 నుంచి 1962 మధ్య కాలంలో ఫుట్బాల్ క్రీడలో ప్రపంచ దేశాలపై అద్భుత ఆధిపత్యం ప్రదిర్శించింది భారత్. ఆ సమయంలో ఆ జట్టుకి కోచ్గా సయ్యద్ అబ్ధుల్ రహీం ఉన్నారు. ఆయన జీవితాన్ని ఆధారంగా ‘మైదాన్’ తెరకెక్కుతుంది.ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరునవ జాయ్ సేన్ గుప్తా నిర్మిస్తున్నారు. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ను సైవిన్ కాద్రస్, రితేష్ షా అందిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ 27న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషలతో పాటు ప్రపంచవాప్తంగా విడుదల కానుంది. -
పిట్ట కథకూ నాకూ లింక్ ఉంది
‘ఈ సినిమాతో నాకు ఓ చిన్న లింక్ ఉంది. అదేంటంటే నాకు ఈ చిత్రకథ తెలియటమే. కథ విన్నప్పుడు ఆసక్తిగా అనిపించింది. దీనికి ఎలాంటి టైటిల్ పెట్టాలి అనే ఆలోచన వచ్చినప్పుడు దర్శకుడికి రెండు, మూడు పేర్లు వచ్చాయి. వాటిలో ‘ఓ పిట్టకథ’ టైటిల్ నాకు బాగా నచ్చింది. ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ అని క్యాప్షన్ పెట్టమని సలహా ఇచ్చాను. అదే ఈ సినిమాకు నా కంట్రిబ్యూషన్’’ అన్నారు దర్శకుడు త్రివిక్రమ్. చందు ముద్దు దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ సంస్థపై ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘ఓ పిట్టకథ’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ను త్రివిక్రమ్ విడుదల చేశారు. నిర్మాత ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘స్టార్ హీరోలతో చాలా కమర్షియల్ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలు చేస్తున్నాను. అలాగే మళ్లీ కొత్తవాళ్లతో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు దర్శకుడు చందు చెప్పిన చిన్న కథకు ఎగ్జయిట్ అయ్యాను. వెంటనే ఈ కథను సెట్స్ మీదకు తీసుకెళ్లాను. ఈ టైటిల్ పోస్టర్ను విడుదల చేసిన త్రివిక్రమ్కు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో గ్రిప్పింగ్ స్క్రీన్ప్లేతో సాగే సినిమా ఇది. షూటింగ్ పూర్తయింది. మార్చిలో సినిమాని విడుదల చేస్తాం’’ అని ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి అన్నారు. ‘‘ఒక పల్లెటూరిలో జరిగే కథ ఇది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు ఏం జరుగుతుందనే ఆసక్తిని రేకిత్తించే సినిమా’’ అన్నారు చందు ముద్దు. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు, నిత్యాశెట్టి తదితరులు నటించారు. -
విఠల్వాడి ప్రేమకథ
రోహిత్, సుధ రావత్ జంటగా టి.నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విఠల్వాడి’. నరేష్ రెడ్డి .జి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను నటుడు జగపతిబాబు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘విఠల్వాడి’ చిత్రం ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న రోహిత్కు అభినందనలు. నిర్మాత నరేష్ రెడ్డి మరిన్ని మంచి చిత్రాలు నిర్మించాలి. ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘హైదరాబాద్లోని విఠల్వాడి అనే ఏరియాలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలతో మా సినిమా నిర్మించాం. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. పాటలు, ఫైట్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. త్వరలో టీజర్ను విడుదల చేస్తాం’’ అన్నారు నరేష్ రెడ్డి. జి. ‘‘విఠల్వాడి’ సినిమాతో హీరోగా పరిచయం కావడం సంతోషం. నరేష్ రెడ్డిగారు బాగా ఖర్చు పెట్టి సినిమాను క్వాలిటీగా నిర్మించారు. ఈ చిత్రం మాకు మంచి పేరు తెచ్చిపెడుతుంది’’ అన్నారు రోహిత్. ‘‘నిజ జీవితంలో జరిగిన ఒక వాస్తవ ప్రేమకథ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు టి.నాగేందర్. అమిత్, అప్పాజీ అంబరీష్ దర్బా, చమ్మక్ చంద్ర, జయశ్రీ, రోల్ రైడ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సతీష్ అడపా, సంగీతం: రోషన్ సాలూరు. -
చివరి క్షణం
ఆదిత్య శశాంక్, కవిత మహతో జంటగా ధర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చివరి క్షణం’. శ్రీరాముల నాగరత్నం సమర్పణలో రత్న మేఘన క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఫస్ట్ లుక్ను ప్రముఖ నటుడు శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ధర్మ, శ్రీరాముల నాగరత్నం మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రమిది. శ్రీకాంత్గారు విడుదల చేసిన ఫస్ట్ లుక్కి విశేష స్పందన వచ్చింది. హైదరాబాద్, మంచిర్యాల ప్రాంతాల్లో టాకీ పార్ట్, ఒక పాట చిత్రీకరించాం. మిగిలిన మూడు పాటలను గోవాలో చిత్రీకరించాం. ఈ నెలాఖరులో ఆడియో విడుదల చేస్తాం’’ అన్నారు. సాకేత్ సాయిరామ్, స్నేహ, కోటయ్య, చౌదరి, రాథోడ్, రామ్ కుర్నవల్లి, మురళి, రామకృష్ణ, వీఎస్ రామరాజు, జ్యోతి, రాంరెడ్డి, దాస్, సంపత్ తదితరులు నటించిన ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సతీష్, మహతి జై, వీరేపల్లి ప్రీతం, సంగీతం: సాకేత్ సాయిరామ్, కెమెరా: శ్రీనివాస్ శ్రీరాములు. -
తలకిందుల ఇంట్లో తమన్నా!
ఇంట్లోని గడియారం, అల్మరా, అద్దం.. ఇలా అన్ని వస్తువులు తలకిందులుగా కనిపిస్తున్నాయి. అదే ఇంట్లో ఉన్న తమన్నా మాత్రం కుర్చీలో దర్జాగా కూర్చుని నవ్వుతున్నారు. విశేషం ఏంటంటే.. తమన్నా కూర్చున్న కుర్చీ మాత్రం తలకిందులుగా లేదు. ఇక్కడున్న ఫొటో చూశారుగా. తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా తమిళ చిత్రంలోని స్టిల్ ఇది. రోహన్ వెంకటేశన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘పెట్రోమాక్స్’ అనే టైటిల్ను ఖరారు చేసి, ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ను తాప్సీ విడుదల చేశారు. ఈ సినిమాను సెప్టెంబర్లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... తెలుగులో హిట్ సాధించిన ‘ఆనందోబ్రహ్మ’ సినిమాకు ‘పెట్రోమాక్స్’ తమిళ రీమేక్ అని టాక్. తెలుగు వెర్షన్లో తాప్సీ నటించిన విషయం తెలిసిందే. అందుకే తమిళ రీమేక్ని ఆమె చేతుల మీదుగా విడుదల చేయించి ఉంటారు. -
యుద్ధానికి సై
మలయాళ నటుడు మమ్ముట్టి తన కొత్త చిత్రం కోసం యోధుడిలా మారిపోయారు. ఆయన హీరోగా పద్మకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మమంగం’. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేణు కున్నప్పిల్లి నిర్మిస్తున్నారు. మలయాళ, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్లుక్ను రిలీజ్ చేశారు. ‘యుద్ధానికి సిద్ధం’ అన్నట్టు మమ్ముట్టి ఫోజుని గమనించవచ్చు. ‘ఈ ఫస్ట్లుక్ని సాధారణంగా ఫొటోషూట్ జరిపినట్టు కాకుండా యాక్టర్స్ అందరూ ఆ సన్నివేశాన్ని నటిస్తుంటే ఈ ఫొటోలను తీసి ఫస్ట్లుక్గా రిలీజ్ చేశాం’ అని చిత్రబృందం తెలిపింది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా విడుదలకానుంది. -
చిన్న సినిమాలు హిట్ అవ్వాలి
‘‘ఎర్రచీర’ సినిమా పోస్టర్ చూస్తుంటే సాయితేజస్విని లుక్ పవర్ఫుల్గా ఉందనిపిస్తోంది. ఇలాంటి ఫీలింగ్ కొన్ని సినిమాలకే కలుగుతుంది. చిన్న సినిమాలు మంచి విజయాలు సాధించాలి. అప్పుడే మాలాంటివాళ్లకు అవకాశాలు వస్తాయి’’ అని నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. ‘మహానటి’ ఫేం బేబి సాయి తేజస్విని, కారుణ ్య చౌదరి ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘ఎర్రచీర’. బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై చెరువుపల్లి సుమన్బాబు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ని రాజేంద్రప్రసాద్, డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ లుక్లో హారర్ కోణం కనిపిస్తోంది. సాయి తేజస్విని చిన్నదైనా చక్కగా నటించింది. ‘రాజా ది గ్రేట్’ సినిమాలో తనతో ఓ పాత్ర చేయించాలనుకున్నా. కానీ, వయసు తక్కువని మిస్సయ్యాను.. ఇప్పుడు ఫీలవుతున్నా. రాజేంద్రప్రసాద్గారిని డాడీ అని పిలుస్తా. నా అన్ని సినిమాల్లో ఆయన ఉంటారు. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ లోనూ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు’’ అన్నారు. ‘‘పోస్టర్ చూసి మా సినిమా హారర్ థ్రిల్లర్ అనుకుంటున్నారు. కానీ, ఇది ఫ్యామిలీ, మదర్ సెంటిమెంట్ ఉన్న కథ. హారర్ని టచ్ చేశామంతే. సినిమా బాగా వస్తోంది. విజయంపై ధీమాగా ఉన్నాం’’ అని సుమన్బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు కమల్ కామరాజు, సంగీత దర్శకుడు ప్రమోద్ పులిగిల్ల, డైలాగ్ రైటర్ గోపి విమలపుత్ర, ఎగ్జిక్యూటివ్ నిర్మాత తోట సతీష్, నటి గీతాసింగ్ పాల్గొన్నారు. -
మీసం తిప్పాడు
శ్రీ విష్ణు హీరోగా నటించిన చిత్రం ‘తిప్పరా మీసం’. నిక్కి తంబోలీ, రోహిణి హీరోయిన్లుగా నటించారు. ‘అసుర’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కృష్ణ విజయ్. ఎల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రిజ్వాన్ ఎంటరై్టన్మెంట్స్, శ్రీ ఓం సినిమా బ్యానర్స్పై రిజ్వాన్ నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ బుధవారం విడుదలైంది. ‘‘తిప్పరా మీసం’ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో బిజీగా ఉంది. వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు దర్శక, నిర్మాతలు. అచ్యుత్ రామారావు, బెనర్జీ, రవిప్రకాష్, రవి వర్మ, నవీన్ నేని, ప్రవీణ్, నేహా దేశ్ పాండే తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, కెమెరా: సి«ద్, సహ నిర్మాతలు: ఖుషీ, అచ్యుత రామారావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మనోజ్ మావిళ్ల. -
నవ్వులు పంచే దొంగ
అతని పేరు గోవిందు. పేరుకి ఫన్నీ దొంగ అయినా అతనికో లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధన కోసం ఏం చేశాడనే కథతో రూపొందుతోన్న చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. సప్తగిరి, వైభవీ జోషీ జంటగా అరుణ్ పవార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. అరుణ్ పవార్ మాట్లాడుతూ–‘‘సప్తగిరితో నేను తెరకెక్కించిన ‘సప్తగిరి ఎక్స్ప్రెస్’ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. తాజాగా రూపొందిస్తున్న ‘వజ్ర కవచధర గోవింద’ సినిమా అంతకు మించి సక్సెస్ కావాలనే తపనతో కృషి చేస్తున్నాం. కడుపుబ్బా నవ్వించే అంశాలతోపాటు, మంచి యాక్షన్, ఎమోషన్, ఇతర వాణిజ్య అంశాలు మెండుగా ఉంటాయి. మా నిర్మాతలు కొత్తవారైనా ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు’’ అన్నారు. ‘‘హిలేరియస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. 80 శాతం షూటింగ్ పూర్తయింది. మిగిలిన సన్నివేశాలను కర్ణాటకలోని ఒక గుడిలో తెరకెక్కిస్తాం’’ అని నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి అన్నారు. ఈ చిత్రానికి కథ: జిటిఆర్ మహేంద్ర, సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: ప్రవీణ్ వనమాలి, ఎడిటింగ్: కిషోర్ మద్దాలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సలాన బాలగోపాలరావు. -
‘మీటూ’ నేపథ్యంలో...
హర్ష్, తులికా సింగ్, హిమాయత్, మధు నారాయణన్ ముఖ్య తారలుగా దీపక్ బల్దేవ్ ఠాకూర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లాస్ట్ సీన్’. జి.పి.ఏ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీ ప్రకాష్ ఠాకూర్ సమర్పణలో రూపొందుతోంది. భారతి సిమెంట్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) ఆర్.రాఘవ ప్రతాప్ ఈ చిత్రం ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. దీపక్ బల్దేవ్ ఠాకూర్ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన ‘మీటూ’ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జవహర్ రెడ్డి, ఎడిటర్ నాగిరెడ్డి మా చిత్రానికి పని చేస్తుండటం గర్వంగా భావిస్తున్నాం. మేజర్ షెడ్యూల్ ఊటీలో చేశాం. 80 శాతం చిత్రీకరణ పూర్తయింది’’ అన్నారు. ‘‘బహుముఖ ప్రతిభాశాలి అయిన దీపక్ బలదేవ్ తెరకెక్కిస్తోన్న ‘లాస్ట్ సీన్’ ఫస్ట్ లుక్ నా చేతుల మీదుగా విడుదల కావడం సంతోషంగా ఉంది. ఈ సినిమా ఘన విజయం సాధించి, చిత్రబృందానికి మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు ఆర్. రాఘవ ప్రతాప్. ‘‘మహా నగరం వెళ్లి దర్జాగా బతకాలనుకునే ఓ పల్లెటూరి అమ్మాయికి ఎదురైన ఆసక్తికర సంఘటనలతో రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయమవుతుండడం గర్వంగా ఉంది’’ అని తులికా సింగ్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనిల్–సంజీవ్. -
సూపర్ 30 ఫస్ట్లుక్ లాంచ్
ముంబై : బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ బయోపిక్గా తెరకెక్కుతున్న సూపర్ 30 సినిమా ఫస్ట్లుక్ విడుదలైంది. టీచర్స్ డే సందర్భంగా బుధవారం తన ట్విటర్, ఇన్స్టాగ్రామ్ పేజీలో ఫస్ట్ లుక్ పోస్టర్ను హృతిక్ రోషన్ షేర్ చేశారు. ఈ పోస్టర్లో హృతిక్ గుబురుగడ్డంతో సీరియస్ లుక్లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. మ్యాథమేటిక్ ఫార్ములాతో పోస్టర్ను డిజైన్ చేసినట్టు కనిపిస్తుండగా పోస్టర్ కింద ‘అబ్ రాజా కా బేటా రాజా నహీ బనేగా’ అనే క్యాప్షన్ సినిమాపై ఆసక్తి రేపుతోంది. బిగ్ స్క్రీన్పై హృతిక్ తొలిసారిగా రియల్ లైఫ్ క్యారెక్టర్ను పోషిస్తుండటంతో మూవీపై అంచనాలు రెట్టింపయ్యాయి. వికాస్ భల్ దర్శకత్వంలో సాజిద్ నడియాద్వాలాకు చెందిన నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్, ఫాంటమ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సూపర్ 30 వచ్చే ఏడాది జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా ఈ మూవీలో మృణాల్ ఠాకూర్, టీవీ నటుడు నందిష్ సింగ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ కంగనా రనౌత్ మణికర్ణిక, ఇమ్రాన్ హష్మిల ఛీట్ ఇండియాలతో తలపడనుంది. -
రోల్స్ రాయిస్ కుల్లినన్ ఫస్ట్లుక్ వచ్చేసింది!
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్కు చెందిన లగ్జరీ కార్ల కంపెనీ రోల్స్ రాయిస్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కుల్లినన్ ఎస్యూవీని పరిచయం చేసింది. ఈ లగ్జరీ ఎ స్యూవీపై దాదాపు మూడు సంవత్సరాలుగా వివిధ అంచనాలు వెలువడుతున్నాయి. ఎట్టకేలకు ఈ అంచనాలకు చెక్పెడుతూ ఈ లగ్జరీ ఎస్యూవీని ఫస్ట్లుక్ని లాంచ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి పొందిన లగ్జరీ కారు రోల్స్ రాయిస్ ‘‘ఆర్కిటెక్చర్ ఆఫ్ లగ్జరీ’’ అనే ఫ్లాట్ఫామ్లో తీర్చదిద్దిన రెండవ కారు. రోల్స్ రాయిస్ పాపులర్ లగ్జరీ కారు ఫాంటమ్ 8వ జనరేషన్ మోడల్ మొదటిది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే 6.75 లీటర్ల టర్బో వీ 12 ఇంజీన్, 563బీహెచ్పీపవర్, 850ఎన్ఎం, 627ఎల్బీ టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సంవత్సరానికి చివరి నాటికి సుమారు 350,000 డాలర్ల (సుమారు 2కోట్ల 35 లక్షల రూపాయలు) ధరలతో కుల్లినన్ విక్రయానికి లభించనుంది.ప్రపంచాన్ని చుట్టేసే వినియోగదారుల కోసం అల్టిమేట్ లగ్జరీగా ఒక కొత్త తరగతి మోటారు కారును సృష్టించడంలో కొత్త ప్రమాణాన్ని ఏర్పరచుకున్నామని రోల్స్-రాయ్స్ అధ్యక్షుడు, బీఎండబ్ల్యు గ్రూపు బోర్డు సభ్యుడు పీటర్ స్క్వార్జెనెబ్యూర్ తెలిపారు. -
‘జువ్వ’ ఫస్ట్లుక్ లాంచ్
-
ఇంద్ర చేతుల మీదుగా ఇంద్రసేన ఫస్ట లుక్ లాంచ్
-
బాహుబలి బరిలో దిగుతున్నాడు
బాహుబలి.. భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికల మీద సగర్వంగా నిలబెట్టిన విజువల్ వండర్. ఇప్పటికే ఎన్నో రికార్డ్లను సొంతం చేసుకున్న ఈ భారీ చిత్రం ఇప్పుడు సీక్వల్తో మరోసారి సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. తొలి సినిమా సంచలన విజయం సాధించిన నేపథ్యంలో రెండో భాగంపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఇప్పటి వరకు ఒక్క టైటిల్ లోగో తప్ప మరే పోస్టర్ రిలీజ్ చేయకపోయినా సినిమా మీద హైప్ మాత్రం ఓ రేంజ్లో ఉంది. ఆ అంచనాలు మరింతగా పెంచేందుకు తొలి టీజర్ను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు బాహుబలి యూనిట్. ముంబైలో జరుగుతున్న మామీ ఫిలిం ఫెస్టివల్ వేదికగా ఈ రోజు(శనివారం) సాయంత్రం 4 గంటలకకు బాహుబలి 2 తొలి పోస్టర్తో పాటు టీజర్ను కూడా రిలీజ్ చేయనున్నారు. అయితే సినిమా మీద ఉన్న హైప్తో ఈ పోస్టర్ టీజర్లు సోషల్ మీడియా, యూట్యూబ్లలో సరికొత్త రికార్డ్లను సృష్టించటం కాయం అన్న టాక్ వినిపిస్తోంది. ఏప్రిల్ 28న రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమాకు ఈ రోజు నుంచి అధికారంగా ప్రచార కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. తొలి భాగం సక్సెస్లో ప్రమోషన్ ప్రముఖ పాత్ర పోషించిన నేపథ్యంలో రెండో భాగానికి కూడా అదే స్థాయిలో భారీ ప్రచారం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాహుబలి సినిమాతో దర్శకుడు రాజమౌళి కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. -
‘భమ్ బోలేనాథ్ ఫస్ట్లుక్ లాంచ్
-
‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ ఫస్ట్లుక్ లాంచ్
-
ఐస్ క్రీమ్-2 మూవీ ఫస్ట్ లుక్ లాంచ్
-
లేడీస్ & జంటిల్ మెన్ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్
-
పవర్నే ఆయుధంగా...
మాస్ ప్రేక్షకులు ఇష్టపడే హీరోల్లో రవితేజ ఒకరు. ఆయన్ను అభిమానంగా మాస్ మహారాజా అని కూడా పిలుస్తుంటారు. త్వరలో ఆయన ‘పవర్’ అనే మాస్ టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కె.ఎస్.రవీంద్రనాథ్(బాబి)ని దర్శకునిగా పరిచయం చేస్తూ... రాక్లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు రవితేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. టైటిల్కి తగ్గట్టుగా ఇందులో రవితేజ పాత్ర చిత్రణ ఉంటుందని ఈ సందర్భంగా దర్శకుడు చెప్పారు. తనకున్న ‘పవర్’నే ఆయుధంగా చేసుకొని పోరాడిన ఓ పోలీస్ అధికారి కథ ఇదని, రవితేజ మార్క్ ఫన్ కూడా ఇందులో ఉంటుందని ఆయన తెలిపారు. రవితేజ పుట్టినరోజున ఫస్ట్లుక్ని విడుదల చేయడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ కథకు, రవితేజ ఇమేజ్కి సరిగ్గా సరిపోయే టైటిల్ ఇదని నిర్మాత చెప్పారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే చిత్రీకరణతో షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుందని ఆయన తెలిపారు. హన్సిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజీ, ముఖేష్రుషి, ఆదిత్యమీనన్, ‘మిర్చి’ సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖావాణి, జోగి బ్రదర్స్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: కోన వెంకట్, సంగీతం: తమన్, కెమెరా: ఆర్ధర్ ఎ.విల్సన్, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మకడలి. -
'క్రిస్ 3' ఫస్ట్ లుక్