Folk Singer
-
సింగర్ శృతి మృతికి కారణం అదే..?
-
ఇన్స్టాతో పాపులర్.. ఫోక్ సింగర్ 'శృతి' ఆత్మహత్య
ఇన్స్టాగ్రామ్తో సోషల్మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న ఫోక్ సింగర్ శృతి ఆత్మహత్యకు పాల్పడటం ఆమె ఫాలోవర్స్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె ఎక్కువగా జానపదాలు పాడుతూ ఎందరినో అభిమానులను సంపాదించుకుంది. జీవితంలో పెద్ద సింగర్ కావాలని ఎన్నో కలలు కన్నది. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ సంగీత కార్యక్రమాలు జరిగినా సింగర్ శృతి తప్పకుండా కనిపిస్తుంది. అయితే, ఇప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో అభిమానులు కూడా షాక్ అయ్యారు.ఇన్స్టాగ్రామ్తో పరిచయమై.. మూడు ముళ్లతో ఒకటై.. పట్టుమని నెల గడవకముందే నవ వధువు సింగర్ శృతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. జగదేవ్పూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి ఎర్ర భిక్షపతి, సత్యమ్మ దంపతుల కుమారుడు ఎర్ర దయాకర్ హైదరాబాద్లో క్యాబ్ నడపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తిమ్మాపూర్ గ్రామానికి శ్యామల, రమేశ్ కుతూరు, ఫోక్ సింగర్(యూట్యూబ్) శృతి (26) ఇన్స్టాగ్రామ్లో పేరడి పాటలతో ఫేమస్ అయ్యింది. ఇన్స్టాగ్రామ్ వల్ల ఇద్దరి మధ్య కొన్ని నెలల కిందట పరిచయం ఏర్పడి ప్రేమపెళ్లి వరకు వచ్చింది. ఇద్దరి ప్రేమ విషయం ఇరువురి తల్లిదండ్రులకు తెలిసింది. యువతి తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితుల కారణంగా పెళ్లికి కొద్ది రోజులు ఆగాలని చెప్పడంతో వేచి చూశారు. కానీ అనివార్య కారణాల వల్ల నవంబర్ 27న పీర్లపల్లి గ్రామంలో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే, వారి పెళ్లికి యువతి తల్లిదండ్రులు, బంధువులు హాజరు కాలేదు. నవ దంపతులు పీర్లపల్లిలోనే ఉంటున్నారు. బుధవారం గ్రామంలోనే దయాకర్ వాళ్ల కులానికి చెందిన వారి దశదినకర్మకి తల్లిదండ్రులతో కలిసి వెళ్లారు. మధ్యాహ్న సమయంలో శృతిని కూడా తీసుకెళ్లడానికి దయాకర్ ఇంటికి రాగా ఉరేసుకొని కనిపించింది. వెంటనే స్థానికులకు, శృతి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.నాలుగు నెలల గర్భిణిప్రస్తుతం శృతి నాలుగు నెలల గర్భిణి కాగా ఇంటి వద్దనే ఉంటుంది. కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్య చేసుకొని ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. వరకట్నం కోసమే శృతిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి వద్ద ఇరువురి కుటుంబాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు సముదాయించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. -
ప్రముఖ ఫోక్ సింగర్పై అత్యాచార కేసు.. యువతి ఫిర్యాదు
యూట్యూబ్లో తన పాటలతో గుర్తింపు తెచ్చుకున్న ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్పై లైంగిక ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదుచేశారు. తెలంగాణలోని జగిత్యాలకు చెందిన సుద్దాల మల్లిక్ తేజ ఎన్నో పాటలు రచించడమే కాకుండా పాడటం కూడా జరిగింది. ఆయన ఎక్కువగా జానపద గీతాలు, ఫోక్ సాంగ్స్, తెలంగాణ ప్రాంతీయ పాటలతో ఫేమస్ అయ్యాడు. ఆయన పాటలకు అత్యధిక వ్యూస్ కూడా ఉన్నాయి.జగిత్యాలకు చెందిన ఒక యువతికి సింగర్గా అవకాశం ఇచ్చాడు. ఆమెతో కలిసి మల్లిక్ తేజ్ చాలా సాంగ్స్ పాడటం కూడా జరిగింది. వారిద్దరూ హైదరాబాద్, దుబాయ్తో పాటు పలుచోట్లు అనేక ఈవెంట్లు కూడా నిర్వహించారు. ఈ క్రమంలో మల్లిక్ తేజ్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని జగిత్యాల పోలీసులకు ఆ యువతి ఫిర్యాదు చేసింది. ఛాన్సుల పేరుతో తనను వేధిస్తున్నట్లు ఫిర్యాదులో ఆమె పేర్కొంది. తనకు సంబంధించిన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్స్ మార్చేసి పలు ఇబ్బందులు పెడుతున్నట్లు బాధితురాలు తెలుపుతుంది. బ్లాక్ మెయిల్ చేసి స్టూడియోలోనే తనపై మల్లిక్ తేజ్ అత్యాచారం చేశాడని ఆమె పేర్కొంది. తరచూ ఫోన్ చేసి వేధిస్తూన్నాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. చిత్రపరిశ్రమ, సోషల్మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న వారిపై ఇలాంటి కేసులే నమోదయిన విషయం తెలిసిందే. వారిలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఒకరు కాగా.. ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి ఉన్నారు. -
పెళ్లి పీటలెక్కనున్న 'పల్సర్ బైక్' రమణ.. గ్రాండ్గా ఎంగేజ్మెంట్
పల్సర్ బైక్ సాంగ్తో ఫుల్ ఫేమస్ అయ్యాడు జానపద కళాకారుడు సింగర్ రమణ. ఈ పల్సర్ బైక్ సాంగ్ను రవితేజ ధమాకా మూవీలోనూ వాడేశారు. ఈ ఒక్కటేనా.. 'పొట్టిదాయి కాదమ్మో గట్టిదాయమ్మో..', 'వస్తావా.. భాను వస్తావా..' ఇలా ఎన్నో ఫోక్ సాంగ్స్ పాడాడు. బుల్లితెర షోలలో, ఈవెంట్లలో పాటలు పాడుతూ ఊహించని స్థాయిలో పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆ మధ్య బేబి 2 పేరుతో ఓ షార్ట్ ఫిలిం కూడా చేశాడు. తన జీవితంలో జరిగిన రియల్ బ్రేకప్ స్టోరీ ఆధారంగా ఈ లఘు చిత్రాన్ని తీసినట్లు తెలిపాడు. ఇకపోతే రమణ ఓ శుభవార్త చెప్పాడు. త్వరలో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు వెల్లడించాడు. డిసెంబర్ నెలాఖరులో అతడి ఎంగేజ్మెంట్ జరగ్గా.. అందుకు సంబంధించిన వీడియోను యూట్యూబ్లో రిలీజ్ చేశాడు. కుందన శ్రీ అనే అమ్మాయితో అతడి నిశ్చితార్థం జరిగింది. వీరిద్దరూ స్టేజీపై ఒకరికొకరు ఉంగరాలు మార్చుకుని ఫోటోలకు పోజిచ్చారు. పనిలో పనిగా ఎంగేజ్మెంట్ వేదికపైనే ప్రీవెడ్డింగ్ షూట్ కూడా పూర్తి చేసినట్లు కనిపిస్తోంది. ఇక ఈ వీడియో వైరల్గా మారగా కొత్త జంటకు అభిమానులు శుభాకాంక్షలు చెప్తున్నారు. చదవండి: అమ్మ మరణం.. రోదిస్తూ గదిలోకి వెళ్లా.. ఎమోషనలైన శ్రీదేవి పెద్ద కూతురు -
అప్పటికే సూపర్ స్టార్,రెండో పెళ్లి.. ఇప్పటికీ మిస్టరీగా చమ్కీలా మరణం
మనసులో పుట్టిన మాటలకు బాణీ కట్టి రాగం అందుకుంటే, అది మహామహా జనసందోహాలను కూడా ఏకం చేసి ఉరకలేయిస్తుంది. సై.. సై.. అంటూ ఉర్రూతలూగిస్తుంది. విప్లవాలను, ఉద్యమాలను, సంస్కరణలను జతచేర్చి.. తరతరాలకు పాఠమవుతుంది. అయితే అదే రాగం కొందరికి చేదును, మరికొందరికి చికాకును ఇంకొందరిలో అసూయనూ రగిలించి నిప్పు రాజేస్తుంది. ఆ నిప్పే కాల్చేసిందో, లేక అంతటి ఔదార్యమున్న కలానికి కులం రంగు అద్దిన ఉన్మాదమే కడతేర్చిందో.. తెలియదు కానీ అమర్ సింగ్ చమ్కీలా జీవితంలో పెద్ద ఉపద్రవమే ముంచుకొచ్చింది. అసలు ఎవరీ చమ్కీలా? ఏం జరిగింది? భారతీయ సంగీత చరిత్రలో చమ్కీలా కథకు ప్రత్యేకమైన అధ్యాయముంది. చమ్కీలా అంటే పంజాబీలో ప్రకాశవంతమైనదని అర్థం. పంజాబ్, లూథియానా సమీపంలోని దుగ్రీ గ్రామంలో చమార్ (దళిత్) కులానికి చెందిన కర్తార్ కౌర్, హరిరామ్ సింగ్ దంపతులకు 1960 జూలై 21న చమ్కీలా జన్మించాడు. అతని అసలు పేరు ధనీరామ్. చిన్నవయసులోనే గుర్మైల్ కౌర్ అనే బంధువుల అమ్మాయితో పెళ్లి జరిగింది. వీరికి అమన్దీప్ కౌర్, కమన్ చమ్కీలా (ప్రస్తుతం ఫోక్ సింగర్) అనే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. మరో కొడుకు పుట్టి.. అనారోగ్యంతో చనిపోయాడు. మొదటి నుంచి ఎలక్ట్రీషియన్ కావాలని ఆశపడిన ధనీరామ్.. ఆ ఆలోచనను పక్కనపెట్టి.. ఆర్థిక కష్టాలను ఎదుర్కోవడానికి దుస్తుల మిల్లులో చేరాడు. అక్కడ ఓ స్నేహితుడు ఇతని రాతకు ముగ్ధుడై.. సురీందర్ షిండా అనే ఓ సంగీతవిద్వాంసుడి దగ్గరకు తీసుకెళ్లాడు. ధనీరామ్ కథలో, పేరులో మార్పులు అక్కడి నుంచే మొదలయ్యాయి. చమ్కీలా (ధనీరామ్) టీమ్లో చేరినప్పటి నుంచి షిండా పేరు దేశవిదేశాలకు పాకింది. చమ్కీలాకు మాత్రం గుర్తింపు దక్కలేదు. పైగా ఇతర దేశాల్లో ప్రదర్శనలకు చమ్కీలాను తీసుకెళ్లడానికి షిండా ఇష్టపడేవాడు కాదు. 1980లో ఒకసారి షిండా.. కెనడా పర్యటనకు వెళ్లినప్పుడు ఆ గ్రూప్లోని సోనియా అనే మరో గాయని చమ్కీలాను కలిసింది. ‘షిండాను దాటి నీకు గుర్తింపు రావాలంటే.. నేను కొత్తగా ప్రారంభిస్తున్న బృందంలో చేరు’ అని చెప్పడంతో చమ్కీలా సరే అన్నాడు. సోనియా పెట్టుబడి పెడితే.. చమ్కీలా తన ఆలోచనలకు మరింత పదునుపెట్టి.. ఆమె దగ్గరే జీతానికి కుదిరాడు. అనుకున్నట్లే షిండా కెనడా నుంచి పంజాబ్ వచ్చేలోపు.. సోనియా ఆధ్వర్యంలో ఎనిమిది యుగళగీతాలను విడుదల చేసి పంజాబ్ని ఓ ఊపు ఊపాడు చమ్కీలా. అయితే ఆ ఏడాది చివరికి.. సోనియా, ఆమె భర్త కలసి.. తన కారణంగా లక్షలు సంపాదిస్తూ, తనకు నెల జీతం మాత్రమే ఇస్తున్నారని గ్రహించాడు. దాంతో చమ్కీలా.. తానే ఒక రంగస్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లే హార్మోనియం, ఢోలక్ వాయించగలిగే బృందంతో పాటు.. అమర్జోత్ కౌర్ అనే ఒక మహిళా గాయనినీ తన టీమ్లోకి తీసుకుని.. ఆల్బమ్స్ రిలీజ్ చేయడం మొదలు పెట్టాడు. రిలీజ్ చేసిన ప్రతి ఆల్బమ్ హిట్ కొట్టడంతో చమ్కీలా పంజాబ్ సూపర్ స్టార్ అయ్యాడు. చమ్కీలా పాటల్లో కొన్ని.. ‘పెహెలే లల్కార్ నాల్ (తొలుత బాకా మోగింది)’ ఇది పెళ్ళైన జంట గురించి పాడిన పాట. ‘బాబా తేరా నన్కానా (బాబా నీ మందిరం, నీ గురువు గురునానక్)’ ఇది సిక్కులకు ధైర్యం చెప్పే పాట. ‘భూల్ గయీ మై ఘుండ్ కడ్నా (ముసుగు వేసుకోవడం మరచాను)’.. లాంటి పాటలూ ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఆ సమయం లోనే అతనికి అమర్ జోత్తో స్నేహం కుదిరింది. ఆ స్నేహం ప్రేమగా మారి.. పెళ్లిదాకా వెళ్లింది. మొదటి భార్య గుర్మైల్ని ఒప్పించి (విడాకులు తీసుకున్నాడని కొందరంటారు).. 1983లో అమర్జోత్ని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి జైమన్ (ప్రస్తుత ఫోక్ సింగర్) అనే కొడుకు పుట్టాడు. వివాహేతర సంబంధాలు, మత సంఘర్షణలు, మద్యపానం, వరకట్నాలు, మాదకద్రవ్యాలు.. ఇలా ప్రతి సమస్యపైనా పాట కట్టి.. ప్రజలను ఆలోచింపచేసేవాడు చమ్కీలా. వేడుక ఏదైనా.. ప్రతి ఊళ్లో అతని దరువు వినిపించాల్సిందే. ఏడాదికి ఊరూరా 366 ప్రత్యక్ష ప్రదర్శనలు చేసేవారంటే చమ్కీలా దంపతులు ఎంత బిజీగా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. 1988 మార్చి 8న మధ్యాహ్నం 2 గంటలకు మెహసంపూర్ సమీపంలోని ప్రదర్శనకు వెళ్తుంటే.. ముసుగులేసుకున్న కొందరు దుండగులు బైక్స్ మీదొచ్చి చమ్కీలా కారుకు అడ్డుపడ్డారు. మరుక్షణమే తుపాకులతో తూటాల వర్షం కురిపించారు. ఆ దాడిలో చమ్కీలా(27), అమర్జోత్ అక్కడికక్కడే కన్నుమూశారు. ఆ సమయంలో అమర్జోత్ గర్భవతి. సంఘటనా స్థలంలో ఉన్న కొందరు గ్రామస్థులు.. ఆ దుండగులను వెంబడించినా దొరకలేదు. దాంతో ఎవరు చంపారు? అనేది నేటికీ మిస్టరీగా మిగిలిపోయింది. నిజానికి ఈ హత్యకేసుపై చాలా ఊహాగానాలున్నాయి. అప్పటి ఖలిస్తాన్ ఉద్యమానికి వ్యతిరేకంగా పాటలు రాసినందుకే సిక్కు ఉగ్రవాదులు చమ్కీలాను చంపేశారని కొందరి అభిప్రాయం. కొన్ని సంగీత బృందాలు కేవలం చమ్కీలా వల్లే మరుగున పడ్డాయని.. ఆ అక్కసుతోనే వారంతా కలసి అతనిని చంపించారని మరి కొందరి ఊహ. మరోవైపు చమ్కీలా రెండో భార్య అమర్జోత్ ఉన్నత వర్గానికి చెందిన స్త్రీ కావడంతో.. ఇది పరువు హత్య అని.. అమర్జోత్ కుటంబీకులే ఈ నేరానికి పాల్పడి ఉంటారని ఇంకొందరి వాదన. ఇతడి జీవితకథపై చాలా సినిమాలు, పుస్తకాలూ విడుదలయ్యాయి. వాటిలో కొన్ని వివాదాల పాలయ్యాయి. ఏది ఏమైనా చమ్కీలా గొంతు మూగబోయి 35 ఏళ్లు దాటింది. అయినా నేటికీ జానపద సంగీత ప్రియులకు అతడి పాట వినిపిస్తూనే ఉంది. ∙సంహిత నిమ్మన -
గద్దర్ అంత్యక్రియలు.. తరలివచ్చిన జనసంద్రం (ఫొటోలు)
-
గద్దర్ చేసిన ఆ పనులు విస్మయం కలిగించాయి.. ఎందుకిలా?
జనం గుండె చప్పుడులా మోగిన ఆ పాట దరువు ఆగింది. మద్దెల మోతల్ల విరబూసిన ఆ పదాల తోట వాడింది. ఉద్యమంలా జనాన్ని చైతన్యంవైపు నడిపించిన ఆ పాట పడమటి దిక్కున అస్తమించింది. కామ్రేడు గద్దరన్నా! కానరాని లోకాలకు పోయిండు, తన పాటను మన యాదిలో వదిలేసి! -సాక్షి, హైదరాబాద్ ప్రజా బాహుళ్యాన్ని తన పాటలతో ఉర్రూతలూగించిన ప్రజా గాయకుడు గుమ్మడి విఠల్ అలియాస్ గద్దర్ ఆదివారంనాడు అనారోగ్య కారణాలతో దివికేగారు. తొలి నుంచి పూర్తిస్థాయి మావోయిస్టుగా, సానుభూతిపరుడిగా ఉన్న గద్దర్.. జీవిత చరమాంకంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు, చేసిన పనులు విస్మయం కలిగించాయి. తన కర్రకు కట్టిన ఎర్ర జెండాను విప్పేయడం, సూటూబూటు ధరించడం, అచ్చమైన కమ్యూనిస్టు అయి ఉండీ.. ఎన్నికల్లో ఓటు వేయడం, గుళ్లకు, స్వామీజీల వద్దకు వెళ్లడంపై ఆశ్చర్యం వ్యక్తమైంది. మావోయిస్టులు తీవ్రంగా వ్యతిరేకించే చంద్రబాబు కడుపులో తలపెట్టడం, కాంగ్రెస్ వారి వేదిక ఎక్కడం, ప్రధాని మోదీ సభకు ఆహ్వానం లేకున్నా వెళ్లడం వంటివీ చర్చనీయాంశంగా మారాయి. రానున్న లోక్సభ ఎన్నికల్లో గద్దర్ పెద్దపల్లి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం కూడా జరిగింది. -
ముగిసిన గద్దర్ అంత్యక్రియలు
►గద్దర్ అంత్యక్రియలు ముగిశాయి.. రాత్రి 8గంటల ప్రాంతంలో అధికారిక లాంఛనాలతో బౌద్ధ మత ఆచారంలో గద్దర్ అంత్యక్రియలు నిర్వహించారు. ► గద్దర్ అంత్యక్రియల్లో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో గద్దర్కు అత్యంత ఆప్తుడిగా పేరున్న జహీరుద్దీన్ అలీఖాన్ మృతి చెందారు. ► బౌద్ధ ఆచారాల ప్రకారం గద్దర్ అంత్యక్రియలు.. ► గద్దర్ అంత్యక్రియలకు భారీగా తరలివచ్చిన జనం.. అభిమానులను అదుపుచేయలేక పోతున్న పోలీసులు.. ► గద్దర్ ఇంటికి చేరుకున్న సీఎం కేసీఆర్.. ఘనంగా నివాళులు అర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ► అల్వాల్కి చేరుకున్న అంతిమ యాత్ర ► పార్టీలకు అతీతంగా అంతిమ యాత్రలో పాల్గొన్న నేతలు ► సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్కు గద్దర్ అంతిమయాత్ర చేరుకుంది. అశేష జనవాహిని మధ్య అంతిమయాత్ర కొనసాగుతోంది. ►మధ్యాహ్నం 2.30 నిమిషాల తరువాత సీఎం కేసీఆర్ గద్దర్ ఇంటికి చేరుకోనున్నారు. ►కాసేపట్లో మహా భోది విద్యాలయ లో గద్దర్ అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. పోలీసులు పాఠశాల ప్రాంగణానికి చేరుకున్నారు. రిహార్సల్ నేపథ్యంలో సెట్ రైట్ అయిన పోలీసులు. ప్రభుత్వ లాంచనాలతో మధ్యాహ్నం గద్దర్ అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. ►అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్న గద్ధర్ అంతిమ యాత్ర ► గద్దర్ అంతిమ యాత్రలో కళాకారులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. అంతిమ యాత్ర సందర్భంగా పోలీసులు అల్వాల్ భూదేవినగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. ► గద్దర్ అంతిమ యాత్ర వాహానానికి జై బీం జెండాలతో పాటు బుద్దిడి పంచశీల జెండాలను జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు. ►ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ అంతిమయాత్ర ప్రారంభమైంది. గన్పార్క్, అసెంబ్లీ, నెక్లెస్రోడ్లోని అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక స్థూపం, ట్యాంక్బండ్, జేబీఎస్, తిరుమల మీదుగా అల్వాల్ చేరనుంది. గద్దర్ ఇంటివద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణంతో తెలంగాణ పాట మూగబోయింది. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ఆయన మృతి పట్ల అందరూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సందర్శనార్థం ప్రస్తుతం గద్దర్ పార్థివదేహాన్ని ఎల్బీ స్టేడియంలో ఉంచారు. గద్దర్ పార్థివ దేహాన్ని ప్రముఖులు సందర్శించి నివాళులు ఘటించారు. ► అల్వాల్ భూదేవి నగర్లోని మహాభోది విద్యాలయంలో గద్దర్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహాభోధి విద్యాలయంలోని గ్రౌండ్ వెనకాల సమాధి కోసం చేస్తున్న ఏర్పాట్లను గద్దర్ కూతురు వెన్నెల దగ్గరుండి చూసుకుంటున్నారు. ఏర్పాట్లను డీసీపీ సందీప్రావు పరిశీలిస్తున్నారు. ►గద్దర్ పార్థివదేహానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాళులు అర్పించారు. ఆయనతోపాటు కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్ మానిక్ రావు థాక్రే, జానారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజనీ కుమార్ యాదవ్, అజారుద్దీన్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, బూర న్సయ్య గౌడ్, గరికపాటి నర్సింహరావు నివాళులు అర్పించారు, ►గద్దర్ అంతిమ యాత్ర వాహానాన్ని జీహెచ్ఎంసీ అధికారులు. సిద్ధం చేశారు. వాహానానికి జై బీం జెండాలతో పాటు బుద్దిడి పంచశీల జెండాలను ఏర్పాటు చేశారు. గద్దర్ పార్దివదేహానికి వీచ్ హనుమంతరావు నివాళులు అర్పించారు ►రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఖమ్మం సభలో దివించారు: వీహెచ్ ►గద్దర్ మరణం పట్ల రాహుల్ తన ఆవేదన తెలియజేశారు. ►గద్దర్ చనిపోయినా గద్దర్ కోరుకున్నట్లు గా రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు.. గద్దర్ చనిపోవడం బాధాకరం: మాజీమంత్రి జానారెడ్డి ► గద్దర్కు ఉన్న స్ఫూర్తి యువత నేర్చుకోవాలి. ►నేను హోం శాఖామంత్రిగా మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపిన్నప్పుడు గద్దర్ సూచనలు సేకరించాం. ►తన సూచనాలతోనే అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులను హైదరాబాద్కు రప్పించాం. ►మావోయిస్టులతో ప్రభుత్వం చర్చల్లో గద్దర్ మధ్యవర్తిత్వం వహించారు. ►అమరుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఎన్నోసార్లు నన్ను ఆనాడు కలిశాడు ►గద్దర్ పార్థివ దేహానికి సుప్రీంకోర్టు మాజీ సీజే ఎన్వీరమణ నివాళులు అర్పించారు. గద్దర్ తన రూమ్ మెట్ అని, రిటైర్మెంట్ తర్వాత తనను రాజకీయాల్లో రావాలని గద్దర్ కోరారని చెప్పారు. ► ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ నివాళులు అర్పించారు. ►గద్దర్ పార్ధివదేహానికి తెలంగాణ విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాళులు అర్పించారు. ►ఎల్బీ స్టేడియంలో గద్దర్ పార్థివ దేహానికి టీపీసీ రేవంత్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మండలి చైర్మన్ స్వామి గౌడ్, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, తదితరులు నివాళులు అర్పించారు. ►నటుడు మోహన్ బాబు, బండ్ల గణేష్, మంచు మనోజ్, సింగర్ మధు ప్రియ గద్దర్కు నివాళులు అర్పించారు. ►అల్వాల్లోని గద్దర్ నివాసం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పిస్తారు. ►తెలంగాణ ఉద్యమంలో గద్దర్ కీలక పాత్ర పోషించారు. 74 ఏళ్ల వయసులో కూడా గోష్టిగొంగడితో సమాజాన్ని మేల్కొలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా: స్పీకర్ పోచారం ►గద్దర్ అంటే మెదక్.. మెదక్ అంటే ఉద్యమాలు: ఎమ్మెల్యే రఘునందన్ రావు ►వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని గద్దర్ కోరుకున్నారు. ►4 దశాబ్దాల ఆశయ సాధక కోసం పోరాటం చేసి.. దానికి దూరం అయ్యారు. ►గద్దర్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నా. గద్దర్ మృతి బాధాకరం: కిషన్ రెడ్డి గద్దర్ పార్ధివ దేహానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు. గద్దర్ మృతి బాధాకరమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సమస్యలపై తిరుగులేని పోరాటం చేసిన ఉద్యమకారుడని కొనియాడారు. తన గొంతు ద్వారా తెలుగు సమాజానికే కాకుండా యావత్ భారతదేశానికి రోల్మాడల్గా నిలిచారని ప్రశంసించారు. గద్దర్ అనారోగ్యంతో మృతి చెందడం ప్రతి ఒక్కరికి బాధ కలిగించిన విషయమని అన్నారు. ‘నాకు గద్దర్తో వ్యక్తిగతంగా మంచి సంబంధం ఉంది. నేను లేకున్నా మా ఇంటికి వచ్చి భోజనం చేసే వాళ్ళు. ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఉండాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి. * ఆయన కలగన్న రాజ్యం రాకముందే స్వర్గస్తులయ్యారు. చివరి కోరిక తిరకముందే కాలం చెల్లించారు. గద్దర్ మనల్ని విడిచి వెళ్లిపోవడం దూరంగా మరి వెళ్లిపోవడం నిజంగా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ సమాజాని, కవులు, కళాకారులకు, తెలంగాణ ఉద్యమకారులకు, మేధావులకు ఎంతో బాధాకరం. గద్దర్ ఆకస్మిక మృతికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ వారి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం’ అని తెలిపారు సాక్షి, హైదరాబాద్: గద్దర్ అంతిమయాత్ర మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీనగర్ స్టేడియం నుంచి ప్రారంభం కానుంది. కళాకారులతో భారీ ర్యాలీగా గద్దర్ పార్థివదేహాన్ని తీసుకెళ్లనున్నారు. కళాకారులు, ఉద్యమకారులు, పలు రాజకీయ పార్టీ నేతలు ఈ అంతిమయాత్రలో పాల్గొననున్నారు. స్టేడియం నుంచి బషీర్బాగ్ చౌరస్తా, జగ్జీవన్రామ్ విగ్రహం మీదుగా.. గన్పార్క్ వైపు సాగనుంది. గన్పార్క్లోని అమరవీరుల స్థూపం వద్దకు గద్దర్ పార్ధివ దేహం చేరుకోగా.. కాసేపు అక్కడ పాటలతో కళాకారులు నివాళులు అర్పించనున్నారు. అనంతరం అమరవీరుల స్థూపం నుంచి సికింద్రాబాద్ మీదుగా భూదేవినగర్లోని తన నివాసానికి చేరుకోనుంది. అల్వాల్్ మహాబోధి గ్రౌండ్స్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. -
గద్దర్కు ఎన్నో ఆహ్వానాలు.. అయినా విమానం ఎక్కలేదు, విదేశాలకు పోలేదు
మంచిర్యాలఅర్బన్: గద్దర్ గళం..దేశవిదేశాల్లో ఎందరో అభిమానాన్ని చూరగొన్నది. ఆయన పాట వినేందుకు విదేశాల నుంచి అభ్యుదయ, సాంస్కృతిక సంఘాల నుంచి ఆహ్వానం వచ్చినా విమానం ఎక్కి వెళ్లలేకపోయారు. 1997, ఏప్రిల్ 6న ఆయనపై కాల్పులు జరగ్గా, ఆరు బుల్లెట్లు శరీరంలోకి చొచ్చుకుపోయాయి. ఐదు బుల్లెట్లను తొలగించిన వైద్యులు, వెన్నుపూసలో ఉన్న మరో బుల్లెట్ తొలగిస్తే ప్రాణానికే హాని ఉంటుందని చెప్పారు. దీంతో అప్పటి నుంచి ఆ బుల్లెట్ శరీరంలోనే ఉండిపోయింది. దేశంలో ఇతర రాష్ట్రాల పర్యటనకు ఎయిర్పోర్ట్కు గద్దర్ వెళ్లినా, తనిఖీల్లో స్కానర్లో బుల్లెట్ చూపడం, అధికారులకు సమాధానం చెప్పడంలో అనేకసార్లు ఇబ్బంది పడినట్టు తెలిసింది. శరీరంలో బుల్లెట్, కేసులు పాస్పోర్టు జారీకి అడ్డంకిగా మారాయి. దీంతో ఎన్ని ఆహా్వనాలు వచ్చినా విమానం ఎక్కి విదేశాలకు వెళ్లలేకపోయారు. ► 1980 సమయంలో నక్సల్స్తో కలసి అజ్ఞాతంలోకి వెళ్లారు. ► పీపుల్స్వార్ పార్టీ నిర్ణయం మేరకు 1982లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి కాలపు జననాట్యమండలి సభ్యుడిగా పనిచేశారు. ► 1990 ఫిబ్రవరి 18న తిరిగి బహిరంగ జీవితంలోకి అడుగుపెట్టారు. ► 1995లో పీపుల్స్వార్ పార్టీ గద్దర్ను బహిష్కరించింది. ఆయన తీవ్రంగా ఆవేదనకు గురవడంతో తిరిగి పార్టీలోకి ఆహా్వనించింది. 25 ఏళ్లుగా వెన్నులో బుల్లెట్తో గద్దర్పై చాలా సార్లు హత్యాయత్నాలు జరిగాయి. నల్లదండు ముఠా, బ్లాక్ టైగర్స్, గ్రీన్ టైగర్స్ ముఠాలు ఆయనను చంపడానికి ప్రయత్నించాయి. ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 1997 ఏప్రిల్ 6న గద్దర్పై హత్యాయత్నం జరిగింది. గ్రీన్టైగర్స్ పేరుతో కొందరు ఆగంతకులు ఆయనపై కాల్పులు జరిపారు. ఆయన ప్రాణాలకు ప్రమాదమని ఒక బుల్లెట్ను వదిలేశారు. దీనితో దాదాపు 25 ఏళ్లుగా ఆ బుల్లెట్ గద్దర్ ఒంట్లోనే ఉండిపోయింది. ‘‘రాష్ట్ర అణచివేతకు చిహ్నంగా నా వెన్నెముకలో బుల్లెట్ అలాగే ఉంది. దానితో నాకు భయమేమీ లేదు, ఏ ప్రభావమూ పడలేదు. నా లక్ష్యాలకు కట్టుబడి ప్రజల కోసం పనిచేస్తూనే ఉన్నా..పనిచేస్తూనే ఉంటా..’’ అని గద్దర్ తరచూ గుర్తు చేసుకునేవారు. -
భారతదేశంలోని టాప్ 10 జానపద గాయకులు
-
కళాకారుడికి అశ్రునివాళి: ముగిసిన సాయిచంద్ అంత్యక్రియలు
Telangana Folk Singer Sai Chand Last Rites Updates ► గాయకుడు, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్కు బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా తుది వీడ్కోలు పలికాయి. వనస్థలీపురం సాహెబ్నగర్ శ్మశాసనవాటికలో సాయిచంద్ అంత్యక్రియలు జరిగాయి. చితికి సాయిచంద్ కొడుకు నిప్పంటించారు. ► గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఆయన వెంట మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. సాయి చంద్ భౌతిక కాయానికి నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ క్రమంలో సాయి చంద్ భార్య భావోద్వేగానికి లోనై రోదించగా.. కేసీఆర్ ఆమెను ఓదార్చారు. ► తెలంగాణ జానపద కళాకారుడు, ఉద్యమ గాయకుడు సాయి చంద్ భౌతిక కాయాన్ని చూసి కేసీఆర్ కంటతడి పెట్టారు. ► తెలంగాణ సమాజం ఓ గొప్ప కళాకారుడిని కోల్పోయింది. సాయి చంద్ కుటుంబానికి అండగా ఉంటాం: సీఎం కేసీఆర్ ► కాసేపట్లో గుర్రం గూడకు ముఖ్యమంత్రి కేసీఆర్.. సాయి చంద్ భౌతిక కాయానికి నివాళులు ► సాయి చందు పార్థివదేహానికి నివాళులర్పించిన ప్రజా యుద్ధనౌక గద్దర్ ► సాయిచంద్ మృతిపై సంతాప ప్రకటన వెలువరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. సాయిచంద్ నివాసానికి వెళ్లి ఆ కుటుంబాన్ని ఓదార్చారు. సాయిచంద్ మృతదేహానికి నివాళులర్పించిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. ‘‘రాతి గుండెల్ని సైతం కరిగించిన గాత్రం సాయిచంద్ది. మా అందరికీ ఆత్మీయుడతను. చనిపోయడనే వార్త జీర్ణించుకోలేక పోతున్నం. ఆయన లేని లోటు తీర్చలేదు. హైదరాబాద్లో ఉంటే బ్రతికే వాడేమో!. అత్యంత చిన్న వయస్సులోనే చనిపోవడం బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి అని పేర్కొన్నారు. ► సాయి చంద్ పాటలు అందరినీ కదిలిస్తాయ్: మంత్రి తలసాని ► సాయి చంద్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కంట తడి పెట్టారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. ‘‘తమ్ముడు సాయి చంద్ లేడని ఊహించుకుంటేనే బాధ గా ఉంది. చిన్న వయసు లో చనిపోవడం దురదృష్టం. నిజాయితీ గల సైనికుడు సాయి చంద్. తన పాట ఖండాంతరాలు దాటాయి. నా మనుసుకు దగ్గర వ్యక్తి కూడా. చాలా సార్లు మా ఇంటికి వచ్చాడు. సీఎం కెసీఆర్ కూడా తనను ఇంకా ఎక్కువ గౌరవించుకోవాలి అనేవారు. సాయిను మళ్ళీ తిరిగి తెచ్చుకోలేం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను ► తెలంగాణ ఉద్యమ గాయకుడు, బీఆర్ఎస్ నేత.. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్(39) హఠాన్మరణం చెందారు. సీఎం కేసీఆర్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. గుర్రంగూడలో ఉన్న ఆయన భౌతికకాయానికి ప్రముఖులు వెళ్లి నివాళులు అర్పించి.. ఆయన కుటుంబాన్ని ఓదారుస్తున్నారు. కన్నీటితో నివాళులర్పిస్తున్నారంతా. ► తెలంగాణ కళాకారుడు, మలిదశ ఉద్యమ సమయంలో తన గాత్రంతో ఉద్యమకారుల్లో స్ఫూర్తిని రాజేసిన గాయకుడు సాయిచంద్ హఠాన్మరణం.. యావత్ తెలంగాణ సమాజాన్ని దిగ్భ్రాంతికి లోను చేసింది. కేవలం 39 ఏళ్ల వయసులో.. అదీ ఉన్నపళంగా గుండెపోటుతో కన్నుమూయడాన్ని కుటుంబ సభ్యులు, అతన్ని అభిమానించేవాళ్లు తట్టుకోలేకపోతున్నారు. ఇదీ చదవండి: ఉద్యమ పాట.. ఆగింది -
ప్రముఖ కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ హఠాన్మరణం
-
తెలంగాణ కళాకారుడు సాయిచంద్ హఠాన్మరణం
సాక్షి, హైదరాబాద్: ఉద్యమ పాట ఊపిరి వదిలింది. తెలంగాణ కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్(39) హఠాన్మరణం చెందారు. గత అర్ధరాత్రి గుండెపోటుకి గురైన ఆయన్ని ఆస్పత్రులకు తరలించగా.. చివరకు ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లిలోని కారుకొండ ఫామ్హౌజ్కు నిన్న ఆయన తన కుటుంబ సభ్యులతో వెళ్లారు. అయితే.. అర్ధరాత్రి ఆయన అస్వస్థతకు గురికాగా.. స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అక్కడ పరిస్థితి విషమించడంతో.. గచ్చిబౌలి కేర్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే.. అప్పటికే ఆలస్యం అయ్యిందని.. సాయిచంద్ మృతిచెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. వనపర్తి జిల్లా అమరచింత సాయిచంద్ స్వస్థలం. విద్యార్థి దశ నుంచే గాయకుడిగా మంచి పేరుంది ఆయనకు. ఉద్యమ సమయంలో తన పాటలతో స్ఫూర్తిని రగిల్చారు ఆయన. జానపద పాటలతో సాగే పలు టీవీషోలలోనూ ఆయన సందడి చేశారు. ఉద్యమ కళాకారుడి గుర్తింపు పొందిన సాయిచంద్ను రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ పదవితో గౌరవించింది తెలంగాణ సర్కార్. తాజాగా అమరవీరుల జ్యోతి ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ ఆయన కనిపించారు. చిన్నవయసులోనే సాయిచంద్ హఠాన్మరణం చెందడం దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ పలువురు కళాకారులు, ఉద్యమకారులు, నేతలు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. గతంలో ఆయనకు గుండెపోటు ఏమీ రాలేదని.. అనారోగ్య సమస్యలేవీ లేదని.. అర్ధరాత్రి భోజనం దాకా కూడా బాగానే ఉన్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదీ చదవండి: కేసీఆర్కు రాజకీయ గురువు ఈయనే! -
దసరా సినిమా డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు: సింగర్, నటుడు
సింగర్ శ్రీను శ్రీకాకుళం 3,200కు పైగా పాటలు పాడాడు.. అవన్నీ జానపద గీతాలే! శ్రీకాకుళంలోని మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన ఆయన తనే సొంతంగా పాటలు రాసి పాడతాడు కూడా! అలా ఆయన రాసిన ఓ గీతాన్ని కాస్త అటూఇటుగా మార్చి అల వైకుంఠపురములో చిత్రంలో సిత్తరాల సిరపడుగా తీసుకొచ్చారు. సినిమాల్లోకి రావాలన్న ఆసక్తితో చిన్నతనంలోనే చెప్పాపెట్టకుండా ఇల్లు వదిలి వచ్చేశాడు శ్రీను. తాజాగా ఆయన తన జర్నీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు . '11 ఏళ్ల వయసులోనే ఇల్లు వదిలి వెళ్లిపోయాను. ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక సిద్దిపేట బస్టాండ్లోనే మూడు రోజులు తిండి లేకుండా గడిపాను. అప్పుడు ఉద్యమం జరుగుతున్న సమయం.. రసమయి బాలకిషన్ పరిచయం కావడంతో ఆయనతో కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను. చాలా సీరియల్స్, సినిమాలకు కూడా పని చేశాను. భీమ్లా నాయక్, సరిలేరు నీకెవ్వడు సినిమాలకు బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్గానూ పని చేశాను. కానీ చాలామంది షూటింగ్ పూర్తయ్యాక డబ్బులివ్వకుండా మోసం చేసేవారు. ఈ విషయం చెప్పొచ్చో లేదో తెలియదు కానీ దసరా సినిమా డబ్బులు నాకింతవరకు ఇవ్వలేదు. 23 మంది ఆర్టిస్టులను గోదావరిఖని తీసుకెళ్లి వారం రోజులు అక్కడే ఉన్నాం. షూటింగ్ అయిపోక తిరిగొచ్చాం. కానీ చిత్రయూనిట్ పైసా ఇవ్వకపోవడంతో నేనే ఆర్టిస్టులకు సగం సగం డబ్బులిచ్చాను. దాదాపు రూ.70వేల దాకా ఖర్చయింది. నేను కూడా మొదట్లో జూనియర్ ఆర్టిస్టుగా, సెట్ బాయ్గా పని చేశాను. జూనియర్ ఆర్టిస్టులను చాలా చీప్గా చూస్తారు. చాలామంది క్యాస్టింగ్ డైరెక్టర్లు వారికిచ్చిన డబ్బులను ఆర్టిస్టులకు సమంగా పంచరు. ఐడీ కార్డు ఉన్న జూనియర్ ఆర్టిస్టులకు రూ.900, ఆ కార్డు లేని వాళ్లకు ఐదారు వందలు, ఒక్కోసారైతే మూడు వందలు కూడా ఇస్తారు. నేను మాత్రం అందరికీ రూ.900 ఇస్తాను' అని చెప్పుకొచ్చాడు సింగర్ శ్రీను. చదవండి: అవును, నేను తండ్రినయ్యా.. ఇకపై కుటుంబానికే సమయం కేటాయిస్తా: ప్రభు దేవా -
కష్టాల్లో ‘బలగం’ మొగిలయ్య.. డబ్బుల్లేక దీనంగా వేడుకోలు
బలగం సినిమా చివరాంకంలో ‘తోడుగా మాతోడుండి.. నీడగా మాతో నడిచి.. నువ్వెక్కాడెల్లినావు కొంరయ్యా..’అంటూ పాటపాడి అందరినీ కదిలించిన గాయకులు మొగిలయ్య, కొమురమ్మ దంపతులు. ఇప్పుడు మొగిలయ్య రెండు కిడ్నీలు చెడిపోయి.. రెండు కళ్లు కనిపించక మంచానికే పరిమితమయ్యాడు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగజంగాల కళాకారులైన ఈ దంపతులకు వారసత్వంగా వచ్చిన తంబూర, దిమ్మస తప్ప మరే ఇతర ఆస్తిపాస్తులు లేవు. (చదవండి: తీవ్ర అనారోగ్యంతో మంచానపడ్డ సింగర్..స్పందించిన మంత్రి) రెండేళ్ల క్రితం కరోనా బారిన పడ్డ మొగిలయ్య ఏడాది క్రితం ఉన్నట్టుండి ఓరోజు కళ్లు తిరిగి పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్తే రెండు కిడ్నీలు పాడయ్యాయని డాక్టర్లు చెప్పారు. అప్పటినుంచి వారానికి మూడు రోజులు వరంగల్ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. వైద్యం కోసం ఇప్పటివరకు రూ.14 లక్షల వరకు ఖర్చయ్యాయి. రూ.10 లక్షల వరకు అప్పు చేశారు. బలగం డైరెక్టర్ వేణు కొంత సాయం చేసినా సరిపోని పరిస్థితి. మొగిలయ్య డయాలసిస్ చేయించుకుంటున్న సమయంలోనే బలగం సినిమాలో అవకాశం వచ్చింది. ‘బీపీ, షుగర్ పెరగడంతో రెండు కళ్లు కనిపించడంలేదు. ఆపరేషన్ చేయాలని, రూ.3 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. కానీ, చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. మనసున్న మారాజులు ఆదుకోవాలి’అని కొమురమ్మ వేడుకుంటోంది. – వరంగల్ డెస్క్ ఆర్థికసాయం చేయదల్చిన వారు పస్తం కొమురమ్మ బ్యాంక్ అకౌంట్ నంబర్: 62306309034 స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా, దుగ్గొండి, వరంగల్ జిల్లా ఐఎఫ్ఎస్సీ కోడ్ : SBIN0020655 గూగుల్పే నంబర్: 90590 98236 ఫోన్పే నంబర్ : 91772 54408 -
అభిమానం అంటే ఇదే.. గాయకుడిపై కరెన్సీ నోట్ల వర్షం
-
జానపద గాయకుడిపై కరెన్సీ నోట్ల వర్షం.. వీడియో వైరల్..
గాంధీనగర్: నటులు, గాయకులు, ఇతర కళాకారులపై కొందరు వినూత్న రీతిలో తమ అభిమానాన్ని వ్యక్తపరుస్తారు. గజరాత్ ప్రముఖ జానపద గాయకుడు కృతిన్ గాధ్వీకి సరిగ్గా ఇలాగే జరిగింది. ఆయన పాటలు పాడుతుండగా.. కొందరు కరెన్సీ నోట్ల వర్షం కురిపించి ఇష్టాన్ని చాటుకున్నారు. ఆయనపై రూ.10, 20, 50, 100 నోట్లు గుమ్మరించారు. 'వల్సాద్ అగ్నివీర్ గో సేవా దళ్' నిర్వహించిన భజన కార్యక్రమంలో ఇలా జరిగింది. మార్చి 11న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వందల మందిని కృతిన్ గాధ్వి తన గాత్రంలో అలరించి ఉత్సాహపరిచారు. అయితే గోవుల సేవ కోసం ఫండ్స్ సేకరించేందుకు ఈ భజన నిర్వహించారు నిర్వహకులు. దీంతో ఈ డబ్బునంతా ఛారిటీకే ఇస్తున్నట్లు గాధ్వీ తెలిపారు. #WATCH | People showered money on singer Kirtidan Gadhvi at an event organised in Valsad, Gujarat on 11th March pic.twitter.com/kH4G1KUcHo — ANI (@ANI) March 12, 2023 విరాళాల సేకరణ కోసం ఇలా భజనలు నిర్వహించడం గుజరాత్లో కొత్తేంకాదు. స్వామి వివేకానంద ఐ టెంపుల్ ట్రస్టు కూడా కొత్త కంటి ఆసుపత్రి కోసం ఇలాంటి కార్యక్రమం నిర్వహించి ఫండ్స్ సేకరించింది. చదవండి: ఇదేం ధమ్కీరా నాయనా.. అండ్రాయిడ్ ఫోన్ ఫ్రీగా ఇచ్చి తెలివిగా రూ.లక్షలు కాజేశారు.. -
యోగి సర్కార్పై సెటైరికల్ సాంగ్.. సింగర్కు నోటీసులు
ప్రముఖ భోజ్పురి గాయని నేహా సింగ్ రాథోడ్కు ఉత్తర ప్రదేశ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. యూపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పాట పాడినందుకు ఆమెకు ఈ నోటీసులు అందాయి. కాగా ఇటీవల కాన్పూర్ అక్రమ ఇళ్లను తొలగిస్తుండగా తల్లీ కూతుళ్లు మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై సెటైర్లు వేస్తూ నేహా సింగ్ ఓ పాట పాడారు. ‘యూపీ మే కా బా సీజన్-2’ పేరుతో ఈ పాటను యూట్యూబ్, ఫేస్బుక్లో విడుదల చేశారు. ఈ క్రమంలోనే నేహా రాథోడ్ పాడిన పాటపై యోగి సర్కార్ సీరియస్ అయ్యింది. ఆ వెంటనే యూపీ పోలీసులు రంగంలోకి దిగారు. గాయని తన పాట ద్వారా ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆరోపిస్తూ సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేశారు. తనకు నోటీసులు రావడంపై గాయని స్పందిస్తూ.. మంగళవారం రాత్రి కాన్పూర్ పోలీసులు తన ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారని పేర్కొంది. తన పాటల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఇదేం తొలిసారి కాదని వెల్లడించారు. ప్రభుత్వం ఎవరికి సమాధానాలు ఇవ్వదని.. కేవలం నోటీసులే జారీ చేస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘జానపద గాయకురాలిగా నా బాధ్యతను నిర్వర్తించడానికి ఎప్పుడూ ప్రయతిస్తాను. జానపద పాటల ద్వారా ప్రభుత్వాలపై ప్రశ్నలు లేవనెత్తాను. యూపీ సర్కార్కు వ్యతిరేకంగా ప్రశ్నలను లేవనెత్తడానికి నేను 'కా బా' ఫార్మాట్ను ఉపయోగించడం ఇదేం తొలిసారి కాదు. ఎన్నికల సమయంలో కూడా నేను అనేక ప్రశ్నలు సంధించాను. దానిపై వారు ఇప్పటికీ సమాధానాలు చెప్పలేకపోయారు. వారు సమాధానాలు ఇవ్వలేరు.. కానీ నోటీసులు మాత్రమే జారీ చేస్తారు. యూపీలో ప్రస్తుత పరిస్థితిపై సమాజ్వాదీ పార్టీని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది.. కరెక్ట్ కాదు కదా. నేను ఏ ఒక్క పార్టీని టార్గెట్ చేయడం లేదు, కేవలం అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నించడమే నా పని’ అని పేర్కొన్నారు. తనను ఎంత ఇబ్బంది పెట్టినా భయపడేది లేదని, సాధారణ ప్రజల సమస్యల మీద పాటలు పాడటం ఆపనని భోజ్పురి సింగర్ స్పష్టం చేశారు. కాగా గుజరాత్ ఎన్నికలకు ముందు మోర్బీ వంతెన కూలిపోవడం గురించి కూడా ఆమె 'గుజరాత్ మే కా బా' అంటూ పాట పాడారు అంతేగాక 2022 యూపీ ఎన్నికల ముందు కూడా నేహా సింగ్ రాథోడ్ ఇలాగే ‘‘యూపీ మే కాబా’’ అంటూ పాట పాడారుది. ప్రస్తుతం దీని రెండో వెర్షన్ ను రిలీజ్ చేశారు. 'यू पी में का बा!' पर पुलिस का नोटिस..!#Nehasinghrathore #up @Uppolice @myogiadityanath @myogioffice #democracy pic.twitter.com/szZUsqvRCu — Neha Singh Rathore (@nehafolksinger) February 21, 2023 'यू पी में का बा!' पर पुलिस का नोटिस..!#Nehasinghrathore #up @Uppolice @myogiadityanath @myogioffice #democracy pic.twitter.com/szZUsqvRCu — Neha Singh Rathore (@nehafolksinger) February 21, 2023 -
నేపాల్ విమాన ప్రమాదం.. జానపద గాయని మృతి
నేపాల్లో ఆదివారం జరిగిన విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ సంఘటనలో అయిదుగురు భారతీయులతో సహా 68 మంది మృత్యువాతపడ్డారు. రష్యా సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, అర్జెంటీనా దేశస్థులు కూడా ఉన్నారు. ప్రమాదం నుంచి ఇప్పటి వరకు ఎవరు ప్రాణాలతో బయటపడలేదు. మరో నలుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రమాద స్థలం వద్ద రెస్కూ చర్యలు సోమవారం తిరిగి ప్రారంభించారు. జానపద గాయని మృతి విమానం కుప్పకూలిన ప్రమాదంలో నేపాల్ ప్రముఖ జానపద గాయని నీరా ఛాంత్యల్ ప్రాణాలు కోల్పోయింది. విమాన ప్రమాదంలో నీరా చనిపోయిందనే విషయాన్ని ఆమె సోదరి హీరా ఛాంత్యల్ షెర్చాన్ వెల్లడించింది. ‘పోఖారాకు విమానంలో బయలుదేరిన నీరా మరణించింది. ఆమె మాఘ్ సంక్రాంతి సందర్భంగా పోఖారరాలో నిర్వహిస్తున్న ఓ ఈవెంట్లో పాల్గొనడం కోసం వెళ్లింది. అంతకుముందు నీరా.. అభిమానులకు మాఘ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. అందులో రేపు పొఖారాలో చాలా ఎంజాయ్ చేస్తాను అంటూ రాసుకొచ్చింది. ఎవరీ నీరా? కాగా నేపాల్లోని బగ్లుండ్ ప్రాంతంలో పుట్టి పెరిగన నీరా.. కొంతకాలంగా రాజధాని ప్రాంతమైన ఖాట్మాండులో నివసిస్తోంది. జానపద పాటలలో పాపులారిటీ సాధించిన ఆమె గొంతుకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. జాతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా వస్తధారణతో ఈవెంట్స్లో పాల్గొనే నీరా తన పాటలనుసోషల్ మీడియాలో పోస్టూ చేస్తూ ఉంటుంది. అయితే నీరా ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురవ్వడంతో మాఘ్ సంక్రాంతి కార్యక్రమాన్ని రద్దు చేశామని నేపాల్ ఛంత్యాల్ యువజన సంఘం అధ్యక్షుడు నవీన్ ఘాత్రి ఛంత్యాల్ తెలిపారు. చదవండి: నేపాల్ విమాన దుర్ఘటన.. అయ్యో దేవుడా! ఏ ఒక్కరిని ప్రాణాలతో గుర్తించలేదు.. బ్లాక్ బాక్స్ స్వాధీనం తాజాగా ఆర్మీ అధికారులు సంఘటన స్థలం నుంచి బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి గురైన విమానం బ్లాక్ బాక్స్ లభ్యమైందని ఖాట్మండు విమానాశ్రయ అధికారి షేర్ బాత్ ఠాకూర్ తెలిపారు. కాగా ఈ బ్లాక్ బాక్స్ ద్వారా కాక్పిట్లో పైలెట్ల మధ్య సంభాషణను రికార్డ్ చేస్తోంది. అంతేగాక ఫ్లైట్ డేటా ఇందులో రికార్డ్ అవుతుంది. ఈ బ్లాక్ బాక్స్ సహాయంతో ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: గాల్లో ఎగురుతున్నామని ఎంత ఉత్సాహం.. కానీ, గాల్లోనే కలిసిపోతామని..! -
ఆ రాష్ట్ర ఐకాన్గా ఫోక్ సింగర్.. 22 ఏళ్లకే అరుదైన ఘనత..
పాట్నా: బిహార్ రాష్ట్ర ఐకాన్గా ప్రముఖ జానపద గాయని మైథిలి ఠాకూర్ను(22) నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ విషయాన్ని ఓ సీనియర్ అధికారి సోమవారం వెల్లడించారు. బిహార్ రాష్ట్ర ఎన్నికల ప్రచారకర్తగా మైథిలి ఉండనున్నారు. ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. 22 ఏళ్ల మైథిలి ఠాకూర్ ఇండియన్ క్లాసికల్, ఫోక్ మ్యూజిక్లో శిక్షణ పొందారు. 2021లో బిహార్ జానపద సంగీతానికి తనవంతు భాగస్వామ్యం అందించినందుకు సంగీత్ నాటక్ అకాడెమీ ఆమెను 'ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్'తో సన్మానించింది. బిహార్ మధుబనిలో జన్మించిన మైథిలికి ఆమె తండ్రి, తాత చిన్నతనం నుంచే జానపదం, హిందుస్తానీ క్లాసికల్ సంగీతం, హార్మోనియం, తబ్లాలో శిక్షణ ఇచ్చారు. దీంతో ఆమె ఫోక్ సింగర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్తర బిహార్ ప్రాంతీయ భాష అయిన మైథిలితో పాటు హిందీ, భోజ్పురిలో జానపద పాటలు పాడి పాపులర్ అయ్యారు. తన కూతురుకు ఈ అవకాశం దక్కడం చాలా ఆనందంగా ఉందని మైథిలి తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. ఓటు హక్కు వినియోగంపై ప్రచారం చేసి ఓటింగ్ శాతం పెంచేందుకు తన కూతురు కృషి చేస్తుందని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. చదవండి: 'సమాజం ఎటుపోతుందో అర్థంకావట్లేదు.. ఆ కిరాతకులను ఉరి తీయాలి' -
బతుకమ్మ, జానపద సాంగ్స్తో ఉర్రూతలూగిస్తున్న సింగర్స్
సాక్షి, కరీంనగర్: బతుకమ్మ తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే పండుగ. ఇందులో ప్రధానంగా పువ్వులను పూజిస్తారు. ఆడబిడ్డలు అందంగా బతుకమ్మలు పేర్చి, ఒక్కచోట ఆడిపాడతారు. బతుకమ్మ అంటే అందరికీ గుర్తొచ్చేవి బతుకులోంచి పుట్టిన బతుకమ్మ పాటలు. పండుగ సమయంలో 9 రోజులు ఈ పాటలతో వీధులన్నీ మార్మోగుతుంటాయి. కాలానికనుగుణంగా తెలంగాణలో సంప్రదాయ బతుకమ్మ పాటలు సరికొత్త సొబగులు అద్దుకొని, సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. వీటికి ఎంతోమంది గాయనీగాయకులు కొత్త రెక్కలు తొడిగారు. తమ ప్రతిభతో శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నారు. కరీంనగర్లో బతుకమ్మ మ్యూజిక్ చానల్ ద్వారా గేయ రచయిత పొద్దుపొడుపు శంకర్ ‘పూతాపూలన్ని పూచే లేత కొమ్మలు అక్కాసెల్లేలు తల్లిగారిల్లు’ అంటూ కొత్త పాటను విడుదల చేశారు. ఉయ్యాలో రామ ఉయ్యాలో అంటూ కరీంనగర్కు చెందిన అమూల్య కోటి కొత్త పాటను యూట్యూబ్లో సోమవారం విడుదల చేయగా ఇప్పటివరకు వేలాది మంది వీక్షించారు. తమ పాటలతో ప్రజాదరణ పొందుతున్న ఇలాంటి పలువురు గాయకులపై ప్రత్యేక కథనం. చిన్నీ మా బతుకమ్మ : తేలు విజయ కరీంనగర్కు చెందిన దంపతులు తేలు వెంకటరాజం–నర్సమ్మ దంపతులకు 1980లో జూన్ 21న తేలు విజయ జన్మించింది. చిన్ననాటి నుంచే తన కుటుంబసభ్యులు పాడే జానపదాలు వింటూ పెరిగింది. 1998లో ‘తండాకు వోతాండు గుడుంబా తాగుతాండు..’ అంటూ పాడి, తొలి పాటతోనే గుర్తింపు తెచ్చుకుంది. 2007లో ‘బతుకమ్మ’ సినిమాలో ‘ఊరికి ఉత్తరానా వలలో..’ అనే పాట పాడింది. 2015లో ‘చిన్నీ మా బతుకమ్మ’ పాటకు 8 లక్షల వ్యూస్ వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘ఉత్తమ ఉద్యమ గాయనిగా’ అవార్డు అందుకుంది. ఈ ఏడాది పువ్వుల బతుకమ్మతోపాటు మరో 6 బతుకమ్మ పాటలు పాడింది. బతుకమ్మా.. బతుకమ్మా : చిలివేరు శ్రీకాంత్ కరీంనగర్లోని సాయినగర్ చెందిన చిలివేరు పోచమ్మ–విజయ్ దంపతులకు శ్రీకాంత్ 1985 నవంబర్ 24న జన్మించారు. నాన్న స్వయంగా భజనలు, కీర్తనలు, అక్క భక్తి పాటలు పాటడంతో వాటిపై ఇతనికి మక్కువ ఏర్పడింది. ఇంటర్మీడియట్ నుంచే ప్రముఖ టెలివిజన్ షోలో గాయకుడిగా తన ప్రతిభ చాటుకున్నాడు. పాడుతా తీయగా, వన్స్మోర్ ప్లీజ్, స్టార్ అంత్యాక్షరీ షోలో పాల్గొని, పేరు తెచ్చుకున్నాడు. గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యంపై పాటలు రాసి, పాడాడు. బతుకమ్మా.. బతుకమ్మా.. మా తల్లీ బతుకమ్మ పాటను శ్రీకాంత్ స్టూడియో యూట్యూబ్ చానల్ ద్వారా గత సోమవారం సాయంత్రం విడుదల చేయగా 19 గంటల్లో 4,500 వ్యూస్ వచ్చాయి. ఓ నిర్మలా.. : వొల్లాల వాణి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్నగర్కు చెందిన వొల్లాల వాణి 2016లో పాడిన ఘల్లు ఘల్లునా.. ఓ నిర్మలా అనే బతుకమ్మ పాటతో గుర్తింపు పొందింది. దీనికి ఇప్పటివరకు 72 లక్షల వ్యూస్ వచ్చాయి. ఏటా బతుకమ్మ పండుగకు ఏ గ్రామంలో చూసినా ఇదే పాట మారుమోగుతోంది. ఆస్ట్రేలియా, దుబాయ్, ఖతర్ దేశాల్లో జరిగిన వేడుకల్లో తన పాటలతో హోరెత్తించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జిల్లా ఉత్తమ గాయనిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకుంది. ఈ నెల 24న విడుదలైన కోడి కూత వెట్టగానే రాంభజన అనే పాటకు 2 లక్షలకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. నల్లమద్ది చెట్టు కింద.. : సుంకోజు నాగలక్ష్మి సుంకోజు నాగలక్ష్మిది రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని బందనకల్. బతుకుదెరువు కోసం సిరిసిల్లకు వచ్చిన ఈమె కుటుంబం తంగళ్లపల్లి మండల కేంద్రంలో స్థిరపడింది. చిన్నతనం నుంచే నాగలక్ష్మికి పాటలన్నా, పాడటం అన్నా ఇష్టం. అర్కమిత్ర ఫౌండేషన్ నిర్వహించిన పోటీల్లో గెల్చుకున్న బహుమతి ఆమెకు స్ఫూర్తినిచ్చింది. బొజ్జ రేవతి దగ్గర కర్నాటక సంగీతాన్ని సాధన చేసి, తన పాటకు శాస్త్రీయతను జోడించింది. మొదటి రెండేళ్లలోనే సుమారు 80 జానపద గీతాలను ఆలపించింది. నల్లమద్ది చెట్టు కింద అనే పాటతో పేరు తెచ్చుకుంది. యూట్యూబ్ చానల్ నిర్వహిస్తూ 30 మిలియన్లకు పైగా వ్యూయర్షిప్ సంపాదించింది. ఇటీవల బతుకమ్మ కోసం ఆలపించిన పాటలూ జనాదరణ పొందాయి. ఏమే పిల్లా అన్నప్పుడల్లా.. : శిరీష రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బద్దం ఎల్లారెడ్డినగర్కు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు అశోక్ కూతురు శిరీష. పాటల ప్రయాణంలో దూసుకుపోతోంది. చిన్ననాడు దసరా ఉత్సవాల్లో పాడాలని ప్రోత్సహించిన నాన్న మాటలే ఆ తర్వాత కాలంలో తనకో కెరీర్ను సృష్టించాయి. పసితనంలో అక్కడే ఆర్కెస్ట్రా నిర్వహిస్తున్న ప్రదీప్ శిరీష స్వర మాధుర్యం, లయ జ్ఞానాన్ని గుర్తించాడు. శిక్షణ ఇస్తే మంచి గాయని అవుతుందని ఆమె తండ్రిని ఒప్పించాడు. ఫలితంగా ఆర్కెస్ట్రా సింగర్గా చాలాచోట్ల కచేరీలు చేసింది. తర్వాత యూట్యూబ్ స్టార్ అయ్యింది.నాలుగేళ్లలోనే వెయ్యి పాటలు ఆలపించిన శిరీష, పాటలు, వాటి షూటింగ్లతో బిజీ అయిపోయింది. ఏమే పిల్లా అన్నప్పుడల్లా.. అనే జానపద పాటతో ప్రజల గుండెల్లో చోటు దక్కించుకుంది. సినీ తారలు సైతం ఈ పాటకు స్టెప్పులేశారు. ప్రస్తుతం యూట్యూబ్లో శిరీష పాటలకు లక్షల సంఖ్యలో వ్యూయర్స్ ఉన్నారు. ఇటీవల రూపొందించిన బతుకమ్మ పాటలు కూడా మంచి గుర్తింపు పొందాయి. -
'భీమ్లా నాయక్' సినిమాలో పాట కోసం దుర్గవ్వకు ఎంతిచ్చారంటే?
భీమ్లా నాయక్ సినిమా ఇద్దరు జానపద కళాకారులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో మొగిలయ్య పాడిన టైటిల్ సాంగ్, సాహితి చాగంటితో కలిసి కుమ్మరి దుర్గవ్వ పాడిన అడవితల్లి మాట ఎంతగా మార్మోగిపోయాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కూలీ పనులు చేసుకుంటూ ఫోక్ సాంగ్స్ పాడే దుర్గవ్వ అడవితల్లి సాంగ్లో అచ్చమైన, స్వచ్ఛమైన పల్లెగొంతును వినిపించింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దుర్గవ్వ తనకు పాట పాడే అవకాశం ఎలా వచ్చింది? పాడినందుకు ఎంత పారితోషికం ఇచ్చారనే విషయాలను వెల్లడించింది. 'సిరిసిల్ల సిన్నది, ఉంగురము పాటలు పాడాను. అవి హిట్ అయ్యాయి. అది విని భీమ్లానాయక్లో పాట పాడమని ఆఫర్ వచ్చింది. ఐదారు నిమిషాల్లో పాడేశాను. ఈ పాట పాడినందుకు రూ.10 వేలు ఇచ్చారు. తర్వాత మిగిలిన డబ్బును నా కూతురుకు ఇచ్చి పంపించారు' అని చెప్పుకొచ్చింది దుర్గవ్వ. -
వెయ్యి రూపాయలు లేక భార్య, కొడుకు చనిపోయారు: మొగులయ్య
మొగులయ్య.. 12 మెట్ల కిన్నెరను వాయిస్తుంటే అందరూ మైమరచిపోవాల్సిందే.. ప్రాచీన సంగీత వాయిద్యం కిన్నెరనే బతుకుదెరువుగా మలుచుకున్న కళాకారుడు మొగులయ్యకు పద్మశ్రీ అవార్డు వరించింది. దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం అందుకోబోతున్న ఆయన జీవితం పూలపాన్పు కాదు.. ముళ్ల దారి. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జీవితంలో చవిచూసిన ఒడిదుడుకుల గురించి చెప్పుకొచ్చాడు. 'నేను చాలా బీదవాడిని. వెయ్యి రూపాయలు లేక నా భార్య చనిపోయింది. ఆమెను హైదరాబాద్ తీసుకువచ్చి నేను ఆఫీసుల చుట్టూ తిరిగితే ఆమె బస్టాండ్లల్ల డబ్బులు అడుక్కుంటూ సరిగా తిండి లేక చివరాఖరికి చేనిపోయింది. ఆమె చనిపోయాక కూడా శవాన్ని ఊరు తీసుకెళ్లేందుకు రూపాయి గతి లేదు. విషయం తెలుసుకుని కేవీ రమణాచారి గారు 10 వేల రూపాయలు ఇస్తే అప్పుడు బండి కిరాయి కట్టుకుని ఇంటికి తీసుకెళ్లాను. సరిగా తిండి లేక మూడేండ్ల కిందట చనిపోయింది. నాకు తొమ్మిది మంది పిల్లలు. మొన్న మా కొడుకు గుండెలో నీరొచ్చింది. హైదరాబాద్ తీసుకెళ్లమన్నారు. కానీ రూ.500 లేక అతడు చనిపోయాడు. నాకు ఇల్లు లేదు, ఆధారం లేదు. ఎక్కడికైనా వెళ్లాలంటే కూడా ఎవరో ఒకరు డబ్బులిచ్చి సాయం చేసేవారు. ఈ కళను బతికించాలన్నదే నా కోరిక' అని మొగులయ్య పేర్కొన్నాడు. -
జానపద దిగ్గజం కన్నుమూత
సాక్షి, బనశంకరి (కర్ణాటక): నాటక కళాకారుడు, జానపద గాయకుడు బసవలింగయ్య హిరేమఠ (63) బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో ఆదివారం కన్నుమూశారు. బెళగావిలోని బైలూరు గ్రామానికి చెందిన ఆయన జానపద కళాకారునిగా ప్రసిద్ధి చెందారు. భార్య విశ్వేశ్వరి కూడా జానపద కళాకారిణి. ఈ దంపతులు అనేక జానపద ప్రదర్శనలు నిర్వహించారు. -
సమంత ఐటమ్ సాంగ్ పాడిన సింగర్.. మంగ్లీకి ఏమవుతుందో తెలుసా!
Did You Know Singer Who Sing Item Song From Pushpa Samantha: ఎక్కడ చూసినా ప్రస్తుతం పుష్ప సినిమా హవా నడుస్తోంది. రిలీజ్కు ముందే పాటలు, ట్రైలర్, డైలాగులు అభిమానులకు పూనకం తెప్పిస్తున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్తోపాటు బాలీవుడ్ సైతం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన కలిసి నటించిన ఈ సినిమాను సుకుమార్ తెరకెకిస్తున్న విషయం తెలసిందే. డిసెంబర్ 17న మొదటి భాగం విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్లను వేగం చేసింది చిత్ర యూనిట్. మూడు పాటలు, ట్రైలర్ను విడుదల చేయడగా.. తాజాగా పుష్ప నుంచి ఐటమ్ సాంగ్ను ప్రజల్లోకి వదిలింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తొలిసారి ఆడిపాడిన ‘ఊ అంటావా.. ఊహు అంటావా’ అనే ఐటమ్ సాంగ్ లిరికల్ సాంగ్ను శుక్రవారం రిలీజ్ చేసింది. మత్తు వాయిస్తో సాగే ఈ పాటలో సమంత తన మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. సామ్ కాస్ట్యూమ్, స్టైల్, లుకింగ్ అన్నీ పాటకు పర్ఫెక్ట్ సెట్ అయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరోసారి మార్మోగించడంతో సాంగ్ బ్లాక్బాస్టర్ హిట్ అవుతుందనడంలో సందేహం లేదు. చదవండి: మీ మగబుద్ధే వంకరబుద్ధి అంటున్న సమంత! కాగా చంద్రబోస్ రాసిన ఈ ఐటమ్ పాటను పాడింది ఇంద్రావతి చౌహాన్. తన గొంతుతో ఈ పాటను మరో మెట్టు ఎక్కించింది. దీంతో ఈ సింగర్ ఎవరని వెతకడం ప్రారంభించారు నెటిజన్లు. ఇంద్రావతి చౌహన్ ప్రముఖ ఫోక్ సింగర్, సినీ నేపథ్య గాయని మంగ్లీ చెల్లెలు. ఈమె కూడా జానపద పాటలు పాడుతూ గుర్తింపు తెచ్చుకున్నారు. జార్జిరెడ్డి సినిమాలో జాజిమొగులాలి అనే పాట కూడా పాడారు. అంతేగాక కోటి న్యాయ నిర్ణేతగా ‘బోల్ బేబీ బోల్’ రియాలిటీ షోలో కూడా పాడారు. -
Bheemla Nayak: ‘అడవి తల్లి’ పాట పాడిన దుర్గవ్వ ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి?
Adavi Thalli Mata Singer: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి మల్టీసారర్గా వస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్'. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వ వహించగా తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే – మాటలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిత్రాన్ని జనవరి 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఇప్పటికే మూడు పాటలను విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి నాలుగో సాంగ్ విడుదలైంది. ‘అడవి తల్లి’అనే ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్లో రికార్ట్ స్థాయి వ్యూస్తో దూసుకెళ్తుంది. ‘కిందున్న మడుసులకా పోపాలు తెమలవు.. పైనున్న సామేమో కిమ్మని పలకడు... దూకేటి కత్తులా కనికరమెరగవు.. అంటుకున్న అగ్గిలోన ఆనవాళ్లు మిగలవు..’అంటూ సాగా ఈ ‘అడవి తల్లి మాట’పాటకు రామజోగయ్యశాస్త్రీ లిరిక్స్ అందించగా, కుమ్మరి దుర్గవ్వ, సాహితి చాగంటి అద్భుతంగా ఆలపించారు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుండడంతో ఈ పాట పాడిన సింగర్ గురించి వెతకడం ప్రారంభించారు నెటిజన్స్. కుమ్మరి దుర్గవ్వ ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. దుర్గవ్వ మంచిర్యాల జిల్లాకు చెందినది. ఆమె చదువుకోలేదు. పొలం పనులకు వెళ్లినప్పుడు జానపదాలను పాడుతూ ఉంటుంది. తెలుగుతో పాటు మరాఠీలోనూ ఎన్నో పాటలు పాడారు. ఆమె పాడిన జానపదాల్లో.. 'ఉంగురమే రంగైనా రాములాల టుంగురమే', 'సిరిసిల్లా చిన్నది' వంటి పాటలు బాగా పాపులర్ అయ్యాయి. దీంతో ఆమెకు 'భీమ్లా నాయక్'లో ‘అడవి తల్లి’పాట పాడే అవకాశం వచ్చింది. ఈ పాటతో దుర్గవ్వ మరింత హైలైట్ అయింది. -
Karimnagar: సిల్వర్ స్క్రీన్పై కరీంనగర్ వెలుగులు
ఒక్కచాన్స్.. ఒకేఒక్క చాన్స్ అంటూ వీళ్లు క్రిష్ణానగర్ చుట్టూ కాళ్లరిగేలా తిరగలేదు.. సినిమాల్లో అవకాశం కోసం ఏళ్లకేళ్లు ఎదురుచూడలేదు. చేస్తున్న పనిని, అన్నం పెడుతున్న ఊరును వదిలిపెట్టలేదు. ఉన్నచోటు నుంచే తమ ప్రతిభను ప్రదర్శించారు. అవకాశాన్ని.. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకున్నారు. యూట్యూబ్లో సొంతంగా ఒక వేదికను ఏర్పాటుచేసుకుని తామేంటో నిరూపించుకున్నారు. షార్ట్ఫిల్మ్లు, ప్రయివేటు ఆల్బంల ద్వారా తమ టాలెంటును మొదట ప్రజలు గుర్తించేలా కష్టపడ్డారు. ఆ కష్టమే ఇప్పుడు వారిని స్టార్లను చేసింది. అనతికాలంలోనే సినిమాల్లో, పెద్దపెద్ద రియాలిటీషోల్లో అవకాశం వచ్చేలా చేసింది. ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్పై ఉమ్మడి కరీంనగర్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. మై విలేజ్ షో ద్వారా ఫేమ్ అయిన బిగ్బాస్ గంగవ్వ, అనిల్ జీల సినిమాల్లో బిజీగా మారారు. మరికొందరు యాక్టర్లు, సింగర్లు, డైరెక్టర్లు పలు సినిమాల్లో ప్రతిభ చూపి స్టార్.. స్టార్.. సూపర్స్టార్ అనిపించుకుంటున్నారు. యూట్యూబ్ ద్వారా రంగుల ప్రపంచంలో ప్రస్థానం ప్రారంభించి వెండితెరపై వెలుగుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సినీ కళాకారులపై ‘సాక్షి’ వీకెండ్ స్పెషల్..!!] పేరు: గంగవ్వ యూట్యూబ్ చానల్ మై విలేజ్ షో షార్ట్ఫిల్మ్: 120కి పైగా సినిమాలు: 4 ‘ఇస్మార్ట్’ గంగవ్వ మల్యాల(చొప్పదండి): జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన మై విలేజ్షో గంగవ్వ అంటే ఇప్పుడు ప్రపంచమంతా పరిచయమే. బడిముఖం చూడని గంగవ్వ కష్టాల కడలిని ఈదింది. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం.. కల్మషం లేని ఆమె మనసు.. ఆరు పదుల వయసులో ప్రపంచానికి స్టార్గా పరిచయం చేశాయి. ఇదే గ్రామానికి చెందిన శ్రీరాం శ్రీకాంత్ ప్రారంభించిన మై విలేజ్ షో యూట్యూబ్ చానల్ గంగవ్వ జీవితాన్ని మార్చివేసింది. 120కిపైగా వీడియోల్లో, నాలుగు పెద్ద సినిమాల్లో నటించింది. ఓ రియాలిటీ షోతో మరింత ఫేమస్ అ యిన గంగవ్వ.. ఇల్లు కట్టుకోవాలనే తనకలను నెరవేర్చుకుంది. జీవితమంతా.. ముళ్లబాటే గంగవ్వ జీవితమంతా ముళ్లబాటలోనే సాగింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. బీడీలు చేస్తూ తమ్ముళ్లకు ఆసరాగా నిలిచింది.ఐదేళ్లలో బాల్య వివాహం జరిగింది. అత్తాగారిల్లే జీవితమైంది.భర్త గంగయ్య పదిహేనేళ్లపాటు గల్ఫ్ వెళ్లాడు. ఐదేళ్లపాటు దుబాయ్ నుంచి కబురు లేకపోవడంతో ఉన్నాడో లేడో కూడా తెలియని వేదనతో గడిపింది. మరో పదేళ్లు గల్ఫ్ వెళ్లినా నయాపైసా పంపలేదు. ఇక్కడి నుంచే అప్పుచేసి, పైసలు పంపిస్తే ఇంటికి తిరిగివచ్చాడు. కలోగంజో తాగి, పొద్దంతా వ్యవసాయ పనులకు వెళ్లి, రాత్రి బీడీలు చేస్తూ పిల్లలను పెద్ద చేసింది. ఆరుపదుల వయసులో.. గంగవ్వకు మై విలేజ్ షో మరో జన్మనిచ్చింది. అవ్వలోని సహజ నటిని మై విలేజ్ షో దర్శకుడు శ్రీరాం శ్రీకాంత్ ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇంటర్నెట్ కష్టాలు అనే షార్ట్ఫిల్మ్తో యూ ట్యూబ్లో అడుగుపెట్టి.. సుమారు 120కిపైగా లఘుచిత్రాల్లో నటించింది. సినీ నటులుసైతం గంగవ్వతో సెల్ఫీకోసం ఎదురుచూసేలా ఎదిగింది. గంగవ్వ సహజ నటనను చూసిన సినిమా డైరెక్టర్లు అవకాశం ఇవ్వడంతో మల్లేశం, ఇస్మార్ట్ శంకర్, రాజరాజచోర, లవ్స్టోరీలో తనేంటో నిరూపించుకుంది. రెండు టీవీ రియాలిటీషోల్లో అదరగొట్టింది. గంగవ్వ మాట తీరు..ఆప్యాయత..కల్మ షం లేని తన వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది. ఏ అవసరం ఉన్నా ఇప్పటికీ ప్యాసింజర్ ఆటోల్లో వెళ్తుండడం ఆమె నిరాడంబరతకు నిదర్శనం. ‘చిన్నప్పటి నుంచి కష్టాలు, కన్నీళ్లతోనే గడిపిన. పొద్దంతా వ్యవసాయ పనికి వెళ్లివచ్చి, బీడీలు చేసేదాన్ని. సదువు అసలే రాదు. ఎక్కడెక్కడి నుండో నా దగ్గరికి అచ్చి.. సెల్ఫీలు దిగుతున్నరు. ఇంటికాడ ఉంటే శ్రీకాంత్ అచ్చి, నేను చెప్పినట్టు చేత్తవా గంగవ్వ అని, షూటింగ్ మొదలు పెట్టిండు. ఇంట్ల టీవీ కూడా లేదు. సినిమాలో నటిస్తా అని అనుకోలేదు. ఇప్పటికి నాలుగు సినిమాలు విడుదల ఐనయ్. ఇంకా వేరే సినిమాలో నటిస్తున్న.. ఇప్పుడు కూడా ఊటీలో షూటింగ్లో ఉన్న.. నాకు తెలిసింది ఒక్కటే. నా పని నేను సేత్త’ అని గంగవ్వ చెప్పుకొచ్చింది. పేరు: రాదండి సదయ్య యూట్యూబ్ చానల్ సదన్న కామెడీ షార్ట్ఫిల్మ్లు: 200కి పైగా సినిమాలు: 10 ఆర్ఎస్ నందా.. కామెడీకి ఫిదా విద్యానగర్(కరీంనగర్): ఆర్ఎస్ నంద.. యూట్యూబ్ ప్రపంచానికి పరిచయం కాకముందే ఇతని కామెడీ షార్ట్ఫిల్మ్లను సిడీల రూపంలో అభిమానులు వీక్షించేవారు. రెండు వందలకు పైగా షార్ట్ఫిల్మ్లు తీసిన ఆర్ఎస్ నందకు దాదాపు ఐదు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నటన అంటే ప్రాణం ఓదెల మండలం కనగర్తికి చెందిన రాదండి సదయ్యకు చిన్నతనం నుంచే నటన అంటే ప్రాణం. పదేళ్ల వయసులోనే బుర్రకథలు చెప్పేందుకు ఆసక్తి చూపేవాడు. 2007నుంచే లఘుచిత్రాలు తీయడం ప్రారంభిచాడు. యూట్యూబ్ హవా ప్రారంభం కావడంతో 2013లో కోడెం సంతోశ్తో కలిసి ‘సదన్న కామెడీ’ చానెల్ ద్వారా ‘గుట్టల్లో గుసగుస’తో యూట్యూబ్లో తొలి అడుగువేశాడు. ఇప్పటివరకు దాదా పు 200కు పైగా విలేజ్ కామెడీ షార్ట్ఫిలిమ్స్ చేశాడు. కామెడీ స్టార్గా దేశవిదేశాల్లో గుర్తింపు సాధించాడు. సినిమా అవకాశాలు కూడా రావడంతో బతుకమ్మ, నానీ బుజ్జి బంగారం, తుపాకీ రాముడు, సంత, చిన్ని గుండెల్లో ఎన్ని ఆశలో, నేనేసరోజన, గున్నమామిడి కొమ్మ మీద తదితర 10కి పైగా సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం మరిన్ని సినిమాల్లోనూ బిజీగా ఉన్నట్లు తెలిపాడు. పేరు: అనిల్ జీల యూట్యూబ్ చానల్: మై విలేజ్ షో షార్ట్ఫిల్మ్లు: 200 కి పైగా సినిమాలు: 5 క్రేజీహీరో.. అనిల్ మల్యాల(చొప్పదండి): ఎన్ఎస్ఎస్ వలంటీర్గా సేవచేసేందుకు లంబాడిపల్లి వెళ్లి.. యూట్యూబర్గా తనలోని ప్రతిభకు పదును పెట్టుకుని.. ప్రపంచస్థాయిలో గుర్తింపు సాధించి, యువతకు క్రేజీ హీరోగా మారాడు అనిల్ జీల. ఉపాధ్యాయుడిగా విద్యాబుద్ధులు బోధిసూ్తనే తన ఆలోచనలను వీడియో రూపంలో ప్రదర్శిస్తూ.. సహచరుడు, మై విలేజ్ షో వ్యవస్థాపకుడు శ్రీరాం శ్రీకాంత్తో జట్టుకట్టాడు. మై విలేజ్ షోలో నటిస్తూ.. తనలో దాగిఉన్న ప్రతిభను చాటుకున్నాడు. స్వయంగా వ్లాగ్ నిర్వహిస్తూ ఏకంగా 7లక్షల ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలో నటిస్తూనే.. యూత్ ఐకాన్గా నిలిచాడు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లి గ్రామానికి చెందిన నిర్మల–మల్లేశం కొడుకు అనిల్ జీల. టీటీసీ చేసేటప్పుడు ఎన్ఎస్ఎస్ క్యాంపులో భాగంగా లంబాడిపల్లికి వచ్చాడు. అప్పుడే శ్రీరాం శ్రీకాంత్తో పరిచయం ఏర్పడింది. జమ్మికుంటలో రెండేళ్లపాటు ఉపాధ్యాయుడిగా పనిచేసి, ఐదేళ్లక్రితం వేసవిసెలవుల్లో లంబాడిపల్లికి వచ్చిన అనిల్ జీల శ్రీకాంత్ దర్శకత్వంతో పాటు ఇతర లఘుచిత్రాలు సుమారు 200లకుపైగా నటించారు. కికీ చాలెంజ్ తన జీవితాన్ని మలుపు తిప్పగా, రైతు పడుతున్న కష్టాల వీడియోతో అనిల్కు ఫాలోయింగ్ పెరిగింది. ఏడు లక్షల ఫాలోవర్స్.. మై విలేజ్ షో వీడియోలతోపాటు తన వ్యక్తిగత జీవిత విశేషాలను అప్లోడ్ చేసేందుకు అనిల్ జీల వ్లాగ్ ప్రారంభించాడు. షూటింగ్లో.. ఇంట్లో.. ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఆ విశేషాలు తెలిసేలా వ్లాగ్లో పెడుతుండడంతో ప్రస్తుతం అనిల్కు 7లక్షల మంది ఫాలోవర్లు పెరిగారు. యూట్యూబ్ వీడియోల్లో నటిసూ్తనే సినిమాల్లో చాన్స్ కొట్టేశాడు అనిల్. ఇతడి సహజమైన నటనతో నేటియువతకు హీరోగా మారాడు. అనిల్ నటనకు సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్తోపాటు, ఎస్ఆర్ కల్యాణ మంటపం సినిమాలు ఇప్పటికే రిలీజ్ కాగా, దర్శకుడు నవీన్ బేతిగంటి తీస్తున్న ‘రామన్న యూత్’ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. మై విలేజ్ షో తీస్తున్న ఓ వెబ్సిరీస్లోసైతం నటిస్తున్నాడు. పాటల మాంత్రికుడు మల్లిక్ గొల్లపల్లి(ధర్మపురి): పల్లెపదాలు ఆయన పాటలకు ప్రాణాలు. తాను రాసే పాటలోని ప్రతీ అక్షరం గ్రామీణ జీవన సుమధురం. మట్టిమనుషుల మధ్య బాధలు, బంధుత్వాలను జానపదాలుగా మలిచి చిత్రీకరిస్తూ.. జానపద ఆణిముత్యంగా రాణిస్తున్నాడు జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్కు చెందిన ఎస్వీ మల్లిక్తేజ. ఎస్వీ మ్యూజిక్ చానల్ ద్వారా 150కి ప్రయివేటు పాటలు రాసి, పాడిన, వీక్షకులకు అందించగా.. ఆరులక్షల మంది పాలోవర్స్ను సొంతం చేసుకున్నాడు మల్లిక్తేజ. ఇటీవల వచ్చిన రుణం సినిమాకు సంగీత దర్శకుడిగా కూడా పనిచేశాడు. చిన్నతనం నుంచే.. మల్లిక్తేజ డిగ్రీవరకు చదివాడు. చిన్నతనం నుంచి అమ్మమ్మవాళ్ల ఊర్లో పెరిగాడు. తాత మ్యాకల వెంకయ్యతో గొర్రెలు మేపేందుకు వెళ్లి జానపదాలు నేర్చుకున్నాడు. ఆ పాటలనే స్కూళ్లో పాడేవాడు. ఇంటర్లోనే పాటలు రాయడం, పాడడం ప్రారంభించాడు. అప్పుడే జగిత్యాలకు వచ్చిన సుద్దాల అశోక్తేజ మల్లిక్పాటకు ముగ్దుడయ్యాడు. మల్లిక్ను హైదరాబాద్ పిలిపించుకుని మెలకువలు నేర్పించాడు. తరువాత యూట్యూబ్లో ఎస్వీ మ్యూజిక్ చానల్ను ప్రారంభించాడు. 2018 జనవరిలో తీసిన ‘నేనొస్తాబావ’ పాటకు 3కోట్లవ్యూస్ను సాధించాడు. ‘మదనాసుందారి’ పాట అత్యంత ప్రేక్షక ఆదరణ సాధించింది. ఎస్వీ మ్యూజిక్ చానల్ద్వారా 150కి పైగా ప్రయివేటు పాటలు చిత్రీకరించాడు. ఆరులక్షల పాలోవర్స్ ఉన్నారు. సినిమాల్లో అవకాశం రావడంతో 2019 ఏప్రిల్లో విడుదలైన రుణం సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేశాడు. కన్నడంలో భన్నదకనుసు, రంగిన దునియాకు మ్యూజిక్ డైరెక్టరుగా పరేషాన్ సినిమాలో పాట పాడాడు. పాటే రమేశ్ ప్రాణం గొల్లపల్లి(ధర్మపురి): యక్షగానం నుంచి పుట్టిన జానపద కళాకారుడు గడ్డం రమేశ్. జగిత్యాల జిల్లా చిన్నాపూర్కు చెందిన రమేశ్ తండ్రి అనంతం యక్షగానం చేస్తుండేవాడు. తండ్రిని అనుకరిస్తూ రమేశ్ తాను చదువుతున్న పాఠశాల వేదికపై యక్షగానం ప్రదర్శిస్తుండేవాడు. తరువాత జానపద పాటలు పాడిన రమేశ్ స్థానికంగా పేరు సంపాదించాడు. 2002లో రమేశ్ ప్రతిభను గుర్తించిన ధర్మపురి సీఐ హోంగార్డుగా ఉద్యోగం కల్పించాడు. పోలీసు కళాబృందంతో కలిసి ప్రదర్శనలు ఇస్తూ.. ప్రజలను చైతనం చేస్తున్నాడు. 2011లో రేలారెరేలా కార్యక్రమంలో పాల్గొని విజేతగా నిలిచాడు. తరువాత పలు ప్రదర్శనలు ఇచ్చాడు. 2018లో యూట్యూబ్లో గడ్డం మ్యూజిక్ చానల్ ప్రారంభించాడు. ‘నీలమ్మ నిమ్మసుక్క రాయిడు సోలో’ పాట మంచి గుర్తింపు పొందింది. ‘అత్తకొడుకా.. ముద్దల మారెల్లయ్య’ పాట 37లక్షల వ్యూస్ దాటింది. రమేశ్ ప్రతిభను జగిత్యాల జిల్లాకు చెందిన డైరెక్టర్ రాజ్నరేంద్ర, నిర్మాత గుగ్గిల్ల శివ ప్రసాద్ గుర్తించి సినిమాల్లో అవకాశం ఇచ్చారు. ఇలా సింగర్గా సినిమాల్లోనూ రాణిస్తున్నాడు. అంచెలంచెలుగా.. ఇల్లందకుంట(హుజురాబాద్): ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే ఆ కుర్రాడికి సిని మాలంటే పిచ్చి. చూసిన ప్రతీ సినిమాను ‘అక్కడ ఆ సీన్ ఉండాల్సింది కాదు.. అక్కడ ఆ ఫైట్ ఇలా తీయాల్సి ఉండే’ అంటూ స్నేహితులతో పంచుకునేవాడు. అలా సినిమాలపై అతడికి ఉన్న ఆసక్తి డైరెక్టర్గా కావాలని సంకల్పిచింది. మొదట్లో అవకాశం రాకపోవడంతో యూట్యూబ్ ద్వారా లఘుచిత్రాలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు జమ్మికుంటకు చెందిన సూర్యతేజ. తన ప్రతిభను గుర్తించిన చాలా మంది నిర్మాతలు డైరెక్టరుగా అవకాశం కల్పించారు. గుంటూరుకు చెందిన రాములు– శ్రీదేవి కుటుంబం 20ఏళ్ల క్రితమే కరీంనగర్కు వచ్చింది. రాములు ప్రైవేట్ విద్యాసంస్థల్లో వంటమనిషిగా చేసేవాడు. వీరికొడుకు సూర్యతేజకు చిన్నతనం నుంచి సినిమాలంటే పిచ్చి. స్నేహితులు తమాషాగా సినిమా పిచ్చోడు అంటూ ఎగతాళి చేసిన సందర్భాలున్నాయి. అవకాశం కోసం తిరిగితే ఎవరూ ఆదరించలేదు. సినిమారంగంపై ఉన్న మక్కువతో సొంతంగా కెమెరా కొనుక్కుని లఘుచిత్రాలు తీయడం ప్రారంభించాడు. పోలీసు డిపార్టుమెంటు చేస్తున్న సేవలపై 500కు పైగా లఘుచిత్రాలు తీశాడు. 2013లో తీసిన దేశం కోసం లఘుచిత్రం పేరుతెచ్చి పెట్టింది. తరువాత దర్శకుడు సుకుమార్ దగ్గర పనిచేశాడు. ఆనంద్సాయి, ఈశ్వర్, పైడిరమేతో పాటు పెద్దదర్శకుల వద్ద సలహాలు తీసుకుని సొంతంగా సినిమాలు చేస్తున్నాడు. 2019లో షైన్పిక్చర్స్ బ్యానర్పై తీసిన ‘తలచినదే జరిగిందా’ సినిమా సూర్యకు గుర్తింపునిచ్చింది. వెండితెరపై మరెందరో.. విద్యానగర్(కరీంనగర్): కళలు, కళాకారులకు వేదికైన కరీంనగర్ నుంచి చాలామంది వెండితెరపై సైతం వెలుగుతున్నారు. కరీంనగర్లోని మార్కెండేయకాలనీకి చెందిన జి.రాధిక ఇంటర్నుంచే నటనలో పేరు సాధించింది. భర్త ప్రోత్సాహంతో లఘుచిత్రాల్లో నటించడం ప్రారంభించింది. తక్కువ సమయంలో పేరు సంపాదించి, సహజనటిగా వెలుగొందుతోంది. ఇప్పటి వరకు 700కు పైగా షార్ట్ఫిల్మ్లతో పాటు దొరసాని, విరాటపర్వం, భిక్ష, గల్లీగ్యాంగ్, స్కైలాబ్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం సితార బ్యానర్పై నిర్మిస్తున్న సినిమాలో కీరోల్ చేస్తోంది. గోదావరిఖనికి చెందిన ఏదుల స్వప్న 250 లఘుచిత్రాల్లో నటించింది. గల్లీగ్యాంగ్, పరేషాన్, నువ్వునేను ఒక్కటైతే, బతుకంతాబ్రహ్మచారి, బిచ్చగాడా మజాకా సినిమాల్లో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బైరాన్పల్లి సినిమాలో నటిస్తోంది. వేములవాడకు చెందిన గోలి శివరామ్రెడ్డి నాటకాల్లో నటిస్తారు. 15 షార్ట్ఫిల్మ్లు చేశారు. పరేషాన్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఇటీవల నటించిన తుపాకులగూడెం సినిమా విడుదలకు సిద్ధమైంది. -
జానపద గాయకుడిని కాల్చి చంపిన తాలిబన్లు
కాబూల్: అఫ్గానిస్తాన్లో తాలిబన్లు నిరంకుశ పాలన సాగిస్తారనే అనుమానాలు బలపడు తున్నాయి. జానపద గాయకుడు ఫవాద్ అందారబీని తాలిబన్లు కాల్చి చంపినట్లు సమాచారం. బఘ్లాన్ ప్రావిన్స్లోని అందారబీ వ్యాలీలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలో కూడా ఒకసారి తాలిబన్లు తమ నివాసానికి వచ్చి, తన తండ్రితో మాట్లాడి టీ తాగి వెళ్లారని ఫవాద్ కుమారుడు జవాద్ అసోసియేటెడ్ ప్రెస్కు తెలిపారు. కానీ, శుక్రవారం తాలిబన్ ముఠాకు చెందిన ఒక వ్యక్తి తుపాకీతో తన తండ్రిని కాల్చి చంపేశాడ న్నారు. దోషిని శిక్షిస్తామని స్థానిక తాలిబన్ నేతలు హామీ ఇచ్చారన్నారు. ‘మా నాన్న అమాయకుడు. ప్రజలకు వినోదం పంచడం మాత్రమే తెలిసిన గాయకుడు’అని ఆయన తెలిపారు. తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ స్పందిస్తూ.. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని తెలిపారు. గాయకుడు అందారబీ ఘిచాక్ అనే వాద్య పరికరాన్ని వాయిస్తారు. తన జన్మభూమి, తన ప్రాంత ప్రజలు, తన దేశం గురించి సంపద్రాయ, దేశభక్తిని ప్రబోధించే పాటలు పాడుతుంటారు. కళాకారుల హక్కులను గౌరవించేలా అంతర్జాతీయ సమాజం తాలిబన్లపై ఒత్తిడి తేవాలని ఐరాస సాంస్కృతిక విభాగం ప్రతినిధి కరీమా బెన్నౌన్ అన్నారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ ఆగ్నెస్ కల్లామర్డ్ స్పందిస్తూ... తాలిబన్ల వైఖరి మార లేదనడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. -
పండు రాలిపోయింది.. పాట మిగిలింది
స్విచ్ వేస్తే తీగలోకి విద్యుత్ ప్రవహించినట్టు.. ఆ పాట నరనరానా ఉత్తేజం నింపుతుందని రాచకొండ అన్నారు. అదిగో ఆ ఉత్తేజప్రసార వాగ్గేయకారుడు వంగపండు అకస్మాత్తుగా పాటను మనకొది లేసి వెలిపోయేడు. ఇపుడాయన గురించి వలపోతలు, తలపోతలు, జేజేలు, ఆహాలు, ఓహోలు... అన్నన్నాలు... యేమలగాలు.. చ్చొచ్చోలు.. వినబడుతున్నాయి. కొందరు వంగపండు పాటలో వసంతకాల గానాన్ని వెదకపూనుకున్నారు. మరి కొందరు–వసంతకాల మేఘఘర్జనలు ఇపుడా పాటగానిలో గానీ, పాటలో గానీ లేవనీ; ఏ ప్రజల కోసం ఆ పాట అంత శక్తివంతమయ్యిందో ఆ ప్రజలను వొదిలాక పాట శక్తిని కోల్పోయిందనీ, పాటగాడు వొంటరయ్యేడనీ... వొంటరిగా వెళిపోయాడని– విప్లవ కోర్టుపీఠాల మీంచి యే పీఠానికి ఆ పీఠం తీర్పుల ప్రకటనలిచ్చేశాయి. చాన్నాళ్ళకిందట ఒకాయన–అమాయక జానపద ఎర్రజెండా–వంగపండు అని వ్యాఖ్యానించేడు. అవును.. వంగపండు అమాయక జానపద ఎర్రజెండా! అమాయకుడుగాబట్టే–అప్పుడుకి సిలకల రెక్కలిరిగి, ఊపిర్లాగి నేలకొరిగినాయి, పిల్లుల వేటలో యెలకలు కొన్ని సనిపోయినాయి. మరికొన్నిబోనుల్ల బందీ ఐనాయి. ఆకు తెంపితే ఆదివాసీ నెత్తురు సుక్కలుసుక్కలుగా కారుతున్న రోజులవి. కోరన్న, మంగన్న నుంచి జరుగుబాటు కోసం తిరుగుబాటు నేర్పిన గురువులు దాకా యెందరో వొరి గిన సమయమది. జెండా పీలికలు పీలికలయ్యింది. యెవులే పీలికకి లీడరో? ఏ రోడ్ యెటు తీసకపోతాదో అంతా తికమక మకతికగ ఉన్న సమయాన తికమకలూ, మకతికల్లేకుండా–ఏమ్ పిలడో యెల్దుమొస్తవా, శికాకుళంలో సీమకొండకని పిలుస్తూ, శికాకుళం బయలెళ్ళిపోనాడు.. సుత్తీకొడవలి గురుతుగ ఉన్న ఎర్రని జెండాని పట్టుకొని! ఉడుపు మళ్ళల్లో వినిపించే ఉడుపుగత్తెల నోమీనోమన్నలు, పశుల కాపర్ల గొంతులు తెగే రాగాలు.. బాల్యం లోనే వంగపండు వొంటిని పట్టేయి. ఉపాధి కోసం ఐటీఐ చేసి విశాఖపట్నం చేరాడు. పల్లె రైతు బతుకు నుంచి పట్నపు కార్మిక బతుకులోకి వొచ్చేడు. అపుడు పుట్టిందే.. సుత్తీకొడవలి గురుతుగ ఉన్నా ఎర్రని జెండా పాట. కార్మిక గీతాలతో విశాఖలో మార్మోగిన వంగపండు గొంతు తొలిసారిగా పార్వతీపురంలో ‘వొత్తన్నాడొత్తన్నాడు.. ఆ భూములున్న బుగతోడు, పోలీసుల తోడుతోను, అడుగడుగో అటుసూడు..’ అని చేత చిరతలతో, కీచుగొంతుతో వేలాది జనానికి వినిపించేడు. వేలాది జనం ఆ రోజు మహాకవి శ్రీశ్రీ కోసం వచ్చేరు. జనం వంగపండు పాటకు వన్స్మోర్ కొట్టేరు. శ్రీశ్రీ– ఇప్పుడు కావాల్సిన కవిత్వమిదీ అని వంగపండుని పొగిడేరు. అమాయక జానపదుడు కాబట్టి శ్రీశ్రీలాగా.. ఇకముందు పాటని నేను నడుపుతాను. ఈ యుగం నాది అనన్లేదు. ఈ పాట జనానిది అనన్నాడు. ‘రండిరో... పండరి భజనకు’ అన్న భజన గీత బాణీని, భావాన్ని ప్రజల చైతన్య మార్గంలోకి మరల్చే పాటగా.. ‘రండిరో కూలన్నా.. సంఘం కడదామూ, ఈళ సంగతేదో సూద్దామూ..’ అని రాసేడు. పట్నం, పల్లె జీవితాల మీద పాటలు రాసేడు. మాలపేటని కళ్ళముందర పెట్టేడు. కూలోళ్ళపిల్లని లోకానికి చూపేడు. మడిలో బెడ్డలన్ని– నీ నెత్తురు గడ్డలూ, పండిన పంటలన్ని నీ సెమటా సుక్కలని రైతోడికి ఎరుక పరిస్తే; ఎంత్రమెట్టా నడుస్తు ఉందంటే... వోరన్నోలమ్మీ అని యంత్ర గమనాన్ని కార్మికునికి వినిపించేడు. వంగపండు విశిష్టతకు ఓ గొప్ప ఉదాహరణ – భూమి బాగోతం నృత్య నాటక రచన, ప్రదర్శన. తెలుగునేల అశేష పల్లెల్లో ఇంత విస్తృతంగా ప్రదర్శనలు పొందిన కళారూపం ఇటీవల మరొకటి లేదు. శ్రీకాకుళ పోరాటాన్ని శిక్కోలు యుద్ధం పేరుతో కంజరి కథ; కారా గారి ప్రసిధ్ధ కథ ‘యగ్యం’ కంజరి కథగా రాసి ప్రదర్శనలు ఇచ్చాడు. అపార కళాసంపదను లోకానికి అందించిన ఈ వాగ్గేయకారుడు అతిపేదగా జీవించి మరణించాడు. వ్యాసకర్త ప్రముఖ కథా, నవలా రచయిత ‘ఉరకవే’ అధ్యక్షుడు ‘ 94400 31961 -
నిఖార్సయిన విప్లవకవి
అప్పుడు విరసం (విప్లవ రచయితల సంఘం) సభలు జరుగుతున్నాయి. 40 ఏళ్ల క్రితం జరిగిన ఆ సభలో రావిశాస్త్రిగారు, కె.వి.రమణారెడ్డిగారు.. ఇలా మహామహులు ఎందరో ఉన్నారు. అప్పుడు నేను ‘అందుకోరా గుత్తందుకో..’ అనే పాట రాశాను. నేను స్టేజి మీద పాడుతూ, మనిషి ఎత్తుకు ఎగురుతున్నప్పుడు ఓ వ్యక్తి వచ్చి డోలక్ కొడుతూ, కోరస్ ఇచ్చారు. ఆయనే వంగపండు ప్రసాదరావు. ఆ తర్వాత నేను, వంగపండు.. నారాయణమూర్తి గారి సినిమాల ద్వారా కలిసి చాలాసార్లు వారాలు, నెలలపాటు గడిపాము. వంగపండు చేతిలో చిన్న అందెలు ఉండేవి. అవి పోయాయి. నేను దుబాయ్ వెళ్లినప్పుడు తీసుకొచ్చిన అందెలు నా దగ్గర పది జతలు ఉన్నాయి. ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు నాకివ్వమని అడిగితే ఇచ్చాను. ఆయనకు ఇచ్చిన అందెలే నాకు ఇప్పుడు చివరి జ్ఞాపకంగా మిగిలాయి. గద్దరన్న, వంగపండు రాసిన ప్రతి పాటా అపురూపమే. ఎందుకంటే వాళ్లు పేరు కోసమో, డబ్బు కోసమో పాటలు రాయరు. ఒక మహోన్నతమైన ఉద్యమం కోసం వాళ్లు పాటలు రాశారు. వంగపండు నిరాడంబరుడు. ఆయన జీవితానుభవాలే పాటలుగా ఆయన గుండెలోతుల్లో నుండి వచ్చాయి. ఆ కాలంలో గద్దరన్న ప్రవాహానికి, ఉప్పెనకు నిలబడ్డ ఏకైక వ్యక్తి వంగపండు. తర్వాత ఆయన స్టెప్పు, మాటతో ఎంతో విభిన్నంగా ఉండేవారు. చాలా నిఖార్సయిన విప్లవ కవి ఆయన. ఆయనకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఆర్. నారాయణమూర్తి చాలా సాయం చేశారు. ఆయన సినిమాల ద్వారా వంగపండుగారి పాటలు ఎంతోమందికి దగ్గరయ్యాయి. -
ఫోక్ సింగర్, నటి మునియమ్మ కన్నుమూత
సాక్షి, చెన్నై : ప్రముఖ జానపద గాయకురాలు, తమిళ నటి పరవై మునియమ్మ(83) ఇక లేరు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మునియమ్మ.. ఆదివారం మదురైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.2003లో విక్రమ్ నటించిన 'దూళ్' చిత్రంతో నటిగా పరిచయమయ్యారు మునియమ్మ. ఈ చిత్రలో ‘సింగం పోల’ అనే పాటతో ప్రాచుర్యం పొందారు. ఆ తర్వాత అనేక సినిమాల్లో తన గాత్రాన్ని వినిపించారు. దూళ్ సినిమాతో పాటు తోరనై కోవిల్, మాన్ కరాటే, వీరమ్ తదితర తమిళ చిత్రాల్లో నటించారు. అలాగే పలు టెలివిజ్ షోలు కూడా చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న మునియమ్మకు గతంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత రూ.6 లక్షలు అందజేశారు. ఆ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి ప్రతి నెల ఆరు వేల రూపాయలను భృతిగా అందజేస్తున్నారు. మునియమ్మ భర్త గతంలోనే మృతి చెందారు. ఈమెకు నలుగురు కుమారులు, ముగ్గరు కుమార్తెలు ఉన్నారు. మునియమ్మ అంత్యక్రియలు మధురైలో ఆదివారం సాయంత్రం జరగనున్నాయి. -
ఇంటివాడైన గాయకుడు రషీద్
నిజామాబాద్ ,డిచ్పల్లి: రేలారే.. రేలా.. ఫేమ్, ప్రముఖ జానపద అంధ గాయకుడు మహమ్మద్ రషీద్, మరో అంధ గాయకురాలు సమీరా(దీప)ను పెళ్లి చేసుకుని ఆదివారం ఓ ఇంటివాడయ్యాడు. రషీద్ అచ్చమైన పల్లె పాటలతో రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులను సంపాందించుకున్నాడు. మండలంలోని నడపల్లి జీపీ పరిధిలో గల గాంధీనగర్ కాలనీకి చెందిన రషీద్, వరంగల్ అర్బన్ జిల్లా ఫాతిమానగర్కు చెందిన సమీరా ఇద్దరూ హైదరాబాద్ బేగంపేట్ దేవనర్ ఫౌండేషన్లో చదువుకున్నారు. అదే సమయంలో రషీద్ టీవీ షోలతో బిజీతో చదువుకు తాత్కాలికంగా దూరం కావాల్సి వచ్చింది. తిరిగి మూడేళ్ల క్రితం రషీద్ డిగ్రీలో చేరడంతో మరోసారి ఇద్దరు ఒకే చోట కలిశారు. ఇద్దరు గాయకులు కావడంతో పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. గిరిజన కుటుంబానికి చెందిన దీప తల్లిదండ్రులు రాజేశ్వరి, రామదాస్ మరణించడంతో తాత కోక్యా, నానమ్మ పుల్లమ్మ వద్ద పెరిగింది. రషీద్తో పెళ్లి కోసం దీప తన పేరును సమీరాగా మార్చుకుంది. ఇరు కుటుంబాలు వీరి ప్రేమను ఆమోదించడంతో ఆదివారం డిచ్పల్లి మండలం ఘన్పూర్లోని షాదీఖానాలో పెళ్లి జరిపించారు. కట్న కానుకలు తీసుకోకుండా మతాంతర వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచిన రషీద్, సమీరా జంటను బంధువులు, కుటుంబీకులతో పాటు ఇరువర్గాల పెద్దలు, మండల ప్రజలు అభినందించి ఆశీర్వదించారు. -
కొడుకు అంత్యక్రియలు.. తల్లి పాట
-
కొడుకు అంత్యక్రియలు.. గద్గద స్వరంతో తల్లి పాట..!
రాయ్పూర్: నవమాసాలు మోసి.. కనిపెంచిన తల్లి బిడ్డ క్షేమమే తన క్షేమమని తలుస్తుంది. పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది. వారికి కావాల్సింది సమకూర్చి ఆనందిస్తుంది. అదేసమయంలో చివరి ఘడియల్లో కన్నవారు తనకిష్టమైన పని చేయాలని కోరుకుంటుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఓ తల్లి కూడా ఇలాగే అనుకుంది. కానీ, ఆమె ఆశలు అడియాశలయ్యాయి. చేతికి అందివచ్చిన కుమారుడి అకాల మరణంతో ఆమె శోకసంద్రంలో మునిగిపోయింది. అంతటి దుఃఖ సమయంలో కూడా తనయుడికి ఇష్టమైన పాటపాడి మాతృ హృదయాన్ని చాటింది. చోలా మాటి కే రామ్.. సూరజ్ తివారి ఓ జానపద గాయకుడు. అతని తల్లి పూనర్ విరాట్ కూడా గాయకురాలు కావడం విశేషం. అయితే గత కొంతకాలంగా సూరజ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స అనంతరం కాస్త కోలుకున్న అతను నాలుగు రోజుల క్రితం ఓ కార్యక్రమంలో పాటపాడుతూ గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. ఇక సూరజ్ అంత్యక్రియల సమయంలో పూనర్ తన కుమారుడికి ఇష్టమైన ‘చోలా మాటి కే రామ్.. ఏకర్ కా భరోసా’ పాటపాడి కడసారి వీడ్కోలు పలికారు. సూరజ్ స్నేహితులు డప్పులు వాయించారు. గద్గగ స్వరంతో పూనర్ పాడిన పాటపై సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. చోలా మాటి కే రామ్.. ఛత్తీస్గఢ్లో చాలా పాపులర్ పాట. -
మందుల కోసం కశ్మీర్ నుంచి ఢిల్లీకి
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్కు చెందిన 26 ఏళ్ల ప్రముఖ జానపద గాయకుడు అలీ సఫుద్దీన్ ఆస్తమాతో బాధ పడుతున్న తన 78 ఏళ్ల తల్లికి మందులు కొనుక్కు పోవడానికి శ్రీనగర్ నుంచి గురువారం నాడు ఢిల్లీకి విమానంలో బయల్దేరి వచ్చారు. ‘ఆగస్టు 4వ తేదీ నుంచి కశ్మీర్ అంతటా అప్రకటిత కర్ఫ్యూ కొనసాగుతోంది. మందుల షాపులతో సహా అన్ని దుకాణాలు, మార్కెట్లు మూతపడ్డాయి. మొబైల్, ల్యాండ్ లైన్లు మూగబోయాయి. ఇంటర్నెట్ సౌకర్యం, కేబుల్ ప్రసారాలు నిలిచిపోయాయి. స్కూళ్లు, కాలేజీలు నిరవధికంగా మూసివేత. వీధుల్లో భారీగా సైనిక దళాల మొహరింపు. ఎక్కడికక్కడే బారికేడ్లు. అక్కడక్కడ ఆడుకునే ఒకలిద్దరు పిల్లలు తప్పా అంతా నిర్మానుష్యం’ అని సఫుద్దీన్ కశ్మీర్ పరిస్థితి గురించి మీడియాకు వివరించారు. సభలూ, సమావేశాలు నిషేధిస్తూ ప్రభుత్వం 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించగా, అక్కడ పరిస్థితేమో కర్ఫ్యూను తలిపిస్తోంది. ఢిల్లీ యూనివర్శిటీలో డిగ్రీ చదివిన సఫుద్దీన్ కశ్మీర్ యూనివర్శిటీ నుంచి ‘మాస్ కమ్యూనికేషన్స్’లో పీజీ చేశారు. ఆ తర్వాత సొంతంగా ఓ చిన్న రికార్డింగ్ స్టూడియోను ప్రారంభించి సొంతంగా కశ్మీర్ పాటల్ ఆల్బమ్ను విడుదల చేశారు. 16వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కశ్మీర్ కవి హబ్బా ఖతూన్ రాసిన ఓ కవితను ఆయన గానం చేశారు. దాన్ని ఇటీవల విడుదలైన ‘నో ఫాదర్స్ ఇన్ కశ్మీర్’ అనే సినిమాలో ఉపయోగించారు. ప్రస్తుం కశ్మీర్ ప్రజల మనోభావాల గురించి ప్రశ్నించగా 1990 దశకంలో అక్కడ స్వతంత్య్ర బీజం పడిందని, అది మొక్కై పెరిగి, ఇప్పుడు వృక్షమైందని చెప్పారు. ఢిల్లీకి రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల విమానం టిక్కెట్ నాలుగువేలయిందని చెప్పారు. మూడు వందల రూపాయల మెడిసిన్ కోసం పది వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సఫుద్దీన్ లాంటి వారు ఢిల్లీకి రాగలిగారుగానీ, ఆస్పత్రులకు వెళ్లేందుకు ఎలాంటి వాహనాలు లేక, వెళితే మందులు లేక స్థానిక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ వేళల్లో శ్రీనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి 800 నుంచి 900 మంది రోగులు వచ్చేవారని, గత ఐదు రోజులుగా రెండు వందలకు మించి రావడం లేదని అక్కడి ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
గుండెపోటుతో అరుణోదయ రామారావు మృతి
-
తెలంగాణ జానపద కళాకారిణి మృతి
హసన్పర్తి : జానపదం మూగబోయింది. 30 ఏళ్ల పాటు తన గళంతో ప్రజలను మంత్ర ముగ్ధులను చేసిన తెలంగాణ జానపద కళాకారిణి సంధ్య (50)ఇక లేరు. అనారోగ్య కారణంతో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున గుండెపోటుకు గురై హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో తుది శ్యాస విడిచారు. జానపద కళాకారుడు దివంగత శంకర్ భార్య సంధ్య. ప్రస్తుతం చింతగట్టు క్యాంపులోని పే అండ్ అకౌంట్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా ఎస్సార్ఎస్సీ క్యాంప్ క్వార్టర్లోనే ఉంటున్నారు. కుమార్తె రఘమయ్ బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, కుమారుడు మింటు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. 2017లో సంధ్యకు ఉత్తమ జనపద కళాకారిణి అవార్డుతో సత్కరించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు చేతుల మీదుగా అవార్డుతో పాటు రూ.లక్ష పురస్కారం అందుకున్నారు. సంధ్య మృతదేహాన్ని జానపద కళాకారులు, పే అండ్ అకౌంట్ అధికారులు, ఎస్సారెస్పీ, దేవాదుల, టీఎన్జీవోస్ నాయకులు సందర్శించి నివాళులర్పించారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు రాజేష్కుమార్, పే అండ్ అకౌంట్ అధికారిణి పద్మజ, టీఎన్జీవోస్ యూనిట్ అధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్, దేవరకొండ యాదగిరి, రాజమౌళితో పాటు నాగరి రికార్డింగ్ సెంటర్ నిర్వాహకుడు సీతా రాఘవేందర్, జడల శివ, దార దేవేందర్లు పాల్గొన్నారు. -
50 లక్షలు చల్లరు..
-
అతడిపై నోట్ల వర్షం కురిసింది...
అహ్మదాబాద్ : అభిమానానికి హద్దే ఉండదనేది మరోసారి నిరూపితమైంది. గుజరాత్ జానపద గాయకుడు కీర్తిదన్ గధ్విపై మరోసారి అభిమానం నోట్ల రూపంలో వెల్లువెత్తింది. గాయకుడి గానామృతానికి మంత్రముగ్ధులైన శ్రోతలు అతడిపై నోట్ల వర్షం కురిపించి తమ అభిమానం చాటుకున్నారు. అహ్మదాబాద్లో జరిగిన ఓ మ్యూజికల్ ఈవెంట్లో కీర్తిదన్ పాడిన పాటకు ఫిధా అయిన అభిమానులు అతడిపై లక్షల రూపాయలు వెదజల్లారు. ఇంకేముంది ఆయన ఉన్న వేదికపైకి కరెన్సీ నోట్లు కుప్పలు కుప్పలుగా వచ్చిపడ్డాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతంలో కూడా కీర్తిదన్పై నోట్ల తుఫాను కురిసిన విషయం విదితమే. -
ఆ సింగర్పై లక్షల రూపాయలు వెదజల్లారు
-
రాజును, రాజ్యాన్ని ప్రశ్నించేదే.. పాట
కవాడిగూడ: రాజును, రాజ్యాన్నిప్రశ్నించేదే పాట అని ప్రజాయుద్ధ నౌక గద్దర్ అన్నారు. గురువారం హైదరాబాద్ ఫెస్ట్లో సృజన స్వరం వేదికపై పాట అనే అంశంపై గద్దర్ మాట్లాడారు. శబ్దం ఉత్పత్తి, శబ్దం జానపదం.. జ్ఞానపదం, అభ్యుదయ పదం, విప్లవపథం అక్షరాల సమూహమే పాట అవుతుందని అన్నారు. భావం భౌతికంగా మారినప్పుడే పాటకు రూపం వస్తుందన్నారు. అనంతరం నిస్సార్, దేవేందర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర పోరాటం, తెలంగాణ ఉద్యమంలో, నగ్జల్బరీ ఉద్యమంలో పాట గొప్ప పాత్ర పోషించిందన్నారు. పాట నిండు చందమామ అని కొనియాడారు. కార్యక్రమంలో స్ఫూర్తి, నేర్నాల కిశోర్, జగన్ పాల్గొన్నారు. బాలోత్సవ్లో.. బాలోత్సవ్లో పిల్లలకు చిత్రలేఖనం, బొమ్మల తయారీ, కథ చెప్పడం, రాయడం లాంటి అంశాలపై విశ్లేషించారు. ఇవేదికపై ‘చిన్నారుల మానవీయత’ అంశంపై సంఘ సేవకురాలు డాక్టర్ లీక్ , రచయిత సోనియా శాండిల్య పాల్గొని మాట్లాడారు. మహిళా వేదికపై.. హైదరాబాద్ ఫెస్ట్లో ఏర్పాటు చేసిన మహిళ వేదికపై సెంటర్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అంశంపై మహిళలకు, పిల్లలకు అవగాహన కల్పించారు. మాయా లేదు.. మర్మం లేదు.. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై విద్యార్థులు అసక్తి చూపుతున్నారు. మాయా లేదు.. మర్మం లేదు అంతా సైన్స్ పరిజ్ఞానమే అంటూ చంద్రయ్య మనోహర్ మ్యాజిక్ షో పిల్లలను, పెద్దలను ఆకట్టుకుంటోంది. సుద్దాల హనుమంతు వేదికపై.. సుద్దాల హనుమంతు వేదికపై సినీ దర్శకుడు కాశీ విశ్వనాథ్, ఏపీఎఫ్ చైర్పర్సన్ విమల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సూర్యాపేటకు చెందిన కళాకారుల జడ కోలాటం, పృథ్వీరాజ్ క్లాసికల్ శాస్త్రీయ నృత్యం, భూదేవి బృందం సోలో సాంగ్, విక్టరీ బృందం బోనాల డాన్స్, కృష్ణా జిల్లా కళాకారుల వీధి నాటకం, పల్లె సుద్దులు, అభ్యుదయ అకాడమీ పూలే నాటకం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గాయకురాలు విమల ఆలపించిన గీతాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో ఫెస్ట్ కార్యదర్శి కోయ చంద్రమోహన్ పాల్గొన్నారు. -
పాట ఒకటే..భాషే వేరు..
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భానంతరం కళాకారులకు ప్రాధాన్యం పెరిగింది. అన్ని రాష్ట్రాలతో సాంస్కృతిక ఒప్పందాలను భాషా సాంస్కృతిక శాఖ కుదుర్చుకుంటోంది. ఇందులో భాగంగా ఇటీవల కేరళ క్యాలికట్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ డ్రామా ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఈ నెల 14, 15, 16 తేదీల్లో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు త్రీసూర్ పట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు తెలంగాణ సారథి కళాకారులను కేరళ ప్రభుత్వం ఆహ్వానించింది. సారథి కళాకారులు డాక్టర్ కుమారస్వామి, గాయకులు యశ్పాల్, డప్పు వాద్యకారుడు పెరుమాళ్ల బాబు వెళ్లారు. సదస్సులో మొదటి రోజు డాక్టర్ కుమారస్వామి ‘తెలంగాణ సాంస్కృతిక అభివృద్ధి తీరుతెన్నులు’ అనే అంశంపై పత్ర సమర్పణ చేశారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం కళాకారులు, కళారూపాలకు ప్రభుత్వం అందించిన చేయూత, రంగస్థల అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు సాంస్కృతిక విధాన రూపకల్పనకు ఏవిధంగా ఉపయోగపడుతున్నాయో వివరించారు. మన జానపదాలకు పోలిక.. ఒగ్గు కథ, గౌడ్ జెట్టీ కథ, బైండ్ల కథ, చిందు యక్షగానం తదితర కళారూపాలను రేఖామాత్రంగా ప్రదర్శించారు. వీటితో పాటు బతుకమ్మ పాటలు, పీర్ల పాటలు, ఉయ్యాల పాటలు, కోలాటం, నాట్ల పాటలు పాడారు. కేరళ జానపదాలు కొన్ని అక్కడ విన్నప్పుడు అచ్చం మన జానపదాలకు పోలిక ఉన్నట్లుగా కనిపించింది. ఏ దేశమైనా, ప్రాంతమైనా ప్రజలు పాడుకునే పాటలు, కళారూపాల్లో భావసారూప్యత ఉందని వివరించారు. మూడో రోజు డప్పుదరువులను పెరుమాళ్ల బాబు ప్రదర్శించారు. డప్పు తెలంగాణ ప్రజల జీవితాల్లో ఎలా పెనవేసుకుపోయిందో వివరించారు. అన్ని పండుగల్లో డప్పును ఉపయోగిస్తారని, వివాహానికి, హిందూ, ముస్లిం ఐక్యంగా జరుపుకొనే పీర్ల పండుగ నాడు డప్పుతో అసయ్ దూల ఆడతారని వివరించారు. హోలీ పండుగనాడు, మారెమ్మ, మైసమ్మ, ఉప్పలమ్మ, గ్రామ దేవతలకు డప్పు వాద్యాలతో వేడుకలు జరుపుకొంటారని డప్పు గొప్పతనాన్ని కొనియాడారు. మనిషి అంతిమ యాత్ర, పెళ్లిళ్ల సమయంలోనూ డప్పును వాడతారని వివరించారు. గ్రామాల్లో చాటింపును ఎన్ని రకాలుగా డప్పు వాయించుతారో యశ్పాల్ డప్పు కొట్టి మరీ చూపించారు. -
గాయకుడిపై నోట్లు కుమ్మరించారు..
అహ్మదాబాద్ : బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నోట్ల వర్షం కురిపించారు. ఓ ఫోక్ సింగర్పై పోటాపోటీగా కరెన్సీ నోట్లను వెదజల్లారు. అందుకు సంబంధించిన వీడియో ఓ ప్రముఖ మీడియా ఛానెల్లో చక్కర్లు కొడుతోంది. గుజరాత్ ఎమ్మెల్యే అంబరీష్ దర్(ప్రస్తుతం సస్పెండ్ అయ్యారు), బీజేపీ ఎమ్మెల్యే పూనమ్బెన్ మాదమ్ ఇద్దరూ తమ అనుచరులతో కలిసి గిర్ సోమ్నాథ్ పట్టణంలో ఫోక్ సాంగ్ ఫెస్టివల్కు హాజరయ్యారు. అక్కడ సింగర్ కీర్తిదన్ గధ్వి తన ప్రదర్శన ఇస్తున్న సమయంలో ఇద్దరూ పోటాపోటీగా డబ్బులు వెదజల్లారు. కార్యక్రమం అయ్యాక అదంతా పోగేస్తే రూ.25లక్షలకు పైగానే అని తేలింది. కాగా, బీజేపీ నేతపై మైక్రోఫోన్తో దాడికి పాల్పడినందుకు.. సభా కార్యక్రమాలకు అడ్డుపడినందుకు అంబరీష్ దర్తోపాటు మరో ఎమ్మెల్యే ప్రతాప్ దుధత్ను మూడేళ్లపాటు అసెంబ్లీ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. -
జానపథం..‘నిజ’బంధం
కొలుములపల్లె (బేతంచెర్ల):వేలి వేలి ఉంగరాలు... నా స్వామి... ఎడమచేతి ఉంగరాలు ..నాస్వామి.. అంటూ అతను పాడుతుంటే ప్రేక్షకులు పాటలో లీనమై తమను తాము మరచిపోతారంటే అతిశయోక్తి కాదు. కాళ్లకు గజ్జెలు కట్టి చేతిలో అందెలు పట్టుకొని పాటకు అనుగుణంగా అతను వేసే చిందు అద్భుతం. అతని నోటి వెంట వచ్చే జానపదం విని.. పల్లెజనం శ్రమను మరచిపోయి.. ఆనందడోలికల్లో తేలియాడుతుంటారు. బేతంచెర్ల మండలం కొలుములపల్లె గ్రామానికి చెందిన నిజాంగారి గోపాల్ విజయగాథ ఇదీ.. జానపద కళాకారుడు నిజాంగారి గోపాల్ చిరుప్రాయంలోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. బాల గాన గంధర్వుడిగా, జానపద గాన కోకిలగా బిరుదులు అందుకున్నాడు. ఆర్థిక పరిస్థితి సరిగా లేక పదో తరగతిలోనే ఇతను చదువుకు స్వస్తి పలికాడు. చిరుప్రాయంలోనే తన మేనమామ కేశాలు ప్రోత్సాహంతో జానపద గేయాలు నేర్చుకున్నాడు. కొంతమంది దాతల సహకారంతో జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి పోటీల్లో పొల్గొని విజేతగా నిలిచాడు. మాటీవీ రేలా రే రేలా ప్రోగ్రాంలో పలు ఎపిసోడ్లలో ప్రతిభ కనబరిచి.. 2010 నవంబర్లో ఫైనల్ విన్నర్గా నిలిచాడు. నాపరాయికి ప్రసిద్ధి గాంచిన కొలుముల పల్లె పేరు రాష్ట్రస్థాయిలో పేరుమోగేలా చేశారు. సినిమాల్లో పాటలు.. పల్లె గొంతుకు అయిన జానపదాన్ని రాష్ట్ర స్థాయిలో వినిపించిన ఘనత గోపాల్కే దక్కింది. ఇతని పాటలు.. జానపద కళాకారులను, సంగీత ప్రియులను సైతం మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. ఒంగోలు గిత్త సినిమాలోనూ ఒక జానపద గేయాన్ని ఆలపించాడు. జానపద కళాబృందం సభ్యులతో కలిసి ఇప్పట వరకు 300 ప్రదర్శనలు ఇచ్చారు. గోపాల్..తండ్రి ఓ సాధారణ రైతు. పేదరికం కారణంగా.. కొంత మంది దాతల సహకారంతో తాను నమ్ముకున్న రంగంలో రాణిస్తున్నాడు. ఉత్సాహవంతులైన వారికి నేర్పిస్తున్నా కళ మరుగున పడకుండా ఉత్సాహవంతులైన జానపదకాళాకారులను ప్రోత్సాహిస్తూ కొత్తబాణిలు నేర్పుతున్నాను. 15 నుంచి 35 సంవత్సరాలలోపు యువతి, యువకులను ప్రోత్సాహిస్తూ శిక్షణ ఇవ్వడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో దాతలు ఆహ్వానం మేరకు వెళ్లి ప్రదర్శనలు ఇస్తున్నాను. కొత్త వారితో జానపదాలు పాడిస్తున్నాను. జానపదం ప్రాచీన కళ. ఈ కళను మరుగున పడకుండా ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి. – నిజాంగారి గోపాల్ -
సింగర్ పై నోట్ల వర్షం..!
అహ్మదాబాద్: గుజరాతీ సంప్రదాయంతో మరో సింగర్ వివాదంలో చిక్కుకున్నాడు. వల్సాద్ జిల్లాలోని వాపి పట్టణంలో ఓ సాంస్కృతిక కార్యక్రమానికి ఫోక్ సింగర్ కీర్తిధన్ గధ్వి హాజరయ్యాడు. స్వామి నారాయణ్ కాంప్లెక్స్ లో తన పాటలతో అక్కడి వారిలో ఉత్సాహాన్ని నింపాడు. అయితే ఆయన పాడటం మొదలుపెట్టింది తరవాయి.. వారిపై నోట్ల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. దీంతో ఆయనకు కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. తొలిసారిగా 2015లో జామ్ నగర్లో ఓ ఈవెంట్లో రూ. 4 కోట్ల నగదు రాబట్టి వెలుగులోకి వచ్చాడు కీర్తిధన్. సింగర్ కీర్తిధన్ గధ్వి, ఆయన బృంధంపై ఈవెంట్ ముగిసేవరకూ రూ.100, రూ.500 నోట్లు, కొందరైతే రూ.50, రూ.10 నోట్లను చల్లుతూనే ఉన్నారు. డబ్బులు ఇలా చల్లడం ఏంటి, అవి ఎవరిస్తున్నారు, వారికి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి.. అసలు ఆ డబ్బుతో మీరు ఏం చేస్తారన్న ప్రశ్నలు ఆయనను చుట్టుముట్టాయి. లక్షల్లో రూపాయలు ఆయనపై కురిపించగా.. నగదు ఎంతో లెక్క మాత్రం తెలపలేదు. ఓవైపు ఏంతో మంది చేతికి డబ్బులు అందక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. ఇలా నోట్లను చల్లుతున్నారంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సింగర్ కీర్తిధన్ నోట్ల వర్షంపై స్పందిస్తూ.. 'ఇలా చేయడమన్నది గుజరాతీ సంప్రదాయంలో ఓ భాగం. ఈ నగదును సామాజిక కార్యక్రమాలకు ఉపయోగిస్తాను. డబ్బు దొరికింది కదా అని వృథా చేసే ప్రసక్తే లేదు. మంచి కార్యక్రమాలకు ఖర్చు చేస్తాం' అని చెప్పాడు. గతేడాది దక్షిణ గుజరాత్ లో ఓ సింగర్ నవరాత్రి ఉత్సవాలలో కచేరీ పెట్టగా.. దాదాపు రూ.40 లక్షల నగదును ఆయనపై కురిపించడం అప్పట్లో వివాదాస్పదమైంది. నోట్ల రద్దు తర్వాత కొత్త రూ.500, రూ.2000 నోట్లను విచ్చలవిడిగా చల్లుతూ ఈవెంట్ నిర్వహించడంపై తీవ్ర విమర్శలు తలెత్తాయి. తాజాగా సింగర్ కీర్తిధన్ ఈవెంట్లోనూ ఇలాగే నోట్లవర్షం కురిపించడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. -
27న ‘గోరటి’కి జాషువా కవితా పురస్కారం
గుంటూరు ఈస్ట్: మహాకవి కవికోకిల నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 121వ జయంతోత్సవాలు సందర్భంగా గోరటి వెంకన్నకు జాషువా కవితా పురస్కారం అందజేస్తున్నట్లు ఆహ్వాన సంఘం అధ్యక్షుడు జిల్లా రిజిస్ట్రార్ ఎస్.బాలస్వామి తెలిపారు. అరండల్ పేటలోని ఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27న శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జాషువా పురస్కార కవితాసభ నిర్వహిస్తున్నామని చెప్పారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘువులు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణ రావు మాట్లాడుతూ జాషువా సాహిత్య విశిష్టతపై ప్రముఖకవి యండ్లూరి సుధాకర్, గోరటి వెంకన్న కవిత్వంపై మువ్వా శ్రీనివాస్ ప్రసంగిస్తారని వెల్లడించారు. ఆహ్వాన సంఘ గౌరవాధ్యక్షుడు ఏసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.ముత్యం, జాషువా విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎన్.కాళిదాసు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి పీవీ రమణ, నాయకులు బి.లక్ష్మణరావు, సి.హెచ్.కిన్నర్, తదితరులు పాల్గొన్నారు. -
సుస్వరాల ‘శాలిని’
పాటల రంగంలో రాణిస్తున్న గిరిజన బిడ్డ తెలంగాణ ఉద్యమంలో హోరెత్తించే గీతాలు ‘ఆటా’ ఉత్సవాలకు తెలంగాణ సాంస్కృతిక సారథి తర పున హాజరు నెల రోజులపాటు 14 రాష్ట్రాల్లో ప్రదర్శనలు స్వగ్రామానికి తిరిగివచ్చిన గాయకురాలు ‘‘పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది’’ అనే నానుడిని నిజం చేస్తూ ముందుకుసాగుతోంది ఓ జానపద గాయకురాలు. నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ ఆత్మ విశ్వాసంతో దూసుకుపోతోంది. ఈ మేరకు తెలంగాణ జానపద గీతాలతోపాటు సందేశ్మాతక, మెలోడీ పాటలు పాడుతూ ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. మారుమూల తండా నుంచి అమెరికాకు వెళ్లి తన మధురమైన గానంతో తెలుగు ప్రజలను ఓలలాడించిన సుస్వరాల మాలిని.. ‘శాలిని’పై ప్రత్యేక కథనం. –నర్సంపేట కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ ఉండదని నిరూపిస్తూ ముందుకుసాగుతోంది జానపద గాయకురాలు శాలిని. నర్సంపేట డివిజన్ పరిధిలోని ఖానాపురం మండలం మంగళవారిపేట శివారు నాజీతండాకు చెందిన గుగులోతు లక్ష్మి, సోమ్లానాయక్ దంపతులకు ఆరుగురు సంతానం ఉన్నారు. సోమ్లానాయక్ వ్యవసాయంపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తూ పిల్లలను కష్టపడి చదివించారు. రెండో తరగతిలోనే పాటలు సోమ్లానాయక్ సంతానంలో ఐదో అమ్మాయిగా జన్మించిన శాలినికి చిన్నప్పటి నుంచే పాటల రంగంపై మక్కువ ఎక్కువ. ఇంట్లో అమ్మ, అన్నయ్య అప్పుడప్పుడు పాడే పాటలను ఆసక్తిగా గమనించిన శాలిని అందులో ప్రావీణ్యం సంపాదించాలని ఆరాటపడేది. ఈ క్రమంలో తం డాలోని ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న సమయంలో ఆమె పాడిన దేశభక్తి గీతానికి ఉపాధ్యాయుడు మదార్హుస్సేన్ మంత్రముగ్దుడయ్యారు. ఈ మేరకు పాటల రంగంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఆయన శాలినిని వెన్నుతట్టి ప్రోత్సహించారు. అలా మెుదలైన శాలిని పాటలు.. ప్రవాహంలో కొనసాగుతున్నాయి. కాగా, శాలిని 5వ తరగతి వరకు మంగళవారిపేటలో, 6 నుంచి పదో తరగతి వరకు బుధరావుపేట ప్రభుత్వ పాఠశాలలో చదివింది. ఇంటర్, డిగ్రీ నర ్సంపేటలో పూర్తి చేసింది. అలాగే హన్మకొండలో బీఎస్సీ నర్సింగ్ కోర్సును కూడా అభ్యసించింది. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలు ఓ వైపు క్రమశిక్షణతో చదువుకుంటూనే.. మరో వైపు తనకు ఇష్టమైన పాటల రంగంలో రాణిస్తూ శాలిని పేరు సంపాదించింది. ప్రధానంగా 2008 నుంచి తెలంగాణ ధూంధాంలలో పాల్గొని తన వంతుగా ఎన్నో పాటలు పాడి ప్రజలను చైతన్యపరిచింది. గాయకులు తాళ్లపెల్లి సునీల్, వరంగల్ శ్రీనివాస్ బృందాలతో కలిసి నర్సంపేట డివిజన్, జిల్లా, రాష్ట్రస్థాయి సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరై పాటలు పాడింది. ఇదిలా ఉండగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ టీవీ చానల్ నిర్వహించిన ‘రేలారే రేలా’ పోటీల్లో పాల్గొని టైటిల్ విజేతగా నిలిచి ఓరుగల్లు కీర్తిని నలుదిశలా చాటింది. నిర్భయపై పాట ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటనను దృష్టిలో పెట్టుకుని శాలిని ‘సన్నపు రైక’ అనే సందేశాత్మక పాటను రాసి పాడి వినిపించడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. జానపద గీతాలతోపాటు మెలోడీ, సామాజిక కార్యక్రమాలకు సంబంధించి ఎన్నో పాటలు రాస్తూ.. పాడుతూ శాలిని ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఆటా ఉత్సవాలకు ఎంపిక అమెరికాలో జూలైలో నిర్వహించిన ఆటా ఉత్సవాలకు శాలిని తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం తరపున ఎంపికైంది. తెలంగాణ రాష్ట్రం నుంచి మెుత్తం ఎంపికైన 15 మంది మహిళా కళాకారుల్లో వరంగల్ జిల్లా నుంచి శాలిని ఒక్కరే ఉండడం గమనార్హం. ఈ మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో శాలిని జూన్ 27న అమెరికాకు వెళ్లి 14 రాష్ట్రాల్లో తెలంగాణ జానపద గీతాలు ఆలపించి అక్కడి తెలుగు ప్రజలను ఆకట్టుకుంది. నెలరోజుల పాటు విదేశాల్లో పర్యటించిన శాలిని మంగళవారం ఇంటికి చేరుకుంది. గొప్ప అనుభూతి మారుమూల తండాలో పుట్టిన నేను అమెరికాకు వెళ్లి పాటలు పాడడం సంతోషంగా ఉంది. తెలంగాణ సంస్కృతిని అమెరికా దేశస్తులతో పాటు అక్కడ ఉంటున్న తెలుగు ప్రజలకు తెలియజేసే అవకాశం లభించడం నా అదృష్టం. నెలరోజుల్లో అమెరికాలోని 14 రాష్ట్రాల్లో ప్రదర్శనలు చేపట్టి అక్కడి ప్రజల మన్ననలు పొందాను. నిజంగా ఇది గొప్ప అనుభూతి. –శాలిని, కళాకారిని, నర్సంపేట శాలిని పాటలు అద్భుతం తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం సభ్యులు నెలరోజుల పాటు అమెరికాలో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేస్తూ వారు పాడిన పాటలు, నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. శాలిని తన మధురమైన గానంతో మమ్మల్ని అలరించింది. తెలంగాణ నుంచి వచ్చిన కళాకారులకు సహకారం అందించడం గర్వంగా ఉంది. –అనుగు లక్ష్మారెడ్డి, అమెరికా తెలుగు అసోసియేషన్ మెంబర్ -
ప్రముఖ విలక్షణ నటుడు కళాభవన్ కన్నుమూత
కొచ్చి: ప్రముఖ విలక్షణ నటుడు కళాభవన్ మణి(45) కన్నుమూశారు. కొంత కాలంగా లివర్, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ కొచ్చిలో తుది శ్వాస విడిచారు. ఈయన ఒక నటుడుగానే కాకుండా జానపద గీతాలను ఆలపించడంలో కూడా పేరు సంపాధించారు. మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన కళాభవన్.. దాదాపు దక్షిణ భారత దేశంలోని అన్ని భాషల చిత్రాల్లో ఆయన విలక్షణ పాత్రల్లో నటించి మెప్పించారు. విలనిజంలోనూ తనదైన కామెడీ ముద్రను కళాభవన్ వేశారు. ముఖ్యంగా తెలుగులో ఆయన నటించిన చిత్రం అనగానే గుర్తొచ్చేది జెమినీనే. జెమినీ సినిమాలో లడ్డా అనే క్యారెక్టర్తో విలక్షణ విలన్ పాత్ర పోషించిన ఆయన ఆ సినిమా అనగానే లడ్డానే గుర్తు చేసుకునేట్లుగా నటించారు. ముఖ్యంగా' నా పేరే లడ్డా.. జెమినీకంటే పేద్ద రౌడీని' అంటూ పలికించిన సంభాషణలు ఇప్పటికీ జనాల నోళ్లలో నానుతూనే ఉన్నాయి. కమేడియన్గా, విలన్గానే కాకుండా రంగస్థల నటుడిగా కూడా ఆయనకు మంచి పేరుంది. ఇక పలు మళయాల సినిమాల్లో హీరోగా కూడా నటించారు. తమిళ సినిమాల్లో కూడా నటించి అక్కడా అభిమానం సొంతం చేసుకున్నారు. ఆటోడ్రైవర్ నుంచి ప్రముఖ విలక్షణ నటుడి స్థాయికి.... ఈయన పాపులర్ సింగర్ కూడా. సల్లాపం అనే చిత్రంలోని తన పాత్రకు అనూహ్యంగా గొప్ప పేరొచ్చి ఆయన ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారుఉ. 1999లో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఉత్తమ నటుడి అవార్డు కూడా అందుకున్నారు. జాతీయ అవార్డుల్లో పోటీ పడ్డారు. లివర్ సమస్యల కారణంగా ఆస్పత్రిలో చేరారు. 'నటుడు కళాభవన్ శనివారం కొచ్చిలోని అమృత ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచాం. ఆదివారం రాత్రి 7.15గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు' అని వైద్యులు తెలిపారు. కేరళలోని చలక్కుడి అనే ప్రాంతానికి చెందిన కళాభవన్ నటుడు కాకముందు ఆటో డ్రైవర్ గా చేసేవారు.