general meeting
-
రాజకీయాల్లోకి తమిళ నటుడు విజయ్?
చెన్నై: తమిళ నటుడు దళపతి విజయ్ రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకుగాను త్వరలోనే కొత్తగా రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. చెన్నైలో గురువారం జరిగిన విజయ్ అభిమానుల సంఘం ‘విజయ్ మక్కల్ ఇయక్కమ్’సర్వసభ్య సమావేశం ఇందుకు ఆమోదం తెలిపింది. విజయ్ అధ్యక్షతన ఏర్పాటయ్యే పార్టీకి నియమ నిబంధనలను ఖరారు చేసే అధికారం కూడా ఈ సమావేశం విజయ్కే వదిలేసింది. నెలలోగా పార్టీ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తారని సమాచారం. తమిళనాడుతోపాటు కేరళలోనూ విజయ్కు భారీగా అభిమానులున్నారు. ఆయన పలు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారు. స్థానిక ఎన్నికల్లోనూ విజయ్ అభిమానుల సంఘం పోటీ చేసింది. 2026 ఎన్నికల్లో రాజకీయాల్లోకి ప్రవేశిస్తానంటూ గతంలోనే ఆయన ప్రకటించారు. -
కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం
-
టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్.. కేసీఆర్ రాజకీయ ప్రస్థానంలో మరో మలుపు..
Updates: తెలంగాణ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు చోటుచేసుకుంది. జాతీయ రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ ఆవిర్భావించింది. జాతీయ పార్టీకి సంబంధించిన పేపర్లపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్(భారత్ రాష్ట్ర సమితి)గా మారుస్తూ తీర్మానానికి సభ్యులు ఆమోదం తెలిపారు. పార్టీ పేరును బీఆర్ఎస్గా సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. నేటి నుంచి టీఆర్ఎస్ కనుమరుగు కానుంది. టీఆర్ఎస్ స్థానంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావించింది. జాతీయ రాజకీయాలే లక్ష్యంగా బీఆర్ఎస్ అవతరించింది. ►టీఆర్ఎస్ పేరు మారుస్తూ ఈసీకి పార్టీ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చాలని టీఆర్ఎస్ కోరింది. ఈ మేరకు పార్టీ రాజ్యాంగంలో సవరణలు చేశారు. యథావిధిగా పార్టీ జెండా, గుర్తు కొనసాగనున్నాయి. ►జాతీయ పార్టీ కోసం టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ ఆరుగురు ఎమ్మెల్యేలు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జాతీయ పార్టీగా ఎందుకు మారుస్తున్నామో కేసీఆర్ వివరించారు. తెలంగాణ భవన్లో కీలక భేటి కొనసాగుతోంది. సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ముందుగా తెలంగాణలో భవన్లో ప్రొ.జయశంకర్ విగ్రహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. సర్వసభ్య సమావేశంలో 283 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశానికి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, వీసీకే పార్టీ(తమిళనాడు) అధినేత తిరుమావళవన్, జాతీయ రైతు సంఘాల నేతలు హాజరయ్యారు. చదవండి: టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ 'మరో ప్రస్థానం' టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ తీర్మానం చేయనున్నారు. మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీకి సంబంధించి పేపర్లపై ముహూర్తానికి సీఎం కేసీఆర్ సంతకం పెట్టనున్నారు. సమావేశం తర్వాత ప్రతినిధులు, అతిథులకు ప్రగతి భవన్లో లంచ్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. -
కాసేపట్లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం
-
భారత్లో పెట్టుబడులను తగ్గించట్లేదు: గౌతమ్ అదానీ
న్యూఢిల్లీ: దేశ అభివృద్ధితోనే తమ సంస్థల పురోగతి ముడిపడి ఉందని పారిశ్రామిక గ్రూప్ దిగ్గజం అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే భారత్లో పెట్టుబడులు పెట్టడాన్ని ఎన్నడూ తగ్గించలేదని, మరింతగా ఇన్వెస్ట్ చేస్తున్నామని స్పష్టం చేశారు. తమ 70 బిలియన్ డాలర్ల పెట్టుబడుల ఊతంతో భారత్.. ఆయిల్, గ్యాస్ను దిగుమతి చేసుకునే దేశం స్థాయి నుంచి పరిశుభ్రమైన ఇంధనాలను ఎగుమతి చేసే దేశంగా మారగలదని అదానీ ధీమా వ్యక్తం చేశారు. ‘భారత్లో ఇన్వెస్ట్ చేయడం నుంచి మేము ఎప్పుడూ తప్పుకోలేదు. మా పెట్టుబడులు ఎన్నడూ నెమ్మదించలేదు. మా వ్యాపారాల స్థాయి, పనితీరుతో ఎలాంటి మార్కెట్ పరిస్థితుల్లోనైనా నెగ్గుకురాగలమన్న ధీమా మాకు ఉంది’ అని గ్రూప్ కంపెనీల వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. చదవండి: యూజర్లకు షాక్, భారీగా పెరిగనున్న అమెజాన్ ప్రైమ్ ధరలు..ఎక్కడంటే -
అర్ధరాత్రి హైడ్రామా.. పన్నీర్ సెల్వంకు భారీ ఊరట
చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో వర్గ పోరు పంచాయితీ మరోసారి న్యాయస్థానాన్ని చేరింది. అయితేసారి జరిగిన అర్ధరాత్రి హైడ్రామాలో పళనిస్వామికి ఝలక్ తగిలింది. అధికారం ఒక్కరి చేతుల్లోనే ఉండాలన్న తీర్మానంపై చర్చ మాత్రమే జరగొచ్చని అయితే.. ఆ తీర్మానంపై ఆమోదించడం లాంటి నిర్ణయం తీసుకోకూడదని డివిజన్ బెంచ్ ఆదేశించింది. దీంతో పన్నీర్సెల్వం వర్గానికి భారీ ఊరట లభించినట్లు అయ్యింది. జూన్ 23న(ఇవాళ) అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ భేటీ వెంకటాచలపతి ప్యాలెస్లో నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో.. సమావేశంలోనే అధికారం ఒక్కరి చేతిలోనే ఉండాలని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ కో-కోఆర్డినేటర్ పళనిస్వామి(EPS) తీర్మానం చేయాలనుకున్నాడు. అయితే.. మాజీ డిప్యూటీ సీఎం.. పార్టీ కోఆర్డినేటర్ పన్నీరుసెల్వం ఆ నిర్ణయాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ జరపకుండా నిలువరించాలని పోలీసులకు ఫిర్యాదుతో పాటు కోర్టుకు చేరింది ఈ వర్గపోరు పంచాయితీ. అయితే.. మద్రాస్ హైకోర్టు భేటీని, తీర్మానాలు చేయకుండా ఆపేలా పార్టీని ఆదేశించలేమని, అది పూర్తిగా ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయితే దీనిపై మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది పన్నీర్ సెల్వం వర్గం. జనరల్ కౌన్సిల్ సభ్యుడు షణ్ముగం అభ్యర్థనతో అర్ధరాత్రిపూట మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ న్యాయమూర్తి ఎం దురై స్వామి ఇంట్లో వాదనలు నడిచాయి. ఈ విచారణకు జస్టిస్ సుందర్ మోహన్ సైతం హాజరయ్యారు. వాదనల అనంతరం మద్రాస్ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తూ.. ముందుగా ప్రకటించిన 23 తీర్మానాలపై మాత్రం అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే ఇతర వ్యవహారాలపై చర్చ మాత్రమే జరగాలని పేర్కొంది. దీంతో ఇవాళ భేటీ జరుగుతుండగా.. ఒక్కరి చేతిలోనే అన్నాడీఎంకే పగ్గాలు ఉండాలన్న పళనిస్వామి తీర్మానానికి ఆమోదం లభించడం కుదరదనే చెప్పాలి. Chennai, Tamil Nadu | AIADMK workers, leaders gather at Shrivaaru Venkatachalapathy Palace, Vanagaram for party's General Council meeting to be held today. pic.twitter.com/9lnaL8OJvD — ANI (@ANI) June 23, 2022 చదవండి: ‘డమ్మీ రాష్ట్రపతి’గా ద్రౌపది ముర్ము.. తీవ్ర ఆరోపణలు -
ఒచ్చిర్రు.. కూసుర్రు.. పోయిర్రు..
సాక్షి, శామీర్పేట్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే మండల సాధారణ సర్వసభ్య సమావేశం సోమవారం తూతూమంత్రంగా జరిగింది. సభలో సమస్యల గురించి చర్చించి.. ఆ సమస్యల సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యతా రాహిత్యంగా కనిపించారు. వీరి తీరుపై పలువురు సభ్యులు అసహనం వ్యక్తం చేయడంతో సభ రసాబాసగా మారింది. పదవి అంటే అనుభవించడం కాదు అది ఒక బాధ్యత (దేశ సేవ) అని తెలుసుకున్న నాడే గ్రామాల అభివృద్ధి సాధ్యం అవుతుందనేది గమనించాలి. సభా దృష్టికి వచ్చిన విషయాలు.. మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు దాసరి యెళ్ళుబాయి అధ్యక్షతన సోమవారం శామీర్పేట మండల సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు పలు సమస్యలను సభా దృష్టికి తీసుకొచ్చారు. చదవండి: నాడు డెల్టా.. నేడు ఒమిక్రాన్.. వెంటాడుతున్న కరోనా వైరస్ గుబులు ♦ మజీద్పూర్ ప్రభుత్వ పాఠశాలలో రెండ్డు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని వెంటనే భర్తీ చేయాలని సర్పంచ్ మోహన్రెడ్డి సభా దృష్టికి తీసుకొచ్చారు. ♦ ప్రజయ్హోమ్స్లో మురుగుతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. సమస్యను గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎంపీటీసీ అశోక్రెడ్డి ఆరోపించారు. ♦ కరోనా రెండో డోస్ వేసుకోని వారు ముందుకొచ్చి వ్యాక్సిన్ తీసుకునేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలని మండల వైద్యాధికారులు కోరారు. ♦ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారానికి నోచుకోవడం లేదని సభ్యులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ♦ ప్రజల ఓటేస్తే గెలిచిన తాను ప్రజా సమస్యలు పరిష్కరించలేనప్పుడు ఈ ఎంపీటీసీ పదవి ఎందుకని అలియాబాద్ ఎంపీటీసీ కోడూరి అశోక్ సభలో ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, సర్పంచ్ల గైర్హాజరు... సోమవారం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సభ అధికారులు, పలువురు సభ్యులు ఆలస్యంగా రావడంతో సుమారు 35 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమయ్యింది. కొందరు మండల స్థాయి అధికారుల గైర్హాజరు అయ్యారు. శామీర్పేట మండలంలోని 10 మంది సర్పంచ్లలో నలుగురు సర్పంచ్లే హాజరవడం గమనార్హం. చదవండి:హైదరాబాద్: ఆరేళ్లలో కొట్టేసిన మొత్తం అక్షరాలా రూ.4,611 కోట్లు సెల్ఫోన్లతో అధికారుల కాలక్షేపం... సభ్యులు సభా దృష్టికి తీసుకొచ్చే సమస్యలను నోట్ చేసుకొని వాటి పరిష్కారానికి కృషి చే యాల్సిన అధికారులు సెల్ఫోన్లతో కాలక్షేపం చేశారు. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శులు, అధికారులపై ఉన్నతస్థాయి అధికారులు క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని పలువురు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పదవీ అంటే పదవీ అంటే అనుభవించడమా.? దీనిని బట్టి ప్రజాసమస్యల పరిష్కారానికి వీళ్లు ఎంత మేరా కృషి చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సర్పంచ్ పదవి అంటే అనుభవించడమని వారు అనుకోవడం దురదృష్టకరం అని పలువురు సభ్యులు పేర్కొంటున్నారు. ప్రజా సమస్యలను సభా దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలనే సోయ ప్రజాప్రతినిధులకు లేనప్పుడు గ్రామాల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. -
జిల్లాపై కపట ప్రేమ
కర్నూలు(అర్బన్): ‘ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లాపై కపట ప్రేమ చూపిస్తున్నారు. నీటి పారుదల విషయంలో అనంతపురం జిల్లాపైనే అమితమైన ప్రేమ కనబరుస్తున్నారు. దీనివల్ల జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. పక్కనే హంద్రీ–నీవా నీరు పోతున్నా, మన జిల్లాకు ఏడు టీఎంసీలు, అనంతపురం జిల్లాకు మాత్రం 40 టీఎంసీలు కేటాయించారు. ఇదేమి న్యాయం?’ అని వైఎస్సార్సీపీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి నిలదీశారు. చేసిన అన్యాయం చాలక.. తాజాగా నందవరం మండలం నాగులదిన్నె నుంచి 20 టీఎంసీల తుంగభద్ర నీటిని అనంతపురం జిల్లాకు తరలించేందుకు సర్వే జరుగుతోందని, దీన్ని వెంటనే ఆపకపోతే భవిష్యత్తులో కర్నూలు తీవ్ర తాగు, సాగునీటి కష్టాలను ఎదుర్కొవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురానికి నీటిని తరలించేందుకు జారీ చేసిన జీఓ 277ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై జెడ్పీ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలని సభ్యులు కూడా మూకుమ్మడిగా డిమాండ్ చేశారు. అయినా చివరకు దీనిపై తీర్మానం చేయకపోవడం శోచనీయం. శనివారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ అధ్యక్షతన జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీలు గంగుల ప్రభాకర్రెడ్డి, వెన్నపూస గోపాల్రెడ్డి, కత్తి నరసింహారెడ్డి, కేఈ ప్రభాకర్, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, మణిగాంధీ, కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జెడ్పీ సీఈఓ ఎం.విశ్వేశ్వరనాయుడుతో పాటు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు. గుండ్రేవుల నిర్మాణం చేపట్టాలి: ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన విధంగా గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి డిమాండ్ చేశారు. సర్వేలంటూ కాలక్షేపం చేస్తున్నారే తప్ప ఇంతవరకు ఈ నిర్మాణానికి నయాపైసా విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీ కెనాల్ పూర్తిగా దెబ్బతిన్నా పట్టించుకునే వారే లేరన్నారు. శ్రీశైలం జలాశయం నీటి మట్టం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో దీనిపరిధిలోని రిజర్వాయర్లు, పంట కాలువలకు నీటిని ఎప్పుడు విడుదల చేస్తారో అధికారులు ముందుగానే రైతాంగానికి తెలియజేయాలని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి కోరారు. కేసీ కెనాల్కు విడుదల చేసే తుంగభద్ర నీరు నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాలకు చేరే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఈఎన్సీకి పోతిరెడ్డిపాడు పనులు చూసేందుకే సమయం సరిపోతున్నందున రాయలసీమకు అదనంగా ఈఎన్సీని నియమించాలన్నారు. తాగునీటిపై గళం కోడుమూరు మండలంలోని అనేక గ్రామాలు తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నాయని ఎంపీపీ రఘునాథరెడ్డి తెలిపారు. వెంటనే శాశ్వత పరిష్కారాన్ని చూపాలన్నారు. ప్యాపిలిలో 20 రోజుల నుంచి నీరు రావడం లేదని ఎంపీపీ సరస్వతి వాపోయారు. కౌతాళంలో తాగునీరు కలుషితమైందని జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మి, ఆస్పరి మండలం జోహరాపురంలో నీటి సమస్య కారణంగా వక్కిరేణికుంటపై ఆధారపడాల్సి వస్తోందని ఆ మండల జెడ్పీటీసీ సభ్యురాలు బొజ్జమ్మ సమావేశం దృష్టికి తెచ్చారు. ఐదు శాఖలపైనే చర్చ అజెండా ప్రకారం ఎనిమిది శాఖలపై చర్చ జరగాల్సి ఉండగా, కేవలం ఐదింటితోనే సరిపెట్టడంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయం, నీటి పారుదల, గ్రామీణ నీటి సరఫరా – పారిశుద్ధ్యం, విద్యుత్, గృహ నిర్మాణం, పశు సంవర్ధకం, ప్రజా పంపిణీ, విద్యా శాఖలపై చర్చ సాగుతుందని ముందుగా అజెండా రూపొందించారు. అయితే.. గృహ నిర్మాణం, పశు సంవర్ధకం, ప్రజా పంపిణీ గురించి ఏ మాత్రమూ చర్చించ లేదు. విద్యుత్పై కూడా ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి కలుగజేసుకోవడంతో కొంత సేపు చర్చ సాగింది. కాగా.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేడీసీసీ బ్యాంక్ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి అసంబద్ధ వ్యాఖ్యలు చేయడంతో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆయనతో పాటు మరో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి, ఎమ్మెల్యే గౌరు చరిత తదితరులు కేడీసీసీబీ అధ్యక్షుడి తీరును నిరసిస్తూ సమావేశంలోనే బైఠాయించారు. సభ్యులు ప్రస్తావించిన సమస్యలివీ.. ► మార్క్ఫెడ్ ద్వారా రైతుల నుంచి కొన్న కందులకు డబ్బు ఎప్పుడు చెల్లిస్తారని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రశ్నించారు. కలెక్టర్ స్పందిస్తూ 45 వేల మెట్రిక్ టన్నులను కొన్నామని, ఇప్పటికే రూ.265 కోట్లు చెల్లించామని, ఇంకా రూ.60 కోట్లను చెల్లించాల్సి ఉందని చెప్పారు. ► తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బేషరతుగా రైతులు, చేనేత కార్మికులు, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామన్నారని, ఎంత మంది రైతులకు రుణాలను మాఫీ చేసి.. బ్యాంకుల్లో ఉన్న వారి బంగారు ఆభరణాలు, డాక్యుమెంట్లను తిరిగి ఇప్పించారని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి ప్రశ్నించారు. ► ప్రొద్దుటూరు నుంచి చాగలమర్రి వరకు గతంలో ఉన్న విద్యుత్ లైన్ బ్రేక్ డౌన్ అయ్యిందని, దాన్ని పునరుద్ధరిస్తే భవిష్యత్లో ఉపయోగం ఉంటుందని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి సూచించారు. ► ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు పంపిన రూ.35 కోట్ల ప్రతిపాదనలు ఏమయ్యాయని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ప్రశ్నించారు. వర్క్ అడ్జెస్ట్మెంట్ కింద ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ► రైతురథం ట్రాక్టర్లు టీడీపీ వారికే దక్కాయని డోన్ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు ఆరోపించారు. అర్హులైన రైతులకు ట్రాక్టర్లు ఇవ్వలేదని, కాంట్రాక్టర్లు, వ్యాపారులకు ఇచ్చారని ఆయన దుయ్యబట్టారు. ► నాగులదిన్నె నుంచి అనంతపురానికి నీటిని తీసుకెళ్తే జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని జెడ్పీ వైస్ చైర్మన్ పుష్పావతి ఆందోళన వ్యక్తం చేశారు. ► బెళగల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పైకప్పు పెచ్చులూడిపోయి కూలేందుకు సిద్ధంగా ఉందని, పాముల సంచారం కూడా అధికంగా ఉందని జెడ్పీటీసీ సభ్యుడు చంద్రశేఖర్ తెలిపారు. ► ప్యాపిలిలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జెడ్పీటీసీ సభ్యుడు దిలీప్ చక్రవర్తి డిమాండ్ చేశారు. ► కౌతాళం కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మి తెలిపారు. అలాగే గ్రామంలోని నీటి ట్యాంకులను శుభ్రం చేయడం లేదన్నారు. -
బీసీసీఐ ఎస్జీఎం చెల్లదన్న సీఓఏ
ఉప్పు–నిప్పుగా తయారైన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), పరిపాలక కమిటీ (సీఓఏ)ల మధ్య మరో లేఖాస్త్రం వార్తల్లోకెక్కింది. ఈ నెల 22న బీసీసీఐ నిర్వహించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) చెల్లదని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ క్రికెట్ బోర్డుకు లేఖ రాశారు. అందులో తీసుకున్న విధాన నిర్ణయాలకు విలువలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎస్జీఎంలో క్రికెటర్ల కొత్త కాంట్రాక్ట్లను ఆమోదించడంతో పాటు పలు కీలక నిర్ణయాలు బోర్డు ఆఫీస్ బేరర్లు తీసుకున్నారు. -
చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశంలో రసాభాస
-
నేడు బీసీసీఐ ప్రత్యేక భేటీ
-
అన్న క్యాంటీన్లపై రభస
సాక్షి, కడప కార్పొరేషన్ : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటీన్లకు సంబంధించి పాలకవర్గ సభ్యులకు తెలియకుండానే కార్పొరేషన్ కార్యాలయంలో స్థల కేటాయింపు జరపడంపై రభస చెలరేగింది. మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో మేయర్ సురేష్బాబు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 47వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్ ఈ అంశాన్ని లేవనెత్తుతూ కార్పొరేషన్ సాధారణ నిధుల నుంచి జన్మభూమి, నవనిర్మాణ దీక్షలకు ఖర్చు చేస్తున్నారని, అన్నక్యాంటీన్కు కార్పొరేషన్ స్థలాన్ని ఇస్తూ పాలకవర్గ సభ్యులకు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. దీనికి కమిషనర్ లవన్న స్పందిస్తూ ప్రభుత్వం అత్యవసరంగా చేయాలని చెప్ప డం వల్లే చేశామని, ఆ స్థలం ఎవరికీ ఇవ్వలేదని, కార్పొరేషన్ ఆధీనంలో నే ఉందని చెప్పారు. ప్రభుత్వం చేసే మంచి పనిని తప్పుబట్టడం సరికాదని టీడీపీ ఫ్లోర్ లీడర్ విశ్వనాథరెడ్డి సూచించగా, తప్పుబట్టడం లేదని సభ్యులకు సమాచారం ఇవ్వలేదనే అడిగామని పాకా సురేష్ వివరణ ఇచ్చారు. ఈ దశలో కో–ఆప్షన్ సభ్యుడు ఎంపీ సురేష్ అన్న క్యాంటీన్ల పనులన్నీ వైఎస్ఆర్సీపీ వారే చేస్తున్నారని అనడంతో ఆ పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీవు కో–ఆప్షన్ సభ్యుడివి ఎలా అయ్యావు’ అనడంతో టీడీపీ సభ్యుడు విశ్వనాథరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం చెలరేగింది. మేయర్ జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. వీఎల్టీ ఫీజుల వసూలుపై ఆగ్రహం కార్పొరేషన్లో వీఎల్టీ పేరుతో 14 శాతం ఫీజు లు వసూలు చేయడంపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకవర్గానికి తెలియకుండా ప్రజలపై భారం వేసి చెడ్డపేరు తెస్తున్నారని బండిప్రసాద్, పాకా సురేష్, లక్ష్మయ్య మండిపడ్డారు. నగరపాలక సంస్థకు చెందిన స్థలాల వివరాలను అసెస్మెంట్ రిజిస్టర్లో పొందుపరచాలని సభ్యులు సూచించగా మేయర్ అంగీకరించారు. రోడ్ల విస్తరణ, బుగ్గవంక సుందరీకరణ, ట్రాఫిక్ అంశాలపై సమగ్ర చర్చ జరిగింది. ఎల్ఈడీ దీపాల నిర్వహణపై ఏది నిజం ఎల్ఈడీ దీపాల కోసం ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చామని చెబుతోంది, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వమూ ఇచ్చామని చెబుతోంది, ఇందులో ఏది నిజమని పాకా సురేష్, మగ్బూల్ బాషా ప్రశ్నించారు. అన్ని నిధులు కార్పొరేషన్ జనరల్ ఫండ్లోంచి ఇవ్వాలని తీర్మాణం ప్రవేశపెట్టారు, అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్ఈడీ దీపాలకు నిధులేమీ ఇవ్వలేదా అని సూటిగా ప్రశ్నించా రు. అగ్రిమెంట్ చేసేటప్పుడు సభ్యులకు తెలపకుండా బిల్లులు చెల్లించాల్సి వచ్చేసరికి తీర్మాణం పెట్టడం సరికాదన్నారు. సంవత్సరం నుంచి అడుగుతున్నా తమ డివిజన్లో వీధిదీపాలు వేయలేదని సభ్యులు లక్ష్మయ్య, ఎంఎల్ఎన్ సురేష్ సభ దృష్టికి తెచ్చారు. దీనిపై మేయర్ స్పందిస్తూ కార్పొరేటర్ల కమిటీ దీనిపై అధ్యయనం చేసి నిధుల విడుదలపై స్పష్టత ఇస్తుందని ప్రకటించా రు. కార్పొరేషన్లో ఒక్కొక్కరి వద్ద రూ.2లక్షలు తీసుకుంటూ ఔట్ సోర్సింగ్ కార్మికులుగా నియమిస్తున్నారని, ఇలా 29 మందిని నియమించారని పాకా సురేష్ ఆరోపించారు. వీరిని ఎవరి అనుమతితో తీసుకున్నారో చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. దీనిపై మేయర్ స్పందిస్తూ 4 రోజు ల్లో నివేదిక ఇవ్వాలని కమీషనర్ను ఆదేశించారు. అమృత్ పథకానికీ మొండిచెయ్యేనా! అమృత్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపిందని సభ్యుడు పాకా సురేష్ విమర్శించారు. అమృత్ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 20 శాతం భరించకపోవడం దారుణమని విచారం వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్ బి.అరీఫుల్లా మాట్లాడుతూ మాచుపల్లె బస్టాండును చెత్తను తొలగించి ఆధునీకరించాలని కోరారు. మేయర్, ఎమ్మెల్యే కూ డా ఆ ప్రతిపాదనకు మద్దతు పలి కారు. కార్పొరేషన్ జనరల్ ఫండ్ను తమ డివిజన్లలో ఖర్చు పెట్టకుం డా అన్యాయం చేశారని ఎస్ఏ షంషీర్, జమ్మిరెడ్డి, హరూన్బాబు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో జనరల్ ఫండ్ ఏఏ డివిజన్లలో ఎంత ఖర్చు చేశారో జాబితా రూపొందించి, ఖర్చుపెట్టని డివి జన్లకు ఎక్కువ నిధులు ఇవ్వాలని కోరారు. అంతకుముందు ఇటీవల మృతి చెందిన 23వ డివిజన్ కార్పొరేటర్ జేసీబీ పీటర్స్ మృతికి సంతాపంగా సభ రెండు నిముషాలు మౌనం పాటించింది. ఎస్ఈ ఉమామహేశ్వరరావు, అదనపు కమీషనర్ నిరంజన్రెడ్డి, డిప్యూటీ కమీషనర్ సుశీలమ్మ, ఈఈ కేఎం దౌలా, ఇరిగేషన్ ఈఈ కొండారెడ్డి పాల్గొన్నారు. పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు– మేయర్ నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరిచేందు కు చర్యలు చేపడుతున్నట్లు మేయర్ సురేష్బాబు తెలిపారు. వేసవి కాలంలో తాగునీటి సమస్య రాకుండా గట్టెక్కామని, ఎల్ఈడీ వ్యవస్థ సక్రమంగా లేదన్నారు. ఉక్కాయపల్లె కంపోస్టు యార్డులో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న పనులను పాలకవర్గ సభ్యులతో కలిసి తనిఖీ చేస్తామని చెప్పారు. వారిపై కేసు నమోదు చేయాలి–ఎమ్మెల్యే కార్పొరేషన్కు సంబంధించిన గదిని అనధికారికంగా లీజుకు ఇచ్చి బాడుగ వసూలు చేసుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే అంజద్బాషా డిమాండ్ చేశారు. రూ.1000లు పింఛన్ డబ్బు దుర్వినియోగం అయ్యిందని ఉద్యోగులను సస్పెండ్ చేశారని, అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులను ప్రశ్నించారు. 29వ డివిజన్లో మేస్త్రిని మార్చడంపై కూడా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అంధకారంలో ఉన్నా, కాలువలు లేక దుర్వాసన చచ్చిపోతున్నా జనరల్ ఫండ్ లేదని చెప్పే అధికారులు అన్నక్యాంటీన్లు, నవనిర్మాణ దీక్షలకు ఎలా ఖర్చుపెడుతున్నారని ప్రశ్నించారు. -
రసాభసగా కర్నూలు సర్వసభ్య సమావేశం
-
5 గంటలు.. 11 అంశాలు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం వాడివేడిగా సా గింది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తుందంటే అది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజ శేఖరరెడ్డి పుణ్యమేనని శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీ ర్ అలీ అన్నారు. జెడ్పీ చైర్మన్ దఫే దార్ రాజు అధ్యక్షత వహించారు. సుమారు ఐదు గంటల పాటు ఎజెండాలోని అంశాలు వరుస క్రమంలో కాకుండా, ఎంపిక చేసిన 11 అంశాలపై సభ్యు లు చర్చ జరిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, ఆకుల లలిత, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ సింధే, నిజా మాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు ఎ.రవీందర్రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు. విద్య.. విద్యాశాఖ పనితీరుపై సమీక్షతో సమావేశం ప్రారంభమైంది. డీఎస్సీపై మూడేళ్లుగా ఊరిస్తూనే ఉన్నారని కాంగ్రెస్ పార్టీ సభ్యులు విమర్శించారు. గాంధారి మండలంలో విద్యావలంటీర్ల నియామకం సక్రమంగా జరగలేదని సభ్యులు ఆరోపించారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన సరిగా సాగడం లేదన్నారు. అధికారుల తీరుపై మండిపడ్డారు. విద్యుత్.. పలు గ్రామాల్లో విద్యుత్ తీగలు కిందికి వేళ్లాడుతుండడంతో ప్రమాదాలు పొంచి జరుగుతున్నాయని, ఇంటర్ పోల్స్ ఏమయ్యాయో అర్థం కావడం లేదని సభ్యులు పేర్కొన్నారు. ట్రాన్స్ఫార్మర్ల ఏబీ స్విచ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య స్వల్ప వాదోపవాదాలు జరిగాయి. వ్యవసాయం.. మధ్యాహ్న భోజన విరామం అనంతరం వ్యవసాయశాఖపై సభ్యులు చర్చించారు. ఫసల్ బీమా యోజనపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వరికి ఎక్కువగా రుణం ఇస్తుండడంతో అందరూ వరి సాగు చేస్తున్నట్లు రికార్డుల్లో నమోదవుతోందని, తద్వారా పంట నష్టపోతే పరిహారం అందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. నందిపేట ఏవోను తొలగించాలని సభ్యులు కోరారు. ఆయన పనితీరులో నిర్లక్ష్యం వల్ల రైతులు నష్టపోతున్నారని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. గ్రామీణాభివృద్ధి.. ఇంకుడు గుంతలు నిర్మించుకుని మూడేళ్లవుతున్నా బిల్లులు ఇవ్వలేదని సభ్యులు పేర్కొన్నారు. సుమారు 50 వేల మంది లబ్ధిదారుల్లో 18 వేల మందికి బిల్లులు రావాల్సి ఉందని, వెంటనే ఇప్పించాలని కోరారు. ఉపాధి హామీ నిధులు.. ఈజీఎస్కు జిల్లాలో ఎంపీలాడ్స్, ఏసీడీపీ నిధుల మ్యాచింగ్ గ్రాంట్ విషయమై చర్చించారు. ఎంపీపీలు తీర్మానాలు చేయకపోవడంపై అభ్యంతరం తెలపగా, ఎంపీ, ఎమ్మెల్సీలు ఈజీఎస్ నిధులతో సంబం ధం లేకుండా పూర్తిగా నిధులు ఇవ్వాలని బాజిరెడ్డి సూచించారు. ఉద్యానవన శాఖ.. కూరగాయల విత్తన పంపిణీ నిలిచిపోవడంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తంచేశారు. మండల సమావేశాలకు ఉద్యానవన అధికారులు హాజరుకాకపోవడంపై అభ్యంతరం తెలిపారు. అసలు ఉద్యానవన శాఖ ఉన్నట్లు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులకు సైతం తెలియడం లేదన్నారు. క్షేత్ర స్థాయి పర్యటనలు ఎందుకు చేయడంలేని ప్రశ్నించారు. 2015–16కు సంబంధించి సబ్సిడీ మొత్తాన్ని ఇప్పటికీ రైతుల ఖాతాల్లో జమ చేయలేదని సభ దృష్టికి తెచ్చారు. నీటి పారుదల.. సింగూరు నుంచి నిజాంసాగర్కు 8 టీఎంసీలు వదిలారని నీటి పారుదల అధికారులు పేర్కొన్నారు. అవి మిగులు జలాలేనని, మిగతా 9 టీఎంసీల నీటిని తీసుకునేందుకు అవకాశం ఉందని పలువురు సభ్యులు అభ్యంతరం తెలిపారు. మంచిప్ప రిజర్వాయర్కు రూ. 375 కోట్ల మంజూరుకు పరిపాలన అనుమతులు వచ్చాయని, అంచనాలు తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. పంచాయతీరాజ్.. పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణంలో అలసత్వం వహించిన కాంట్రాక్టర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సభ్యులు పంచాయతీరాజ్ అధికారులను ప్రశ్నించారు. పిట్లం, భిక్కనూరు, ఆర్మూర్ తదితర మండలాల్లో మంజూరైన పనులను సకాలంలో పూర్తి చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు అంశాలపై తీర్మానాలు.. సమావేశంలో 26 అంశాలపై ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఇందులో ప్రధానంగా 417 సీసీ రోడ్ల నిర్మాణానికి ఉపాధి హామీ, సీడీపీ నిధులు కేటాయిస్తూ చేసిన తీర్మానాలున్నాయి. సుమారు 50 ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలని, ఇందుకోసం ఉపాధి హామీ నిధులకు విద్యాశాఖ నిధులను మ్యాచింగ్ గ్రాంటుగా ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లాలో ఐదు పాఠశాలలను అప్గ్రేడ్ చేస్తూ తీర్మానించారు. మిషన్ భగీరథ... మిషన్ భగీరథ అధికారుల తీరుపై సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. కామారెడ్డి పట్టణానికి 15 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. మున్సిపాలిటీ నుంచి నిర్వహణ ఖర్చులు రావడం లేదని అధికారులు సమాధానమివ్వడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం అధికారుల తీరుపై మండిపడ్డారు. డిసెంబర్ నాటికి సింగూరు గ్రిడ్ నుంచి తాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
సాదాసీదాగా సర్వసభ్య సమావేశం
సీఎం, మంత్రి ఐకేరెడ్డి, రైల్వే మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం నిర్మల్ టౌన్ : ఆర్మూర్– నిర్మల్– ఆదిలాబాద్ రైల్వేలైన్ నను ఏర్పాటుచేసేందుకు సుముఖత వ్యక్తంచేసిన కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ప్రభుకు, సీఎం కేసీఆర్కు, మంత్రి ఐకేరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ మున్సిపల్ సర్వసభ్యసమావేశంలో సభ్యులు తీర్మానించారు. జిల్లాకేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలోని సమావేశమందిరంలో బుధవారం మున్సిపల్ సర్వసభ్యసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్చక్రవర్తి మాట్లాడారు. నిర్మల్కు రైల్వేలైన్ రావడానికి మంత్రి ఐకేరెడ్డి కృషిచేశారని తెలిపారు. పట్టణ అభివృద్ధికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాకేంద్రంలో పూర్తిగా ఎల్ఈడీ లైట్లు బిగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. జిల్లాకేంద్రంలోని సోఫినగర్ నుంచి చించోలి(బి) వరకు డ్రెయినేజీ నిర్మించేందుకు రూ. 30లక్షలు వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు. తిరుమల టాకీస్ వద్ద ఉన్న మురుగుకాలువ పరిస్థితిపై మున్సిపల్ వైస్ చైర్మన్ అజీంబిన్ యాహియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చైర్మన్ మాట్లాడారు. తిరుమల టాకీస్ వద్ద ఉన్న మురుగుకాలువకు సంబంధించి ఇప్పటికే తాత్కాలిక చర్యలు తీసుకున్నామన్నారు. ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడి త్వరలోనే కల్వర్టు నిర్మించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. సమావేశానికి సగం మంది సభ్యులే హాజరుకావడంతో సమావేశం బోసిపోయింది. -
జిల్లా కేంద్రం అభివృద్ధికి కృషి చేద్దాం
నిర్మల్టౌన్ : జిల్లాకేంద్రం అభివృద్ధికి కృషి చేస్తానని మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి పేర్కొన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమావేశమందిరంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సహకారంతో పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. పట్టణంలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా నాలుగు తాగునీటి ట్యాంక్లను నిర్మిస్తామని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నప్పటికీ సమస్యలను అధిగమిస్తామని తెలిపారు. పీఎంకేవీవైలో భాగంగా శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. లాజిస్టిక్స్, రిటైల్ విభాగాల్లో 400మంది విద్యార్థులను చేర్చుకోనున్నట్లు తెలిపారు. కౌన్సిల్ సభ్యులు దానికి సహకరించాలన్నారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది, కౌన్సిల్ సభ్యులు కేక్ కట్ చేసి నూతన సంవత్సర సంబురాలు జరుపుకున్నారు. ఇందులో మున్సిపల్ కమిషనర్ త్రియంబకేశ్వర్రావు, పాల్గొన్నారు. -
మాటల యుద్ధం
మనూరు : మనూరులో మంగళవారం మండల సర్వసభ్య సమావేశం ముగింపులో మనూరు సర్పంచ్ మారుతిరెడ్డి లేచి పట్టపగలు విద్యుత్ దీపాలు వెలుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఏఈ మాణిక్యం మాట్లాడుతూ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉందన్నారు. పంచాయతీ నిధులు వెచ్చిస్తే ప్రత్యేక లైన్ వేసేందుకు చర్యలు తీసుకుంటాన్నారు. ‘ప్రభుత్వం మెడలు వంచి విద్యుత్ బిల్లు తీసుకుంటోంది. మీరేం చేస్తున్నారు ’అని సర్పంచ్ పేర్కొనడంతో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి జోక్యం చేసుకున్నారు. విద్యుత్ బల్బుల సమస్య నేటిది కాదని గత ప్రభుత్వం నుంచి వస్తోందని అన్నారు. తమ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదనడంతో సర్పంచ్ మారుతిరెడ్డి మాట పెంచారు. ఎమ్మెల్యే, సర్పంచ్ల మధ్య మాటల యుద్ధ వాడివేడిగా సాగింది. బెల్లాపూర్ ఎంపీటీసీ రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో ప్రశ్నించకుండా ఇప్పు అగడమేంటని, కాంగ్రెస్ హయాంలో దోచుకున్నారని ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. జెడ్పీటీసీ నిరంజన్, ఎంపీపీ లక్ష్మిగణపతి ఎంత జోక్యం చేసుకున్నా పరిస్థితి అదుపులోకి రాలేదు. పోలీసులు సమావేశ మందిరం వద్దకు వచ్చి పరిస్థితిని పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్పంచ్ మారుతిరెడ్డి మాట తీరు సరికాదన్నారు. అనవసరమైన మాటలతో అభివృద్ధిని ఆటంకపర్చరాదని అన్నారు. ఎంపీపీ ఉపాధ్యక్షుడు గడ్డె రమేశ్ జోక్యం చేసుకుని కాంగ్రెస్ నాయకులను విమర్శించడం సమంజసం కాదన్నారు. ఓ దశలో వ్యక్తిగత విమర్శలకు దారి తీసే పరిస్థితి వచ్చింది. సభలో తీవ్ర గందరగోళం, ఉత్కంట నెలకొంది. ఎంపీపీ జోక్యం చేసుకుని సర్పంచ్ను సముదాయిండంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. -
వాడివేడిగా సర్వసభ్య సమావేశం
మెదక్ మున్సిపాలిటీ: వార్డుల్లో నెలకొన్న నీటి సమస్య పరిష్కరించాలని ఇంజనీర్ చిరంజీవి దృష్టికి తీసుకెళ్తే నాకేం తెలియదు...మీ సమస్య ఏదైనా ఉంటే చైర్మన్కు చెప్పుకోవాలంటూ సమాధానం ఇస్తున్నారని, ఇప్పటి వరకు జరిగిన మున్సిపల్ సమావేశాల్లో చర్చించిన ఏ సమస్యను కూడా అధికారులు పరిష్కరించలేదని 23వ వార్డు కౌన్సిలర్ గోదల జ్యోతి ధ్వజమెత్తారు. మున్సిపల్ సర్వసభ్య సమావేశమంటే...చాయ్ బిస్కెట్ల సమావేశంగా మారింది...సభ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలేవి పరిష్కారం కావడం లేదని 1వ వార్డు కౌన్సిలర్ అనిల్కుమార్ ఎద్దేవాచేశారు. మంగళవారం మున్సిపల్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్గౌడ్ అధ్యక్షతన స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 1వ వార్డు కౌన్సిలర్ అనిల్కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కౌన్సిలర్లంటే మున్సిపల్ కార్యాలయంలో కనీస విలువ లేకుండా పోతుందన్నారు. దీనిపై స్పందించిన మున్సిపల్చైర్మన్ వ్యక్తిగత విషయాలను సభలో చర్చించవద్దన్నారు. నీటి సమస్య పరిష్కరించాలని కోరితే అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని 23వ వార్డు కౌన్సిలర్ గోదల జ్యోతి సభ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన చైర్మన్ మీ సమస్యలు ఏమున్నాయో చెప్పాలంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కౌన్సిల్ సభ్యులు మధుసూదన్రావు, అనిల్కుమార్ కలుగజేసుకుని ఆవేశం ఎందుకు అధ్యక్షా సమస్యలు సామరస్యంగా పరిష్కరించాలని కోరారు. చిన్న చిన్న విషయాలకు కూడా చైర్మన్కే చెప్పుకోవాలంటున్నారని మరో కౌన్సిలర్ రమణా పేర్కొన్నారు. కౌన్సిలర్లు పేర్కొన విషయాలు తనకు తెలియకుండా జరుగుతున్నాయని, ఇకపై అలా చేయవద్దని అధికారులకు సూచిస్తానని చైర్మన్ తెలిపారు. జీరో బ్యాలెన్స అకౌంట్ల విషయంలో కౌన్సిలర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని కౌన్సిల్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. సభ్యులకు కనీస మర్యాద ఇవ్వని కమిషనర్ మాకొద్దంటూ కౌన్సిలర్ అనిల్కుమార్ తెల్చిచెప్పారు. అలాగే జీఐఎస్ సర్వేలో చాలా తప్పులు జరిగాయని, ఇష్టారీతిగా సర్వేలు నిర్వహించారని మండిపడ్డారు. కౌన్సిలర్ మధుసూదన్రావు మాట్లాడుతూ పట్టణాభివృద్ధి కమిటీ ఏర్పాటుచేసి ప్రణాళిక బద్ధంగా ముందుకెళితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. పట్టణంలో అడ్డగోలుగా అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయని, వాటికి అనుమతులు ఇవ్వడం సరైన విధానం కాదని కౌన్సిలర్లు పేర్కొన్నారు. సంబంధిత శాఖ మంత్రి ఒకటి చెబితే, ఇక్కడ మరొకటి చేయడం సరికాదన్నారు. తాము ఎవరికి అనుమతులు ఇవ్వలేదని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వెంచర్లకు నోటీసులివ్వాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు. జీఐఎస్ సర్వే ఆధారంగా పన్నుల శాతం పెరిగి మున్సిపల్కు రూ.35లక్షల ఆదాయం రానున్నట్లు చైర్మన్ తెలపగా,పెరిగిన ఆస్తి పన్నులు డిసెంబర్ 15 నుంచి అమలులోకి వస్తాయని మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు. జీఐఎస్ ఆన్లైన్ చేపట్టి 4300 మంది నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. సర్వేలో సమస్యలపై మున్సిపల్ మేనేజర్ను సంప్రదించాలని కమిషనర్ తెలిపారు. అలాగే పలుచోట్ల ప్రభుత్వం సీజ్చేసే ఇసుకను మున్సిపల్ అభివృద్ధి పనులకు వినియోగించేలా అధికారులు తహసీల్దార్కు లేఖ రాయాలని చైర్మన్ ఆదేశించారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి సహకారంతో గ్రేడ్-2గా ఉన్న మెదక్ మున్సిపాలిటీని గ్రేడ్-1లోకి తీసుకొస్తామన్నారు. అనంతరం వార్డుల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను కౌన్సిల్ సభ్యులు సభదృష్టికి తీసుకురాగా స్పందించిన చైర్మన్ ట్రాన్సకో డీఈకి ఫోన్ సమస్యను విన్నవించారు. ఈ సమావేశంలో వైస్చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు రబీన్ దివాకర్, ఆర్కె శ్రీనివాస్, చంద్రకళ, విజయలక్ష్మి, గాయత్రి, లక్ష్మి, గాయత్రి, సులోచన, గంగాధర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీడియాకు నో ఎంట్రీ మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి పాలకవర్గం మీడియాను అనుమతించలేదు. పలువురు పాత్రికేయులు ప్రశ్నించగా మున్సిపల్ చైర్మన్ ఒకింత అసహనం వ్యక్తంచేస్తూ....చాంబర్ మాకే సరిపోవడం లేదని మీరెక్కడ కూర్చుంటారని ఎదురు ప్రశ్నించారు. అనంతరం ఏమనుకున్నారో ఏమో మళ్లీ అందరిని లోపలకు అనుమతించారు. -
ఆత్మహత్య చేసుకోవాలని ఉంది..
ఎల్.ఎన్.పేట: మండలంలో అధికార పార్టీకి చెందిన నాయకుల వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకోవాలని ఉందంటూ ఇన్చార్జి తహశీల్దారు జి.వి.నారాయణమూర్తి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ ఒమ్మి కృష్ణవేణి అధ్యక్షతన గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో విలపించారు. రేషన్ కార్డులు, యూనిట్ల తొలగింపు విషయమై సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతున్న సమయంలో ముంగెన్నపాడు పంచాయతీ సర్పంచ్ యారబాటి రాంబాబు తన పంచాయతీలోని సమస్యలపై ఇన్చార్జి తహశీల్దారును ప్రశ్నించారు. ముంగెన్నపాడు కాలనీలో ఆక్రమణలు ఎందుకు తొలగించలేదంటూ నిలదీశారు. ఎమ్మెల్యే చెప్పినా జాప్యం చేస్తున్నారంటూ సర్పంచ్ మండిపడ్డారు. ఈ సమయంలో భావోద్వేగానికి గురైన నారాయణమూర్తి... ఆక్రమణల తొలగింపుపై అధికార పార్టీనేతలు ప్రతిరోజు వేధిస్తున్నారన్నారు. కార్యాలయంలో పనిచేసుకోనివ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్డీవో మాట్లాడి సెలవుపెట్టాలని అనుకుంటున్నానన్నారు. గతంలో ఆర్ఐగా ఇదే మండలంలో ఏడేళ్లపాటు విధులు నిర్వహించానని, ఇంతటి స్థాయిలో వేధింపులు ఎన్నడూ చూడలేదని కన్నీరుపెట్టారు. అధికారుల పని సక్రమంగా, న్యాయబద్ధంగా చేసుకోనివ్వకపోవడం బాధగా ఉందన్నారు. వేదికపై ఉన్న ఎంపీడీవో మోహన్ప్రసాద్, మండలప్రత్యేక ఆహ్వానితుడు ఒమ్మి ఆనందరావు కలుగ జేసుకుని సర్ది చెప్పడంతో శాంతించారు. -
‘సిక్కాలు’ కావాలి: టీసీఎస్ ఏజీఎంలో డిమాండ్
ముంబై: టాటా గ్రూప్ ఐటీ దిగ్గజం టీసీఎస్ నుంచి బోనస్ షేర్లను కోరుతూ ‘మాకు సిక్కాలు కావాలంటూ’ శుక్రవారంనాడిక్కడ జరిగిన కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో షేర్హోల్డర్లు డిమాండ్ చేశారు. సిక్కా అంటే నాణెం అని అర్థం. అలాగే టీసీఎస్ ప్రత్యర్థి ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ చీఫ్ పేరు కూడా విశాల్ సిక్కా. ఈ రెండూ కలిపి ధ్వనించేలా షేర్హోల్డర్ల నుంచి వచ్చిన డిమాండ్కు టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ బదులిస్తూ బోర్డు ఈ అంశాన్ని పరిశీలిస్తుందని చెప్పారు. కంపెనీ నగదు నిల్వలతో పోలిస్తే మూలధనం తక్కువగా వున్నందున పలువురు షేర్హోల్డర్లు బోనస్ షేర్లు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. తమిళనాడులో ఐటీ పరిశ్రమలో యూనియన్ల ఏర్పాటును అనుమతించడం వల్ల తమ కంపెనీపై ప్రభావం ఏదీ పడదని మరో ప్రశ్నకు మిస్త్రీ బదులిచ్చారు. -
నీరు-చెట్టుపై గరంగరం
♦ అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం ♦ ఆ పనులపై విచారణ చేస్తామన్న కలెక్టర్ ♦ ఇళ్ల ఎంపికలో కమిటీ సభ్యుల సంతకాలు లేకుండా తీర్మానంపై వాదోపవాదాలు ♦ జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని సజావుగా నడిపించిన కలెక్టర్ సాక్షి, కడప : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిరసనలు, వాదోపవాదాలతో వాడీవేడిగా సాగింది. పండ్లతోటల నష్ట పరిహారంతోపాటు నీరు-చెట్టు పనులకు సంబంధించి అవకతవకలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కొద్దిసేపు ప్రజాప్రతినిధుల మధ్య రగడ కొనసాగింది. శుక్రవారం కడపలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు జెడ్పీ చైర్మన్ గూడూరు రవి అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. కలెక్టర్ కేవీ సత్యనారాయణ హాజరుకాగా, జేసీ శ్వేత తెవతీయ జెడ్పీ సీఈఓ హోదాలో సభను నడిపించారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేలోపే టీడీపీ జెడ్పీటీసీ సభ్యులు అడ్డుతగలడంతో రచ్చ రాజుకుంది. పదేపదే తనకు మైకు ఇవ్వాలంటూ టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ సభ్యుడు పోరెడ్డి ప్రభాకర్ పట్టుబట్టిన వ్యవహారం జెడ్పీ చైర్మన్ గూడూరు రవి తీవ్రస్థాయిలో స్పందించారు. అరగంటపాటు వాదోపవాదాలు సాగినా అనంతరం ప్రశాంతంగా సమావేశం కొనసాగింది. నీరు-చెట్టు, ఇళ్ల మంజూరుపై వాగ్వాదం సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే వైఎస్సార్సీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ముందుగా పులివెందుల జెడ్పీటీసీ సభ్యుడు వెంగముని, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ వడగండ్ల వాన తో అరటితోపాటు ఇతర పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిని రైతులు నష్టపోయారన్నారు. 2010 నుంచి ఇప్పటివరకు పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం రైతులతో చెలగాటమాడుతోందని దుమ్మెత్తిపోశారు. దీంతో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్రెడ్డి ప్రభుత్వం బాగా పనిచేస్తోందని చెప్పబోగా వెంటనే అందుకున్న వైఎస్సార్సీపీ సభ్యులు రైతులు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను వివరించారు. ఈ నేపథ్యంలోనే వారి మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. ఇళ్ల మంజూరులో ఇదే ం పద్ధతి ఒంటిమిట్ట మండలంలోని మాధవరానికి 17 ఇళ్లు మంజూరుచేశారని, అయితే సర్పంచ్, సెక్రెటరీ లేకుండా సభ్యుల్లో ఇద్దరు మాత్రమే సంతకాలు చేసి తీర్మానం పంపారని దానిని ఎలా అమోదిస్తారంటూ జెడ్పీ వైస్చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. దానికి సమాధానం చెప్పాలని హౌసింగ్ అధికారులను కోర గా, మధ్యలో టీడీపీ నేతలు జోక్యం చేసుకోవడంతో మాటలయుద్ధం సాగింది. ఒంటిమిట్ట మండలంలో ఉపాధిలో చేసిన పనులపైనే నీరు-చెట్టులో మళ్లీ పనులు చేసి దోచుకుంటున్నారని ఆరోపించారు. స్పందించిన కలెక్టర్ విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సభను సజావుగా నడిపించిన కలెక్టర్ జెడ్పీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి కలెక్టర్ సత్యనారాయణ సజావుగా నడిపించారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు వాగ్వాదానికి దిగిన సందర్భంలో జోక్యం చేసుకుం టూ సమస్యను చక్కదిద్దుతూ వచ్చారు. జెడ్పీటీసీలు అడిగిన ప్రశ్నలకు కూడా స్వయంగా కలెక్టరే సమాధానాలు ఇవ్వడంతోపాటు పరి ష్కారానికి మార్గం చూపారు. పథకాలకు సం బంధించిన లబ్ధిదారుల విషయంలో ఖచ్చితం గా అర్హులకే అందాలని, ఎట్టి పరిస్థితుల్లో అనర్హులకు అందకూడదని, ఈ విషయంలో ఎవరినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నిధుల దుర్వినియోగంపై దద్దరిల్లిన జెడ్పీ కడప ఎడ్యుకేషన్: జిల్లాలో జరుగుతున్న నీరు చెట్టు పనుల్లో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని సంబంధిత పనులపై విజిలెన్సు విచారణ జరిపించాలని జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సభలో చేసిన తీర్మానాన్ని మెజారిటీ సభ్యుల ఆమోదం తెలిపారు. శుక్రవారం జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశానికి ఇన్చార్జు సీఈఓ, జేసీ శ్వేతా అధ్యక్షతన జెడ్పీ చైర్మన్ గూడూరు రవి ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా కలెక్టర్ కేవీ సత్యనారాయణ సభకు పరిచయం చేసుకున్నారు. అనంతరం ఈ ఏడాది పదవ తరగతిలో రాష్ట్రంలో కడప జిల్లాను మొదటి స్థానంలో నిలిపినందుకు డీఈఓ ప్రతాప్రెడ్డిని అభినందించారు. అనంతరం జరిగిన సమావేశంలో పలువురు మాట్లాడారు. పంటల బీమాను అందజేయాలి: ఎంపీ అవినాష్రెడ్డి జిల్లాలో 2013-14లో జరిగిన పంటనష్టం ఇన్సూరెన్సును ఇచ్చి రైతన్నలను ఆదుకోవాలని ఎంపీ అవినాస్రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లావ్యాప్తంగా 55 వేలమంది రైతులకు పంటలనష్టబీమా రావాల్సి ఉండగా ఇందులో 29 వేలమందికి ఇన్స్యూరెన్సు వచ్చిందన్నారు. ఇటీవల మరో 11 వేలమందికి కూడా వచ్చిందని.. ఇంకా 16 వేలమందికి రావాల్సి ఉందన్నారు. వారికి సంబంధించిన పత్రాలో సమస్యలు ఉన్నాయని తెలిపారన్నారు. సంబంధిత విషయంలో కలెక్టర్ చోరవ తీసుకుని జాబితాను మళ్లీ పంపాలన్నారు. అలాగే అరటి పంటకు కూడా బీమాను వర్తింపచేయాలన్నారు. అరటికి పంటనష్ట జరిగితే హెక్టారుకు 24 వేలు ఇస్తున్నారని ఇది ఏమూలకు సరిపోదన్నారు. ప్రజాధనం దుర్వినియోగం: రాచమల్లు జిల్లాలో జరిగిన నీరుచెట్టు పనుల్లో అవినీతి రాజ్యమేలుతొందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి ధ్వజమెత్తారు. చాలాచోట్ల వందకు పదిశాతం మేరకే పనులు చేశారని మిగతా సొమ్మంతా తెలుగుతమ్ముళ్ల జేబులు నింపేందుకేనన్నారు. ఇదంతా అధికారులకు తెలియదా అని నిలదీశారు. సంబంధిత పనులపై విజిలెన్స్తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విత్తనాలు తక్కువ ఇస్తే ఎలా: రవీంద్రనాథరెడ్డి ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చే వేరుశనక్కాయలు రైతులకు సరిపడవని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ రెడ్డి అన్నారు. ఎకరాకు 60 సేర్ల విత్తనాలు అవసరం అయితే మీరు ఇచ్చే ఒక బస్తా ఎలా సరిపోతాయన్నారు. రైతులకు సరిపడ విత్తనాలను ఇవ్వాలని అవికూడా నారాయణి రకం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మామిడికి గిట్టుబాటు ధరను కల్పించాలి: శ్రీకాంత్రెడ్డి రైతన్నలు పండించే మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి కోరారు. దీంతోపాటు రైతులకు సంబంధించి బ్యాంకుల్లో ఉన్న రుణాలను మొత్తం చెల్లించి మళ్లీ తీసుకొంటున్నారన్నారు. ఇలా చేయటం వల్ల రైతులు నష్టపోయి.. బయట బ్రోకర్లు బాగుపడుతున్నారని దీనిపై రైతులకు న్యాయం చేయాలన్నారు. స్పందించిన కలెక్టర్ పరిశీలిస్తామన్నారు. వెలిగళ్లు ప్రాజెక్టు నుంచి కాలువలకు నీరు ఇస్తే పంటల సాగుకు బాసటగా ఉంటుందన్నారు. నీరు-చెట్టులో అవినీతి జరగలేదంటే రాజీనామా చేస్తా: రఘురామిరెడ్డి ప్రభుత్వ తలపెట్టిన నీరు-చెట్టులో అవినీతి జరగలేదని అధికారులు నిరూపిస్తే తమ పదవికి రాజీనామా చేస్తానని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో విపరీతమైన కరువుతో రైతులు అల్లాడుతున్నారన్నారు. రైతులకు సరైన విత్తనాలు ఇవ్వలేదు, ఎరువులు లేవు. కానీ తెలుగు తమ్ముళ్ల జేబులు నింపేందుకే చంద్రబాబు నీరు-చెట్టును ప్రవేశ పెట్టారన్నారు. ఇది చంద్రబాబు సొమ్మా, పచ్చ చొక్కాల దోపిడీనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యాన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి: కొరముట్ల శ్రీనివాసులు కోడూరు ప్రాంతంలో ఉద్యాన పంటల సాగు అధికమని కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. గాలులకు, వర్షాలకు పంటన ష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఇంతవరకూ నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. పండ్ల తోటకు పంట ఇన్స్యూరెన్సు ఇస్తే బాగుంటుందని తెలిపారు. మండల కమిటీ ఆమోదం లేకుండానే పనులా: జెడ్పీ ఉపాధ్యక్షుడు ఇరిగేషన్ పనులకు సంబంధించి సర్పంచ్ రెజెల్యూషన్ లేకుండానే పనులను ఇస్తున్నారని జెడ్పీ ఉపాధ్యక్షుడు ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. కమిటీలో ఉన్న సభ్యలలో ఒకరిద్దరు మాత్రమే సంతకాలు తీసుకుని పనులను మంజూరు చేస్తున్నారన్నారు. ఒంటిమిట్ట మండలంలో హౌసింగ్కు సంబంధించి గ్రామసభ తీర్మాణం లేకుండానే 17 ఇళ్లను మంజూరు చే శారని వీటిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఐసైన్మెంట్ కమిటీలను ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్సీ గోవిందరెడ్డి జిల్లాలో అసైన్మెంట్ కమిటీలు లేక చాలా మంది రైతలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ గోవిందరెడ్డి అన్నారు. గత రెండేళ్ల నుంచి అసైన్ క మిటీ లేదన్నారు. అలాగే టీఎఫ్సీ , జనరల్ ఫండ్ కింద వచ్చిన పనులకు నిధులు రాలేదన్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన పనులకు కూడా నిధులు రాలేదన్నారు. దీనికి స్పందించిన కలెక్టర్ సంబంధిత పనుల్లో కొన్ని కోర్టులో ఉన్నాయని వాటి పరిధిలోని పనులకు మాత్రమే బిల్లులు ఇవ్వాలని వచ్చిందన్నారు. అలాగే అసంపూర్తిగా ఉన్న పనులకు బిల్లులు ఇచ్చే విషయమై పరిశీలిస్తామన్నారు. అక్రమ ఇసుక తరలింపును అరికట్టాలి: ఎమ్మెల్సీ దేవగుడి ప్రభుత్వం ఉచిత ఇసుక అని చెబుతుంది కానీ 99 శాతం అక్రమంగానే తరలిపోతుందని ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి అన్నారు. గ్రామానికి ఇద్దరు రౌడీలు జతై మామాళ్లు వసూలు చేస్తున్నారన్నారు. సంబంధిత క్వారీలను వెంటనే రద్దు చేయాలన్నారు. -
పిలుపు.. రాదాయె!
► మినీ మహానాడుకు అందని ఆహ్వానం ► అధినేతకు వలస ఎమ్మెల్యేల ఫిర్యాదు ► ప్రత్యేక సమావేశాల నిర్వహణకు బ్రేకులు ► పార్టీని ధిక్కరించి కార్యకర్తలతో భేటీ ► ఇన్చార్జీలకు, ఎమ్మెల్యేలకు మధ్య పెరుగుతున్న దూరం సాక్షి ప్రతినిధి, కర్నూలు: మినీ మహానాడు పేరుతో నిర్వహిస్తున్న కార్యకర్తల సర్వసభ్య సమావేశానికి తమకు కనీసం పిలుపు కూడా అందలేదని గోడదూకిన ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఈ మేరకు పార్టీ అధినేతను కలిసి ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిసింది. తమ వెంట ఉన్న కార్యకర్తల ముందు తమ పరువు పోతోందని వాపోతున్నారు. మరోవైపు తమ కార్యకర్తలతో ప్రత్యేకంగా మినీ మహానాడులను నిర్వహించుకోవాలని మొదట్లో భావించిన ఈ గోడ దూకిన ఎమ్మెల్యేలు.. చివర్లో వెనక్కి తగ్గారు. ఈ విధంగా ప్రత్యేక భేటీలను నిర్వహిస్తే తమపై ఎక్కడ ఇన్చార్జీలు ఫిర్యాదు చేసి తమను కార్నర్ చేస్తారోననే ఆందోళనతో వీరు ప్రత్యేక మినీ మహానాడుల నిర్వహణ ప్రయత్నాలను విరమించుకున్నట్టు సమాచారం. మొత్తం మీద జిల్లాలో గోడదూకిన ఎమ్మెల్యేలకు, అధికార పార్టీ ఇన్చార్జీలకు మధ్య దూరం రోజురోజుకీ పెరుగుతోంది. అధినేతకు ఫిర్యాదు.. మినీ మహానాడులకు ఆహ్వానం అందని గోడదూకిన ఎమ్మెల్యేలంతా తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి నియోజకవర్గ ఇన్చార్జీల మీద ఫిర్యాదు చేసినట్టు సమాచారం. తమను అవమానాల పాలు చేస్తున్నారని ఈ సందర్భంగా వాపోయారని తెలిసింది. తమ వెంట ఉన్న కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పుకోవాలని అధినేత వద్ద రాగాలు తీశారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇప్పటికే ప్రభుత్వ కార్యకలాపాల్లో పూర్తిగా ఇన్చార్జీల హవా కొనసాగుతోందని.. ఇక పార్టీలో కూడా వారిదే పెత్తనం అయితే తమకు ఏమి గౌరవం ఉంటుందని వాపోతున్నారు. ఇదే పద్ధతి కొనసాగితే తమ వెంట ఉన్న కార్యకర్తలకు సమాధానం చెప్పుకోలేని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని అధినేత ముందు తేటతెల్లం చేశారని సమాచారం. ప్రత్యేక మినీ మహానాడులపై వెనక్కి.. వాస్తవానికి గోడదూకిన ఎమ్మెల్యేలు ఎవరికి వారే ప్రత్యేకంగా మినీ మహానాడులను నిర్వహించుకోవాలని మొదట్లో భావించారు. అయితే, జిల్లా కమిటీ నిర్ణయానికి భిన్నంగా ప్రత్యేక భేటీలను ఏర్పాటు చేస్తే ఎక్కడ తమ మీద ఫిర్యాదు చేస్తారోననే ఆందోళనతో వీరు ప్రత్యేక భేటీ యత్నాలకు బ్రేకులు వేసుకున్నట్టు తెలిసింది. అయినప్పటికీ ప్రత్యేక మినీ మహానాడుల తరహాలో కాకుండా కార్యకర్తలతో సమావేశాల పేరిట కొద్ది మంది ఎమ్మెల్యేలు భేటీ కావడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అది కూడా పార్టీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. జిల్లా అధ్యక్షుడికి చెప్పకుండా సమావేశం కావడం పార్టీని ధిక్కరించడమేననే వాదన తెరమీదకు వచ్చింది. ఇదే విషయాన్ని పార్టీ అధినేత వద్ద నియోజకవర్గాల ఇన్చార్జీలు తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు తెలిసింది. మొత్తం మీద అధికార పార్టీలో అటు గోడ దూకిన ఎమ్మెల్యేలు... ఇటు ఇన్చార్జీలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. కొసమెరుపు ఎమ్మెల్యే, ఇన్చార్జి మధ్య నెలకొన్న తీవ్ర వివాదాల నేపథ్యంలో కోడుమూరు నియోజకవర్గ మినీ మహానాడు ఏకంగా రద్దు కావడం గమనార్హం. -
రూ.15వేల కోట్ల సమీకరణకు మార్గం సుగమం
ఎస్బీఐ వాటాదారుల ఆమోదం ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.15,000 కోట్ల నిధుల సమీకరణ కోసం వాటాదారుల ఆమోదం పొందింది. ఈ నిధులను పబ్లిక్ ఇష్యూ ద్వారా కానీ, విదేశాల్లో షేర్ల జారీ ద్వారా కానీ సమీకరించనున్నట్లు ఎస్బీఐ తెలిపింది. శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు ఆమోదం పొందామని తెలియజేసింది. ప్రభుత్వ వాటా 52 శాతానికన్నా తగ్గకుండా ఉండేలా ఈ నిధులను సమీకరిస్తామని పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి కల్లా రూ.15,000 కోట్ల నిధులు సమీకరించనున్నామని ఈ ఏడాది జనవరిలోనే ఎస్బీఐ వెల్లడించింది. బాసెల్-3 నిబంధనలకు పాటించడానికి అవసరమైన నిధులను ఇలా సమకూర్చుకోవాలని ఎస్బీఐ భావిస్తోంది. -
11న గ్రేటర్ తొలి సర్వసభ్య సమావేశం
⇒ అదే రోజు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు.. త్వరలోనే జీవో జారీ ⇒ ఫిబ్రవరి 3న ఎన్నికల సిబ్బందికి ఆన్డ్యూటీ సౌకర్యం ⇒ గ్రేటర్ ఎన్నికల బ్యాలెట్లో ‘నోటా’ ఆప్షన్ లేనట్లే సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ పూర్తికాకముందే తదనంతర కార్యక్రమాలకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ సర్వ సభ్య సమావేశం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక తదితర అంశాలపై గ్రేటర్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపిన దరిమిలా ఆ మేరకు జీవో కూడా జారీచేసేందుకు రంగం సిద్ధమైంది. 11న సర్వసభ్య సమావేశం జరిగే రోజునే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను నిర్వహించనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 2న జీహెచ్ఎంసీ పోలింగ్, 5న ఫలితాలు వెల్లడికానున్న సంగతి తెలిసిందే. పోల్కు మరుసటిరోజు ఆన్డ్యూటీ.. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 2న జరగనుండగా.. ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ఆ మరుసటి సెలవు ప్రకటించాలని ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞాపనపై సైతం రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బంది ఆ మరుసటి రోజు విధులకు హాజరుకాకపోయిన ‘ఆన్డ్యూటీ’(ఓడీ)గా పరిగణించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు సైతం ఒకట్రేండు రోజుల్లో జారీ కానున్నాయి. నోటాకు నై.. ఎన్నికల బరిలో నిలబడ్డ అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ నచ్చకపోతే.. అభ్యర్థులందరినీ తిరస్కరించేందుకు జీహెచ్ఎంసీ ఓటర్లకు ‘నోటా’ హక్కు ఇక లేనట్లే. నోటా అమలుపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరుతూ లేఖ రాసింది. సాంకేతిక కారణాలతో ప్రస్తుత పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ‘నోటా’ అమలు సాధ్యం కాదని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చింది. దీంతో నోటా అమలు లేనట్లేనని అధికారవర్గాలు తెలిపాయి. -
ఐఎఫ్సీఐ 22వ ఏజీఎం
ఐఎఫ్సీఐ (ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) 22వ వార్షిక సర్వసభ్య సాధారణ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. సుబ్రతో పార్క్, ఎయిర్ఫోర్స్ ఆడిటోరియంలో ఇటీవల జరిగిన ఈ సమావేశంలో సంస్థ మెజారిటీ షేర్హోల్డర్లు పాల్గొన్నారు. బోర్డ్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎస్వీ రంగనాథ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ మలై ముఖర్జీ, డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్ అచల్ కుమార్ గుప్తా, ప్రొఫెసర్ బాలకృష్ణన్, ప్రొఫెసర్ అరవింద్ సహాయ్ తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంస్థ కార్యకలాపాలపై సమావేశం చర్చించింది.