Geo tagging
-
అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా దిశగా..
సాక్షిప్రతినిధి, వరంగల్: సాంకేతిక సమస్యలను క్షణాల్లో అధిగమించి..నాణ్యమైన విద్యుత్ను నిరంతరం సరఫరా చేసేందుకు తెలంగాణ ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్పీడీసీఎల్) జియో ట్యాగింగ్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఇందుకోసం ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామా బాద్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో చేపట్టిన విద్యుత్ ఫీడర్లు, సబ్స్టేషన్లు, విద్యుత్ స్తంభాల నంబర్లు, మ్యాపింగ్ ప్రక్రియ తుది దశకు చేరింది. విద్యుత్ స్తంభాలకు జియో ట్యాగింగ్ ఇచ్చేందుకు ప్రత్యేక రంగులతో నంబర్లు వేస్తున్నారు. 33 కేవీ స్తంభానికి పసుపు రంగు, 11 కేవీ స్తంభానికి నలుపు రంగుతో ఈ నంబర్లు ఇస్తున్నారు. ఇది పూర్తయ్యాక జియో ట్యాగింగ్కు అనుసంధానం చేస్తారు. ఈ ప్రక్రియ జూన్లో ప్రారంభిస్తామని ఆ సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి తెలిపారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో ఐదు లక్షలకు పైగా విద్యుత్స్తంభాలకు జియో ట్యాగింగ్ పూర్తి దశకు చేరినట్టు అధికారవర్గాల సమాచారం. స్తంభాలకు ఇస్తున్న నంబరింగ్ పూర్తయ్యాక జియో ట్యాగింగ్కు అనుసంధానం చేస్తారు. జియో ట్యాగింగ్తో ఇవీ ప్రయోజనాలు విద్యుత్ ఉత్పత్తి నుంచి వినియోగం వరకు చాలా రకాల సమస్యలు ఉంటాయి. ప్రమాదాలు జరిగినప్పుడు, వర్షాలు కురిసినప్పుడు అంతరాయాలు ఎదురవుతాయి. ప్రకృతి విపత్తులో కరెంట్ అంతరాయం, ప్రమాదాలు జరిగినప్పు డు, గాలి దుమారానికి, పిడుగు పడినప్పుడు కరెంట్ స్తంభాలు విరగడం, విద్యుత్ వైర్లు తెగిపోవడం, ఫ్యూజులు పోవడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీంతో గంటలపాటు కరెంట్ సరఫరా నిలిచిపోతుంది. విద్యుత్ అంతరాయానికి కారణం ఏంటి.. సమస్య ఎక్కడొచ్చింది? అన్నది తెలుసుకోవడం సిబ్బందికి తలనొప్పి వ్యవహారమే. సాధారణంగా ఒకలైన్లో విద్యుత్ అంతరాయం వస్తే దాని పరిధిలోని మిగతా లైన్లకు కరెంట్ సరఫరా నిలిపివేస్తారు. కానీ జియో ట్యాగింగ్ చేస్తే సమస్య ఉన్న లైన్కు మాత్రం కరెంట్ సరఫరా ఆగిపోతుందని అధికారులు చెబుతున్నారు. జియో ట్యాగింగ్ ద్వారా విద్యుత్ అధికారులు, సిబ్బంది సెల్ఫోన్లకు మెస్సేజ్ల ద్వారా సమాచారం వస్తుంది. దీంతో విద్యుత్ లైన్లలో ఎక్కడ సమస్య తలెత్తిన ఆ ప్రాంతాన్ని సులువుగా గుర్తించి పరిష్కరించొచ్చని అధికారులు చెప్పారు. జూన్ మాసాంతం వరకు పూర్తిపోల్ నంబరింగ్, మ్యాపింగ్ ప్రక్రియ జూన్కు పూర్తవుతుంది. యాసంగి పంటలు చేతికి రాగానే మిగిలిపోయిన స్తంభా లకు నంబరింగ్, జియో ట్యాగింగ్ పూర్తి చేస్తాం. జియో ట్యాగింగ్ (మ్యాపింగ్) ద్వారా రైతులు, విద్యుత్ వినియోగ దారులకు సరఫరాలో ఏదైనా సమస్య తలెత్తితే విద్యుత్ అధికారులకు, సిబ్బందికి పోల్పై నంబర్తో సహా సమాచారం అందిస్తే సిబ్బంది మ్యాపింగ్ ద్వారా సులువుగా, త్వరగా చేరుకుంటారు. సమస్య త్వరితగతిన పరిష్కారమవుతుంది. కొత్త లైన్లు వేయాల్సి వస్తే సులభంగా ప్రణాళిక రూపొందించొచ్చు. సత్వర సేవలకు ఈ విధానం ఎంతగానో దోహదపడుతోంది. – కర్నాటి వరుణ్రెడ్డి, సీఎండీ,టీజీఎన్పీడీసీఎల్ -
లే అవుట్ డౌటే!
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏలో భూసేకరణ నిలిచిపోయింది. ఔటర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములను సేకరించి లే అవుట్లను అభివృద్ధి చేసేందుకు గతంలో ప్రణాళికలను రూపొందించారు. పలు చోట్ల రైతుల నుంచి భూసేకరణ కూడా చేపట్టారు. లేమూరు, ఇనుముల్నర్వ వంటి చోట్ల లే అవుట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు కూడా చేపట్టారు. నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా లే అవుట్లను ఏర్పాటు చేయాలని భావించారు. కానీ.. ప్రభుత్వం మారడంతో భూసేకరణ ప్రక్రియ నిలిచిపోయింది. భూ సేకరణపై కొత్త సర్కారు సమీక్షించి నిర్ణయం తీసుకొంటే తప్ప ముందుకెళ్లడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. వెయ్యి ఎకరాల సేకరణకు ప్రణాళికలు.. కోకాపేట్, మోకిలా, బుద్వేల్ తదితర ప్రాంతాల్లో హెచ్ఎండీఏ సొంత స్థలాల్లో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్కు కొనుగోలుదారుల నుంచి అనూహ్య స్పందన లభించడంతో అదే పద్ధతిలో మరిన్ని భూములను అభివృద్ధి చేయాలని భావించారు. ఔటర్కు అన్ని వైపులా సుమారు 1000 ఎకరాల వరకు సేకరించి అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఉప్పల్ భగాయత్లో మూడుసార్లు నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్కు కూడా కొనుగోలుదారుల నుంచి స్పందన లభించింది. అన్ని చోట్లా అంచనాలకు మించి ఆదాయం లభించింది. దీంతో హెచ్ఎండీఏ ఎక్కడ భూమి లభిస్తే అక్కడ లే అవుట్ను అభివృద్ధి చేసేందుకు రంగంలోకి దిగింది. ఈ మేరకు ఉప్పల్ భగాయత్ తరహాలో ప్రతాపసింగారంలో భారీ లే అవుట్కు చర్యలు చేపట్టారు. ఇందుకోసం సుమారు 250 ఎకరాలను హెచ్ఎండీఏకు అప్పగించేందుకు రైతులు సైతం సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు రైతులకు, హెచ్ఎండీఏకు మధ్య ఒప్పందం ఏర్పాటు చేసుకోవాల్సిన తరుణంలో ఎన్నికల దృష్ట్యా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. కీసర సమీపంలోని బోగారంలోనూ మరో 170 ఎకరాలు లే అవుట్కు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఔటర్ రింగ్రోడ్డుకు సమీపంలో ఉన్న ఈ భూములు నిరుపయోగంగా ఉన్నాయి. రెండు దఫాలుగా రైతులతో చర్చలు జరిపారు. మరోసారి చర్చించి ఒప్పందం చేసుకోవాల్సిన తరుణంలో అసెంబ్లీ ఎన్నికలొచ్చేశాయి. ప్రతాపసింగారం, బోగారంలతో పాటు కుర్మల్గూడ, దండుమల్కాపురం, లేమూరు, ఇన్ముల్నర్వ, కొర్రెముల, నాదర్గుల్ తదితర ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న సుమారు వెయ్యి ఎకరాల భూములను గుర్తించారు. ఇప్పటికే ఇన్ముల్నర్వలోని 96 ఎకరాలు, లేమూరులో మరో 83 ఎకరాలను సేకరించారు. కుర్మల్గూడలో 92 ఎకరాలు, దండుమల్కాపురంలో మరో 355 ఎకరాల చొప్పున భూమి అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో 924 ఎకరాలకు పైగా భూములను గుర్తించగా, ఈ భూముల సేకరణ పూర్తయ్యేనాటికి మరి కొంతమంది రైతులు ముందుకు వచ్చే వచ్చే అవకాశం ఉందని అప్పట్లో అధికారులు అంచనాలు వేశారు. కానీ ప్రభుత్వ మార్పుతో ఈ కార్యక్రమం నిలిచిపోయింది. తూర్పు వైపు విస్తరణపై దృష్టి.. ఇటీవల కాలంలో పడమటి వైపున రియల్టర్లు, బిల్డర్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ఐటీ సంస్థలు,పలు అంతర్జాతీయ సంస్థలు పడమటి వైపే విస్తరించుకొని ఉండడం, హైరైజ్ భవనాల నిర్మాణానికి అనుమతులు లభించడంతో కొనుగోలుదారులు సైతం ఇటు వైపు ఆసక్తి చూపుతున్నారు. కోకాపేట్ చుట్టుపక్కల ప్రాంతాల తర్వాత బుద్వేల్ హాట్కేక్గా మారింది. ఇప్పటికే ఈ రెండు చోట్ల విక్రయాలు పూర్తి కావడంతో హెచ్ఎండీఏ తూర్పు వైపున దృష్టి సారించింది. గతంలో మేడిపల్లి, బోడుప్పల్, తొర్రూరు తదితర ప్రాంతాల్లో స్థలాలను విక్రయించారు. సొంత ఇళ్ల నిర్మాణానికి ఈ లేఅవుట్లు అనుకూలంగా ఉండడంతో మధ్యగతరగతి వర్గాలు, ఎన్నారైలు ఎక్కువగా కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే మరోసారి తూర్పు వైపున కొనుగోలుదారులను ఆకట్టుకొనేందుకు భారీ లేఅవుట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిరుపయోగంగా ఉన్న భూములను సేకరించి రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, పార్కులు తదితర సదుపాయాలతో నివాసయోగ్యమైన వెంచర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రైతుల నుంచి సేకరించిన భూములను అభివృద్ధి చేసిన తర్వాత 60 శాతం భూములను తిరిగి వారికే అప్పగిస్తారు. 40 శాతం భూమిని హెచ్ఎండీఏ తీసుకుంటుంది. ‘భూ సేకరణ తిరిగి మొదటికొచి్చంది. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే తప్ప తిరిగి చేపట్టడం సాధ్యం కాదు’ అని ఒక అధికారి చెప్పారు. హెచ్ఎండీఏ భూములకు జియో ట్యాగింగ్ హెచ్ఎండీఏ భూములకు త్వరలో జియో ట్యాగింగ్ చేయనున్నారు. ఇందుకోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి తదితర జిల్లాల్లో హెచ్ఎండీఏకు ఉన్న భూములపై అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఆ లెక్క తేలిన వెంటనే జియో ట్యాగింగ్కు శ్రీకారం చుడతారు. ఇదే జరిగితే ఆన్లైన్లో నిరంతరం భూములను పర్యవేక్షించేందుకు ఆస్కారం ఉంటుంది. ఎక్కడ ఎలాంటి అక్రమ కట్టడాలు వెలసినా, కబ్జాలకు పాల్పడినట్టు నిర్ధారణ అయిన వెంటనే హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ బృందం రంగంలోకి దిగుతుంది. పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్, తదితర విభాగాల సాయంతో భూముల రక్షణకు చర్యలు చేపడుతుంది. హెచ్ఎండీఏలోని ఏడు జిల్లాల పరిధిలో వేలాది ఎకరాలకు పైగా భూములు ఉన్నట్టు అంచనా. అయితే కొంతకాలంగా ఈ భూముల రక్షణ పెద్ద సవాల్గా మారింది. ఒక్క జవహర్నగర్లోనే దాదాపు 1500 ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు అంచనా. కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అనేక చోట్ల హెచ్ఎండీఏ భూములు అదృశ్యమయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు గతంలో హెచ్ఎంటీ ప్రాంతంలో ఉన్న వంద ఎకరాలకు పైగా భూమికి రక్షణ చర్యలు చేపట్టారు. కాగా.. శంషాబాద్లో అన్యాక్రాంతమైన భూముల కోసం హెచ్ఎండీఏ పెద్దఎత్తున న్యాయ పోరాటం చేయాల్సివచి్చంది. ఇటీవల ఆ భూములపై సుప్రీంకోర్టులోనూ హెచ్ఎండీఏకు అనుకూలంగా తీర్పు వెలువడిన సంగతి తెలిసిందే. ఇలా సొంత స్థలాలు అన్యాక్రాంతం కాకుండా రక్షించేందుకే తాజాగా జియో ట్యాగింగ్ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. -
ఇక్కడి ఆస్తులకు జియో ట్యాగింగ్ తప్పనిసరి! ముందే చేయించుకుంటే ఆఫర్..
దేశ రాజధాని నగరం ఢిల్లీ దేశంలోని అతిపెద్ద, అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో ఒకటి. స్థానికులకే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన చాలా మందికి ఇక్కడ ఆస్తులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఆస్తులకు జియో ట్యాగింగ్ తప్పనిసరి అని ప్రకటించింది. ముందే చేయించుకుంటే రాయితీ ఎంసీడీ పరిధిలోని ఆస్తులకు జియో ట్యాగింగ్ చేయడం ద్వారా ఆస్తి పన్నుల పూర్తి, కచ్చితమైన సమాచారం లభిస్తుందని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ భావిస్తోంది. మేరకు అన్ని ప్రాపర్టీలకు జియోట్యాగింగ్ తప్పినిసరి అని వాటి యజమానులకు స్పష్టం చేసింది. అంతేకాకుండా 2024 జనవరి 31 లోపు జియోట్యాగింగ్ చేయించుకున్న వారికి ఆస్తిపన్నుపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రాపర్టీ యజమానులు వ్యతిరేకిస్తున్నారు. ఇంత పెద్ద ప్రకటన చేసే ముందు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎవరినీ సంప్రదించుకుండా, యజమానుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తున్నారు. -
ప్రతి గణేష్ విగ్రహానికీ క్యూఆర్ కోడ్
హైదారబాద్: గణేష్ నిమజ్జన సామూహిక ఊరేగింపుల పర్యవేక్షణకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటున్నారు. ప్రతి వినాయక మండపానికీ ఓ ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ కేటాయించడంతో పాటు వాటికి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఇలా దాదాపు 12 వేల విగ్రహాలను ట్యాగ్ చేశారు. పోలీసులు గణేష్ విగ్రహాల వివరాలతో పోలీసులు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ముద్రించి అందిస్తున్నారు. ఇలా ఈ విగ్రహాలను జియో ట్యాగింగ్ చేయడంతో పాటు ఐసీసీసీలోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానించారు. ఈ క్యూఆర్ కోడ్స్, జియో ట్యాగింగ్ డేటాను పోలీసు అధికారిక యాప్ టీఎస్ కాప్లోకి లింకు ఇచ్చారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయిలో ఉండే పోలీసుల వరకు ఎవరైనా సరే తమ ప్రాంతంలో ఎన్ని మండపాలు ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? ఎప్పుడు ఏర్పాటు అవుతాయి? నిమజ్జనం ఎప్పుడు? ఏ మార్గంలో వెళ్ళి, ఎక్కడ నిమజ్జనం చేస్తారు? తదితర వివరాలను తమ ట్యాబ్స్, స్పార్ట్ఫోన్స్లో చూసుకునే అవకాశం ఏర్పడింది. ఊరేగింపు మార్గాలను పరిశీలించిన సీపీ సామూహిక నిమజ్జనం గురువారం జరగనుండటంతో నగర కొత్వాల్ సీవీ ఆనంద్ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. మంగళవారం ఆయన అదనపు సీపీలు విక్రమ్ సింగ్ మాన్, జి.సు«దీర్బాబు, సంయుక్త సీపీ ఎం.శ్రీనివాసులు తదితరులతో కలిసి చారి్మనార్, ఎంజే మార్కెట్ సహా వివిధ ప్రాంతాల్లోని ఊరేగింపు మార్గాన్ని పరిశీలించారు. బాలాపూర్ నుంచి హుస్సేన్సాగర్ వరకు మొత్తం 19 కిమీ మేర ప్రధాన ఊరేగింపు జరగనుంది. ఈ మార్గంలో అనేక ఇతర ఊరేగింపులు వచ్చి కలుస్తాయి. బందోబస్తు, భద్రతా విధుల్లో మొత్తం 25,694 మంది సిబ్బంది, అధికారులు పాల్గొంటారు. వీరికి అదనంగా 125 ప్లటూన్ల సాయుధ బలగాలు, మూడు కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వినియోగిస్తున్నారు. ఈ బలగాలు హుస్సేన్సాగర్ చుట్టూతో పాటు 18 కీలక జంక్షన్లలో మోహరించి ఉంటాయి. ప్రతి ఊరేగింపు మార్గాన్ని ఆద్యంతం కవర్ చేసేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అవసరమైన సంఖ్యలో క్యూఆరీ్ట, యాంటీ చైన్ స్నాచింగ్, షీ–టీమ్స్ బృందాలతో పాటు డాగ్ స్వా్కడ్స్ను రంగంలోకి దింపుతున్నారు. ఐసీసీసీలో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని విభాగాలకు చెందిన అధికారులు ఈ ఊరేగింపును పర్యవేక్షిస్తారు. నగర ప్రజలు సైతం తమకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. రాచకొండ పరిధిలో.. వినాయక నిమజ్జనానికి రాచకొండ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కమిషనరేట్ పరిధిలోని 56 చెరువుల వద్ద 3,600 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిమజ్జన ఏర్పాట్లపై మంగళవారం రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వివరాలను వెల్లడించారు. అన్ని చెరువులను సందర్శించి ఇప్పటికే క్రేన్లను ఏర్పాటు చేశామన్నారు. 6 వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉంటారని తెలిపారు. మరో 1000 మంది అదనపు సిబ్బందిని కూడా జిల్లాల నుంచి రప్పించామన్నారు. రూట్ టాప్, షీ టీమ్స్, మఫ్టీ పోలీస్లతో భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. అదనంగా ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు ఈ నెల 28న జరగనున్న వినాయక నిమజ్జన వేడుకల కోసం ఆరీ్టసీ, ఎంఎంటీఎస్, మెట్రో సంస్థలు విస్తృత ఏర్పాట్లు చేపట్టాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో 535 బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రయాణికుల రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు వివిధ మార్గాల్లో 8 ఎంఎంటీఎస్ సర్వీసులను అదనంగా నడపనున్నారు. భక్తుల రద్దీకనుగుణంగా మెట్రో రైళ్లను నడిపేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ చర్యలు చేపట్టింది. బస్సుల వివరాల కోసం ప్రయాణికులు 99592 26154, 99592 26160లను సంప్రదించవచ్చు. సమన్వయంతో.. సమష్టిగా – నిమజ్జనానికి ఏర్పాట్లు సామూహిక గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా, భక్తులకు ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకు వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేయనున్నాయి. జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, సమాచారం, పౌరసంబంధాలు, పోలీసు, రవాణా, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డు, మెడికల్అండ్ హెల్త్, ఫైర్సరీ్వసెస్, టీఎస్ ఆరీ్టసీ,టీఎస్ఎస్పీడీసీఎల్, ఇరిగేషన్, ఆర్అండ్బీ, టూరిజం విభాగాలతో పాటు 108 ఈఎంఆర్ఐ విభాగాల ఉన్నతాధికారులు సమన్వయంతో పని చేసేలా ప్రణాళిక రూపొందించారు. అన్ని విభాగాల అధికారుల ఫోన్నెంబర్లు అందరి వద్ద అందుబాటులో ఉంచారు. నిమజ్జనాల సందర్భంగా వెలువడే వ్యర్థాలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు దాదాపు 3 వేల మంది పారిశుద్ధ్య కారి్మకులు విధులు నిర్వర్తిస్తారు. విభాగాల వారీగా అన్ని ప్రభుత్వ శాఖలు పని చేయనున్నాయి. మహా నిమజ్జనానికి ట్రయల్ రన్ ఖైరతాబాద్: శ్రీ దశమహా విద్యాగణపతిగా ఖైరతాబాద్లో కొలువుదీరిన మహాగణపతి నిమజ్జనానికి పోలీసులు మంగళవారం ఉదయం 5.30 గంటలకు ఖైరతాబాద్ మండపం నుంచి ఎనీ్టఆర్ మార్గ్లోని క్రేన్ నెం– 4 వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. నేటి ఉదయం 11 గంటల వరకే మహాగణపతి దర్శనాలు ఉంటాయని, తెల్లవారుజామున 5 గంటల నుంచి షెడ్డు తొలగించే పనులు ప్రారంభించి 7 గంటల కల్లా పూర్తి చేస్తామని ఉత్సవ కమిటీ సభ్యుడు సందీర్ రాజ్ తెలిపారు. మినట్ టు మినట్.. మంగళవారం రాత్రి నుంచే ట్రాయిలర్ వాహనానికి వెల్డింగ్ పనులు మొదలు పెట్టారు. నేటి రాత్రి నుంచే నిమజ్జన ఏర్పాట్లు ప్రారంభిస్తారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు మహాగణపతి ఇరువైపులా ఉన్న విగ్రహాలను మరో వాహనంపైకి తెస్తారు. తెల్లవారుజామున 4 గంటల కల్లా రవి క్రేన్ సాయంతో మహాగణపతిని ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్ వాహనంపైకి తెస్తారు. ఉదయం 7 గంటలకు మహాగణపతికి వెల్డింగ్ పనులు పూర్తి చేసి 9.30 గంటలకు మహా శోభాయాత్ర ప్రారంభిస్తారు. ఎనీ్టఆర్ మార్గ్లోని క్రేన్ నెం–4 వద్ద మధ్యాహ్నం 12 గంటల వరకు నిమజ్జనం పూర్తయ్యేలా పోలీసులు మినట్ టు మినట్ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ విధంగానే ఏర్పాట్లు చేయాలని ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. -
క్యూఆర్ కోడ్ బందోబస్త్
సాక్షి, సిటీబ్యూరో: వినాయక నిమజ్జనానికి రాచకొండ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలోని చెరువులు, రూట్ మ్యాప్లను సిద్ధం చేసిన పోలీసులు.. సాంకేతిక వినియోగంపై దృష్టిసారించారు. ఈసారి గణేష్ బందోబస్తు ప్రక్రియను క్యూఆర్ కోడ్ ద్వారా పరిశీలించనున్నారు. దీని కోసం కమిషనరేట్ పరిధిలో దాదాపు 10 వేల వినాయక మండపాలకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ను ఇచ్చారు. ఇందులో విగ్రహ ప్రతిష్టాపన తేదీ, నిమజ్జనం తేదీ, రూట్ మ్యాప్ వంటి వివరాన్నీ ఈ కోడ్లో భధ్రపరిచారు. నిమజ్జనానికి సిద్ధం చేసిన చెరువుల వద్ద ఏర్పాటు చేసిన 500 సీసీటీవీ కెమెరాల లొకేషన్స్ను జియో ట్యాగింగ్ చేశారు. వీటిని ఈ క్యూఆర్ కోడ్కు జత చేశారు. విశేషంగా ఈ క్యూఆర్ కోడ్లో ఏ వినాయక మండపం వద్ద ఏ తరహా వినాయకుడిని నిలబెట్టారు? ఎన్ని విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ఇంకాఎన్ని ఉన్నాయనేవి రియల్ టైంలో తెలిసిపోతాయి. ఆకతాయిలపై షీ టీమ్స్ నిఘా.. సాధారణ ప్రయాణికులు, భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిమజ్జన ఏర్పాట్లు సాగేలా గట్టి చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకించి నిమజ్జనానికి వచ్చే మహిళ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించారు. అలాగే ఆకతాయిలపై నిఘా పెట్టేందుకు 10 షీ టీమ్స్ బృందాలు మఫ్టీలో తిరుగుతుంటాయి. వీటితో పాటు రాచకొండలో ఉన్న 1.83 లక్షల సీసీటీవీ కెమెరాలతో శాంతి భద్రతల పరిస్థితులను పోలీసు ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షణతో పాటు విశ్లేషిస్తున్నారు. కమిషనర్ డీఎస్ చౌహాన్ నిమజ్జన బందోబస్తుతో పాటు నిరంతరం మండపాల వద్ద తనిఖీలను చేస్తూ పరిస్థితులను తెలుసుకుంటున్నారు. -
జియో ట్యాగింగ్కు ‘అగ్రి’ అవడం లేదు!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ శాఖలో జియో ట్యాగింగ్ నిఘా రచ్చకు దారితీసింది. వ్యవసాయ విస్తరణాధికారుల(ఏఈవో)పై జియో ట్యాగింగ్తో నిఘా ఏర్పాటు చేసి, తద్వారా అదే పద్ధతిలో హాజరు వేసుకోవాలని నిర్ణయించారు. లేకుంటే గైర్హాజరుగా భావించాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ తేల్చిచెప్పడంతో పెద్ద దుమారం చెలరేగింది. దీనిపై ఏఈవోలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు మండల వ్యవసాయాధికారులు(ఏవో), డివిజనల్ వ్యవసాయాధికారులకు కూడా ఇదే పద్ధతిలో హాజరును ప్రవేశపెట్టాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. దీంతో ఈ పద్ధతిని ఎత్తేయాలని 21 జిల్లాలకు చెందిన పలువురు అధికారులు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. అయినా ఇప్పటివరకు ఉన్నతస్థాయి అధికారులు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. యాక్టివిటీ లాగర్ యాప్... రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పనిచేసే 2,600 మంది ఏఈవోలు ఉన్నారు. ప్రతీ రెండు, మూడు గ్రామాలకు కలిపి ఒక ఏఈవో ఉంటారు. రైతు వేదికలే వారి కార్యాలయాలు. ఏఈవో ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో ఎప్పటికప్పడూ వారి కార్యకలాలపాలను తెలుసుకునేందుకు ప్రత్యేక యాక్టివిటీ లాగర్ యాప్ పేరుతో జియో ట్యాగింగ్ చేసే జీపీఎస్ వ్యవస్థను అమలు చేయనున్నారు. ఏఈవోలు వారి క్లస్టర్ పరిధిలోని గ్రామాల్లో ప్రత్యేకంగా ఒక నిర్దేశిత స్థలాన్ని నమోదు చేసుకోవాలి. స్పాట్లోకి వెళ్లి ‘మార్క్ మై ప్రెజెన్స్’అని నొక్కి ఫింగర్ ప్రింట్ నమోదు చేయాలి. లాంగిట్యూడ్, లాట్యిట్యూడ్ ఆధారంగా గుర్తించిన తర్వాతే హాజరు పడుతుంది. నిర్దేశిత గ్రామంలో ఏ రైతును కలిశారు? రైతుతో కలిసి క్షేత్రస్థాయికి వెళ్లారా? ఇంకా ఎవరైనా అధికారి వచ్చారా? రైతు వేదిక వద్ద ఏం చేశారు? ఆ రోజు షెడ్యూల్ ఏంటి? క్రాప్ బుకింగ్, రైతు బీమా, సీడ్ పర్మిట్ స్లిప్లు లాంటివి రోజుకు 17 రకాలు, అందులో మళ్లీ ఒక్కోదానికి రెండు, మూడు ఆప్షన్లతో అప్డేట్ చేసి నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడే వారి రోజువారీ హాజరు, పనితీరు రికార్డు అవుతుంది. ఇలా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేసేలా ఈ విధానాన్ని ప్రవేశపెట్టడంపై ఏఈవోలు మండిపడుతున్నారు. ఇదీ చదవండి: ‘ధరణి’లో పరిష్కారం కాని సమస్యలు.. భూ లబ్ధిదారులకు తిప్పలు -
తెలంగాణ: మహిళలపై నేరాలు జరిగే ప్రాంతాల గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రతకు కీలక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర పోలీసు విభాగం దానికోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటోంది. ఇందులో భాగంగా అమలులోకి తీసుకువచ్చిన పోలీసు అంతర్గత యాప్ ‘షీ–టీమ్స్’లో కొత్త హంగులు చేర్చింది. యువతులు, మహిళలపై నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించి జియోట్యాగింగ్ చేస్తోంది. ఈ మ్యాప్స్ను అప్లికేషన్లో ఉంచడం ద్వారా ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రత్యేక పర్యవేక్షణకు మార్గం సుగమమైంది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు ఎక్కడైనా షీ–టీమ్స్ పనితీరు, స్పందన ఒకేలా ఉండేందుకు ఈ యాప్ వినియోగిస్తున్నారు. దీన్ని పోలీసు విభాగం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. నిఘా మూసధోరణిలో కాకుండా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 370 షీ–టీమ్స్ పనిచేస్తున్నాయి. ఈ బృందాలు మఫ్టీలో సంచరిస్తూ ఈవ్టీజర్లు, మహిళలపై వేధింపులకు పాల్పడే వారిపై నిఘా వేసి ఉంచుతున్నాయి. సాధారణంగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లతో పాటు ఇతర పబ్లిక్ ప్లేసుల్లో ఈ బృందాలు సంచరిస్తుంటాయి. అన్ని వేళలా, అన్ని ప్రాంతాల్లోనూ ఉండటం సాధ్యం కాకపోవడంతో కొన్ని సందర్భాల్లో షీ–టీమ్స్ నిఘా మూస ధోరణిలో సాగుతోంది. ఉదాహరణకు హైదరాబాద్లోని కోఠి ఉమెన్స్ కాలేజ్ బస్టాప్ వద్ద వీళ్లు ఎక్కువ నిఘా ఉంచితే... ముషీరాబాద్లో ఈవ్టీజింగ్ జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక నగరాలు, పట్టణాలు, జిల్లాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే షీ–టీమ్స్ యాప్లో జియోట్యాగింగ్ను చేర్చారు. మ్యాప్పై ఆ ప్రాంతాలు ప్రత్యక్షం హైదరాబాద్ కేంద్రంగా పని చేసే ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇలాంటి హాట్స్పాట్స్ను ఎప్పటికప్పుడు గుర్తిస్తుంటుంది. ఆయా ప్రాంతాల్లో నమోదైన కేసులు, వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా వీటిని గుర్తిస్తుంది. మ్యాప్పై ఆ వివరాలు పొందుపరుస్తూ జియోట్యాగింగ్ చేస్తుంది. రాష్ట్రంలోని అన్ని షీ–టీమ్స్ వద్ద ఈ యాప్ అందుబాటులో ఉంది. అందులోని మ్యాప్లో ఈవ్టీజింగ్ హాట్స్పాట్స్ను నిర్దేశిస్తుంటుంది. దీని ఆధారంగా ఆయా ప్రాంతాలను తెలుసుకునే సిబ్బంది వాటిపైనే ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. కాలమాన పరిస్థితులను బట్టి ఈ హాట్స్పాట్స్ మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఉమెన్ సేఫ్టీ వింగ్ ఈ మ్యాప్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ షీ–టీమ్స్ను సమాచారం అందేలా చేస్తుంటుంది. ఆ ఫిర్యాదులన్నీ ఈ యాప్లోకి.. ఈవ్టీజింగ్ తరహాలో మహిళలపై జరిగే నేరాలు, వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులనూ ఈ యాప్లోకి తీసుకువస్తున్నారు. షీ–టీమ్స్ కేంద్రాలు, భరోస కేంద్రాలు, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ వింగ్, సైబర్ క్రైమ్... ఇలా కేటగిరీల వారీగా మహిళలు, యువతులపై జరిగే నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు రాష్ట్రంలో ఎక్కడ వచ్చినా వాటిని షీ–టీమ్స్ యాప్లో పొందుపరుస్తారు. ఫిర్యాదులోని అంశాలను బట్టి ఆయా విభాగాలకు దీన్ని బదిలీ చేస్తారు. సదరు ఫిర్యాదుపై అధికారులు, సిబ్బంది స్పందించిన తీరు, సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలు, పరిష్కరించిన విధానాలను ఈ యాప్లో పొందుపరచాల్సి ఉంటుంది. పోకిరీల వివరాలు, వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన ప్రాంతాలు, సమయం, తేదీలు ఇందులో నిక్షిప్తం అవుతాయి. వీటి ఆధారంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ పదేపదే ఈ తరహా నేరాలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసుల నమోదుకు చర్యలు తీసుకుంటోంది. -
కేపీ ఉల్లి: అధిక యాంటీ ఆక్సిడెంట్లు, ఫినోలిక్ సమ్మేళనాలు!
వైవీయూ: తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందనే నానుడి తెలుగునాట ఎంతో ప్రాచుర్యం.. అలాంటి ఉల్లిలో ప్రత్యేకమైన కేపీ ఉల్లికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. ఈ ఉల్లిపై వైవీయూ (యోగి వేమన విశ్వవిద్యాలయం) వృక్షశాస్త్ర విభాగం చేపట్టిన పరిశోధనల్లో పలు అంశాలు వెలుగులోకి రావడంతో దీని ప్రాధాన్యత పెరిగింది. దీనికి తోడు కేపీ ఉల్లిని ఈ ప్రాంత పంటగా జియోట్యాగ్ కోసం వైవీయూ వృక్షశాస్త్ర విభాగం ప్రయత్నిస్తుండగా, అంతర్జాతీయ ప్రఖ్యాత జర్నల్ ఆఫ్ బయోలాజికల్ సైన్స్ స్ప్రింగర్లో పరిశోధక పత్రం ప్రచురితమై ఖ్యాతిని మరింత విస్తరించేలా చేసింది. కేపీ ఉల్లిగా కృష్ణాపురం ఉల్లి వైఎస్సార్ జిల్లా మైదుకూరు పరిధిలోని కృష్ణాపురంలో రైతులు ఉల్లి పంటను ఎక్కువగా పండించడంతో కృష్ణాపురం ఉల్లి (కేపీ ఉల్లి)గా ప్రసిద్ధికెక్కింది. కేపీ ఉల్లిని సలాడ్స్, సాస్, సూప్లలో విపరీతంగా వినియోగిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో అనేక రకాల పేర్లతో ఉల్లి వంగడాలను పండిస్తున్నప్పటికీ కేపీ ఉల్లి ఎగుమతి కావడానికి ఆరోగ్యపరంగా అత్యధిక ప్రయోజనాలు ఉండటమేనని పరిశోధకులు గుర్తించారు. వ్యాధి నిరోధకత పెంచే యాంటీ ఆక్సిడెంట్లు.. కేపీ ఉల్లిలో ఫినోలిక్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉండటంతో పాటు అధిక యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం కారణంగా ఇందులో వ్యాధి నిరోధకతను పెంచే సామర్థ్యం ఉన్నట్లు వైవీయూ వృక్షశాస్త్ర పరిశోధకులు వెల్లడించారు. వైవీయూ వృక్షశాస్త్ర ఆచార్యులు డాక్టర్ పీఎస్ షావల్లీఖాన్ మార్గదర్శకంలో డాక్టర్ జి. విజయలక్ష్మి, ఇటలీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్, నేషనల్ కౌన్సెల్ పరిశోధకులు సంయుక్తంగా కేపీ ఉల్లిపై పరిశోధనలు సాగించారు. ఈ పరిశోధనల్లో కేపీ ఉల్లికి ఒక ప్రత్యేకత ఉందని.. దీనికి సంబంధించిన విశిష్టతలను తెలియజేస్తూ ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ బయోలాజికల్ సైన్స్ స్ప్రింగర్’లో పరిశోధక వ్యాసం ప్రచురితమైంది. అలాగే, వైఎస్సార్ జిల్లాకు చెందిన కేపీ ఉల్లిని ప్రత్యేక వంగడం (లాండ్రేస్)గా పరిశోధకులు పేర్కొన్నారు. ప్లేవనాయిడ్ కంటెంట్, యాంటి యాక్సిడెంట్లు ఇందులో ఎక్కువని పరిశోధనల్లో తేల్చారు. కేపీ ఉల్లి ప్రత్యేకించి ముదురు ఎరుపు రంగును కలిగి ఉండటానికి కారణం అందులోని ఆంథోసైనిన్ అని గుర్తించారు. అదే విధంగా యాంటీ ఆక్సిడెంట్స్ అయిన ప్లావినాయిడ్స్ రోగ నిరోధకతను కల్గిస్తాయని శాస్త్రీయంగా నిరూపించారు. ఇందులోని లక్షణాలు మరే ఇతర రకాల్లో లభించవని పరిశోధకులు స్పష్టంచేశారు. జియోట్యాగ్ కోసం ప్రయత్నం.. కేపీ ఉల్లికి జియోట్యాగ్ (భౌగోళికపరమైన గుర్తింపు) పొందేందుకు వైవీయూ వృక్షశాస్త్ర విభాగం ప్రయత్నాలు ప్రారంభించింది. జియోట్యాగ్ వస్తే కేపీ ఉల్లికి న్యాయపరమైన రక్షణ లభిస్తుంది. ఈ వంగడాన్ని ఇతరులు అనధికారికంగా వినియోగించుకునే అవకాశం ఉండదు. ఈ ప్రాంత ఉత్పత్తిదారులకు ఎగుమతుల విషయంలో ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. అందువల్ల ప్రభుత్వ గుర్తింపు సంస్థలు, రిజిస్టర్డ్ రైతు సంస్థలు ముందుకు వచ్చి సహకారం అందించి జియోట్యాగ్ లభించేలా చూడాలని వృక్షశాస్త్ర సహాయ ఆచార్యులు డాక్టర్ పీఎస్ షావల్లీఖాన్ కోరారు. మరోవైపు.. కేపీ ఉల్లిపై పరిశోధనలు చేసిన డాక్టర్ విజయలక్ష్మి దాని పుష్పాల నుంచి ఉల్లి మొక్కలు సృష్టించడం విశేషం. -
ఇళ్ల నిర్మాణాల నాణ్యతపై రాజీ పడొద్దని అధికారులకు స్పష్టం చేశారు..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
ఇళ్ల నిర్మాణ వేగం పెరగాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెద్ద ఎత్తున కొత్తగా ఏర్పాటవుతున్న వైఎస్సార్–జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణం, వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంజూరైన ఇళ్లకు సంబంధించి మ్యాపింగ్, జియో ట్యాగింగ్ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని చెప్పారు. పేదల ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి, ఆ మేరకు సకాలంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాలనీల్లో ఇళ్ల నిర్మాణం వేగంగా చేపట్టేందుకు అవసరమై నీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించడంపై నిర్లక్ష్యం వహించకుండా వాటిపై వెంటనే దృష్టి సారించాలని సూచించారు. ఇళ్లు కట్టు కోవడానికి కరెంటు, నీళ్ల వంటి సదుపాయాలు లేవనే పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా కన్పించకూడదని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతపై రాజీ పడొద్దని అధికారులకు స్పష్టం చేశారు. వసతుల కల్పనపై నివేదిక ఇవ్వండి కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, కరెంటు సౌకర్యం తదితర వసతుల కల్పనపై సీఎం వైఎస్ జగన్ సమగ్రంగా చర్చించారు. పట్టణాల్లో ఏవిధంగా మౌలిక వసతులు కల్పిస్తున్నామో అదే తరహాలో కొత్తగా నిర్మిస్తున్న కాలనీల్లోనూ వసతులు కల్పించాలని చెప్పారు. ఆ మేరకు తీసుకునే చర్యలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో రోడ్ల వెడల్పు 20 అడుగులకు తగ్గకుండా చూడాలన్నారు. తామే ఇళ్లు నిర్మించుకుంటామని ఆప్షన్ ఎంచుకున్న లబ్ధిదారులకు నిర్మాణ సామగ్రి విషయంలో సహాయకారిగా నిలవాలని చెప్పారు. స్టీలు, సిమెంట్, ఇతరత్రా నిర్మాణ సామగ్రిని తక్కువ ధరలకే అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కోర్టు వివాదాల్లో ఉన్న ఇళ్ల స్థలాల కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. కొత్త కాలనీల రూపు రేఖలు, అక్కడ చేపట్టనున్న నిర్మాణాలు, కల్పిస్తున్న వసతులు, డిజైన్లపై రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ముఖ్యమంత్రి పరిశీలించారు. -
నాలుగో సింహానికి నాలుగు సవాళ్లు
సాక్షి, అమరావతి: పోలీస్ శాఖ ఇప్పుడు నాలుగు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఆలయాలకు బందోబస్తు, వ్యాక్సిన్ భద్రత, రోజువారీ శాంతిభద్రతల నిర్వహణ.. ఇలా అన్నింటినీ ఒకేసారి సమర్థవంతంగా నిర్వహిస్తూ అందరి మన్ననలను పొందుతోంది. ప్రధానంగా రాష్ట్రంలో పథకం ప్రకారం జరిగిన దేవుడి విగ్రహాల ధ్వంసం కేసుల చిక్కుముడులను చాకచక్యంగా విప్పి శభాష్ అనిపించుకున్నారు. సున్నితమైన మతపరమైన అంశాల ద్వారా అలజడులు సృష్టించేందుకు పన్నిన కుట్రలను ఛేదించడమే కాకుండా.. ఆలయాలపై నిరంతర నిఘా పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మతపరమైన సంస్థలు, ఆలయాలను గుర్తించి.. జియో ట్యాగింగ్ చేయడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. అలాగే కోవిడ్ వ్యాక్సిన్ భద్రతా చర్యలను కూడా పోలీసులే చేపట్టారు. వైద్య ఆరోగ్య, మున్సిపల్ తదితర సిబ్బందికి వేస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమానికి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో హఠాత్తుగా వచ్చి పడిన పంచాయతీ ఎన్నికల విధులకు కూడా పోలీస్ శాఖ వెంటనే సిద్ధమైంది. నామినేషన్లు మొదలు.. ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ తదితరాలన్నింటికీ బందోబస్తు నిర్వహిస్తూ గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కొనసాగేలా చర్యలు తీసుకుంటోంది. విధుల కోసం వ్యాక్సిన్ వాయిదా.. ఫ్రంట్లైన్ వారియర్స్ అయిన పోలీసు శాఖలోని దాదాపు 73 వేల మంది సిబ్బంది, 16 వేల మంది హోంగార్డులకు ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ వేయాలని అధికారులు తొలుత నిర్ణయించారు. కానీ వారికి వ్యాక్సిన్ వేస్తే నెల రోజులపాటు ఎలాంటి రియాక్షన్ లేకుండా పరిశీలనలో ఉంచాలి. అయితే రోజువారీ శాంతిభద్రతల నిర్వహణ, వ్యాక్సిన్ భద్రత, ఎన్నికల విధులకు విఘాతం కలుగుతుందని భావించిన అధికారులు, సిబ్బంది.. వ్యాక్సిన్ తీసుకునే కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం మార్చి 5లోపు వీరికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంది. పోలీసు సిబ్బందికి సలామ్ చేస్తున్నా.. త్యాగాలకు ఏపీ పోలీసులు వెనుకాడరనే విషయాన్ని మరోసారి రుజువు చేశారు. ప్రజా శ్రేయస్సు కోసం వ్యాక్సిన్ కూడా వాయిదా వేసుకొని.. సేవలందిస్తున్నందుకు పోలీస్ బాస్గా వారికి సలామ్ చేస్తున్నాను. – డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ కుటుంబ ఒత్తిడి.. అయినా బాధ్యత ముఖ్యం కోవిడ్ విధులు మొదలైనప్పటి నుంచి కుటుంబసభ్యులు మా గురించి భయపడుతున్నారు. అయినా కూడా కుటుంబాలకు దూరంగా, ప్రాణాలకు తెగించి ప్రజల కోసం సేవలందిస్తున్నాం. 14,362 మంది పోలీసులు కోవిడ్ బారిన పడగా, 109 మందిని కోల్పోయాం. దీంతో కనీసం వ్యాక్సిన్ వేయించుకుంటే.. ప్రశాంతంగా ఉంటాం కదా అని కుటుంబసభ్యులు మా మీద ఒత్తిడి చేస్తున్నారు. అయినా ఎన్నికల తర్వాతే వ్యాక్సిన్ వేసుకోవాలనే నిర్ణయం తీసుకుని విధులు నిర్వహిస్తున్నాం. –జె.శ్రీనివాసరావు, ఏపీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు -
ఆలయాల భద్రతకు అన్ని చర్యలూ తీసుకున్నాం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలోని ఆలయాలన్నీ సర్వే చేసి జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయడం ద్వారా భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. దేవదాయ ధర్మాదాయ శాఖ, రాష్ట్ర దేవాలయాల పాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన సదస్సులో డీజీపీ మాట్లాడారు. అంతర్వేది ఘటన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయన్నారు. ఆలయాల్లో వరుసగా ఘటనలు జరుగుతుండటంతో పోలీస్ విభాగం అప్రమత్తమై.. దేవాలయాల భద్రతకు అన్ని చర్యలూ తీసుకుందని వివరించారు. 13 జిల్లాల్లో ఉన్న 59 వేల ఆలయాలను సర్వే చేసి.. వాటికి జియో ట్యాగింగ్ చేశామని చెప్పారు. 47,734 ఆలయాల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే 23,832 ఆలయాల్లో గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయాల్లో ఘటనలకు సంబంధించి.. 1,893 మందిని విచారించామని తెలిపారు. 198 కేసుల్లో 373 మందిని అరెస్టు చేశామని చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు దేవాలయాలే మూలమన్నారు. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. పాలక మండళ్లు, ఈవోలు చర్చించుకుని ఆలయాల్లో భద్రత ప్రమాణాలను మెరుగుపరచుకోవాలన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆలయాల భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాలని దేవదాయ శాఖ కమిషనర్ అర్జునరావు సూచించారు. గ్రామాలకు దూరంగా ఉన్న ఆలయాలతో పాటు పురాతన ఆలయాలపై తగిన నిఘా ఉంచాలన్నారు. దేవదాయ అడిషనల్ కమిషనర్ రామచంద్రమోహన్ మాట్లాడుతూ.. కార్యనిర్వహణ అ«ధికారులు, పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని ఆలయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలన్నారు. సమావేశంలో పాల్గొన్న డీజీపీ సవాంగ్కు దుర్గగుడి ఈవో సురే‹Ù.. అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. అంతకుముందు డీజీపీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సమావేశంలో ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్, నగర పోలీస్ కమిషనర్ బత్తుల శ్రీనివాసులు, సిట్ అధికారి జీవీజీ అశోక్కుమార్, టెక్నికల్ సర్వీసెస్ డీఐజీ డి.పాల్రాజ్, డీసీపీ విక్రాంత్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆలయాలకు పోలీసు రక్ష
సాక్షి, అమరావతి: మతపరమైన అంశాలను వివాదం చేసి అలజడులు సృష్టించే ప్రయత్నాలకు చెక్ పెట్టడంలో ఏపీ పోలీసులు పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని దేవాలయాలు, చర్చిలు, మసీదుల వద్ద నిర్వాహకులే అప్రమత్తంగా మెలిగేలా పోలీసులు చర్యలు చేపట్టారు. వాటి బందోబస్తుతోపాటు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త వహించేలా నిర్వాహకులకు పలు సూచనలు ఇచ్చారు. పోలీస్ శాఖ పరిధిలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే మరోవైపు ఆలయాల నిర్వాహకులు, ట్రస్ట్బోర్డు సభ్యులు, ధర్మకర్తలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ఆలయాల వద్ద సీసీ కెమెరాలు, బందోబస్తు ఏర్పాట్లను పక్కాగా చేపట్టారు. మతపరమైన సంస్థల విషయంలో పోలీస్ శాఖ తీసుకున్న చర్యలు ఇవీ.. ► అన్ని ఆలయాల్లో అగ్నిమాపక జాగ్రత్తలు, భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. ► మొత్తంగా 57,270 మతపరమైన సంస్థలను గుర్తించి జియో ట్యాగింగ్తో మ్యాపింగ్ చేశారు. ► సంబంధిత 9,268 ప్రాంతాల్లో ఇప్పటివరకు 31వేల సీసీ కెమెరాలు అమర్చారు. ► ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 33 ఆలయాల్లో జరిగిన నేరాలకు సంబంధించి 27 కేసుల్లో నిందితులతోపాటు తాజాగా నేరాలకు పాల్పడిన 130 మందిని అరెస్టు చేశారు. గతంలో 54 ఆలయాల్లో జరిగిన నేరాలపైనా చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ► ప్రార్థనామందిరాల్లో నేరాలు, అలజడులు, విధ్వంసాలు చేసే అలవాటున్న 1,196 మందిని బైండోవర్ చేశారు. వారిపై హిస్టరీ షీట్లు తెరిచి నిఘా ఉంచారు. ఎటువంటి ఘటనలు జరగకుండా చర్యలు ప్రజల మత విశ్వాసాలకు సంబంధించిన ఆలయాల విషయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాం. ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య సృష్టించే శక్తులపై అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాం. ఇటీవల పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పక్కా కార్యాచరణ చేపట్టాం. సీసీ కెమెరాల ఏర్పాటు, బందోబస్తు చర్యలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఆలయాల వద్ద అలజడులు లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాం. – గౌతమ్ సవాంగ్, డీజీపీ -
దేవాలయాలకు జియో ట్యాగింగ్
-
దేవాలయాలకు జియో ట్యాగింగ్: డీజీపీ
సాక్షి, విజయవాడ: దేవాలయాల వద్ద జియో ట్యాగింగ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఆదివారం ఆయన పోలీస్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, పటిష్ట బందోబస్తు ఏర్పాటుపై పలు సూచనలు ఇచ్చారు. గతంలో నేర చరిత్ర కలిగిన వ్యక్తులను గుర్తించి వారిపై నిఘా ఉంచాలన్నారు. దేవాలయ కమిటీ సభ్యులు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మతపరమైన అంశాలపై పోలీసులు సున్నితంగా వ్యవహరించాలని కోరారు. సోషల్ మీడియాలో వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు డీజీపీ విజ్ఞప్తి చేశారు. ప్రతి దేవాలయం వద్ద పాయింట్ బుక్లు ఏర్పాటు చేయాలని, వాటిని స్థానిక అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. అగ్నిప్రమాదం నియంత్రణ పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. (చదవండి: 100 ఏళ్లు ఉండేలా కొత్త రథం) (చదవండి: దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిరంతర నిఘా) -
కార్పొరేట్ కాలేజిల ఆగడాలకు అడ్డుకట్ట..
కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయనుంది. ఉన్నత విద్యకు ఇంటర్ ప్రామాణికం కావడంతో కార్పొరేట్ యాజమాన్యాల దోపిడీకి అడ్డూ అదుపు లేదు. కళాశాలల్లో కనీస వసతులు కల్పించకుండానే ఇంటర్ విద్యకు రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒకరిద్దరికి వచ్చిన ర్యాంక్లను ప్రచారం చేసుకుంటూ నాణ్యమైన విద్య అందిస్తున్నామని బురిడీ కొట్టిస్తూ పరిమితికి మించి అడ్మిషన్లు చేసుకుని అందిన కాడికి కాసులు దండుకుంటున్నాయి. ఈ పరిస్థితులపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం కళాశాలల్లో వసతులపై జియో ట్యాగింగ్ చేయడంతో పాటు సెక్షన్కు విద్యార్థుల సంఖ్యను పరిమితం చేసే చర్యలు చేపట్టింది. అడ్మిషన్లు ఆన్లైన్లో పారదర్శకంగా నిర్వహించాలని సూచించింది. నెల్లూరు (టౌన్): కార్పొరేట్, ప్రైవేట్ ఇంటర్ కళాశాలల అడ్డగోలు విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇంటర్ అడ్మిషన్లకు కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. ఆయా కళాశాలల్లో వసతులు, బోధన, క్రీడా ప్రాంగణం, ఫర్నీచర్, బాత్రూంలు తదితర సౌకర్యాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఇప్పటికే ఆయా కళాశాలలను ఆదేశించింది. వారం రోజుల క్రితం కళాశాలల్లో వసతులు, అధ్యాపకుల వివరాలను జిల్లా ఇంటర్ బోర్డు ద్వారా రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి పంపించారు. ♦జిల్లాలో మొత్తం 208 ప్రభుత్వ, కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 157 కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉండగా 26 ప్రభుత్వ, 8 ఎయిడెడ్, మిగిలిన 17 కేజీబీవీ, మోడల్, బీసీ వెల్ఫేర్, ఏపీటీడబ్ల్యూఆర్, ఎపీఎస్డబ్ల్యూఆర్కు చెందిన కళాశాలలు ఉన్నాయి. ♦వీటిల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు 60 వేల మందికి పైగా చదువుతున్నారు. ♦అయితే విద్యార్థులకు మెరుగైన వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు పేరుతో ప్రభుత్వ జానియర్ కళాశాలల్లో అభివృద్ధి పనులపై దృష్టి సారించింది. ♦ఇప్పటికే వీటికి సంబంధించి అంచనా వివరాలను జిల్లా వృత్తి విద్యాశాఖ కార్యాలయం ద్వారా ఇంటర్ బోర్డుకు పంపించారు. వసతులు అధ్వానం కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో వసతులు అధ్వానంగా ఉన్నాయి. ♦మెజార్టీ కళాశాలలు అపార్ట్మెంట్లలో ఇరుకు గదుల్లో తరగతులు ¯నిర్వహిస్తున్నాయి. వాటిల్లో నిబంధనల మేరకు తరగతి గదులు, ల్యాబ్లు, క్రీడా మైదానాలు, ఫైర్ అనుమతులు లేవు. ♦కొన్ని అనుమతులు పొందినా వాటికి అనుబంధంగా మరోక చోట అనుమతి లేని బ్రాంచ్లు ఏర్పాటు చేసి బోధన సాగిస్తున్నాయి. ♦అయితే క్వాలిఫైడ్ అధ్యాపకులను నియమించకుండా డిగ్రీ చదివిన వారితో బోధన సాగిస్తున్నారు. ♦విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ♦ర్యాంక్ల కోసం ఓ పది మంది మెరిట్ విద్యార్థులను ఎంచుకుని వారికి ప్రత్యేక బోధన సాగిస్తూ మిగిలిన విద్యార్థులను నామమాత్రపు బోధనతో నెట్టుకువస్తున్నారు. వసతులపై జియో ట్యాగింగ్ ఈ ఏడాది నుంచి కార్పొరేట్ వసతులపై ప్రభుత్వం దృష్టి సారించింది. కళాశాలకు సంబంధించి భవనం, గదులు, టాయ్లెట్స్, క్రీడా మైదానం, ల్యాబ్, గ్రంథాలయం తదితర వసతులను ఫొటోలు ఆన్లైన్లో పెట్టాల్సి ఉంది. ♦వీటితో పాటు కళాశాలకు సంబంధించి గుర్తింపు సర్టిఫికెట్, ఫైర్, ఎన్ఓసీ తదితర అనుమతుల కాపీలను కూడా అందులో ఉంచాల్సి ఉంది. ♦ఇక అధ్యాపకులు, వారి క్వాలిఫికేషన్, జీతాల వివరాలు, నాన్ టీచింగ్ సిబ్బంది, వారి జీతాల వివరరాలను apbie.gov.in వెబ్సైట్లో ఉంచాలని కళాశాలల యాజమాన్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ♦వెబ్సైట్లో పెట్టిన వసతులను కళాశాలల యాజమాన్యాలు జియో ట్యాగింగ్ చేయాలని నిర్దేశించింది. ♦కళాశాలల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు, వసతులపై వారం రోజుల క్రితం జిల్లా ఇంటర్బోర్డు అధికారులు వివరాలు సేకరించి రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఈ ఏడాది నుంచి ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లు వి«ధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందాలంటే విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్ బోర్డు సూచించిన వెబ్సైట్లో విద్యార్థులు తాము చేరదల్చుకున్న కళాశాల, కోర్సులను ఆప్షన్గా నమోదు చేయాలి. ఇప్పటి వరకు ఒక్కో గదిలో 80 నుంచి 100 మంది విద్యార్థులను కుక్కి బోధన సాగిస్తున్నారు. ఇక నుంచి కళాశాలలో ఒక్కో సెక్షన్కు 40 మంది విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు ఇచ్చుకోవాలి. ఈ లెక్కన గరిష్టంగా 9 సెక్షన్లకు 360 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంటుంది. అంతకు మంచి విద్యార్థులు ఉంటే అదనపు సెక్షన్ ఏర్పాటుకు ఇంటర్బోర్డు అనుమతి తప్పనిసరని ప్రభుత్వం స్పష్టం చేసింది. తరగతి గదులు, ల్యాబ్ తదితర వసతులను ధ్రువీకరించిన తర్వాతే బోర్డు అనుమతిని మంజూరు చేస్తోంది. వివరాలు పంపించాం వారం రోజుల క్రితం కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో వసతులు, సౌకర్యాలు, అధ్యాపకులు తదితర వివరాలను రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యాలయానికి పంపించాం. బోర్డు నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలి్సందే. కళాశాలలో వసతులు, ల్యాబ్ తదితర సౌకర్యాలు జియో ట్యాగింగ్ చేయాల్సిందే. సెక్షన్కు 40 మందికి మాత్రమే అనుమతి. ఆన్లైన్ అడ్మిషన్లపై ఎలాంటి ఆదేశాలు ఇంకా రాలేదు. – మాల్యాద్రి చౌదరి, ఆర్ఐఓ -
సచివాలయాల్లో జాబితాలు
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ కాపు నేస్తం’ ‘జగనన్న చేదోడు’ పథకాలకు సంబంధించి 4,79,623 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. వైఎస్సార్ కాపు నేస్తం పథకానికి 2,29,416 మంది మహిళలను ఎంపిక చేయగా ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున జూన్ 24న ఆర్థిక సాయం అందించనుంది. జగనన్న చేదోడు పథకానికి 2,50,207 మంది లబ్ధిదారులు ఎంపిక కాగా వీరిలో దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులు ఉన్నారు. వీరికి జూన్ 10న రూ.10,000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తారు. అభ్యంతరాలుంటే 25లోగా తెలపాలి.. ► ఈ రెండు పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను బుధవారం నుంచి సచివాలయాల నోటీసు బోర్డులో ప్రదర్శించాలని ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లకు బీసీ కార్పొరేషన్ ఎండీ రామారావు ఆదేశాలిచ్చారు. అభ్యంతరాలను ఈనెల 25లోగా తెలియచేయాలి. ► అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీలకు జాబితాను పంపించాలి. కలెక్టర్ అనుమతితో బీసీ కార్పొరేషన్ ఈడీలు ఈ జాబితాను రాష్ట్ర బీసీ కార్పొరేషన్ ఎండీ, కాపు కార్పొరేషన్ ఎండీ కార్యాలయాలకు పంపిస్తారు. ► వైఎస్సార్ కాపు నేస్తం పథకం ద్వారా 45 – 60 ఏళ్ల లోపు మహిళా లబ్ధిదారులకు ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. మూడు వర్గాలకు ‘చేదోడు’... ► జగనన్న చేదోడు పథకం లబ్ధిదారుల షాపులకు వలంటీర్ల ద్వారా జియో ట్యాగింగ్ చేయించాలి. జియో ట్యాగింగ్ చేయించకుంటే మంజూరు ఉత్తర్వులు ఆపివేస్తారు. ► జగనన్న చేదోడు పథకానికి సంబంధించి సామాజిక తనిఖీ బృందాలు మండలాలు, మునిసిపాలిటీల్లో పర్యటిస్తున్నట్లు బీసీ కార్పొరేషన్ ఎండీ రామారావు తెలిపారు. ► ఈ పధకానికి 1,29,749 మంది దర్జీలు, రజకులు 81,815 మంది, 38,643 మంది నాయీ బ్రాహ్మణులు ఎంపికయ్యారు. వీరికి వృత్తి పనుల కోసం ఏటా ఒక్కో కుటుంబానికి రూ.10,000 చొప్పున ప్రభుత్వం సాయం అందజేస్తుంది. -
అన్నీ ఉంటేనే అనుమతి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించే కాలేజీలకే అనుమతులు మంజూరు చేయాలని ఇంటర్మీడియెట్ బోర్డు నిర్ణయించింది. ఈమేరకు బోర్డు బుధవారం సవివరమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ కాలేజీల యాజమాన్యాలు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. కొత్త కాలేజీల ఏర్పాటు, అదనపు సెక్షన్లకు సంబంధించి నోటిఫికేషన్లో నిబంధనలు పొందుపరిచారు. యాజమాన్యాలు సంబంధిత పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. భవనాలు, ల్యాబ్లు, లైబ్రరీలు, తరగతి గదులకు సంబంధించిన ఫొటోలను జియో ట్యాగింగ్ చేసి అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు. ► రాష్ట్రంలో ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, జూనియర్ కాలేజీలు, కోఆపరేటివ్, ఇన్సెంటివ్, సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల రెసిడెన్షియల్ కాలేజీలు, ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలతోపాటు కేంద్రీయ విద్యాలయాలు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. బోర్డు ఇదివరకు ఇచ్చిన అనుమతులు వచ్చే విద్యాసంవత్సరానికి (2020–21) పొడిగింపు, అదనపు సెక్షన్ల ఏర్పాటు కోసం ఆన్లైన్లో దరఖాస్తులు అందించాలి. గరిష్టంగా రెండేళ్లకే అనుమతి వర్తిస్తుంది. ► 2020–21కి సంబంధించి అఫ్లియేషన్/అదనపు సెక్షన్ల ఏర్పాటు, ఇన్స్పెక్షన్ ఫీజు ఇప్పటికే చెల్లించిన కాలేజీలు కూడా దరఖాస్తులను రూ.500 రుసుముతో ఆన్లైన్లో సమర్పించాలి. ► ‘హెచ్టీటీపీఎస్://బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’లో ఆన్లైన్ దరఖాస్తు ఫారం పొందుపరిచారు. కాలేజీలు తమ సంస్థ కోడ్, పాస్వర్డ్ వినియోగించి ఈ ఫారాలను పొందవచ్చు. ► అప్లికేషన్, అఫ్లియేషన్, ఇన్స్పెక్షన్ ఫీజులను ఆన్లైన్లో చెల్లించిన అనంతరం బోర్డు లింక్ ద్వారా ‘బీఐఈ జియో ట్యాగింగ్’ యాప్ డౌన్లోడ్ చేసుకొని డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. ► కాలేజీ భవనం, తరగతి గదులు, ల్యాబ్లు,లైబ్రరీ, ఆటస్థలం తదితరాల ఫొటోలను జియో ట్యాగింగ్ ద్వారా అప్లోడ్ చేయాలి. ► అదనపు సెక్షన్లకు అనుమతించేందుకు ఆర్సీసీ భవన వసతి, తరగతి గదుల లభ్యతను పరిశీలిస్తారు. ► భవనపు రిజిస్టర్డ్ లీజ్ డీడ్, సొంత భవనమైతే సంబంధిత డాక్యుమెంట్లు, ఆటస్థలం లీజ్ డీడ్లను పరిశీలిస్తారు. ► భవన నిర్మాణ ప్లాన్, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్, శానిటరీ, స్ట్రక్చరల్ సౌండ్నెస్ సర్టిఫికెట్లతో పాటు నిరభ్యంతర పత్రాలను కాలేజీలు బోర్డుకు సమర్పించాలి. ► పార్కింగ్ స్థలం, బోధన, బోధనేతర సిబ్బంది, అర్హతల వివరాలను వెల్లడించాలి. ► బోర్డు అనుమతి లేకుండా కొత్త సెక్షన్లు ప్రారంభించరాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు. -
‘క్వారంటైన్’ ఇళ్లకు జియో ట్యాగింగ్
సాక్షి, హైదరాబాద్: విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో వారిని హోమ్ క్వారంటైన్ చేశారు. అలాంటి వారికి విమానాశ్రయాల్లోనే స్టాంపింగ్ చేస్తున్నారు. నిర్ణీత గడువు ముగిసే వరకు ఇళ్లు దాటి బయటకు రావద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినా కొందరు విదేశీ ప్రయాణాలు చేసి వచ్చిన వారు నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారని పోలీసులకు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హోమ్ క్వారంటైన్లో ఉన్న వారిపై పటిష్ట నిఘా కోసం సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నారు. దీని కోసం తెలంగాణ పోలీసు అధికారిక యాప్ టీఎస్ కాప్లో హోమ్ క్వారంటైన్లో ఉన్న వారిని జియో ట్యాగ్ చేయడానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఇప్పటికే విదేశాలకు వెళ్లివచ్చిన వారి వివరాలను పోలీసు విభాగం వివిధ మార్గాల్లో సేకరించింది. ఈ జాబితాను స్టేషన్ల వారీగా క్షేత్ర స్థాయి అధికారులకు అందించింది. ఈ జాబితాల్లోని వివరాల ఆధారంగా వారి ఇళ్లకు వెళ్తున్న గస్తీ సిబ్బంది చిరునామాలను సరిచూస్తున్నారు. ఆపై ఆ ఇంటిని అక్షాంశం, రేఖాంశాల ఆధారంగా జియో ట్యాగింగ్ చేస్తున్నారు. క్వారంటైన్ అయిన వ్యక్తి ఫోన్ నంబర్ను దీనికి అనుసంధానిస్తున్నారు. 22 వేల మంది వివరాలు... శనివారం నాటికి ఇలా మొత్తం 22 వేల మంది వివరాలను జియో ట్యాగింగ్ ద్వారా టీఎస్ కాప్ యాప్లోని లింక్లో పొందుపరిచారు. ఫలితంగా ప్రతి గస్తీ సిబ్బంది, ఆకస్మికంగా తనిఖీ చేసే అధికారులు అనునిత్యం ఆ ఇళ్లను, క్వారంటైన్ అయిన వ్యక్తుల్ని పర్యవేక్షించే అవకాశం ఏర్పడింది. ఇలా క్వారంటైన్ అయిన వ్యక్తుల కదలికల్ని పోలీసు విభాగం నిరంతరం పర్యవేక్షిస్తోంది. వీరిలో ఎవరైనా తమ ఇంటిని దాటి గరిష్టంగా 50 మీటర్లు వెళితే ఆ విషయాన్ని జియో ట్యాగింగ్ ద్వారా పోలీసు విభాగం తక్షణం గుర్తిస్తుంది. క్వారంటైన్ అయిన వ్యక్తి పరిధి దాటిన విషయం పోలీసులకు టీఎస్ కాప్ యాప్ ద్వారా కంట్రోల్ రూమ్ సిబ్బందికి తెలుస్తుంది. అక్కడి వారు క్షేత్రస్థాయి అధికారులకు దీనిపై సమాచారం ఇవ్వడం ద్వారా అప్రమత్తం చేస్తారు. ఆ అధికారులు గస్తీ టీమ్ సహకారంతో కొన్ని నిమిషాల్లోనే బయటకు వచ్చిన క్వారంటైన్ వ్యక్తిని గుర్తించి, ఆ ప్రాంతానికి చేరుకుని అదుపులోకి తీసుకుంటారు. వీరిపై ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు. -
ఇకపై ఇంటర్ కళాశాలల గుర్తింపు,అడ్మిషన్లకు ఆన్లైన్
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ విద్యా సంస్థల్లో అక్రమాలకు చరమగీతం పాడుతూ విప్లవాత్మక సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. విద్యార్థులు, తల్లిదండ్రులను పీల్చి పిప్పిచేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలకు ముకుతాడు పడేలా పలు చర్యలను చేపట్టనుంది. ఆయా కళాశాలలకు గుర్తింపు, అడ్మిషన్లకు సంబంధించి ఇంటర్మీడియెట్ బోర్డు ఇంతకుముందే ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు పంపింది. వీటికి ఆమోదముద్ర పడగానే వచ్చే విద్యా సంవత్సరం నుంచే వీటిని అమల్లోకి తేనున్నారు. కాలేజీలు ఆఫ్లైన్లో ఇంటర్మీడియెట్ బోర్డుకు దరఖాస్తు చేసుకొని గుర్తింపునకు అనుమతులు పొందుతున్నాయి. కేవలం కాగితాలపై నిర్ణీత సదుపాయాలు అన్నీ ఉన్నట్లు చూపుతున్నా వాస్తవానికి ఆయా కాలేజీల్లో అవేవీ ఉండడం లేదు. కొన్ని సంస్థలు అనుమతులు పొందే ప్రాంతం ఒకటి కాగా కాలేజీని మరో ప్రాంతంలో నిర్వహించడం పరిపాటిగా మారింది. ఒక కాలేజీకి, పరిమిత సెక్షన్లకు అనుమతులు తీసుకొని రెండు మూడు కాలేజీలకు సంబంధించిన విద్యార్థులందరినీ ఒకే గదిలో పెట్టి బోధన సాగిస్తున్నారు. ఇలా అక్రమ పద్ధతుల్లో ప్రభుత్వానికి నిర్ణీత రుసుములు కూడా చెల్లించకుండా పలు కార్పొరేట్, ప్రైవేటు కాలేజీలు రూ.కోట్లు కొల్లగొడుతున్నాయి. వీటికి ముకుతాడు వేసేందుకు వీలుగా గుర్తింపు ప్రక్రియను ఇకపై ఆన్లైన్ చేయనున్నారు. ప్రతి కాలేజీ అనుమతి కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. కాలేజీ భవనం ఉన్న ప్రాంతంతోపాటు, తరగతి గదులు, దానికి అనుబంధంగా ఆటస్థలం, లైబ్రరీ, లేబొరేటరీ వంటి వసతులన్నిటినీ ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలి. ఇంటర్మీడియెట్ బోర్డు వీటిని జియోట్యాగింగ్ చేస్తుంది. కాలేజీ పేర్కొన్న స్థలంలో భవనం, ఆటస్థలం ఉన్నట్లు తేలితేనే గుర్తింపు వస్తుంది. కోచింగ్లకు కాలేజీలకు సంబంధం లేదు ఇంటర్మీడియెట్ కాలేజీల్లో ఇంటర్ పాఠ్యాంశాల బోధన తప్ప ఇతర కోచింగ్లకు ఆస్కారం లేకుండా బోర్డు చర్యలు చేపడుతోంది. కాలేజీలకు, కోచింగ్లకు సంబంధం లేదని ఇప్పటికే విద్యా శాఖ యాజమాన్యాలకు స్పష్టం చేసింది. అలాగే హాస్టళ్లలోని పరిస్థితులు దారుణంగా ఉంటున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఒత్తిడి పెరిగి ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని బోర్డు భావిస్తోంది. ఈ నేపథ్యంలో వాటిపైనా కొన్ని సంస్కరణలకు వీలుగా ప్రతిపాదనలు అందించింది. ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు తమ ఇష్టానుసారం అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ను పట్టించుకోవడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మహిళలకు నిర్ణీత కోటాలో సీట్లు కేటాయించాల్సి ఉన్నా వాటిని బేఖాతరు చేస్తున్నాయి. ఫీజులను కూడా కాకుండా ఇష్టానుసారం వసూలు చేస్తున్నాయి. వీటికి ఇకపై చెక్ పడనుంది. అడ్మిషన్ల ప్రక్రియ, ఫీజుల వసూళ్లను ఆన్లైన్లో నిర్వహించేలా ఇంటర్ బోర్డ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందుకు నీట్, ఎంసెట్ తరహాలో ప్రత్యేక వెబ్పోర్టల్ను రూపొందించనుంది. రాష్ట్రంలో బోర్డు గుర్తింపు ఉన్న కాలేజీలు, వాటిలో సెక్షన్లు, కోర్సు గ్రూపుల సమాచారాన్ని పూర్తిగా ఆన్లైన్లో విద్యార్థులు,తల్లిదండ్రులకు తెలిసేలా ఈ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. టెన్త్ పాసయ్యే విద్యార్థులు దీని ద్వారా తమ మండలం, జిల్లా, రాష్ట్రంలోని ఏ కాలేజీలో, ఏ కోర్సులో చేరాలనుకుంటారో ఆ మేరకు ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. ఆ విద్యార్థి మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ను అనుసరించి కాలేజీలో సీటు ఆన్లైన్లో అలాట్ అవుతుంది. -
టెక్నికల్ గణేషా..!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఏటా జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలు, సామూహిక నిమజ్జనం నగర పోలీసులకు అత్యంత కీలకమైన ఘట్టాలు. మండపం ఏర్పాటుకు అనుమతి మంజూరు చేయడం నుంచి విగ్రహం నిమజ్జనం వరకు అనునిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇప్పటి వరకు మాన్యువల్గా జరుగుతున్న ఈ తతంగానికి నగర పోలీసులు సాంకేతికత జోడించారు. ప్రతి వినాయక మండపానికీ ఓ ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ కేటాయించడంతో పాటు దానిని జియో ట్యాగింగ్ ద్వారా పోలీసు అధికారిక యాప్ ‘టీఎస్ కాప్’కు అనుసంధానిస్తున్నారు. ఫలితంగా తనిఖీల నుంచి నిమజ్జనం వరకు ప్రతి అంశం జవాబుదారీగా, పారదర్శకంగా, సాంకేతికంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అంతా ఆన్లైన్లోనే... గణేష్ ఉత్సవాలకు సంబంధించి నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏటా వేల వినాయక మండపాలు ఏర్పాటవుతుంటాయి. ఈ నేపథ్యంలో మండపాల రిజిస్ట్రేషన్ను సిటీ కాప్స్ ఆన్లైన్ చేశారు. గత ఏడాది నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటి వరకు అధికారిక వెబ్సైట్ ద్వారా దాదాపు 9 వేల మండపాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఆన్లైన్లోనే దాఖలు చేసి దాని ప్రింట్ఔట్తో పాటు పత్రాలను ఠాణాలో సమర్పిస్తున్నారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోని మండపాల వద్దకు నేరుగా వెళ్తున్న పోలీసులు వాటి వివరాలు నమోదు చేసుకుని వాటి వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. ప్రత్యేక క్యూఆర్ కోడ్ కేటాయింపు... ఇలా ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులు, పోలీసులు ఆన్లైన్ చేసిన మండపాల వివరాలను పరిశీలించడానికి బషీర్బాగ్లోని కమిషనరేట్లో ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేశారు. వీరు ఆన్లైన్ దరఖాస్తులు, ఠాణాల నుంచి వచ్చిన పత్రాలను పరిశీలించి మండపం ఏర్పాటుకు అనుమతి ఇస్తారు. మండపాలన్నీ ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత ఆయా దరఖాస్తులపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ముద్రిస్తున్నారు. ఒక్కో విగ్రహానికి ఒక్కో కోడ్ కేటాయిస్తున్నారు. దీంతో అనుమతి మంజూరులో ఎలాంటి జాప్యం లేకుండా పని సాఫీగా సాగుతుందని అధికారులు చెబుతున్నారు.ఈ అనుమతి పత్రాన్ని మండప నిర్వాహకులు తమ మండపాల్లో నిర్ణీత ప్రాంతంలో అతికించేలా చూస్తున్నారు. ఈ క్యూఆర్ కోడ్స్ డేటాను పోలీసు అధికారిక యాప్ ‘టీఎస్ కాప్’లోకి లింకు ఇస్తున్నారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయిలో ఉండే పోలీసుల వరకు ఎవరైనా సరే తమ ప్రాంతంలో ఎన్ని మండపాలు ఉన్నాయి? ఎక్కడ ఉన్నా యి? ఎప్పుడు ఏర్పాటవుతాయి? నిమజ్జనం ఎప్పుడు? ఏ మార్గంలో వెళ్ళి, ఎక్కడ నిమజ్జనం చేస్తారు? తదితర వివరాలను తమ ట్యాబ్స్, స్పార్ట్ఫోన్స్లో చూసుకునే అవకాశం ఏర్పడుతోంది. క్యూఆర్ కోడ్ కేటాయింపులోనే అధికారులు పక్కాగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల వారీగా వేర్వేరుగా దీని కేటాయింపు జరుగుతోంది. తనిఖీలపై పర్యవేక్షణ... ఓ ప్రాంతంలో మండపం ఏర్పాటు అయినప్పటి నుంచి అందులోని విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు ప్రతి దశలోనూ పోలీసుల పర్యవేక్షణ ఉంటుంది. గస్తీ విధులు నిర్వర్తించే బ్లూకోల్ట్సŠ, పెట్రోలింగ్ వాహనాల సిబ్బంది నిత్యం ఆయా మండపాల వద్దకు వెళ్ళి పరిస్థితుల్ని అంచనా వేయడంతో పాటు తనిఖీలు నిర్వహించాలి. ఆయా మండపాల వద్దకు వెళ్ళిన వీరు కోడ్ను టీఎస్ కాప్ యాప్లో స్కాన్ చేస్తారు. దీంతో ఈ తనిఖీలు ఎలా సాగుతున్నాయన్నది ఉన్నతాధికారులకు ఈ యాప్ ద్వారానే తెలుస్తుంది. ఏ మండపానికి ఏ పోలీసును లైజనింగ్ అధికారిగా నియమించారు? ఆయా అధికారుల వివరాలు? ఇలా ప్రతి అంశమూ యాప్ ద్వారా అన్ని స్థాయిల అధికారులకూ తెలుస్తుంది. నిమజ్జన సమయంలో నిర్ణీత సమయంలో ఊరేగింపు ప్రారంభంకావడం నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు ప్రతి విగ్రహం కదలికల్నీ గమనిస్తుండాలి. క్యూఆర్ కోడ్తో కూడిన పత్రంతో వచ్చే విగ్రహాలను క్షేత్రస్థాయి సిబ్బంది ఎక్కడిక్కడ పర్యవేక్షిస్తారు. ఆ కోడ్ ను తమ ట్యాబ్స్, ఫోన్లలో స్కానింగ్ చేస్తుంటారు. దీంతో ఏ విగ్రహం, ఏ సమయంలో, ఏ ప్రాంతంలో ఉంది? ఎప్పుడు నిమజ్జనం జరిగింది? ఇంకా ఎన్ని విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉంది? అనే అంశాలు సిబ్బంది, అధికారులకు యాప్ ద్వారా తెలుస్తుంటాయి. మండపాల జియో ట్యాగింగ్ గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే ఒకే రోజులో నిమజ్జనం పూర్తి చేయాలని భావిస్తున్నారు. ప్రత్యేక క్యూఆర్ కోడ్ సాయంతో అన్ని మండపాలను మ్యాప్ మీది జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఏ చిన్న ఘటనకూ ఆస్కారం లేకుండా అన్ని ప్రభుత్వ విభాగాలు, నిర్వాహకులు, గణేష్ ఉత్సవ కమిటీలతో సమన్వయంతో పని చేస్తున్నాయి. జియో ట్యాగింగ్ చేసిన మండపాలను పోలీసుల అధికారిక యాప్ ‘టీఎస్ కాప్’ ద్వారా గస్తీ సిబ్బంది ట్యాబ్స్, మొబైల్స్కు లింకు చేస్తున్నారు. దీంతో మండపం ఏర్పాటు నుంచి నిమజ్జనం జరిగే వరకు ఆ మండపాన్ని ఏఏ పోలీసులు సందర్శించారు? ఏ సమయంలో వచ్చారు? నిర్వాహకులు ఎవరు ఉన్నారు? అనేవి తేలిగ్గా గుర్తించవచ్చు. ఫలితంగా గస్తీపై ఉన్నతాధికారుల నిఘా ఉంటోంది. ఈ ఏడాది సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ చేసే ఏర్పాట్లు భక్తులకు నచ్చేలా, వారు మెచ్చేలా ఉండాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నగరంలోని అన్ని ఊరేగింపు మార్గాలు సీసీ కెమెరా నిఘాలోకి తీసుకువస్తున్నారు. క్యూఆర్ కోడ్తో కూడిన విగ్రహాన్ని తీసుకువస్తున్న వాహనంపై నిమజ్జనం రోజు ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. అది ఎక్కడ ఉంది? అక్కడి పరిస్థితులు ఏంటి? అనేవి తెలుసుకోవడంతో ఎక్కడా ఆలస్యం, ఆటంకాలు లేకుండా నిమజ్జనం పూర్తి చేసే అవకాశం ఉంది. -
మగ్గాలపై మలిసంధ్య బతుకులు
చేనేతను నమ్ముకుని పనిచేస్తున్న ఆఖరితరం - సిరిసిల్లలో మొత్తం 175 చేనేత మగ్గాలు - కార్మికులు 225 మంది మాత్రమే - ఇప్పటికే జియో ట్యాగింగ్ పూర్తి - చేనేతను మింగిన మర నేత ఈ చిత్రంలో కనిపిస్తున్న చేనేత కార్మికుడి పేరు మామిడాల చంద్రయ్య (92). భార్య పేరు కమలమ్మ. ముగ్గురు కుమారులు, ఒక కూతురు. సిరిసిల్ల విద్యానగర్వాసి. ఒకప్పుడు బాగానే బతికాడు. ఇల్లు కట్టుకోవడంతోపాటు కుమారులు, కూతురుకు పెళ్లిళ్లు చేశాడు. వీరు ఎవరికి వారే బతుకుతున్నారు. ఈ వృద్ధుడిది ఇప్పుడు సాతగాని పానం.. బొక్కలు తేలిన ఒళ్లు.. మగ్గంపై జోటను ఆడించాలంటే రెక్కల్లో సత్తువ లేదు. తన ఒంట్లో సత్తువ లేకున్నా.. చేనేత మగ్గంపై బట్ట నేస్తున్నాడు. రోజూ పొద్దుగాల 10 గంటలకు వచ్చి చేనేతమగ్గంపై 4 మీటర్ల బట్టను సాయంత్రం 5 గంటల వరకు ఉత్పత్తిచేసి వెళ్తాడు. ఒక్కో మీటరుకు రూ.17 చొప్పున రోజూ రూ.68 కూలి వస్తుంది. నెలకు రూ.1,500 – రూ.1,800 మాత్రమే అందుతుంది. ప్రభుత్వం ఆసరా పింఛన్ రూ.1,000 ఇస్తుంది. ఈ సొమ్ముతోనే బియ్యం, ఉప్పు, పప్పు, కూరగాయలతో పూటగడవాలి. ఆరోగ్యం సహకరించకున్నా చేనేతమగ్గంపై బట్ట నేసి అంతో ఇంతో సంపాదించడం తప్ప మరోమార్గంలేదు. ఇది ఒక్క చంద్రయ్య– కమలమ్మ దంపతుల పరిస్థితే కాదు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దాదాపు 225 మంది చేనేత కార్మికుల దుస్థితి. సిరిసిల్ల: ‘చిన్న చేపను పెద్ద చేప మింగినట్లు’.. చేనేత మగ్గాలను మరమగ్గాలు (పవర్లూమ్స్) మింగేశాయి. కాలంతో పోటీ పడలేక.. జిగిసచ్చిన వృద్ధ కార్మికులు మరోపని చేతకాక.. వయసు పైబడినా.. కళ్లు కనిపించ కపోయినా.. ఒళ్లు సహకరించకున్నా.. జానెడు పొట్ట కోసం.. కాళ్లు, చేతులు ఆడిస్తూ బట్ట నేస్తున్నారు. 58 ఏళ్లవయసు నిండితే ప్రభుత్వం రిటైర్మెంట్ను ప్రకటి స్తోంది. కానీ చేనేత కార్మికులంతా 60 దాటి 95 ఏళ్ల వయసున్న వారు ఇంకా మగ్గంపై శ్రమిస్తూ.. పొట్టపో సుకుంటున్నారు. తక్కువ కూలి ఉన్నా.. కుటుంబ అవసరాల కోసం మగ్గాన్నే నమ్ముకుని మలి సంధ్య లోనూ పనిచేస్తున్నారు. సిరిసిల్లలో మూడు చేనేత సహకార సంఘాలు ఉండగా.. 114 మంది కార్మికులు చేనేత మగ్గాలపై ఆధారపడ్డవారే.. మరమగ్గాలపై వేగం గా బట్ట ఉత్పత్తి అవుతుండగా.. చేనేతమగ్గంపై కాళ్లు, చేతులు ఆడిస్తూ.. ఎంతశ్రమించినా మరమగ్గాలతో పోటీపడలేక పోతున్నారు. అత్యంత కష్టమైన ఈ పనిలో వయోవృద్ధులు శ్రమించడం బాధాకరం. ఈ పనిని కొత్తగా ఎవ్వరూ నేర్చుకోకపోవడంతో ఈ తరం తనువు చాలిస్తే.. చేనేత మగ్గాలు మూలన పడాల్సిందే. ఇప్పుడు మరణశయ్యపై చేనేత మగ్గాలు ఆఖరితరం చేతిలో బట్టనేస్తున్నాయి. మిగిలినవి కొన్నే.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 175 చేనేత మగ్గా లు ఉన్నాయి. వీటికి చేనేత, జౌళిశాఖ అధి కారులు జియో ట్యాగింగ్ చేశారు. ఈ రంగంపై 175 మంది కార్మికులు, మరో 50 మంది అను బంధ రంగాల కార్మికులు ఆధారపడ్డారు. సిరిసి ల్లలో అత్యధికంగా 135 మంది ఉండగా.. వేము లవాడ, మామిడిపల్లి, బోయినపల్లి, తంగళ్లపల్లి గ్రామాల్లో మిగతావారు పని చేస్తున్నారు. వీరికి టెస్కో ద్వారా నూలు సరఫరా అవుతోంది. దీని ఆధారంగా బట్టనేసి ఇస్తున్నారు. ‘ఆసరా’ అంతంతే.. ప్రభుత్వం అందించే రాయితీలు, సంక్షేమ పథకాలు మర మగ్గాల కార్మికులకు కొంతైనా దరి చేరుతున్నాయి. కానీ, నిజమైన చేనేత కార్మికులకు చేయూత లభించడంలేదు. 35 కిలోల బియ్యం వచ్చే అంత్యోదయ కార్డులు మంజూరు చేయడంలేదు. ఇంట్లో ఒక్కరికే పింఛన్ ఇవ్వాలనే నిబంధన.. వృద్ధాప్యంలో ఉన్న దంప తుల్లో ఒక్కరికే వర్తిస్తోంది. మగ్గం నేసే కార్మికుడు, ఇంట్లో ఉండే వృద్ధురాలు ఇద్దరూ పింఛన్కు అర్హులే. బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు ఈ నిబంధనను సడలించింది. చేనేత కార్మికులకు ఆం క్షలు ఉండడంతో సామాజిక భద్రత కరువైంది. ఆసరా పిం ఛన్లు, అంత్యోదయ కార్డులివ్వాలని వేడుకుంటున్నారు. -
వీధి కుక్కలకు జియోట్యాగింగ్
– శునకాల నియంత్రణకు ఆండ్రాయిడ్ యాప్ – దేశంలోనే మొదటిసారిగా తిరుపతిలో అమలు తిరుపతి మెడికల్: దేశంలోనే మొట్టమొదటి సారిగా వీధి కుక్కల నియంత్రణకు జియోట్యాగింగ్ పద్ధతిని తిరుపతిలో అమలు చేస్తున్నారు. మున్సిపల్ శాఖ సమన్వయంతో తిరుపతికి చెందిన యానిమల్ కేర్ ల్యాండ్ సంస్థ ఈ ఆధునిక సాంకేతిక పద్ధతికి శ్రీకారం చుట్టింది. ఫలితంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రత్యేక ‘ఆండ్రాయిడ్ యాప్ ’ద్వారా వీధి కుక్కల నియంత్రణకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే తిరుపతి కేంద్రంగా యానిమల్ కేర్ల్యాండ్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్.వి. శ్రీకాంత్ బాబు 14 ఏళ్లుగా రేబిస్ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. 110 మున్సిపాలిటీల్లో యాప్ సేవలు.. ఈ పద్ధతిని పారదర్శకంగా అమలుచేసేందుకు యానిమల్ కేర్ ల్యాండ్ తిరుపతి నగరపాలక సంస్థతో సమన్వయంతో పనిచేస్తోంది. ఈ పద్ధతిలో భాగంగా టీకాలు వేసిన ప్రతి శునకాన్ని ప్రత్యేకంగా రూపొందించిన ఆండ్రాయిడ్ యాప్ ద్వారా జియోట్యాగ్ చేస్తారు. ఒక సారి యాప్ను ఉపయోగించి శునకాలను పట్టినప్పుడు, శస్త్ర చికిత్సలు చేసినప్పుడు, తిరిగి వాటి స్థానాల్లో వదిలినప్పుడు మొత్తం 3 ఫొటోలతో జియోట్యాగింగ్ చేస్తారు. దీనిని నేరుగా సీఎం డాష్ బోర్డుకు అనుసం«ధానం చేస్తారు. ఈ విధానం మంచి ఫలితాలను ఇవ్వడంతో రాష్ట్ర మున్సిపల్ శాఖ డైరెక్టర్ కె.కన్నబాబు ఆసక్తి చూపించారు. అందులో భాగంగానే డాక్టర్ శ్రీకాంత్బాబుతో చర్చించి రాష్ట్రంలోని 110 మున్సిపాలీటీల్లో .. 1.79లక్షల శునకాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నారు. దేశంలోనే ఆదర్శంగా... తిరుపతి కేంద్రంగా యానిమల్ కేర్ ల్యాండ్ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 1370 ఫిర్యాదులు తమ దష్టికి వచ్చాయి. వీధి శునకాల నియంత్రణ కోసం దేశంలోనే మొట్టమొదటి సారిగా ఒక ప్రత్యేక ఆండ్రాయిడ్ యాప్ను రూపొందించాం. ఈ విధానాన్ని రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో అమలుచేస్తున్నందుకు సంతోషంగా ఉంది. – డాక్టర్ ఎన్.వి.శ్రీకాంత్ బాబు, కో–ఆప్షన్ సభ్యులు, యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా -
సాగు కనెక్షన్లకు జియోట్యాగింగ్
– ఎస్ఈ భార్గవరాముడు – 12లోగా పూర్తి చేయాలని ఆదేశం కర్నూలు(రాజ్విహార్): వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను జియోట్యాగింగ్తో అనుసంధానించాలని విద్యుత్ శాఖ ఏపీ ఎస్పీడీసీఎల్ కర్నూలు ఆపరేషన్స్ ఎస్ఈ జి. భార్గవ రాముడు సూచించారు. స్థానిక కేవీఆర్ కళాశాల ఎదురుగా ఉన్న పవర్ హౌస్లోని ఆయన కార్యాలయంలో బుధవారం డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు జియోట్యాగింగ్ వ్యవస్థను ఈనెల 12వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. ప్రతి నెలా నిర్ణీత గడువులోగా స్పాట్ బిల్లింగ్ పూర్తి చేసి వసూలుపై దష్టి సారించాలని ఆదేశించారు. సంస్థ నిబంధనల ప్రకారం పాత బకాయిలను ప్రతి నెలా 10శాతం మేరకు వసూలు చేయాలన్నారు. అభివద్ధి పనులు త్వరగా పూర్తి చేసి వర్క్ అర్డర్లు క్లోజ్ చేయాలన్నారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే గ్రామీణ ప్రాంతాల్లో 24గంటలు, పట్టణ ప్రాంతాల్లో 12గంటల్లోపు కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో కర్నూలు–1, 2, రూరల్స్, గూడూరు, ఆత్మకూరు, నందికొట్కూరు ఏడీఈలు టీఎన్ ప్రసాద్, రంగస్వామి, నవీన్ బాబు, విజయసారథి, జయశంకర్, రామ సుబ్బారెడ్డి, ఏఈలు, ఏఏఓలు పాల్గొన్నారు. -
వారంలో జియో ట్యాగింగ్ పూర్తి
డ్వామా పీడీ హరిత నెల్లూరు(అర్బన్): జిల్లాలోని రైతులకు చెందిన అన్ని రకాల వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు/ టెక్నికల్ సిబ్బంది వారం లోపు జియోట్యాగింగ్ను పూర్తి చేయాలని డ్వామా పీడీ హరిత అన్నారు. ఈ మేరకు ఆమె శనివారం దర్గామిట్టలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫిల్టర్ పాయింట్లు, బోరు బావులు, ఓపెన్ బావులు, కాలువలపై ఉంచిన మోటార్ల కనెక్షన్లకు సంబంధించి 100 శాతం జియోట్యాగింగ్ను వారం లోపు పూర్తి చేయాలని కోరారు. జిల్లాలో 1,61,376 కనెక్షన్లు ఉన్నాయని, గత రెండు రోజుల్లో 21,800 కనెక్షన్లు జియోట్యాగింగ్ చేశార ని తెలిపారు. దీని వల్ల రైతులు వేసిన పంటల రకాలు, భూవిస్తీర్ణం, మెట్ట, మాగాణి తదితర వివరాలతోపాటు విద్యుత్ ఖర్చు, నీటి వినియోగం, కరువు పరిస్థితులు తెలుసుకోవచ్చన్నారు. రైతులు ఫీల్డ్ అసిస్టెంట్లకు సహకరించాలని కోరారు. సమావేశంలో అడిషనల్ పీడీ ప్రభాకర్ పాల్గొన్నారు. -
‘సర్వే’జనా.. ‘దుఖమే’ భవిష్యత్తు
సంక్షేమ పథకాల కుదింపు సర్వే టీవీ, ఫ్రిడ్జ్ ఉంటే పేదలు కానట్లే సాధికార సర్వేలో ఇదే ‘లోగుట్టు’...! వివరాలు చెప్పడానికి జనం నిరాకరణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనుంచి తప్పించుకోవడానికే టీడీపీ సర్కారు సాధికార సర్వే చేయిస్తోందా..? సంక్షేమ పథకాలను కొందరికే పరిమితం చేయడానికి ప్రణాళిక వేసిందా..? ఇంట్లో టీవీ, రిఫ్రిజిరేటర్లు ఉండే కుంటుంబాలు ప్రభుత్వం దృష్టిలో సంపన్న కుటుంబాలా..? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెబుతున్న ప్రజాసాధికార సర్వే కొందరికే సాధికారికతను చేకూర్చేలా ఉందనే విమర్శలను తెచ్చిపెడుతోంది. చిత్తూరు (అర్బన్): కుటుంబ ఆదాయ వనరులు, ఆర్థిక పరిస్థితులు, పథకాల ద్వారా పొందుతున్న లబ్ధిదారులు..తదితర లెక్కలు సేకరించడానికే ప్రజాసాధికారత సర్వే (స్మార్ట్ పల్స్ సర్వే) నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 13 లక్షల కుటుంబాలను 2,745 బ్లాకులుగా విభవించారు. ఒక్కో బ్లాకుకు ఎన్యుమరేటరును నియమించారు. సర్వే తీరును పరిశీలించడానికి 317 మందిని అదనంగా నియమించారు. ఆరు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇందుకోసం పనిచేస్తున్నారు. ఈనెల 6 నుంచి ప్రారంభమయ్యింది. వారం రోజుల్లో అధికారులు పూర్తిచేసిన బ్లాకులు రెండంకెలు కూడా దాటలేదు. సీఎం డాష్ బోర్డులో చిత్తూరు జిల్లా నుంచి యాభై బ్లాకులు కూడా పూర్తి చేయలేదనే సమాచారం కనిపిస్తోందని సర్వే చేస్తున్న అధికారులపై, పర్యవేక్షకులు రోజూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక లోపాలున్నప్పటికీ చాలా చోట్ల ప్రజలు వ్యక్తిగత వివరాలు చెప్పడానికి నిరాకరించడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆ వివరాలు ఎందుకో.. సర్వేలో ప్రతి కుటుంబంలోని వ్యక్తిని ఫొటో తీయాలి. ఇంటిని ఫోటో తీసి జియో ట్యాగింగ్ చేయాలి. టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, ఏసీ, హీటర్, సెల్ఫోన్, సైకిల్, స్కూటర్ వివరాలు తప్పనిసరిగా తెలియచేయాల్సి ఉంటుంది. కులాల వివరాలు సైతం చెప్పాలి. దారిద్య్రరేఖకు దిగువగా (బీపీఎల్), దారిద్య్ర రేఖకు ఎగువగా (ఏపీఎల్) ఉన్న కుటుంబాలుగా ప్రజల్ని విభజించడమే సర్వే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. టీవీ, రిఫ్రిజిరేటర్ ఆధారంగా ప్రజల్ని బీపీఎల్, ఏపీఎల్గా విడగొట్టడం ద్వారా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కొందరికే చేకూర్చాలన్నదని ప్రభుత్వ ఉద్దేశంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సర్వేలో కులాల ప్రస్తావన ఉండటం వెనుక కాపులను బీసీల్లో చేరస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ముద్రగడ దీక్ష నేపథ్యంలో ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్కు సాధికార సర్వేలో కులాల వారీగా తీసిన వివరాలను ఇవ్వనున్నట్లు స్పష్టమవుతోంది. ఎలాంటి ప్రామాణికం లేకుండా చేస్తున్న సర్వేలో కాపుల సంఖ్యను తక్కువగా చూపిస్తూ బీసీల్లో చేర్చడానికి వీల్లేదనే విధంగా కొత్త అంశాన్ని తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఎమ్మెల్యేల గుప్పెట్లోకి ‘ఇంటి’ గుట్టు!
జియో ట్యాగింగ్ పూర్తి చేసేందుకు కసరత్తు ఇదయ్యాక..ఇళ్ల నిర్మాణాలపై సామాజిక తనిఖీ తరహా విచారణ ఆపైన..బిల్లుల చెల్లింపుల్లో జన్మభూమి కమిటీలకు కీలక బాధ్యత? బిల్లులు ఆగిపోయి ఏడాదైంది... బకాయిలు రూ.40కోట్లపైమాటే? ఇందిరమ్మ పథకం అధికార పార్టీ నేతల చే తుల్లోకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా ఇంటి జాబితాలను ఎమ్మెల్యేలకు అందజేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ మొదటివారంలో ఈ జాబితాలు ఎమ్మెల్యేలకు అంద నున్నాయి. ఈ చర్యతో గ్రామాల్లో అధికారపార్టీ నేతలు చెప్పినట్టుగానే పథకం అమలయ్యే పరిస్థితులు రానున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. బి.కొత్తకోట: ఇందిరమ్మ పథకం అమలు బాధ్యతను ఎమ్మెల్యేలకే అప్పగించనున్నట్లు సమాచారం. ఇప్పటికే మండలస్థాయి అధికారులకు ఈమేరకు సమావేశాల్లో ఉన్నతాధికారులు వివరించినట్టు తెలిసింది. జన్మభూమి కమిటీలకు కూడా అధికారాలు కట్టబెట్టే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కమిటీలకు కూడా ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితాను ఇవ్వడమేకాక బిల్లుల చెల్లింపు, లబ్ధిదారుల ఇంటి నిర్మాణాల పరిశీలనలో ప్రమేయం కల్పించే దిశగా చర్యలు ఉండబోతున్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. జన్మభూమి కమిటీల్లో అత్యధికులు అధికార టీడీపీ నేతలే ఉండడంతో చర్యలన్నీ వారి కనుసన్నల్లోనే సాగే పరిస్థితులూ లేకపోలేదు. ఏడాదిగా లబ్ధిదారులకు పైసా చెల్లించలేదు. ఇప్పుడు కమిటీలకు బిల్లుల చెల్లింపు వ్యవహారంలో అవకాశం ఇవ్వడం వెనుక అధికార పార్టీకి చెందిన వారికే లబ్ధి చేకూర్చాలన్న లోగుట్టు ఉందన్న విమర్శలూ లేకపోలేదు. ఈ విషయాన్ని ఓ ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లగా వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. జియో ట్యాగింగ్ అయ్యాక తనిఖీలు.. జిల్లాలోని ఇందిరమ్మ ఇళ్లకు జియో ట్యాగింగ్ ప్రారంభించాక 3,26,615 ఇళ్లకు ఫొటోలు తీసి ఆన్లైన్ చేశారు. ఇందులో ఆధార్ నంబర్ల సమస్య, ఒకే రకమైన పేర్లు పలు ఇళ్లకు ఉండడంతో వాటిని సరిచేసే పనిలోపడ్డారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో ఇళ్లసర్వే, లబ్ధిదారుల జాబితా పరిశీలన, వివిధ స్థాయిలో ఆగిపోయిన నిర్మాణాల పరిశీలనతోనే ఏడాది గడిచిపోయింది. మిగిలిన ఇళ్లకు జియో ట్యాగింగ్ పూర్తిచేశాక గ్రామస్థాయిలో తనిఖీలు ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఉపాధి హమీ పథకం పనులపై ఏడాదికోసారి సామాజిక తనిఖీలు నిర్వహించి అవినీతి గుట్టును రట్టు చేస్తున్నారు. ఇదే తరహాలో ఇందిరమ్మ ఇళ్లకు సామాజిక తనిఖీ అవసరమని ప్రభుత్వం నిర్ణయించి, వీటి బాధ్యతలను ఓ ఏజెన్సీకి అప్పగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. పనుల నాణ్యతను తనిఖీ చేసే థర్డ్ పార్టీ తరహాలో కార్యక్రమం సాగనుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. దీనికోసమే జిల్లాలో మిగిలిపోయిన ఇళ్లకు జియో ట్యాగింగ్ పనులు త్వరలో పూర్తిచేయాలని ప్రాజెక్ట్ డెరైక్టర్ అధికారులను ఆదేశించారని తెలిసింది. రూ.1,236 కోట్ల ఖర్చు.. జిల్లా వ్యాప్తంగా 2004-05 నుంచి 2013 వరకు 4,43,009 గృహాలను మంజూరు చేశారు. ఇందులో 2014 మే 24 నాటికి 2,95,134 గృహాలు పూర్తిచేశారు. 31,900 గృహాలు పునాదులు, 2,130 గృహాలు గోడల స్థాయిలో, 13,170 గృహాలు రూఫ్ లెవల్లో ఉన్నాయి. ఇవి కాకుండా 1,00,671 గృహాలు ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు. ఇందిరమ్మ పథకం కోసం ఇంతవరకు రూ. 1,236.2 కోట్లను ఖర్చుచేశారు. గడచిన ఏడాదిగా ఈ లెక్కల్లో మార్పులేదు. ఇదికాక బిల్లులు నిలిపి వేసిన నాటికి రూ.16 కోట్ల చెల్లింపులు ఆగాయి. ప్రస్తుతం వివిధ దశల్లో జరిగిన నిర్మాణాల వివరాలు సేకరించిన అధికారులు వాటికీ రూ.25కోట్ల దాకా చెల్లించాల్సి వస్తుందని అంచనా వేశారు. -
ఆన్లైన్లో పురపాలన!
విజయనగరం మున్సిపాలిటీ : జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఇకపై పౌర సేవలన్నీ ఆన్లైన్లో జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో పురపాలక సంఘాల్లో పరిస్థితులను ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రి ఇక నుంచి ఆన్లైన్ ద్వారానే పురపాలనను సమీక్షించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పన్నుల వసూళ్లు, చెత్త సేకరణ, అభివృద్ధి ప నులకు సంబంధించిన ప్రతిపాదనలు, వీధి లైట్ల నిర్వహణ, మున్సిపల్ ఆస్తులతో పాటు ప్రతి అంశాన్ని అందరూ ఆన్లైన్లో చూసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకపై రోజు వారి కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు కూడా నిత్యం ఆన్లైన్లో ఆప్డేట్ చేయాల్సి ఉంటుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఈ విధానాన్ని పక్కాగా అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో ఆస్తు ల గుర్తింపునకు జియో ట్యాగింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఖాళీ స్థలాలు, పార్కులు, పాఠశాలలు ఇతర మున్సిపల్ ఆస్తుల వివరాలను విస్తీర్ణంతో సహా జియో ట్యాగింగ్లో నమోదు చేస్తారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, ఆస్పత్రులు, రోడ్లు వంటి సమాచారాన్ని కూడా ఇందులో పొందుపరుస్తారు. ప్రతి ఆస్తికి ఒక నంబర్ కేటాయిస్తారు. తద్వారా ఆస్తుల ఆక్రమణలను ఉన్నతాధికారులు ఆన్లైన్ ద్వారా పర్యవేక్షించడానికి వీలు కలుగుతుంది. అలాగే పట్టణ ప్రజలు పురపాలక సంఘం నుంచి సత్వర సేవలు పొందేందుకు వీలుగా ఈ-సువిధ కార్యక్రమాన్ని అ మలు చేయనున్నారు. ఇందులో మొత్తం 18 అంశాలను చేర్చారు. ఇంటి పన్ను, ఆక్రమణ, ప్రకటన, వ్యాపార లెసైన్సు, మంచినీటి పన్నులకు ఇకపై ఆన్లైన్లోనే బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. భవనాలకు సంబంధించిన ప్లాన్లనూ కూడా ఆన్లైన్ ద్వారానే మంజూరు చేస్తారు. పారిశుద్ధ్య పనుల తీరుపై కూడా ఆన్లైన్లోనే పర్యవేక్షణ జరగనుంది. వాస్తవానికి పట్టణాల్లో చేపట్టే పనులపై నిత్యం ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పనుల పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఎంబిన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే శానెట రీ ఇన్స్పెక్టర్లకు స్మార్ట్ ఫోన్లు కూడా అందజేశారు. ఈ ఫోన్ల ద్వారా వీధుల్లో ఉన్న చెత్త కుప్పలకు ముందుగా ఫొటోలు తీసిన అనంతరం అక్కడి చెత్తను తొలగించిన తరువాత మరోమారు ఫొటో తీసి ఆన్లైన్లో ఆప్లోడ్ చేయాలి. దీని వల్ల అందరి పని తీరుపై నిఘా పెట్టాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. అమలు బాధ్యత కమిషనర్లదే మున్సిపాలిటీల్లో అమలు చేసే కార్యక్రమాలు, పౌర సేవలకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాల్సిన బాధ్యతను కమిషనర్లకు అప్పగించారు. ఇళ్లు, ఆస్తుల యజమానుల ఆధార్ నంబర్లు సేకరణ, వీధి లైట్లు ఎన్ని ఉన్నాయి. జనన మరణ ధ్రు వీకరణ పత్రాలు ఎన్ని జారీ చేశారు, కోర్టు కేసులు, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద చేపట్టే కార్యక్రమాలు, జియోగ్రాఫిక్ మ్యాపింగ్ సిస్టమ్, అర్బన్ హౌసింగ్, పాఠశాలల అభివృద్ధికి ఎంత మేర నిధులు వచ్చాయి. ఎంత ఖర్చు చేశారు. జేఎన్ఎంఆర్యూ, స్వయం సహాయక సంఘాలకు రుణాల అందజేత, బిల్డింగ్ ప్లాన్ల పరిస్థితి, స్మార్ట్ వార్డు కార్యక్రమం అమలు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అమలు తీరుపై కమిషనర్లు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. -
సొంతిల్లు..కలేనా?
ఒక్క ఇల్లూ మంజూరు చేయని నూతన ప్రభుత్వం బిల్లులన్నీ పెండింగ్లోనే జియో ట్యాగింగ్ పేరుతో జాప్యం నూతన గృహాల మంజూరు ఎప్పటికో మచిలీపట్నం : పేదల సొంతింటి కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించటం లేదు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఒక్క గృహాన్నీ మంజూరు చేయకపోగా గతంలో నిర్మించిన ఇళ్లకు బిల్లుల మంజూరు కూడా నిలిపివేయటం గమనార్హం. ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడిచినా గృహనిర్మాణంపై దృష్టిసారించకపోవటంతో పేదలు గుడిసెల్లోనే కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో గృహనిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న సాకును బూచిగా చూపి ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోంది. సగం గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులు బిల్లుల కోసం నెలలతరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేని పరిస్థితి నెలకొంది. గతంలో నిర్మించిన గృహాలు వాస్తవంగా నిర్మించారా, లేదా అసలైన లబ్ధిదారులే ఉన్నారా తదితర వివరాలు సేకరించేందుకు జియో ట్యాగింగ్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోంది. జిల్లాలో 75 శాతం మేర జియో ట్యాగింగ్ ద్వారా గృహాలను గుర్తించే పని పూర్తయిందని, మరో 25 శాతం ఈ నెలాఖరులోగా పూర్తిచేస్తామని గృహనిర్మాణ శాఖ పీడీ సీహెచ్ ప్రతాపరావు తెలిపారు. రాష్ట్రంలో కృష్ణాజిల్లానే జియో ట్యాగింగ్ ద్వారా గృహాలను గుర్తించే ప్రక్రియలో మొదటి స్థానంలో ఉందన్నారు. పెండింగ్లో రూ.12.44 కోట్ల బిల్లులు.. జిల్లాలో 5,765 గృహాలకు రూ.12.44 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. 2014 మే నెల నుంచి బిల్లుల చెల్లింపులు నిలిపివేశారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత వీటిని చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఈ అంశాన్ని పక్కనపెట్టేశారు. నూతన గృహ నిర్మాణం చేసే సమయంలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అసలు గృహనిర్మాణమే ప్రారంభం కాకపోవటంతో మరుగుదొడ్ల నిర్మాణం కూడా నిలిచిపోయింది. నగదు పెంచుతామన్నారు.. జీవో జారీ చేయలేదు ప్రస్తుతం పేదలకు నిర్మించే ఒక్కొక్క గృహానికి రూ.70 వేలు, ఎస్సీ, ఎస్టీలైతే లక్ష రూపాయలు చొప్పున నగదు అందజేస్తున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత రూ.70 వేలు చొప్పున ఇస్తున్నవారికి లక్ష రూపాయలు, ఎస్సీ, ఎస్టీలకు లక్ష రూపాయల స్థానంలో లక్షా 50 వేల రూపాయలకు పెంచి ఇస్తామని పాలకులు ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయలేదని గృహనిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు వస్తేనే పెంచిన మొత్తాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు అంటున్నారు. జియో ట్యాగింగ్ 75 శాతమే పూర్తి.. 2004 నుంచి నిర్మాణంలో ఉండి వివిధ దశల్లో ఉన్న గృహాలను జియో ట్యాగింగ్ పద్ధతిలో ఫొటోలు తీసి కంప్యూటర్లో ఆన్లైన్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికోసం సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. దీని అమలు కోసం అసిస్టెంట్ ఇంజనీర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లకు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు అందజేశారు. ప్రతి గృహాన్నీ రెండు ఫొటోలు తీసి శాటిలైట్కు అప్లోడ్ చేయాల్సి ఉంది. గతంలో ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు 50 గృహాల వివరాలను ఆన్లైన్లో ఉంచాలని చెప్పగా ప్రస్తుతం ఈ సంఖ్యను 100కు పెంచినట్లు అధికారులు చెబుతున్నారు. 2 లక్షల 16 వేల 108 గృహాలను జియో ట్యాగింగ్ ద్వారా గుర్తించి ఆన్లైన్లో ఉంచాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు 75 శాతం మాత్రమే పూర్తయింది. 2015 జనవరి 31 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించినా ఆచరణలో అది సాధ్యం కాలేదు. జియో ట్యాగింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాతే పెండింగ్లో ఉన్న బకాయిలను లబ్ధిదారులకు అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుంది, ఎప్పటికి బిల్లులు చెల్లిస్తారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. అప్పటివరకు తాము గుడిసెల్లోనే నివసిస్తూ ఇబ్బందులు పడాలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 14,020 గృహాలను పూర్తిచేసి రూ.118.78 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అర్హత లేని లబ్ధిదారులకు గృహాలు నిర్మించటం జరిగిందనే సందేహాలతో గత మూడేళ్లుగా నిలిచిన గృహాలను తనిఖీ చేసేందుకు మండలస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులు అర్హత కలిగిన లబ్ధిదారుల జాబితాలు తయారుచేస్తేనే వాటిని ఆన్లైన్లో ఉంచుతామనే నిబంధన విధించారు. అర్హత లేనివారు గృహాలు నిర్మిస్తే ప్రభుత్వం నుంచి ఇచ్చిన నగదును వారి నుంచి వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మంజూరు చేయిస్తామంటూ అక్రమ వసూళ్లు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన గృహాల మంజూరు ఇంతవరకు ప్రారంభం కాలేదు. వివిధ దశల్లో ఉన్న గృహాలకు బిల్లుల చెల్లింపులూ చేయలేదు. పాత బకాయిలు రాక లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు నూతన గృహాలు మంజూరు చేయిస్తామంటూ లబ్ధిదారులకు ఆశ చూపుతున్నారు. గ్రామ, వార్డు, మండల కమిటీల్లో ఉన్న సభ్యులు సూచించినవారికే నూతనంగా గృహాలు మంజూరవుతాయనే ఆశ చూపి గుట్టుచప్పుడు కాకుండా ఒక్కొక్క గృహానికి రూ.4 నుంచి రూ. 5 వేలు చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలోనే నూతన గృహాలకు అనుమతులు వస్తాయని అధికారులు చెబుతుండగా ముందస్తుగానే అధికార పక్షానికి చెందిన కొందరు వసూళ్లకు దిగారు. -
వీడని జియోట్యాగ్ ముడి
వీరఘట్టం : జియో ట్యాగింగ్ పేరుతో ప్రభుత్వం ఇళ్ల లబ్ధిదారులను అవస్థల పాల్జేస్తోంది. నాలుగు నెలలుగా ఇదే సాకుతో కొత్త ఇళ్లు మంజూరు చేయక, కట్టిన ఇళ్లకు బిల్లులు చెల్లించడం లేదు. నిర్మాణాలు చేపట్టండి బిల్లులు చెల్లిస్తామన్న అధికారుల భరోసాతో అప్పులు చేసి నిర్మాణాలు ప్రారంభించిన లబ్ధిదారులు ఏడాది కాలంగా బిల్లులు మంజూరు కాక, నిర్మాణాలను అర్ధంతరంగా నిలిపివేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క కొత్త ఇల్లు కూడా మంజూరు చేయలేదు. గత ఏడాది మార్చి 23 నుంచి ఎన్నికల కోడ్ అంటూ ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు నిలిపివేశారు. అనంతరం వచ్చిన కొత్త ప్రభుత్వం ఇందిరమ్మ స్థానంలో ఎన్టీఆర్ స్వగృహ ద్వారా ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి ఏడు నెలలు దాటినా.. ఇంతవరకు ఆ పథకం ప్రారంభం కాలేదు. ఇదే సమయంలో అక్రమంగా ఇందిరమ్మ గృహాలు పొందిన వారిని జియోట్యాగింగ్ ద్వారా గుర్తించి ఫిబ్రవరి నెలాఖరు నాటికి ప్రభుత్వానికి నివేదిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ అది జరిగే పరిస్థితి కనిపించడంలేదు. 65 శాతం పూర్తి జిల్లాలో ప్రభుత్వ పథకాల కింద 2.64 లక్షల గృహాలు ఉండగా 65 శాతం అంటే 1.80 లక్షల గృహాలకు జియో ట్యాగింగ్ పూర్తి చేశామని, మిగిలిన వాటిని ఈ నెలాఖరులోపు పూర్తి చే స్తామని అధికారులు చెబుతున్నారు. కాగా 2.64 లక్షల ఇళ్లలో సుమారు 2.40 లక్షల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. 24 వేల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీరికి గత ఏడాది నుంచి చెల్లింపు నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా సుమారు రెండు నెలల క్రితం నిర్వహించిన జన్మభూమిలో ఇళ్ల నిర్మాణాల కోసం జిల్లా వ్యాప్తంగా 43 వేలు దరఖాస్తులు, అలాగే ప్రజావాణి ద్వారా మరో 94 వేల దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం ఆన్లైన్లో జన్మభూమి వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంతో ఈ దరఖాస్తులన్నీ కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. పెరుగుతున్న ధరలు సిమెంట్, ఇనుము ఇతర సామాగ్రి ధరలు పెరుగుతుండటంతో ఇందిరమ్మ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క బిల్లులు అందక ఇబ్బందులు పడుతుంటే మరో పక్క ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తుందని వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే అరకొర నిధులతో ఇంటి నిర్మాణం సాధ్యం కాదని అంటున్నారు. ప్రభుత్వం స్పందించి నిలిచిన నిర్మాణాలను పూర్తి చేసేందుకు అదనపు నిధులు కేటాయిస్తే గాని ప్రభుత్వ ధ్యేయం నెరవేరదని లబ్ధిదారులు అంటున్నారు. ప్రభుత్వ సాయం పెంచాలి ఇందిరమ్మ ఇంటికి ఇస్తున్న ప్రభుత్వ సహాయం ఏ మూలకు చాలడం లేదు. కనీసం 2 లక్షల రూపాయలైనా ఇవ్వందే ఇల్లు కట్టడం అసాధ్యం. ఆ దిశగా చర్యలు తీసుకుంటేనే నిర్మాణాలు పూర్తవుతాయి. లేకపోతే మధ్యలోనే ఆగిపోతాయి. -వెలగాడ చిన్నమ్మ, కంబరవలస ధరలను అదుపు చేయాలి సిమెంట్, ఇనుము ధరలు సామాన్యుడికి అందుబాటులో లేవు. రోజురోజుకి పెరిగిపోతున్న వీటి ధరలను ప్రభుత్వం అదుపు చేయాలి. వ్యాపారులు తమ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచి అమ్ముతున్నారు. వీటిపై అధికారులు దృష్టి సారించాలి. -రెట్టి కమల, వీరఘట్టం -
గూగుల్ స్థానంలో ‘భువన్’
భువన్ మ్యాప్ల ఆధారంగా పేదల ఇళ్లకు జియో ట్యాగింగ్ ఆధార్తోనూ ఇళ్ల వివరాలను అనుసంధానించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: గూగుల్ మ్యాప్లకు బదులు దేశీయంగా రూపొందించిన భౌగోళిక సమాచార వ్యవస్థ ‘భువన్’ను ఇకపై విస్తృతంగా వినియోగించాలన్న కేంద్రం నిర్ణయం మేరకు రాష్ర్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దేశ భౌగోళిక సమాచారానికి సంబంధించిన పూర్తి వివరాలతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎస్సీ) తయారు చేసిన ‘భువన్’ సాఫ్ట్వేర్ అప్లికేషన్ల వినియోగంపై అధికారులు దృష్టి సారించారు. దీంతో ప్రభుత్వ పథకాలను భువన్ మ్యాపులతో అనుసంధానించే ప్రక్రియ మొదలవుతోంది. రాష్ట్రంలో పేదల ఇళ్ల వివరాలను ఈ పోర్టల్ ఆధారంగా ‘జియో ట్యాగింగ్’ చేయబోతున్నా రు. ప్రతి ఇల్లు ఉన్న ప్రదేశాన్ని ఆక్షాంశరేఖాంశాల ఆధారంగా గుర్తించి ఈ ప్రక్రియను చేపడతారు. సర్వే నంబర్, లబ్ధిదారుడి ఫొటో, వ్యక్తిగత వివరాలన్నీ ఇందులో ఉంటాయి. దీంతో అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఒకసారి లబ్ధిపొందిన వ్యక్తి మరోసారి ఇంటి కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అవకతవకలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సీఐడీ విచారణ జరిపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ‘భువన్’ సాఫ్ట్వేర్ను ఉపయోగించాలని ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయించడంతో గూగుల్ సాఫ్ట్వేర్ను పక్కనబెట్టనున్నారు. ఒక్కో ఇంటి వివరాలను జియో ట్యాగింగ్లో నమోదు చేయడానికి రూ. 27 చొప్పున ప్రైవేట్ సంస్థకు చెల్లించాల్సి వస్తుండటంతో.. ఇకపై సొంతంగానే ఈ ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా గృహ నిర్మాణ శాఖ బాధ్యతలు చేపట్టిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి గురువారం సాయంత్రం అధికారులతో సమావేశమై దీనిపై చర్చించారు. జియో ట్యాగింగ్ చేసే ప్రతి ఇంటి వివరాలను ఆధార్ తోనూ అనుసంధానించాలని, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను పాత పథకం కిందనే పూర్తి చేయాలని, రెండు పడకగదుల ఇళ్ల పథకాన్ని కొత్త దరఖాస్తులతో ప్రారంభించాలని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి సూచించారు. హైదరాబాద్లోని బండ్లగూడ, పోచారం ప్రాంతాల్లో నిర్మించిన స్వగృహ ఇళ్ల ధరలను తగ్గించాలన్నారు. జవహర్నగర్ ప్రాజెక్టులోని ఇళ్లను సీఆర్పీఎఫ్కు కేటాయించేందుకు చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. -
ఇళ్ల బిల్లులకు జియో‘బంధనం’
జియో ట్యాగింగ్.. ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలను గుర్తించేందుకు ఉపకరించే అధునాత న జీపీఎస్ సర్వే విధానమంటోంది ప్రభుత్వం. కానీ నిర్మించిన ఇళ్లకు బిల్లులు చెల్లించకుండా కావాలని చేస్తున్న జాప్యంగా దీన్ని లబ్ధిదారులు అభివర్ణిస్తున్నారు. గత పదేళ్లలో నిర్మించిన ఇళ్లన్నింటినీ సర్వే చేయాలని ఆదేశించడమే దీనికి నిదర్శనంగా చూపిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఇల్లూ మంజూరు కాలేదు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.14 కోట్ల బకాయిలు ఉన్నాయి. మరోవైపు మొక్కుబడిగా.. మందకొడిగా సర్వే జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో జియో ట్యాగింగ్ ఎప్పుడు పూర్తి అవుతుంది.. డబ్బులు ఎప్పుడు అందుతాయోనని పేద లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. క్షేత్రస్థాయిలో వివరాలు, ఆధారాలు లభించక సర్వే బృందాలు నానాపాట్లు పడుతున్నాయి. కొత్తవి లేవు.. పాత బకాయిలు రావు గత ఆర్థిక సంవత్సరంలో నిర్మించిన ఇళ్లకు రూ.14 కోట్ల మేరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. అలాగే ప్రస్తుత(2014-15) ఆర్థిక సంవత్సరానికి కొత్తగా ఇళ్లు మంజూరు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలైనా వీటి విషయం పట్టించుకోవడం లేదు. పైగా జియో ట్యాగింగ్ సర్వే బాధ్యత అప్పగించడంతో కార్యాలయాల్లో కూర్చొని బిల్లులు, లబ్ధిదారుల గుర్తింపు వంటి కార్యకలాపాలు నిర్వహించాల్సిన గృహనిర్మాణశాఖ సిబ్బంది లబ్ధిదారుల జాబితాలు పట్టుకొని గ్రామాల్లో తిరుగుతున్నారు. దీంతో కార్యాలయాల్లో పనులు స్తంభించాయి. పైగా గత పదేళ్లలో జరిగిన నిర్మాణాలను సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే జాబితాల్లో ఉన్న చిరునామాలు, ఆధారాలు క్షేత్రస్థాయిలో సరిపోలక సర్వే మందకొడిగా సాగుతోంది. ఇదంతా ఎప్పటికి పూర్తి అవుతుందో.. తమ బిల్లులు ఎప్పుడొస్తాయో తెలియక లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. కావాలనే ప్రభుత్వం కాలయాపన చేస్తోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి గానీ.. లబ్ధిదారులకు గానీ కలిగి ప్రయోజనం ఏమీ లేదని అధికారవర్గాలే చెబుతున్నాయి. లక్ష్యం కొండంత.. పదేళ్ల నిర్మాణాలను సర్వే చేయాలని ప్రభుత్వం కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. జిల్లాలో 2004 నుంచి నిర్మించిన ఇళ్లు 4 లక్షల వరకు ఉంటాయని అధికారులు అంచనా వేశారు. గత నెల రోజుల్లో 27వేల ఇళ్లకు మాత్రమే జియో ట్యాగింగ్ పూర్తి చేశారు. ఇంకా 3.70 లక్షల ఇళ్లున్నాయి. గడువు డిసెంబర్ నెలాఖరుతో ముగుస్తుంది. అప్పట్లోగా పూర్తి అయ్యే పరిస్థితి లేదు. క్షేత్రస్థాయిలో చాలా ఇళ్ల, లబ్ధిదారుల వివరాలు లభించడం లేదని సర్వే బృందాలు వాపోతున్నాయి. దీంతో సర్వే చాలా మందకొడిగా సాగుతోంది. ఉదాహరణకు వంగర మండలంలో 27 పంచాయతీలు ఉండగా.. ఇప్పటికి నీలయ్యవలస, బాగెంపేట పంచాయతీల్లోనే సర్వే పూర్తి చేశారు. ప్రయోజనాలు జియో ట్యాగింగ్ వల్ల గతంలో ఇళ్లు పొందినవారు భవిష్యత్తులో మళ్లీ పొందే అవకాశం ఉండదు, ఒకే ఇంటికి రెండు మూడుసార్లు బిల్లులు చేయడం వంటి అక్రమాలను అరికట్టవచ్చు. ఒకే రేషన్ కార్డుతో ఇద్దరు, ముగ్గురు ఇళ్లు పొందే అవకాశం కూడా ఉండదు. సర్వే కోసం వర్క్ ఇన్స్పెక్టర్లు, ఏఈలతో కూడిన 59 బృందాలను నియమించారు. ఆయా మండలాల్లో పనిచేస్తున్న వారే ఈ బృందాల్లో సభ్యులుగా ఉన్నారు. పతి మండలంలో రెండు బృందాలు సర్వే చేస్తున్నాయి. పతి బృందానికి మైక్రోమాక్స్ సెల్ఫోన్, ఎయిర్టెల్ సిమ్ కార్డు, ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్వేర్ అందజేశారు. లబ్ధిదారుల జాబితా ఆధారంగా ఇళ్లను గుర్తించి వాటికి సంబంధించి రెండుకు తగ్గకుండా ఫొటోలు తీసుకుంటారు. ఇంటి ఐడీ నెంబరు, గృహ యజమాని పేరు తీసుకుంటారు. ఫొటోలతోపాటు ఆ వివరాలను జియో ట్యాగింగ్ వెబ్సైట్లోకి అప్లోడ్ చేస్తారు. వివరాల సేకరణలో ఇందిరా ఆవాస్ యోజన, ఇందిరమ్మ, తర్వాత ఇతర గృహనిర్మాణ పథకాలను ప్రాధాన్యక్రమంగా అనుసరిస్తున్నారు. -
రాష్ట్రంలో 44 లక్షల ఇళ్ల జియోట్యాగింగ్
గొల్లప్రోలు : రాష్ట్రంలో 44 లక్షల ఇళ్లను జీపీఎస్ ద్వారా జియోట్యాగింగ్(హద్దులు గుర్తించి ఆన్లైన్ చేయడం) చేస్తామని రాష్ట్రగృహనిర్మాణశాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి.శ్రీరాములు చెప్పారు. గొల్లప్రోలులో జరుగుతున్న జియోట్యాగింగ్ విధానాన్ని పరిశీలించేందుకు ఆయన శనివారం వచ్చారు. హౌసింగ్శాఖ ద్వారా నిర్మించుకున్న ఇళ్లను పరిశీలించారు. జియోట్యాగింగ్ విధానం గురించి ఆయన సిబ్బందికి వివరించారు. ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా సక్రమంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. డిసెంబర్ నెలాఖరు నాటికి ప్రక్రియ పూర్తికావాలని చెప్పారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇప్పటికే ఆన్లైన్ చేసిన 36 లక్షల ఇళ్లతోపాటు, ఆఫ్లైన్లో ఉన్న 7 లక్షల పైబడి ఇళ్లను జియోట్యాగింగ్ చేస్తామన్నారు. జీపీఎస్తో అనుసంధానమైన ప్రత్యేక మొబైల్ కెమెరాలతో ఇళ్ల నాలుగు పక్కల హద్దులను ఫొటో తీసి ఆన్లైన్ చేస్తామన్నారు. దీనివల్ల గృహనిర్మాణశాఖ పథకాల్లో లబ్ధిదారుల ఎంపిక, అక్రమార్కులు గుర్తింపు సులువుగా జరుగుతుందని చెప్పారు. 1994 నుంచి 2014 వరకు నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించి జియోట్యాగ్ విధానం అమలుచేస్తామన్నారు. మొదటి విడతగా 2004 నుంచి నిర్మించుకున్న ఐఏఓ ఇళ్లను ఈ విధానం ద్వారా గుర్తిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 1 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభంకాగా, ఇప్పటి వరకు 22,200 ఇళ్లను జియోట్యాగింగ్ చేశామన్నారు. జిల్లాలోని 3.4 లక్షల ఇళ్లు ఉండగా, 2,600 ఇళ్లకు ప్రక్రియ పూర్తయిందన్నారు. దీనికోసం జిల్లాలో 94 బృందాలు పనిచేస్తున్నాయన్నారు. ఆయన వెంట పెద్దాపురం ఏఈ పట్నాయక్, డీఈ కెవివి సత్యనారాయణ, ఏఈ శ్రీనివాస్, వర్క్ ఇన్స్పెక్టర్ పోతురాజు తదితరులు ఉన్నారు.