Godown
-
మాదన్నపేటలో భారీ అగ్నిప్రమాదం
-
మేడ్చల్లో భారీ అగ్నిప్రమాదం.. మంటల ధాటికి కూలిపోయిన గోడౌన్
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పూడూరు గ్రామంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి నిల్వ చేసిన గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోడౌన్ పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున పొగలు కమ్ముకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలు అదుపుచేసే ప్రయ్నతం చేస్తున్నారు. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో గోడౌన్ కుప్పకూలింది. రూ.కోట్లలో నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా. మంటలు చెలరేగిన వెంటనే కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. -
బీబీనగర్లో భారీ అగ్ని ప్రమాదం.. నిప్పురవ్వలు ఎగిసి
సాక్షి, యాదాద్రి: బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హిందూస్థాన్ శానిటరీ గోడౌన్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. గోడౌన్ సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో రైతులు గడ్డి తగులబెట్టారు. ఈ క్రమంలో నిప్పు రవ్వలు ఎగిరి గోడౌన్లోని కాటన్ బాక్స్లపై పడ్డాయి. దీంతో మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. -
తమిళనాడులో పేలుడు.. ముగ్గురి మృతి
చెన్నై: తమిళనాడులో భారీ పేలుడు చోటుచేసుకుంది. మంగళవారం తిరువూరు జిల్లాలోని ఓ బాణాసంచా గోడౌన్లో భారీగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. Three people, including a nine-month-old baby, were killed in a country-made bomb explosion in #Tiruppur.Express photos | @meetsenbaga pic.twitter.com/5WL1nZGCWK— TNIE Tamil Nadu (@xpresstn) October 8, 2024క్రెడిట్స్: TNIE Tamil Naduమృతిచెందినవారిలో 9 నెలల పాప ఉన్నట్లు తెలుస్తోంది. మరో నలుగురికి తీవ్ర గాయలు అయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పేలుడు ధాటికి 10 ఇళ్లకుపైగా ధ్వంసం అయ్యాయి. పేలుడు శబ్దానికి భయంతో ప్రజలు పరుగులు తీశారు. సమాచారం అందుకొని ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలిస్తున్నారు. -
గోదాములోని సరుకుపై బ్యాంకు లోన్.. లబ్ధిదారులు ఎవరంటే..
ఉద్యోగులకు రుణాలు కావాలంటే నేరుగా పేస్లిప్లు తీసుకెళ్లి అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు బ్యాంకులో ఇచ్చేసి రుణాలు తీసుకుంటారు. అదే రైతులకు రుణాలు కావాలంటే భూమి పట్టా పుస్తకాలు బ్యాంకులో తనఖా పెట్టాల్సి ఉంటుంది. అయితే చాలామందికి వారు పండిస్తున్న పంటభూమికి పట్టాలుండవు. కవులు రైతులు రుణాలు తీసుకోవాలంటే చాలాకష్టంతో కూడుకున్న వ్యవహారం. పంట మార్కెట్కు తరలించి వచ్చినకాడికి తెగనమ్ముకుని ఆ డబ్బును తదుపరి పంట కోసం పెట్టుబడికి ఉపయోగిస్తుండడం ఆనవాయితీగా వస్తుంది. భవిష్యత్తులో సరుకు మంచిధర పలుకుతుందని తెలిసినా అవసరాల కోసం అమ్ముకోక తప్పదు. అలాంటి వారికోసం ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించింది. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఉన్న గోదాముల్లో రైతులు తమ పంటలను స్టోర్ చేసుకుంటే, వీటిపై లోన్లు పొందేందుకు కేంద్రం వీలు కలిపిస్తోంది. ఇందుకు సంబంధించి ఫుడ్ అండ్ కన్జూమర్ అఫైర్స్ మినిస్టర్ పియూష్ గోయల్ సోమవారం ‘ఈ–కిసాన్ ఉపజ్ నిధి’ డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. ఈ విధానం అమల్లోకి వస్తే రైతుల ఆదాయాలు పెరుగుతాయని మంత్రి అన్నారు. వేర్ హౌస్ ఓనర్లు చెల్లించే సెక్యూరిటీ డిపాజిట్లను ఒక శాతానికి తగ్గిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది 3 శాతంగా ఉంది. ఇదీ చదవండి: రిస్క్ అని తెలిసినా అవే అప్పులు చేస్తున్నారు..! ఆందోళనలో ఆర్బీఐ వంట నూనెల దిగుమతులు తగ్గించేలా.. వంట నూనెల దిగుమతులను తగ్గించి, నూనె గింజల ఉత్పత్తిని పెంచేందుకు ఓ మిషన్ లాంచ్ చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అర్జున్ ముండా సోమవారం పేర్కొన్నారు. ఇందుకోసం రూ.11 వేల కోట్లు ఖర్చు చేయనున్నామన్నారు. దీంతో పాటు అస్సాంలో ఏర్పాటు చేసిన ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఏఆర్ఏ)ను ఆయన ప్రారంభించారు. -
Bengaluru: పర్ఫ్యూమ్ ఫ్యాక్టరీ గోదాంలో అగ్నిప్రమాదం
బెంగళూరు: కర్ణాటక రాజధాని నగరం బెంగళూరు శివార్లలోని ఓ పర్ఫ్యూమ్ ఫ్యాక్టరీ గోదాంలో ఆదివారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఐదుగురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. #Karnataka: Three people killed and six others injured in a fire accident that broke out at an illegal perfume factory in Ramasandra in Kumbalgodu police limits on Sunday evening. pic.twitter.com/Htshft0BOu — South First (@TheSouthfirst) February 19, 2024 గాయపడ్డ వారిలో 10 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న బాలురు కూడా ఉండటంతో గోదాంలో చిన్న పిల్లలు కూడా పనిచేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగళూరు శివార్లలోని మైసూర్ రోడ్డు సమీపంలో నివాసాల మధ్య ఏర్పాటు చేసిన ఈ గోదాంనకు లైసెన్స్ ఉందా లేదా అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గడువు దాటిపోయిన పర్ఫ్యూమ్ బాటిళ్లను డీల్ చేసేందుకు ఈ గోదాంను రెండు వారాలే క్రితమే ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి.. బైక్పై వెళుతున్న యువకునికి గుండెపోటు -
15 గంటలుగా మండుతూనే...
ఒంగోలు సబర్బన్: ప్రకాశం జిల్లా ఒంగోలులోని గాంధీ రోడ్డు సమీపంలోని పప్పు బజార్లో ఉన్న కాయర్ రోప్ మర్చంట్స్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున సునీల్ కాయర్ రోప్ మర్చంట్స్ గోడౌన్లో మంటలు వ్యాపించాయి. ఒంగోలు ఫైర్ ఇంజన్లతో పాటు టంగుటూరు, కొండపి, బాపట్ల జిల్లా అద్దంకి నుంచి 8 ఫైర్ ఇంజన్లు తీసుకువచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. 15 గంటలకు పైగా మంటలు దట్టంగా వ్యాపిస్తూనే ఉన్నాయి. భారీగా స్టాక్ ఉండటంతో మంటలు అదుపులోకి రావడం లేదు. ఈ ప్రమాదంలో రూ.2 కోట్లకు పైగా నష్టం వాటిలినట్లు సమాచారం. -
హైదరాబాద్: బోలక్పూర్లో పేలుడు..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ముషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధి బోలక్పూర్లో స్క్రాప్ గోడౌన్లో పేలుడు సంభవించింది. నార్త్ ఇండియాకు చెందిన కార్మికుడికి తీవ్ర గాయాలు కాగా, గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో పెద్ద శబ్దం వినిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. కెమికల్ బాక్స్లను కట్ చేస్తుండగా పేలుడు జరిగింది. హైదరాబాద్: ట్రాన్స్జెండర్ల వేషం వేసుకుని బెగ్గింగ్.. -
TN: కృష్ణగిరి పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి
చెన్నై: తమిళనాడులోని కృష్ణగిరి పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం పాతపేటలోని ఓ బాణాసంచా గోడౌన్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. బాణాసంచా గోడౌన్ కావడంతో క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించి భారీగా పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల అదుపులోకి తెచ్చుందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి ఇదేందిది.. కారు కాని కారు.. బానే పోతోందే..! -
భారీ అగ్ని ప్రమాదం.. స్తంభించిన ట్రాఫిక్
హైదరాబాద్లోని వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గోదాంలో మంటలు చెలరేగాయి. ఫర్నీచర్ గోదాంతో పాటు పక్కనే ఉన్న బట్టల దుకాణంలో మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో ఎల్బీనగర్ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థిలికి చేరుకుని నాలుగు ఫైరింజన్లతో మంటలార్పేందుకు యత్నిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు. -
హైదరాబాద్: కోఠిలో అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కోఠి లోని ట్రూప్ బజార్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ట్రూప్ బజార్ లోని ఎల్.ఈ.డి లైట్స్ గోదాంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హాటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో 4 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి. ప్రమాద సమయానికి గోదాంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మూడు అంతస్తుల ఈ భవనంలో రెండు అంతస్తులలో మాటలు వ్యాపించాయి.. దీంతో స్థానికులు.. వ్యాపారులు భయాందోళకు గురయ్యారు. ఈ అగ్నిప్రమాదం ఎలక్ట్రిక్ షాట్ సర్క్యూట్ వల్లనే జరిగిందని.. ప్రాధమికంగా నిర్దారించారు. చదవండి: HYD: తనను పెళ్లి చేసుకోవాలని నా భర్తను వేధించింది.. మమత కీలక వ్యాఖ్యలు -
మామిడికుదురు మండలం పాశర్లపూడిలో భారీ అగ్ని ప్రమాదం
-
అనుమతులు లేకుండా ఐస్క్రీములు తయారుచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్
-
Hyderabad: పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్: పాతబస్తీలోఆదివారం సాయంత్రం వేళ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గోడౌన్లో అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికంగా అలజడి రేకెత్తించింది. డబీర్పూరా పీఎస్ పరిధిలోని ఓ గోడౌన్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీనా అక్కడ చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేసే యత్నం చేస్తున్నారు అగ్ని మాపక సిబ్బంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా.. లేక వేరే కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే విషయం తేలాల్సి ఉంది. జనావాసాల మధ్యే ఈ గోడౌన్ ఉండటంతో స్థానికంగా ఉన్నవారిని ఖాళీ చేయించే యత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదం సమాచారంతో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. -
బాణసంచా గోదాంలో భారీ పేలుడు.. నలుగురు మృతి
భోపాల్: బాణసంచా నిలువ చేసిన గోదాంలో భారీ పేలుడు సంభవించి నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు సైతం ఉన్నారు. ఈ విషాద సంఘటన మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లా బన్మోర్ నగర్లో గురువారం జరిగింది. భారీ పేలుడుతో ఫైర్క్రాకర్స్ నిలువ చేసిన గోదాం తునాతునకలైంది. శిథిలాల కింద మరింత మంది చిక్కుకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ పేలుడులో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడగా వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ‘గోదాంలోని గన్పౌడర్ వల్ల పేలుడు జరిగిందా లేదా గ్యాస్ సిలిండర్ పేలటం వల్లనా అనే అంశంపై దర్యాప్తు చేపట్టాం. ఈ పేలుడులో గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. వారికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి.’ అని మొరేనా కలెక్టర్ బక్కి కార్తికేయన్ తెలిపారు. గోదాం శిథిలాలను తొలగించేందుకు సహాయక బృందాలను మోహరించామని, పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు ఐజీ రాజేశ్ చావ్లా తెలిపారు. మూడేళ్ల క్రితం పంజాబ్లో ఇలాంటి సంఘటనే జరిగి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: దీపావళి సెలవుపై ప్రభుత్వం కీలక ప్రకటన.. పబ్లిక్ హాలీడే ఎప్పుడంటే.. -
గోదాముల లీజు విస్తీర్ణంలో 62 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశంలోని ప్రధాన పట్టణాల్లో గోదాములకు డిమాండ్ ఏర్పడింది. లీజు విస్తీర్ణం గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 62 శాతం వృద్ధితో 51.3 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్, ఈ కామర్స్ సంస్థల నుంచి డిమాండ్ పెరిగినట్టు తెలిపింది. నూతన లాజిస్టిక్స్ పాలసీ ఈ రంగానికి సాయంగా నిలుస్తుందని పేర్కొంది. ఈ మేరకు భారత్ వేర్హౌసింగ్ మార్కెట్పై నైట్ ఫ్రాంక్ ఓ నివేదికను విడుదల చేసింది. లీజు విస్తీర్ణం వృద్ధి పరంగా పుణె, హైదరాబాద్ టాప్–2 మార్కెట్లుగా ఉన్నాయి. పుణెలో 166 శాతం, హైదరాబాద్ మార్కెట్లో 128 శాతం చొప్పున గోదాముల లీజు గత ఆర్థిక సంవత్సరంలో పెరిగింది. భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి, వినియోగం పెరగడం సంఘటిత రంగంలో గోదాముల లీజు అధిక వృద్ధికి దోహదం చేస్తున్నట్టు తెలిపింది. కరోనా ముందు నాటి పరిమాణాన్ని గోదాముల లీజు అధిగమించినట్టు పేర్కొంది. ఇనిస్టిట్యూషన్స్ సైతం గోదాముల నిర్వహణ, అభివృద్ధి పట్ల ఆసక్తి చూపిస్తుండడం వల్ల.. నిపుణుల అనుభవం వృద్ధి చెందుతున్న ఈ మార్కెట్ను నడిపిస్తుందని నైట్ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. వేర్హౌసింగ్ వృద్ధి టాప్–8 పట్టణాలకు వెలుపల కూడా జోరందుకుంటోందని.. మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్క్ల ఏర్పాటు, మరిన్ని వేర్ హౌస్ జోన్ల ఏర్పాటుకు వీలు కల్పిస్తుందని పేర్కొంది. పట్టణాల వారీగా.. ► ఢిల్లీ ఎన్సీఆర్లో వేర్హౌస్ లీజు విస్తీర్ణం 2021–22లో 32 శాతం పెరిగి 9.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ► ముంబైలో 48 శాతం పెరిగి 8.6 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. ► బెంగళూరులో 38 శాతం వృద్ధితో 5.9 మిలియన్ చదరపు అడుగుల పరిమాణంలో గోదాములు లీజు నమోదైంది. ► పుణెలో 166 శాతం పెరిగి 7.5 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. హైదరాబాద్లో 128 శాతం పెరిగి 5.4 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. ► అహ్మదాబాద్లో 81 శాతం వృద్ధితో 5.3 మిలియన్ చదరపు అడుగులు, చెన్నైలో 44 శాతం పెరిగి 5.1 మిలియన్ చదరపు అడుగులు, కోల్కతాలో 41 శాతం పెరిగి 4.3 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. -
విచారణ విధులకు డుమ్మా.. ఎందుకు చెప్మా?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కొత్తూరు పౌర సరఫరాల గోదాంలో జరిగిన అక్రమాలను ఆ శాఖ సీరియస్గా తీసుకుంది. రూ.కోటికిపైగా సరుకులు పక్కదారి పట్టిన వైనంపై ఉన్నత స్థాయి విచారణకు రంగం సిద్ధం చేసింది. ఇక్కడ మూడు నెలలుగా పర్యవేక్షణ లేదు. ఎవరూ భౌతిక తనిఖీలు చేపట్టిన దాఖలా కనిపించలేదు. దీంతో సరుకులు పక్కదారి పట్టాయి. ఈ మొత్తం వ్యవహారం అనుమానాస్పదంగా ఉండటంతో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ రంగంలోకి దిగింది. ఈ గుట్టు రట్టు చేసేందుకు నెల్లూరులో పనిచేస్తున్న విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ సుధాకర్ను విచారణాధికారిగా నియమించింది. ఆయన ఈ నెల 20న జిల్లాకు రానున్నారు. సంబంధిత ఎంఎల్ఎస్ పాయింట్ రికార్డులన్నీ సిద్ధం చేసి ఉంచాలని ఇప్పటికే ఆదేశించారు. చదవండి: కన్సల్టెన్సీ.. కంత్రీ.. జాబులు పేరుతో ‘టీడీపీ’ నేత దగా నిబంధనలు ఇవీ.. ♦రేషన్ షాపులు, అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు, వసతి గృహాల కోసం పౌరసరఫరాల సంస్థకు చెందిన ప్రైవేటు గోడౌన్లో సరుకులు ఉంచుతారు. ♦ప్రతి నెలా మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. వచ్చిన నిల్వలు, సంబంధిత సరఫరా ఏజెన్సీలకు వెళ్లిన సరుకులు, ఇంకా మిగిలి ఉన్న నిల్వలపై ప్రతి నెలా చివర భౌతిక తనిఖీలు చేయాల్సి ఉంటుంది. ♦తనిఖీలో గుర్తించిన విషయాలపై సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డిస్ట్రిక్ట్ మేనేజర్కు నివేదిక అందించాలి. ♦ఆ నివేదిక సవ్యంగా ఉంటే ఫర్వాలేదు. లేకపోతే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. వెలుగులోకి ఆసక్తికర విషయాలు.. కొత్తూరు ఎంఎల్ఎస్ పాయింట్ను ఏప్రిల్ నెలలో తనిఖీ చేసేందుకు ఏఎస్ఓ వంశీని నియమించారు. అయితే ఆయనకు ట్రాన్స్ఫర్ కావడంతో తనిఖీలు చేయలేదు. మే నెలలో తనిఖీ చేసేందుకు ఏఎం అకౌంట్స్ జ్యోతిని నియమించారు. ఆమె కూడా అనారోగ్యం కారణం చూపి తనిఖీలకు వెళ్లలేదు. జూన్లో తనిఖీ చేసేందుకు ఏప్రిల్లో నియమించిన ఏఎస్ఓ వంశీనే మళ్లీ నియమించారు. బదిలీ కారణంతో ఆ నెలలో కూడా తనిఖీలకు వెళ్లలేదు. ఈయన మొదటిసారి తనిఖీ చేయకపోయినా రెండోసారి మళ్లీ ఆయననే తనిఖీ చేయాలని ఆదేశించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు తనిఖీ చేయకుండా సాకులు చెప్పడం వెనుక కారణాలేంటి..? అన్న అనుమానాలూ బలపడుతున్నాయి. సాధారణంగా ప్రతి నెలా చేసిన తనిఖీలకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నివేదిక వచ్చిందా? లేదా? అన్నది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డీఎం కార్యాలయం చూసుకోవాలి. దీన్ని బట్టి ఏ నెల ఏం జరిగిందో ఒక అవగాహనకు వస్తారు. కానీ, ఇక్కడ ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తనిఖీలు జరిగాయో లేదో, ఫిజికల్ విజిట్ నివేదికలొచ్చాయో లేదా అన్నది ఏ ఒక్కరూ గుర్తించలేదు. జూలై నెల వస్తే గానీ ఈ విషయం బయటపడలేదు. ఈలోపే అక్రమాలు జరిగిపోయాయి. అయితే ఇదంతా పథకం ప్రకారం జరిగిందా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. రామ్మోహన్పై చర్యలు.. భారీగా సరుకులు మాయమైన ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి, గ్రేడ్ 3 టెక్నికల్ అసిస్టెంట్ ఈ.రామ్మోహనరావును ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఆయనతో పాటు అక్కడ పనిచేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డును కూడా విధుల నుంచి తొలగించారు. సరుకుల మాయంపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదైంది. దానితో పాటు సస్పెండైన రామ్మోహన్రావుపై చార్జెస్ ఫ్రేమ్ చేశారు. ఏడు రోజుల సమయం ఇచ్చారు. ఇంకా సమాధానం ఇవ్వలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దీంతో తదుపరి ఏం చేయాలన్నదానిపై సివిల్ సప్లై అధికారులు ఆలోచిస్తున్నారు. కుమ్మక్కయిందెవరు.. సరుకులు మాయమైన తర్వాత విచారణ చేస్తున్న కొద్దీ చాలా విషయాలు బయటపడుతున్నాయి. ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జిగా ఉన్న రామ్మోహన్ ఆ గోడౌన్ తాళం వాచ్మెన్కు ఇచ్చేసి రెగ్యులర్గా విధులకు హాజరు కాలేదని తెలిసింది. వాచ్మెన్పైనే ఆ పాయింట్ ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో 198.706 మెట్రిక్ టన్నుల బరువైన 3,982 బస్తాలు(50 కిలోలవి) బియ్యం, 176 బస్తాలు (50 కిలోలు) పంచదార, 148 పామాయిల్ ప్యాకెట్లు, 420బస్తాల(50కిలోలవి) కందిపప్పు మాయమయ్యాయి. దీంతో ఎవరెవరు కుమ్మక్కయ్యారు? దీంట్లో ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి, వాచ్మెన్తో పాటు ఇంకెవరు ఉన్నారనే దానిపై ఆరా తీయాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది. ఇంత పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందంటే ఈ ఇద్దరే కాదు మరికొంతమంది ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 20న జిల్లాకు ప్రత్యేక అధికారి.. కొత్తూరు ఎంఎల్ఎస్ పాయింట్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రత్యేక అధికారిని ఉన్నతాధికారులు నియమించారు. ఈ నెల 20న జిల్లాకు వస్తున్నారు. రికార్డులన్నీ సిద్ధం చేసి ఉంచాలని సమాచారం ఇచ్చారు. కొత్తూరు ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జీగా పనిచేసిన రామ్మోహన్రావును సస్పెండ్ చేయడమే కాకుండా చార్జెస్ కూడా ఫ్రేమ్ చేశాం. దానిపై వివరణ వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటాం. – బి.జయంతి, డిస్ట్రిక్ట్ మేనేజర్, జిల్లా పౌరసరఫరా సంస్థ -
హైదరాబాద్: వనస్థలిపురంలో భారీ అగ్నిప్రమాదం
-
Hyderabad: భోలక్పూర్లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: భోలక్పూర్ భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్క్రాప్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. రోడ్డు ఇరుకుగా ఉండటంతో ఫైరింజన్లు వెళ్లడానికి ఇబ్బందికరంగా మారింది. చుట్టు పక్కల వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మూడు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. గోదాంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. -
వరంగల్: గోదాంలో అగ్నిప్రమాదం
సాక్షి,వరంగల్: గీసుకొండ మండలం ధర్మారం బాలవిరం టెస్కో గోదాంలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాగా టెస్కోకు సంబంధించిన బట్టలు ఈ గోదాంలో నిల్వ ఉంచుతారు. దాదాపు 30 నుంచి 40 కోట్ల రూపాయల విలువ చేసే బట్టలు ఉన్నట్లు టేస్కో అధికారులు వెల్లడించారు. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడడంతో గోదాము గోడలు కూలాయి. ఈ ప్రమాదం కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి స్పష్టమైన కారణాలు తెలయాల్సి ఉంది. ఎవరైనా నిప్పు వేశారా.. లేక కరెంటు షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. -
సీసీ కెమెరాలో రికార్డ్ అయిన టింబర్డిపోలో బ్లాస్ట్ దృశ్యాలు
-
బోయిగూడ అగ్ని ప్రమాదం: గోదాంలో ఉండేది 8 మందే.. ఆ నలుగురు ఎవరంటే!
సాక్షి, బన్సీలాల్పేట్: విధి ఒక విష వలయం. విషాద గాథలకు అది నిలయం. ఆ నలుగురు అమాయకులు బలి కావడం కాల వైచిత్రి. తామొకటి తలిస్తే దైవమొకటి తలిచిందన్నట్లు మృత్యువాత పడ్డారు. బుధవారం తెల్లవారుజామున న్యూ బోయగూడలోని స్క్రాబ్ గోదాంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో పదకొండు మంది బిహార్ వలస కార్మికులు సజీవ దహనమైన విషయం విదితమే. వీరిలో నలుగురు అనుకోని పరిస్థితుల్లో ప్రాణాలు వదల డంతో కుటుంబీకులను తీవ్ర విషాదానికి గురి చేసింది. మృతుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. స్నేహితులను కలిసేందుకు వచ్చి.. స్క్రాబ్ గోదాంలో అనేక మంది పని చేస్తున్నా.. 8 మంది మాత్రమే గోదాం పైఅంతస్తులో రాత్రిపూట నిద్రిస్తుంటారు. ఈ క్రమంలో నగరంలోని అంబర్పేటలో పని చేస్తూ అక్కడే నివాసం ఉండే గొల్లుతో పాటు మరో ముగ్గురు తమ మిత్రులను కలిసేందుకు మంగళవారం రాత్రి న్యూ బోయగూడలోని శ్రావణ్ ట్రేడర్స్ స్క్రాబ్ గోదాంనకు వచ్చారు. అందరూ కలిసి భోజనం చేశారు. రాత్రి పొద్దుపోవడంతో వారితో పాటు ఈ నలుగురూ అక్కడే నిద్రించారు. ఆ నిద్రే వారి పాలిట శాపంగా మారింది. శాశ్వత నిద్రకు చేరువచేసింది. ప్రేమ్ మాత్రం.. ప్రమాద సమయంలో కిటికీలోంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం ప్రభావంతో 3.50 గంటలకు సిలిండర్ పేలగా.. దాదాపు ఆరున్నర నిమిషాల తర్వాత అతడు భవనం సన్సైడ్ మీదికి దూకాడు. సిలిండర్ పేలుడు ధాటికి భవనం సమీపంలో ఉన్న ఓ శునకం గాయపడినట్లు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. వైద్యుల పర్యవేక్షణలో ప్రేమ్.. అగ్ని ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ప్రేమ్కు గాంధీ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. అతని శరీరంపై అయిన పది శాతం కాలిన గాయాల వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. బుధవారం రాత్రి నుంచే అతను సాధారణ పరిస్థితుల్లోనే ఉన్నాడని చెబుతున్నారు. వేడి పొగ పీల్చి ఉండటంతో దాని ప్రభావం అతని ఊపిరితిత్తుల లోపలి భాగంలో ఇన్ఫెక్షన్ రూపంలో ఉండొచ్చని వైద్యులు పేర్కొన్నారు. ఇది తెలియాలంటే కనీసం మరో మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఆపై పరీక్షలు చేయాలని వివరించారు. ఆప్యాయంగా.. ప్రేమగా.. వేర్వేరు చోట పని చేస్తున్నా వీరంతా ఆప్యాయంగా, ప్రేమగా మెలిగే వారు. సెలవులు, పండగలతో పాటు వీలున్నప్పుడల్లా కలుసుకునేవారు. మృత్యువు వీరి బంధాన్ని విడదీసింది. మిత్రులందరిని ఒకేసారి తీసుకెళ్లింది. ఈ దుర్ఘటన కార్మికులకు తీరని వేదనను మిగిల్చింది. ఏప్రిల్లో వివాహం.. అంతలోనే విషాదం.. వచ్చే నెల ఏప్రిల్లో గొల్లు విహహం జరగాల్సి ఉంది. దీంతో అతను సొంతూరు వెళ్లేందుకు రైల్వే టికెట్ కూడా బుక్ చేసుకున్నాడని, ఇంతలోనే మృత్యువు కబళించిందని స్నేహితులు విలపిస్తున్నారు. మంగళవారం రాత్రి ఆలస్యం కావడంతో అక్కడే ఉండి ఉదయం రావాలని మృతుని బంధువు చెప్పడంతో నిద్రించి ప్రాణాలమీదికి తెచ్చుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. కన్నీటి సుడుల మధ్య.. గాంధీ ఆస్పత్రి: న్యూ బోయగూడలో స్క్రాప్ దుకాణంలో బుధవారం సంభవించిన అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన 11 మంది బిహార్ వలస కార్మికుల మృతదేహాలను బంధువుల కన్నీటి సుడుల మధ్య గురువారం పాట్నాకు తరలించారు. అక్కడ నుంచి ప్రత్యేక వాహనాల్లో స్వస్థలాలకు పంపించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ దగ్గరుండి పర్యవేక్షించారు. మృతదేహాలకు గాంధీ ఆస్పత్రి మార్చురీలో బుధవారమే పోస్టుమార్టం పరీక్షలు పూర్తి చేశారు. ఎంబామింగ్ చేసి ఫ్రీజర్లో భద్రపరిచారు. వీటిని రెండు విడతలుగా అంబులెన్స్లో శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకువెళ్లారు. కార్గో విమానాల్లో పాట్నాకు తరలించారు. ఉదయం 8 గంటలకు మొదటి విమానంలో ఆరు, మధ్యాహ్నం 2 గంటలకు రెండో విమానంలో అయిదు మృతదేహాలను తరలించారు. మృతుల బంధువులు కొందరు వీటితో వెళ్లారు. పాట్నా విమానాశ్రయం నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో మృతదేహాలకు స్వస్థలాలకు పంపారు. ప్రమాదానికి కారణాలు కనిపెట్టడంతో పాటు ఇతర ఆధారాల సేకరణ కోసం గురువారం ఘటనాస్థలిలో పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు చేపట్టారు. కొన్ని నమూనాలు సేకరించామని వాటి విశ్లేషణ తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని ఓ అధికారి పేర్కొన్నారు. -
బోయిగూడ అగ్ని ప్రమాదం: గురువారం ఉదయం మృతదేహాల తరలింపు
Latest Updates ► బోయిగూడ అగ్ని ప్రమాదంలో మరణించిన మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తైంది. ► బోయిగూడ అగ్ని ప్రమాదంలో మరణించిన మృతదేహాలను గురువారం స్వస్థలాలకు తరలించనున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి కావడానికి ఈ రోజు సాయంత్రం అవుతుందని పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయం గుండా 3 పాట్నాకు చెందిన విమానాలలో మృతదేహాలను తరలించనున్నట్లు వెల్లడించారు. ►బోయిగూడ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాల గుర్తింపు జరుగుతోందని హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ తెలిపారు. గాంధీ మార్చురీలో ఇప్పటికే ఆరుగురి మృతదేహాలను గుర్తించినట్లు, మరో అయిదుగురి మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు. పోస్టుమార్టం ప్రక్రియలో మొత్తం నాలుగుటీమ్లు పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారాన్ని హైదరాబాద్ కలెక్టర్, సీపీ సీవీ ఆనంద్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎయిర్ అంబులెన్స్ ద్వారా మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించనున్నట్లు తెలిపారు. అగ్ని ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని, అనధికరికంగా నిర్వహిస్తున్న స్క్రాప్ గోడౌన్లపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ►బోయిగూడ అగ్ని ప్రమాద స్థలానికి హోంమంత్రి మహమూద్ అలీ చేరుకున్నారు. బోయిగూడ ఘటనపై అధికారులతో విశ్లేషిస్తామని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు జీహెచ్ఎంసీ, పోలీస్, అగ్నిమాపకశాఖ విజిలెన్స్ అధికారులతో సమావేశం కానున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో స్క్రాప్ గోడౌన్లు ఎన్ని ఉన్నాయో.. ఎలాంటి చర్యలు చేపట్టాలో చర్చిస్తామని పేర్కొన్నారు. జనావాసాల మధ్య గోడౌన్లు చాలా ఉన్నాయని, ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: బోయిగూడ అగ్ని ప్రమాదం.. సీఎం దిగ్భ్రాంతి.. రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా బోయిగూడలో 20కి పైగా స్క్రాప్ గోడౌన్లు కాగా బోయిగూడ ఘటనతో అధికారులు అలెర్ట్ అయ్యారు. అనుమతులు లేని టింబర్లపై అధికారులు దాడులు చేస్తున్నారు. కార్మికుల రక్షణ, సౌకర్యాలపై ఆరా తీస్తున్నారు. ఇక బోయిగూడలో 20కి పైగా స్క్రాప్ గోడౌన్లు ఉన్నట్లు అధికారుల గుర్తించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సమగ్ర విచారణ జరపాలి: రేవంత్ రెడ్డి సికింద్రాబాద్లోని బోయిగూడ అగ్ని ప్రమాదంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 11 మంది కార్మికులు మృతిచెందడం అత్యంత బాధాకరమని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చదవండి: Hyderabad: భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం ఎలాంటి సేఫ్టీ పరికరాలు లేవు: సీవీ ఆనంద్ సికింద్రాబాద్ బోయిగూడలోని టింబర్, స్క్రాప్ గోడౌన్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. స్క్రాప్ గోడౌన్లో షార్ట్ సర్క్యూట్లో మంటలు వ్యాపించాయని. ఆ తర్వాత సిలిండర్ పేలుడు జరగడంతో దట్టమైన పొగ కమ్ముకుందని సీపీ ఆనంద్ తెలిపారు. ప్రమాద సమయంలో కార్మికులంతా నిద్రలో ఉన్నందున ప్రమాద తీవ్రత భారీగా పెరిగిందని పేర్కొన్నారు. గోడౌన్ విషయంలో నిబంధనలు పాటించలేదని, అందులో ప్రమాద నివారణ చర్యలు ఏమీలేవని చెప్పారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్ పేలినట్లు 100కు ఫోన్కాల్ వచ్చిందని చెప్పారు. సిలిండర్ పేలడంతోనే మంటలు ఎక్కువగా వ్యాపించాయన్నారు. ఇద్దరు యువకులు పైనుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారని చెప్పారు. గాయాలైన వ్యక్తితో మాట్లాడితే పూర్తి సమాచారం వస్తుందని తెలిపారు. మృతులు బీహార్లోని చప్రా జిల్లాకు చెందినవారని వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. గోదాం యజమానికి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ప్రమాదం జరిగిన గోడౌన్కు ఎంట్రీ, ఎగ్జిట్ ఒక్కటే ఉందన్నారు. అలాగే గోడౌన్లో ఎలాంటి సేఫ్టీ పరికరాలు కూడా లేవని సీవీ ఆనంద్ వివరించారు. మృతులంతా బిహార్లోని చప్రా జిల్లాకు చెందినవారని, ఇక్కడ పనిచేసే కార్మికులకు నెలకు రూ. 12 వేలను జీతంగా ఇస్తారని తెలిపారు. పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాం: మంత్రి తలసాని బోయిగూడలో అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని మంత్రి శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటన బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించామని తెలిపారు. పూర్తి వివరాలు తెలుస్తాయని అన్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా అదుకుంటామన్నారు. సాక్షి, హైదరాబాద్: బుధవారం తెల్లవారుజామన సికింద్రాబాద్ బోయిగూడలోని స్క్రాప్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది సజీవ దహనమయ్యారు. మరొకరు ప్రాణాలతో బయట పడ్డారు. సుమారు మూడు గంటలకు పైగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది 8 ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశాయి. ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ సంతాపం తెలిపారు. మృతుల కుంటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా, ప్రధాని నరేంద్రమోదీ రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీశారు. మృతులంతా బీహార్కు చెందిన కూలీలుగా గుర్తించారు. మృతులను సికిందర్(40), బిట్టు(23), సత్యేందర్(35), గోలు(28), దామోదర్(27), రాజేశ్(25), దినేశ్(35), రాజు(25), చింటు(27), దీపక్(26), పంకజ్(26)గా గుర్తించారు. -
స్క్రాప్ వల్ల భారీగా మంటలు ఎగిసిపడ్డాయి: రిజినల్ ఫైర్ అధికారి
-
ఇది చాలా విషాదకరమైన సంఘటన: సీవీ ఆనంద్
-
హైదరాబాద్: స్క్రాప్ గోడౌన్లో అగ్ని ప్రమాదం.. ఫైర్ అధికారులేమన్నారంటే
సాక్షి, సికింద్రాబాద్: బోయిగూడలోని తుక్కు (స్క్రాప్) గోడౌన్లో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. మంటల దాటికి గోడౌన్ పైకప్పు కూలింది. ఘటనలో 11 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. మూడు గంటలు శ్రమించి పూర్తి స్థాయిలో మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులంతా బిహార్కు చెందినవారుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. సర్కిల్లో గోడౌన్ యజమాని సంపత్ కాగా శ్రవణ్ ట్రేడర్స్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు రిజినల్ ఫైర్ అధికారి పాపయ్య తెలిపారు. మొదట గోడౌన్ గ్రౌండ్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం మొదలైందని తెలిపారు. ఉదయం 3.10 నిమిషాలకు ప్రమాదం జరిగిందన్నారు. స్క్రాప్ వల్ల భారీగా మంటలు ఎగిసిపడ్డాయని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా లోపల ఉన్న సిలిండర్ బ్లాస్ట్ అవ్వడంతో ప్రమాద తీవ్రత పెరిగిందన్నారు. ఇప్పటి వరకుపదకొండు మృతదేహాలను వెలికి తీసినట్లు పేర్కొన్నారు. మంటల్లో చిక్కుకుని బయటకు రాలేకపోయారని, పొగ మంట వల్ల పదకొండు మంది చనిపోయారని అన్నారు. సంబంధిత వార్త: Hyderabad: భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం అయితే మృతదేహాల వెలికితీత సమయంలో చాలా బాధకరమైన సన్నివేశం కనిపించిందన్నారు. ఒకరి మీద ఒకరు పడిపోయి, పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయన్నారు. అలాగే 11 మంది మృతదేహాల్లో వాచ్మెన్ ఉన్నాడా లేదా అనే విషయాన్ని తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ఓ వ్యక్తి మంటలను గుర్తించి కిటీకి నుంచి బయటకు దూకడంతో ప్రాణాలు రక్షించుకోగలిగాడని తెలిపారు. గోడౌన్పైన నివాసం కోసం రెండు గదులు ఉన్నాయని అందులోనే కార్మికులు వంట చేసుకోవడం, పడుకోవడం చేస్తారని తెలిపారు. పైకి వెళ్లడానికి గోడౌన్నుంచే మెట్ల మార్గం ఉందని తెలిపారు. అందుకే తప్పించుకోలేకపోయారని వెల్లడించారు. గోడౌన్ అగ్ని ప్రమాద ఘటనలో చనిపోయిన వారంతా బీహార్ ఛప్రా జిల్లా వాసులు. కుటుంబాలు అన్ని బిహార్లో ఉండగా.. ఇక్కడ బ్యాచిలర్గా జీవిస్తుంటారు. గోడౌన్లో మొత్తం 16 మంది కార్మికులు ఉండగా.. షిఫ్టుల వారీగా 8 మంది కార్మికులు ఉంటారు. అయితే మంగళవారం రాత్రి ముగ్గురు బంధువులు వచ్చారు. ఇక గోడౌన్ యజమాని సంపత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే గోడౌన్కు అనుమతులు ఉన్నాయా లేవా అన్నా అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. -
‘ఫర్నిచర్ స్టోరేజ్’కు కలిసొచ్చిన కరోనా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శ్రీనివాస్ ఐటీ ఉద్యోగి. హైదరాబాద్లో ఫ్యామిలీతో కలిసి అద్దెకుంటున్నాడు. గతేడాది కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో కంపెనీ వర్క్ ఫ్రం హోమ్ ఆఫర్ ఇచ్చింది. పరిస్థితులు మాములుగా మారితే మళ్లీ రావొచ్చులే అనుకొని సొంతూరుకు వెళ్లిపోయాడు. ఏడాదిన్నర దాటినా సేమ్ సీన్. నగరంలో అద్దె భారం భరించలేక.. ఇంట్లోని ఫర్నిచర్ను తక్కువ అద్దె వసూలు చేసే స్టోరేజ్ గోడౌన్కు షిప్ట్ చేశాడు. హైటెక్సిటీలోని ఓ కంపెనీ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోమ్ బాధ్యతలు అప్పగించింది. మరి, ఆఫీసులోని ఏసీలు, ఫ్యాన్లు, ఇతరత్రా ఫర్నిచర్ను అలాగే వదిలేస్తే నిర్వహణ భారమవుతుందని, స్టాఫ్ లేని ఆఫీసుకి అద్దె చెల్లించడం అనవసరమని ఫర్నిచర్ మొత్తాన్ని స్టోరేజ్ గోడౌన్కు తరలించింది.. ఇలా కరోనా నేపథ్యంలో ఫర్నిచర్ స్టోరేజ్ కంపెనీలకు గిరాకీ పెరిగింది. ఇల్లు, ఆఫీసుల్లోని ఫర్నిచర్ కోసం ప్రతినెలా వేల రూపాయల అద్దెను చెల్లించడం భారమైన ఉద్యోగులు, కంపెనీలకు ఫర్నిచర్ స్టోరేజ్ గోడౌన్ సర్వీసులు యూజ్ఫుల్గా మారాయి. అద్దెలో సగం కంటే తక్కువ ఖర్చుకే స్టోరేజీ, బీమా, భద్రత సేవలను అందిస్తున్నాయి. డిమాండ్ పెరిగింది.. ఫర్నిచర్ స్టోరేజ్ సర్వీస్లు కొత్తమీ కాదు. గతంలో వినియోగదారులు, బిజినెస్ టూరిస్ట్లు హోమ్ రెనోవేషన్ లేదా కంపెనీలు రీలొకేషన్ సమయంలో ఫర్నిచర్ స్టోరేజ్ సర్వీస్లను వినియోగించుకునేవి. కానీ, ఇప్పుడు కరోనా, లాక్డౌన్తో సొంతూర్లకు వెళ్లినవారు రెండేళ్లయినా తిరిగిరాని పరిస్థితి. ఇక్కడ ఉన్నా లేకున్నా ఇంటి అద్దెలు చెల్లించాల్సిందే. చాలామంది రెంట్ భారం తగ్గించుకునేందుకు ఇళ్లను ఖాళీ చేసి సామాన్లను వేర్హౌస్లో పెడుతున్నారు. వస్తువులను బట్టి ధరలు ఉండటం, కాలపరిమితి లేకపోవటం, బీమా, భద్రత ఏర్పాట్లు ఉండటంతో డిమాండ్ ఏర్పడింది. కరోనా కంటే ముందు ఈ రంగం వృద్ధి ఏటా 20–30 శాతంగా ఉండేది.. ప్రస్తుతం 50–60 శాతంగా ఉంది. వస్తువులను బట్టి చార్జీలు.. స్టోనెస్ట్, సేఫ్స్టోరేజ్, స్టోర్గనైజ్ వంటి వందలాది కంపెనీలు హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాలలో సేవలను అందిస్తున్నాయి. శివారు ప్రాంతాలలో వేర్హౌస్లను ఏర్పాటు చేసి ఫర్నిచర్ను భద్రపరుస్తున్నాయి. స్టోనెస్ట్కు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణే నాలుగు నగరాలలో కలిపి 5 లక్షల చదరపు అడుగు (చ.అ.)లలో, సేఫ్స్టోరేజ్కు 7.5 లక్షల చ.అ. విస్తీర్ణంలో వేర్హౌస్లున్నాయి. 4 నగరాల్లో స్టోనెస్ట్కు 1000 కంపెనీలు, 10 వేల మంది కస్టమర్లున్నారు. సేఫ్స్టోరేజ్కు 300 కంపెనీలు, 12 వేల మంది యూజర్లున్నారు. వస్తువుల సైజ్ను బట్టి స్టోరేజీ ధరలుంటాయి. రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, ఏసీ, టీవీ, బెడ్, పరుపు, కప్బోర్డ్స్, అల్మారా, సోఫా, డైనింగ్ టేబుల్ వంటి పెద్ద సైజు ఫర్నిచర్లకు ఒక్కో దానికి నెలకు రూ.130, కుర్చీలు, వాటర్ప్యూరిఫయ్యర్, ఎయిర్ కూలర్, టేబుల్ ఫ్యాన్లు వంటి మిడియం సైజ్ అప్లియెన్సెస్కు రూ.70, పాదరక్షలు, బట్టలు, బెడ్షీట్లు, గ్యాస్ స్టవ్, సీలింగ్ ఫ్యాన్లు, కుక్కర్, మైక్రోవేవ్ వంటి స్మాల్ అప్లియెన్సెస్కు రూ.35 చార్జీలుంటాయి. కంపెనీలకు చ.అ.లను బట్టి ధరలుంటాయి. నెలకు 300 చ.అ.లకు రూ.21 వేలు, 450 చ.అ.లకు రూ.28 వేలుగా ఉన్నాయి. సీసీ కెమెరాలు, బయోమెట్రిక్లతో భద్రత.. ప్యాకింగ్, మూవింగ్, స్టోరేజ్ అంతా కంపెనీలే చూసుకుంటాయి. ఆర్డర్ రాగానే స్టోరేజ్ కంపెనీకి చెందిన బృందం కస్టమర్ల ఇంటికి వెళ్తుంది. కస్టమర్ రాలేకపోతే బంధువులు, ఫ్రెండ్స్ ఎవరైనా కానీ షిఫ్టింగ్ టైమ్లో ఉండాలని చెప్తారు. ఎవరూ లేకపోతే కస్టమర్కు వీడియో కాల్ చేసి వారి చెప్పిన వస్తువులను ప్యాకింగ్ చేసి గోడౌన్కు తరలిస్తారు. అక్కడ కస్టమర్ పేరు రాసి సామన్లను భద్రపరుస్తారు. సీసీటీవీ కంట్రోల్లో ఉంచడమే కాకుండా సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉంటారు. వస్తువులకు డ్యామేజీ జరిగితే రూ.3–5 లక్షల వరకు బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తారు. నెలకొకసారి పెస్ట్ కంట్రోల్ చేయడం, ఫర్నిచర్ ఫొటోలు, వీడియోలు తీసి కస్టమర్లకు పంపుతారు. కంపెనీల ల్యాప్ట్యాప్లు, డాక్యుమెంట్ల వంటి వాటిని ప్రత్యేకమైన గదులలో పెట్టి వాటికి బార్కోడ్ ట్రాకింగ్, బయోమెట్రిక్ సిస్టమ్తో యాక్సిస్ను ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్లో రోజుకు 60–70 ఆర్డర్లు.. స్టోనెస్ట్కు కొంపల్లిలో 60 వేల చ.అ.లలో రెండు గిడ్డంగులున్నాయి. 2,500 మంది వ్యక్తిగత కస్టమర్లున్నారు. క్లౌడ్ఎరా, జెన్డెస్క్ వంటి 150 కంపెనీలు ఫర్నిచర్, ల్యాప్ట్యాప్స్ ఇతరత్రా ఎలక్ట్రానిక్ వస్తువులను నిల్వ చేసుకున్నాయని స్టోనెస్ట్ స్టోరేజ్ మార్కెటింగ్ హెడ్ రాహుల్ తెలిపారు. ప్రీ–కోవిడ్ సమయంలో 4 నగరాల్లో నెలకు 300–400 కాల్స్ వచ్చేవి. ఇప్పుడు 800–1000 కాల్స్ వస్తున్నాయి. వీటిల్లో 150–200ల బుక్సింగ్ అవుతున్నాయి. హైదరాబాద్లో రోజుకు 60–70 ఆర్డర్లు వస్తున్నాయని పేర్కొన్నారు. ఫర్నిచర్కు రూ.3 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. త్వరలోనే ఢిల్లీ, కోల్కత్తా నగరాలలో సేవలను ప్రారంభించనున్నాం. మార్కెట్ ట్రెండ్స్ను బట్టి ఆంధ్రప్రదేశ్లో సేవలను విస్తరిస్తామని తెలిపారు. -
అహ్మదాబాద్లో భారీ అగ్నిప్రమాదం
-
హైదరాబాద్లో అగ్ని ప్రమాదం..
సాక్షి, హైదరాబాద్: బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. సిద్దింబెర్ బజార్లోని రాజధాని మోటార్స్ గోడౌన్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. సంఘటనా స్థలానికి నాలుగు ఫైరింజన్లు చేరుకున్నాయి. మంటలను ఫైర్ సిబ్బంది, బేగంపేట బజార్ పోలీసులు అదుపులోకి తీసుకువస్తున్నారు.షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
ఉద్యోగంలోంచి తీసేశారని..
నాగోలు: ఉద్యోగంలోంచి తొలగించారనే కోపంతో పనిచేసిన సంస్ధ గోదాంలో చోరీకి పాల్పడిన ఓ వ్యక్తితో పాటు అతడికి సహకరించిన మరో ముగ్గురిని ఎల్బీనగర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 9.51 లక్షల నగదు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయంలో ఇన్చార్జి డీసీపీ యాదగరి వివరాలు వెల్లడించారు. కవాడిగూడ, ముగ్లుబస్తీకి చెందిన అన్నారం మల్లికార్జున్ ఎల్బీనగర్ సిరీస్ రోడ్డులోని నిక్కో లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ గోదాంలో కస్టమర్ కేర్ మేనేజర్గా పనిచేసేవాడు. అయితే అతడి వైఖరి సరిగా లేకపోవడంతో సంస్థ నిర్వాహకులు ఇటీవల అతడిని ఉద్యోగంలోంచి తొలగించారు. దీంతో కంపెనీపై కోపం పెంచుకున్న మల్లికార్జున్ రాణింగంజ్లో ఉంటూ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న తన బావమరిది రోమల రాకేష్తో కలిసి గోదాం కార్యాలయం లాకర్లో ఉండే నగదు చోరీ చేయాలని పథకం పన్నాడు. పథకం ప్రకారం గోదాం షట్టర్ తాళం చెవులు దొంగలించిన మల్లికార్జున్ ఈ నెల 9న రాత్రి రాకేష్కు వాటిని అప్పగించాడు. రాకేష్ గోదాంకు చేరుకునేందుకు గాను మరో వ్యక్తి ఫోన్ నుంచి ఓలా క్యాబ్ బుక్ చేయించాడు. క్యాబ్లో గోదాంకు చేరుకున్న రాకేష్ షట్టర్ తెరిచి లోపలికి వెళ్లగా మల్లికార్జున్ వాట్సప్ కాల్ ద్వారా అతడికి డైరెక్షన్ ఇచ్చాడు. అతడి సూచనల మేరకు రాకేష్ గోదాంలో ఉన్న సీసీ కెమెరాలు, డీవీఆర్ను తొలగించాడు. అనంతరం లాకర్ తెరచి అందులో ఉన్న రూ. 13 లక్షల నగదు, డీవీఆర్ తీసుకుని ప్రహరీ దూకి బయటికి వచ్చాడు. అనంతరం క్యాబ్ బుక్ చేసుకుని అక్కడినుంచి పరారయ్యాడు. అనంతరం ఇద్దరూ కలిసి బ్యాగులో ఉన్న నగదును బయటికి తీసి తక్కువ డినామినేషన్తో ఉన్న నోట్లను రూ.2 వేల నోట్లలోకి మార్చాలని నిర్ణయించుకున్నారు. ఇందుకుగాను వారు ఖైరతాబాద్కు చెందిన మహ్మద్ అస్తామ్ అబ్దుల్ నదీం ఖురేషిలను సంప్రదించారు. గోదాం లాకర్లో నగదు కనిపించకపోవడంతో మర్నాడు ఉదయం కంపెనీ యాజమాని శ్రీకాంత్ ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఎల్బీనగర్ డీఐ కృష్ణమోహన్, క్రైమ్ సిబ్బందితో సీసీ కెమెరాల పుటేజీ, సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుల ఆచూకీ గుర్తించారు. శుక్రవారం ఉదయం ఎల్బీనగర్లో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. మల్లికార్జున్ నుంచి రూ.9.51 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. గోదాం నుంచి ఎత్తుకెళ్లిన సీసీ కెమెరాల డీవీఆర్ను కవాడిగూడ నాలలో పడేసినట్లు విచారణలో వెల్లడైంది. చోరీకి పాల్పడిన ఇద్దరితో పాటు నగదు మార్చేందుకు సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. సమావేశంలో ఎల్బీనగర్ ఏసీపీ పృథ్వీధర్రావు, ఎల్బీనగర్ సీఐ అశోక్రెడ్డి, డీఐ కృష్ణమోహన్, డీఎస్ శ్రీనివాస్రెడ్డి, క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు. -
పతంగి ఎగరేసేందుకు వెళ్లి..
అల్వాల్: గాలిపటం ఎగరవేసేందుకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు గోదాంలో జారి పడిపోయిన సంఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్మత్పేట్కు చెందిన వాహిద్ వారం రోజుల క్రితం గాలిపటం ఎగరవేసేందుకు అదే ప్రాంతంలో ఉన్న మూతపడిన గోదాం పైకి ఎక్కాడు. పతంగి ఎగరవేస్తున్న అతను ప్రమాదవశాత్తు కాలుజారి లోపల పడిపోయాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో అతను బయటికి రాలేకపోయాడు. బుధవారం రాత్రి గోదాం పక్కనే ఉన్న మరో గోదాంకు వచ్చిన కొందరు వ్యక్తులు వాహిద్ కేకలు విని అక్కడికి చేరుకుని అతడిని బయటికి తీసుకువచ్చారు. వారం రోజుల పాటు తిండి లేకపోవడంతో నిరసించిన అతడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించార -
బీహార్: పాట్నాలో భారీ చోరీ
-
పారగాన్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం
కొచ్చి : ప్రముఖ పాదరక్షల సంస్థ పారగాన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బుదవారం ఉదయం అకస్మాత్తుగా సంస్థ గౌడోన్లో మంటలంటు కున్నాయి. ఐదు అంతస్తుల భవనమంతా వ్యాపించిన అగ్ని కలలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన అలుముకుంది. దీంతో తీవ్ర ఆందోళన నెలకొన్న నేపథ్యంలో సమీప భవనాలను ఖాళీ చేయించారు. ముందు జాగ్రత్త చర్యగా ఈ ప్రాంతానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఎర్నాకుళం దక్షిణ రైల్వే స్టేషన్ సమీపంలోని పారగాన్ చెప్పుల బ్రాండ్ గోదాంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు అగ్నిమాపక శకటాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.తాజా సమాచారం ప్రకారం ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి వుంది. Massive fire broke out at Paragon footwear godown in Kochi. Apparently no persons injured. Fire and rescue officials struggling to put out fire.#Kochi #Fire pic.twitter.com/kHminnPbsG — Neethu Joseph (@neethujoseph_15) February 20, 2019 -
ధ్యానం గోడౌన్లో అగ్నిప్రమాదం
-
హైదరాబాద్ రాణిగంజ్లో భారీ అగ్నిప్రమాదం
-
రాణిగంజ్లోని పెయింట్ గోడౌన్లో బారీ అగ్ని ప్రమాదం
-
నల్గోండ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
-
పట్టుకున్నారు..
కాకినాడ రూరల్:కాకినాడ పట్టణంలోని రాజాజీ వీధిలోని చందా కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.5.62 లక్షల విలువైన వంట నూనెలు, పంచదార, వేరుశనగ గుళ్లను సీజ్ చేసినట్టు కాకినాడ పౌరసరఫరాల శాఖ సహాయ అధికారి పీతల సురేష్ శుక్రవారం వివరించారు. వ్యాపారులు ఏ డోర్ నంబర్ పేరుతో గోడౌన్లు రిజిస్టేషన్ చేయించుకున్నారో అదే గోడౌన్లో సరుకు నిల్వ ఉంచుకోవాల్సి ఉండగా.. చందా కిరాణా షాపు యజమాని కాంతిలాల్ చౌదరి ఒక గోడౌన్కు అనుమతి తీసుకొని మరో రెండు గోడౌన్లకు అనుమతులు లేకుండా వంటనూనెలు, పంచదార, వేరుశనగ గుళ్లు నిల్వ వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించామన్నారు. ఈ గోడౌన్లకు కనీసం లైసెన్సు కోసం దరఖాస్తు చేయలేదన్నారు. అనుమతులు లేకుండా గోడౌన్లో స్టాకులను అక్రమంగా ఉంచినందుకు నిత్యవసర వస్తువుల చట్టం 1955 సెక్షన్6ఏ ప్రకారం కేసు నమోదు చేసి జాయింట్ కలెక్టర్ కోర్టుకు నివేదిక పంపినట్టు తెలిపారు. అనుమతులు లేని గోడౌన్లలో 6785 లీటర్ల వంట నూనెలు, 644 కిలోల పంచదార, 250 కిలోల వేరుశనగ గుళ్లు నిల్వ ఉన్నాయని, వీటి విలువ ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం రూ.5,62,336 ఉంటుందన్నారు. కృత్రిమ కొరత సృష్టించి బహిరంగ మార్కెట్ అధిక ధరలకు విక్రయించేందుకు వీలుగా ఈ అక్రమ నిల్వలు ఉంచినట్టు గుర్తించామని సురేష్ తెలిపారు. సీజ్ చేసిన స్టాకును అశోక జనరల్ స్టోర్స్ యజమాని కాంతిలాల్జైన్కు భద్రత నిమిత్తం అప్పగించినట్టు వివరించారు. వంట నూనెలు, పంచదారకు సంబంధించి లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసినా సక్రమంగా రికార్డులు రాయకపోయినా, అనుమతిలేని గోడౌన్లో నిత్యవసర సరుకులు నిల్వ ఉంచినా సంబంధిత వ్యాపారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీలో కాకినాడ అర్బన్, కరప, కాకినాడ రూరల్ సివిల్ సప్లై అధికారులు ఎం.సూరిబాబు, పి.సుబ్బారావు, ఎ. తాతారావు తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యత.. నగుబాటు!
గోపాల్పేట : నాణ్యత నవ్వులపాలవుతోంది. పది కాలాలపాటు పదిలంగా.. రైతులకు అందుబాటులో ఉండాల్సిన ధాన్యం గోదాం నిర్మాణ పనులు నాసిరకంగా సాగుతున్నాయి. సుమారు 5వేల మెట్రిక్టన్నుల ధాన్యం నిల్వచేసే సామర్థ్యంతో మండల కేంద్రంలో రూ.3కోట్ల వ్యయంతో గోదాంను నిర్మిస్తున్నారు. అందులో రూ.1.50కోట్ల వ్యయంతో ఐరన్ పైకప్పు, మరో రూ.1.50కోట్లు వెచ్చించి గోడలు నిర్మిస్తున్నారు. పనులు సగానికిపైగా పూర్తికావస్తున్నా అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, కాంట్రాక్టర్ కూడా అందుబాటులో లేకపోవడంతో సూపర్వైజర్ ఇష్టానుసారంగా పనులు చేయిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. నాణ్యతలేని ఇటుకలు, రాతిపొడి నిర్మాణాకి నాణ్యత లేని ఇటుకలు, రాతిపొడిని వాడుకుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. సమీపంలోని వ్యవసాయ బావి నుంచి నల్లాపైపు సాయంతో నామమాత్రంగా నీళ్లుపడుతూ క్యూరింగ్ చేస్తున్నారు. నీళ్లు సమపాళ్లలో పారకపోవడంతో గోడలు తడవడం లేదు. చుట్టుపక్కల లభించే నాణ్యత లేని ఇసుకలో తక్కువ మోతాదులో సిమెంట్ను కలిపి పనులు చేపడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇంత జరుగుతున్నా మార్కెటింగ్ అధికారులు అటువైపు వెళ్లడం లేదనే విమర్శలు ఉన్నాయి. రైతులకు భరోసా ఉమ్మడి గోపాల్పేట మండలంలో ఖరీఫ్, రబీ సీజన్లో ఎక్కువగా వరి, మొక్కజొన్న, వేరుశనగ, జొన్నలు, కందులు పండిస్తారు. గతేడాది మాత్రం వెయ్యి ఎకరాలకు పైగా రైతులు పత్తి పండించారు. ఒక సీజన్లో టన్నులకొద్దీ ధాన్యం పండించినా నిల్వచేసేందుకు గోదాంలు లేవు. గోదాంలు ఉంటే అందులో నిల్వచేసుకుని ఆశించిన ధర వచ్చిన సమయంలో అమ్ముకోవడానికి వీలుండేది. గతంలో బుద్దారం, రేవల్లిలో రైతులు సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం రేవల్లి గోదాములో వ్యవసాయ శాఖ వారు ఎరువులను నిల్వచేస్తున్నారు. బుద్దారంలో ఉన్న గోదాం శిథిలావస్థలో ఉంది. ప్రస్తుతం గోపాల్పేట మండల కేంద్రంలో రూ.మూడు కోట్ల వ్యయంతో గోదామును నిర్మిస్తున్నారు. దీన్ని ఖరీఫ్ నాటికి పూర్తిచేస్తే రైతులు ధాన్యం నిల్వచేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. అలాగే రైతుబంధు పథకం రుణం పొందే అవకాశం ఉంది. పర్యవేక్షిస్తున్నాం.. ఈ విషయమై మార్కెటింగ్ డీఈ నాగేంద్ర ప్రసాద్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. తమ పర్యవేక్షణలోనే గోదాం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. రెగ్యులర్గా ఇంజనీర్ వెళ్తున్నాడని, దీనిపై క్వాలిటీ కంట్రోల్ అధికారులు పరిశీలిస్తారని వెల్లడించారు. పనులు నాణ్యవంతంగా లేకపోతే మళ్లీ చేయిస్తామని చెప్పారు. -
రాజమండ్రిలో వీడియోకాన్ గోడౌన్లో అగ్నిప్రమాదం
-
హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం..
సాక్షి, హైదరాబాద్: నగరంలో అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. బైరామల్ గూడాలోని ఓ బిస్కెట్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాద ఘటనను మరువక ముందే మరో అగ్ని ప్రమాదం జరగడం కలకలంగా మారింది. ఎల్బీ నగర్ బైరామల్గూడలోని ఓ స్కాబ్ గోడౌన్లో మంటలు ఎగసిపడ్డాయి. దీంతో స్థానిక ప్రజలు భయందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఐదు ఫైర్ ఇంజన్లతో రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాం చేశారు. గోడౌన్లో ప్లాస్టిక్ పదార్థాలు, సీసాలు ఉండటంతో ప్రమాదం చోటుచేసుకుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై కార్పొరేటర్ మాట్లాడుతూ.. ఫైర్ సిబ్బంది అప్రమత్తంతో ప్రమాదం తప్పిందన్నారు. మూడు గోడౌన్లో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోయాయని ఆయన చెప్పారు. పెద్ద మొత్తంలో ఆస్తినష్టం సంభవించిందని తెలిపారు. దీనిపై సీఐ మాట్లాడుతూ.. విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించామన్నారు. గోడౌన్లో పాత ప్లాస్టిక్ వస్తువులు ఉండటంతో ప్రమాదం సంభవించి ఉంటుందని ఆయన అంచనా వేశారు. హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం -
ప్లాస్టిక్ సంచుల గోదాములో అగ్నిప్రమాదం
డోన్ టౌన్ : పట్టణ శివారులోని వైఎస్సార్ విగ్రహం వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారి పక్కనే ఉన్న లక్ష్మీవెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్కు చెందిన ప్లాస్టిక్ సంచుల గోదాములో ఆదివారం ఉదయం 5గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. యజమాని ఎరుకలి సుంకన్న కథనం మేరకు.. గోదాములో విద్యుదాఘాతం కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది. గత వారం రూ. 15లక్షల సరుకును బెంగళూరు నుంచి తెప్పించుకుని నిల్వ ఉంచగా సుమారు రూ. 12 లక్షల సరుకు కాలిపోయింది. సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక కేంద్ర ప్రధాన అధికారి మద్దిలేటి ఆధ్వర్యంలో సిబ్బంది గోపాల్, రామాంజనేయులు, గోవిందరాజు, సుంకన్న, నారాయణ ఫైరింజిన్తో వచ్చి మంటలను ఆర్పివేయడంతో ఆస్తి నష్టం తగ్గింది. జిల్లా అగ్నిమాపక కేంద్ర అధికారి బాలరాజు ఉదయం 7గంటల సమయంలో ప్రమాద స్థలానికి వచ్చి పరిశీలించారు. గోదాము యజమాని ఎరుకలి సుంకన్న, అగ్నిమాపక అధికారి మద్దిలేటితో మాట్లాడి ప్రమాదానికి కారణాలు, జరిగిన నష్టం తదితర వివరాలు తెలుసుకున్నారు. -
అమెజాన్ గోడౌన్లో చోరీ
కొత్తూరు(రంగారెడ్డి జిల్లా): కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో ఉన్న ఆమెజాన్ గోడౌన్లో భారీ చోరి జరిగింది. గోడౌన్లో దాచిన 20 హెచ్పీ, 16 ఆపిల్ ల్యాప్ట్యాప్లను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. వీటి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుంది. ఈ మేరకు గోడౌన్ నిర్వాహకుడు వైఎన్ ఎస్ రెడ్డి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎక్స్పో్లజివ్ గోడౌన్స్ తనిఖీ చేసిన కంట్రోలర్
యెటింక్లయిన్ కాలనీ : జీడీకే–5వ గని సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఎక్స్పో్లజివ్ గోడౌన్ ను కంట్రోలర్ ఆఫ్ ఎక్స్పో్లజివ్ డీకేపాండే గురువారం తనిఖీ చేశారు. ప్రస్తుతం వకీల్పల్లిగని సమీపంలోని గోడౌన్ ను నూతనంగా నిర్మిస్తున్న కట్టడాల్లోకి మార్చేందుకు సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం యాజమాన్యం దరఖాస్తు చేసుకుంది. ఈమేరకు హైదరాబాద్ నుంచి వచ్చిన ఎక్స్పో్లజివ్ఆఫ్కంట్రోలర్ నూతన నిర్మాణాలు పరిశీలించారు. కంట్రోలర్ వెంట ఆర్జీ–2 ఎస్ఓటూ జీఎం రవీందర్, ఏజీఎం రాజేశ్, సివిల్ ఎస్ఈ శ్రీనివాస్, ఎక్స్పో్లజివ్ స్టోర్స్ ఇన్ చార్జి మూర్తి, సెక్యూరిటీ అధికారి జానకిరాం తదితరులున్నారు. -
గోడౌన్లపై విజి‘లెన్స్’
– 41 క్వింటాళ్ల బియ్యం, 800 లీటర్ల నీలి కిరోసిన్ స్వాధీనం – ఇద్దరిపై కేసు నమోదు డోన్ టౌన్ : పట్టణ శివారులోని గోడౌన్లపై జిల్లా విజిలెన్సు అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన కిరోసిన్, బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. కంభాలపాడు చౌరస్తా వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారి పక్కన గల గోడౌన్ పై శుక్రవారం అర్ధరాత్రి దాడులు జరిపారు. అక్రమంగా నిల్వ ఉంచిన 800 లీటర్ల నీలి కిరోసిన్ స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు బాధ్యుల లక్ష్మీనారాయణ గౌడ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అలాగే మండల పరిధిలోని కొత్తపల్లె గ్రానైట్ ఫ్యాక్టరీ సమీపంలో ఒక గోడౌన్పై దాడి చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 41క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని..షేక్ ఇస్మాయిల్ బాషాపై కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యం, కిరోసిన్ను స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పగించారు. దాడుల్లో విజిలెన్స్ సీఐ రామకృష్ణాచారి, విజిలెన్స్ తహసీల్దార్ రామకృష్ణ, సిబ్బంది ఉమా మహేశ్వర్, నాగభూషణం, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. -
భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
జగ్గయ్యపేట అర్బన్ : వరుస దాడులు జరుగుతున్నప్పటికీ గుట్కా అక్రమ వ్యాపారం జోరు తగ్గలేదు. గురువారం పట్టణంలో పట్టణ ఎస్ఐ–2 ఎస్.ప్రియకుమార్ జరిపిన దాడుల్లో రూ 3 లక్షలకు పైగా విలువైన గుట్కా ప్యాకెట్లు, అనుమతి లేని బ్లాక్ అనే సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం... ఉదయం 8.30 సమయంలో పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు బలుసుపాడు రోడ్డులోని పాత వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఆటోను తనిఖీ చేశారు. ఆటో డ్రైవరు సమాచారంతో పాత కూరగాయల మార్కెట్ సందులో ఉన్న గుండా కాశయ్యకు చెందిన గోడౌన్పై ఎస్ఐ తన సిబ్బంది, వీఆర్వోలు రాంబాబు, వీఆర్ఏ శివలతో కలిసి దాడి చేశారు. గోడౌన్లో ఉన్న సుమారు తొమ్మిది గుట్కా పార్సిళ్లను సీజ్ చేశారు. అనంతరం వాటిని స్టేషన్కు తరలించారు. వీటి విలువ సుమారు రూ 3 లక్షలకుపైగా ఉన్నట్లు సమాచారం. గుండా కాశయ్య, సాంబయ్యపై కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. దాడుల్లో కానిస్టేబుళ్లు కృష్ణయ్య, నాగరాజు పాల్గొన్నారు. సీఐ వైవిఎల్.లచ్చునాయుడు గుట్కాలు నిలువ ఉంచిన గోడౌన్ను పరిశీలించారు. -
ఆగ్రాలో అగ్ని ప్రమాదం: లక్షల్లో ఆస్థి నష్టం
-
రూ. 1024 కోట్లతో గోదాంల నిర్మాణం
ఆలేరు : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1024 కోట్లతో 330 గోదాంల నిర్మాణం చేపడుతున్నామని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ శరత్ తెలిపారు. ఆలేరు మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 95 శాతం గోదాంల నిర్మాణాలు పూర్తయ్యాయని, మరో 20 రోజుల్లో నిర్మాణంలో ఉన్న గోదాంలు పూర్తవుతాయని చెప్పారు. రైతులు రైతుబం«ధు పథకం కింద ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు, ఎరువులు, పీడీఎస్ బియాన్ని నిల్వ చేసుకునేందుకు ఈ గోదాంలు ఉపయోగపడుతాయని తెలిపారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 180 మార్కెట్ యార్డుల్లో రూ. 285 కోట్లతో స్వాగత తోరణాలు, ఫ్లాట్ఫామ్స్, కవర్ షెyŠ లు నిర్మిస్తున్నామని చెప్పారు. హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గతేడాది నాలుగున్నర లక్షల మొక్కలు నాటామన్నారు. ఇందులో 80 శాతం వరకు మొక్కలను కాపాడగలిగామని చెప్పారు. ఈ ఏడాది ఎనిమిదిన్నర లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మొక్కల పెంపకం సామాజిక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహించిన వారిని ఇటీవల నలుగురిని సస్పెండ్ చేశామని తెలిపారు. ఈ సమావేశంలో చైర్మన్ కాలె సుమలత, వైస్ చైర్మన్ నాయిని రామచంద్రారెడ్డి, సెక్రటరీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
అన్ని గోదాంలను వినియోగంలోకి తెస్తాం
దామరచర్ల : జిల్లాలో ఉన్న అన్ని గోదాంలను వినియోగంలోకి తెస్తామని మార్కెటింగ్ శాఖ జేడీఏ లక్ష్మణుడు తెలిపారు. శుక్రవారం దామరచర్ల సబ్మార్కెట్ యార్డులో విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో 1.55లక్షల మెట్రిక్టన్నుల సామర్థ్యమున్న 121 గోదాంలు ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత రెండేళ్లుగా 1.25లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 31 గోదాంల నిర్మాణాలను ప్రారంభించామన్నారు. వీటి నిర్మాణం 80 శాతం పూర్తయినట్టు తెలిపారు. ఈ గోదాంలను పీడీఎస్ బియ్యం, ఫెస్టిసైడ్స్ నిల్వలకు వినియోగిస్తామన్నారు. రైతులు రైతు బంధు పథకం కింద తమ పంట ఉత్పత్తులను దాచుకోవచ్చునన్నారు. తమ శాఖ ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటాలనేది లక్ష్యమని, ఇప్పటి వరకూ 34 వేల మొక్కలు నాటినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ అలీం, కార్యదర్శి అనంతయ్య, శ్రీనివాస్, సైదులు, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విత్తనాల గోదాములో అగ్ని ప్రమాదం
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని పీఆర్ కాలనీలో అగ్ని ప్రమాదం కారణంగా పత్తి విత్తనాలు బూడిదయ్యాయి. స్వామిదాసు అనే వ్యక్తి ఇక్కడ ఓ గది అద్దెకు తీసుకుని అందులో రూ.7 లక్షల విలువైన 27 క్వింటాళ్ల పత్తి విత్తనాలు నిల్వ చేశాడు. బుధవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా లేచిన మంటలకు విత్తనాలు మొత్తం కాలి బూడిదయ్యాయి. స్థానికులే స్పందించి మంటలను ఆర్పివేశారు. -
ముంబైలో భారీ అగ్నిప్రమాదం
ముంబై: ముంబైలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తూర్పు ముంబైలోని దాము నగర్ మురికి వాడలో సిలిండర్లు పేలడం వలన ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఎగసిపడుతున్న అగ్నికీలల్ని సుమారు 12 అగ్నిమాపక శకటాలు తీవ్రంగా ప్రయత్నించి అదుపులోకి తెచ్చాయి. గాయపడిన వారిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో సిలిండర్లు దగ్థం కావడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. నగర మేయర్ స్నేహాల్ అంబేకర్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. -
డెకరేషన్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం
-
హైదరాబాద్ అఘాపూరా ప్రాంతంలో అగ్నిప్రమాదం
-
హైరానా
ఇతని పేరు ప్రసాద్బాబు. ప్రొద్దుటూరు పట్టణంలోని 9వ చౌకదుకాణ డీలర్. చంద్రన్న సంక్రాంతి కానుకకు సంబంధించిన వస్తువులను గోడౌన్ నుంచి శనివారం తీసుకున్నారు. అయితే సరుకులలో 100 నెయ్యిప్యాకెట్లు, 50 కిలోల బెల్లం, 50 కిలోల శనగలు తక్కువగా వచ్చాయి. దీంతో డీలర్ తిరిగి సరుకులను గోడౌన్లో అప్పగించాడు. సరుకుల కోసం ఆదివారం సాయంత్రం వరకు గోడౌన్ వద్ద కాపలా కాయాల్సి వచ్చింది. ప్రొద్దుటూరు: చంద్రన్న సంక్రాంతి కానుక అధికారులతో పాటు డీలర్లను హడలెత్తిస్తోంది. సరుకుల వద్ద అధికారులు రాత్రింబవళ్లు కాపలా కాస్తుండగా వీటిని తీసుకెళ్లేందుకు రేషన్ డీలర్లు పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఆదివారం సాయంత్రం వరకు సరుకుల పంపిణీ పూర్తి కాలేదు. చంద్రన్న సంక్రాంతి కానుకగా ప్రభుత్వం హెరిటేజ్ కంపెనీకి చెందిన 100 మిల్లీ లీటర్ల నెయ్యి, మరో కంపెనీకి చెందిన పామాయిల్ ప్యాకెట్లు మాత్రమే సరఫరా చేస్తుండగా కందిబేడలు, శనగలు, బెల్లంపై ఎలాంటి కంపెనీల పేర్లు లేవు. వాటి బస్తాలు కూడా సాధారణంగా ఉన్నాయి. ప్రస్తుతం సరఫరా అయిన హెరిటేజ్ నెయ్యి ప్యాకెట్లు కూడా కంపెనీ లేబుల్ లేకుండా పాలిథిన్కవర్లలో సరఫరా అయ్యాయి. బెల్లం నిజామాబాద్, కందిబేడలు గుంటూరు జిల్లా వినుకొండ, శనగలు ప్రొద్దుటూరు సమీపంలోని గోడౌన్ నుంచి సరఫరా అవుతున్నాయి. కాగా వీటి తూకాల్లో భారీ వ్యత్యాసం ఉన్నట్లు కనిపిస్తోంది. కందిబేడలు 50 కిలోలకు గానూ 49.50 కిలోలు మాత్రమే ఉండగా అధికారులు మాత్రం 50.50 కిలోలుగా, 50 కిలోల శనగలను కూడా 50.50 కిలోలుగా, 10 కిలోల బెల్లాన్ని 10.50 కిలోలుగా లెక్కకట్టి తమకు అంటగడుతున్నారని డీలర్లు తెలిపారు. ప్రతి బస్తాకు ఈ విధంగా లెక్కకడితే తామెంతోనష్టపోతామని తెలిపారు. అలాగే చంద్రన్న సంక్రాంతి కానుకను ప్రభుత్వం ఉచితంగా ఇస్తుండగా సరుకులను, ఎత్తిదించినందుకు గానూ కూలీలు మాత్రం యధావిధిగా డబ్బు వసూలు చేస్తున్నారు. సరుకులు ఉచితం కదా అని డీలర్లు ప్రశ్నిస్తే మేం శ్రమను నమ్ముకొని జీవించేవారం, మాకు కూలీ ఇవ్వకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రకారం రూ. 300-400 వరకూ చెల్లించిన వారు ఉన్నారు. ఇదిలా ఉండగా అధికారుల అదేశాల మేరకు సరకులు తీసుకెళ్లేందుకు గానూ డీలర్లు పడిగాపులు కాయాల్సి వస్తోంది. సరకులన్నీ పూర్తిగా లేకపోగా అధికారులు మాత్రం ఉన్నవాటినే సరఫరా చేస్తున్నారు. బెల్లం నిల్వలు కూడా ఆదివారం ఉదయానికి అయిపోగా మధ్యాహ్నం మరో లారీ వచ్చింది. అలాగే గోధుమ పిండి నాలుగు లారీలకు గాను ఒక్క లారీ మాత్రమే ఆదివారం సరఫరా అయింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఉన్న సరకులు పంపీణీ చేస్తుండగా ప్రొద్దుటూరు గోడౌన్లో సాయంత్రానికే నెయ్యి ప్యాకెట్ల కొరత ఏర్పడింది. శనివారం ఉదయమే వీటిని తెప్పించారు. ఇంకా ఈ కానుకకు సంబంధించిన సంచులు తయారవుతూనే ఉన్నాయి. -
ఫర్నీచర్ షాపులో అగ్నిప్రమాదం
-
రైతాంగ సమస్యల పరిష్కారానికి పెద్దపీట
* త్వరలో రుణమాఫీహామీ పత్రాలు * మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి బాన్సువాడరూరల్ : దేశానికి అన్నంపెట్టే రైతన్నల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని కొల్లూర్ గ్రామంలో రూ.18లక్షల వ్యయంతో నిర్మించిన 500 మెట్రిక్ టన్నుల గోడౌన్ను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో 250కి పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభత్వ మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఈసారి బీపీటీ ధాన్యానికి మద్దతుధర లేకపోవడంతో అక్కడడక్కడ ధాన్యం రాశులు పేరుకు పోయిన మాట తమ దృష్టికి వచ్చిందన్నారు. వారంతా రైతుబంధు పథకంలో భాగంగా వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో నిల్వచేసి, పంటవిలువలో 75శాతం వరకు అప్పుగా తీసుకునే వెసులుబాటు వుందన్నారు. తీసుకున్న అప్పుకు గరిష్టంగా రూ. 2లక్షలకు 6మాసాల వరకు ఎలాంటి వడ్డీ ఉండదని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాన్సువాడ సొసైటీ చైర్మన్ కృషితో ఈసారి 25 ఎకరాల్లో రైతులకు ఫౌండేషన్ సీడ్ సాగు చేయిచడం అభినంద నీయమన్నారు. ప్రభుత్వం విత్తనాలను మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేసేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 160 గోడౌన్లు నిర్మించడానికి నాబార్డుకు ప్రతిపాదనలు పంపామని, ప్రస్తుతం మండలానికి ఒకటి చొప్పున 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్లను నిర్మిస్తున్నామన్నారు. త్వరలోనే రైతులకు రుణమాఫీ హామీ పత్రాలు అందిస్తామన్నారు. గ్రామస్తులు సూచించిన అన్ని సమస్యలను పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అర్హులైన వికలాంగులకు సదరం సర్టిఫికెట్లు ఇప్పించడానికి మండల అధికారులు, ప్రజాప్రతినిధులు సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. అంతకు ముందు కొల్లూర్ మసీద్ వద్ద మంత్రిని ముస్లింలు ఘనంగా సన్మానించారు. పాఠ శాలలో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. సభ ప్రారంభానికి ముందు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కొల్లూర్ గ్రామ సర్పంచ్ మాధవీ మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ఎర్వాల కృష్ణారెడ్డి, డీసీసీబీ చైర్మన్ గంగాధర్ పట్వారీ, ఆర్డీవో శ్యాంప్రసాద్లాల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్యాదవ్, ఏఎంసీ చైర్మన్ మాసాని శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ రేష్మాబేగం ఎజాస్, జెడ్పీటీసీ విజయగంగాధర్, నాయకులు గోపాల్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, అంజిరెడ్డి, నార్లసురేష్, ఇన్చార్జి సర్పంచ్ బస్వంత్, ఎంపీటీసీ సభ్యురాలు సురేఖరాచప్ప , మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రండి బాబూ రండి..
సాక్షి, కడప : ప్రజలకు పంపిణీ చేసే నిత్యావసర వస్తువుల విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగా గోడౌన్లో రూ. లక్షలు విలువైన సరుకులు మగ్గుతున్నాయి. ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు..ఏకంగా ఏడాది కాలంగా రూ. రూ. 60 లక్షల విలువైన సరుకులు మగ్గుతున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం మిల్లర్లకు అమ్మేందుకు కూడా చొరవ చూపడం లేదు. ఇటీవల జిల్లాకు వచ్చిన పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత ఈ విషయంలో తీవ్రంగా మండిపడినా అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఏడాదికి కాలంగా గోడౌన్లో..అమ్మహస్తం సరుకులు... అమ్మహస్తం పథకంలో భాగంగా అప్పటి కిరణ్ సర్కార్ 2013 జనవరిలో 9 వస్తువులకు సంబంధించిన సరుకులను లారీల ద్వారా జిల్లాకు పంపించారు. అప్పట్లో అధికారులు పరిశీలించుకున్నారో లేదో తెలియదుగానీ గోడౌన్లో దించుకుని...తర్వాత తాపీగా చూసుకుంటే ప్రజలకు పంపిణీ చేసే వస్తువుల్లో నాణ్యత లోపించినట్లు స్పష్టమైంది. 2013 జనవరి నుంచి ఇప్పటివరకు గోడౌన్లోనే సరుకులు నిల్వ ఉన్నాయి. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఈ విషయాన్ని ఇంతవరకు బయటికి పొక్కనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నా.. ఇటీవలే ఓ సమీక్షా సమావేశంలో బహిర్గతమైంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపినా పట్టించుకోలేదని ఇక్కడి అధికారులు పేర్కొంటున్నారు. గోడౌన్లో రూ. 60 లక్షల విలువైన సరుకులు పౌరసరఫరాలశాఖ గోడౌన్లో ఉన్న అమ్మహస్తం సరుకులు నాణ్యతగా లేవని ఏడాది కాలంగా అక్కడే ఉంచారు. చింతపండు 47.690 టన్నులు...దీని విలువ దాదాపు రూ. 33,59,354, కారంపొడి 21.274 టన్నులు..దీని విలువ రూ. 20,64,428, పసుపు 5.474 క్వింటాళ్లు కాగా దీని విలువ రూ. 5,47,900 కలుపుకుంటే దాదాపు రూ. 60 లక్షల విలువైన సరుకులు గోడౌన్లో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి మందలించినా.... గోడౌన్లో ఉన్న సరుకుల విషయం బయటపడి పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత స్వయంగా జిల్లా అధికారులను మందలించినా మార్పు కనిపించడం లేదు. సరుకులను మిల్లర్లకు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అయినా ఇంతవరకు పురోగతి కనిపించడం లేదు. గతంలో ఎండీ స్థాయి అధికారులకు తెలిపినా పట్టించుకో లేదని.. మా తప్పేమి లేదని..మాకేమి కాదంటూ కొంతమంది అధికారులు కార్యాలయంలోనే కూర్చొని లెక్కలు వేసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఎండీ స్థాయి అధికారికి తెలిపినా ఎందుకు అలాగే గోడౌన్లోనే నిల్వ పెట్టించారన్న విషయం అర్థం కావడం లేదు. సరుకులో నాణ్యత లోపించిన సందర్భంలో మిల్లర్లకు విక్రయించడమో, లేకపోతే వెనక్కి తెప్పించుకోవడమో జరుగుతుందని... అలాగే గోడౌన్లో నిల్వ చేయడం వల్ల సరుకులు మరింత క్షీణించి నాణ్యత మరింత తగ్గుతుందని శాఖకు చెందిన సిబ్బందే చెప్పుకుంటున్నారు. అమ్మినా కొనుగోలు చేసేవారు కరువే చింతపండు, కారంపొడి, పసుపు గోడౌన్కు వచ్చి ఏడాదిన్నర దాటింది. ఇన్ని రోజులు గోడౌన్లో నిల్వ చేసిన సరుకులలో నాణ్యత ఎంతవరకు ఉంటుందన్నది ప్రశ్నార్థకం. పౌరసరఫరాలశాఖ అధికారులు విక్రయించేందుకు సిద్ధపడినా కొనుగోలు చేసేందుకు మిల్లర్లు రావడం అనుమానంగా మారింది. అధికారులు మాత్రం ఎవరో ఒకరు వస్తే ఎంతో కొంతకు అమ్మేస్తామని పేర్కొంటున్నా....కర్ణాటక, అనంతపురం ప్రాంతాలకు చెందిన కొంతమంది వ్యాపారులు చింతపండును కేవలం కిలో రూ. 16 చొప్పున సరుకులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపినట్లు తెలిసింది. ప్రస్తుతం వీరు కూడా అనాసక్తి ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. జిల్లా మేనేజర్ ఏమంటున్నారంటే! ప్రస్తుతం గోడౌన్లో రూ. 50 లక్షలకు పైగా విలువ చేసే చింతపండు, కారంపొడి, పసుపు నిల్వలున్న ఉన్న మాట వాస్తవమే. నాణ్యత లేకపోవడంతో ఏడాది కాలంగా ఇక్కడే ఉంచాం. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం. ఎవరైనా మిల్లర్లు ముందుకొస్తే విక్రయించడానికి సిద్ధంగా ఉన్నాం. - బుల్లయ్య, జిల్లా మేనేజర్, పౌరసరఫరాలశాఖ,కడప నేడు ఎండీతో సమావేశం హైదరాబాదులోని సోమాజిగూడలో ఉన్న సివిల్ సప్లయ్ కార్యాలయంలో ఎండీ అనిల్కుమార్తో సోమవారం జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులకు సమావేశం జరగనుంది.జిల్లాకు సంబంధించిన గోడౌన్లతోపాటు స్టాకు నిల్వల విషయం, ఇతర అనేక అంశాలపై ఎండీతో జిల్లా అధికారులు చర్చించనున్నట్లు తెలియవచ్చింది. -
'అది చంద్రబాబు ఆలోచన'
హైదరాబాద్: ఏపీలో గిడ్డంగుల నిర్మాణానికి రూ. 250 కోట్లు కేంద్రం మంజూరు చేసిందని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. కేంద్రం నుంచి ఎరువుల కేటాయింపు పూర్తి స్థాయిలో జరగలేదన్నారు. 4.15 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వసామర్థ్యాన్ని పెంపొందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 1.17 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల కొరత ఉందన్నారు. 2.59 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయించాలని కేంద్రానికి లేఖ రాయనున్నట్టు చెప్పారు. రైతులకు ఐపాడ్లు ఇవ్వాలన్నది సీఎం ఆలోచన అని మంత్రి చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై రైతులను చైతన్యపరిచేందుకు ఈ ప్రతిపాదన చేశారని వివరించారు. త్వరలో ఉపాధిహామీకి వ్యవసాయరంగాన్ని అనుబంధం చేసి రైతులకు రూ.5 వేల పెట్టుబడి తగ్గిస్తామన్నారు. -
ఫ్రీడం రిపైండ్ ఆయిల్ గోడౌన్లో అగ్నిప్రమాదం
-
ఫ్రీడం రిపైండ్ ఆయిల్ గోడౌన్లో అగ్నిప్రమాదం
విజయవాడ : విజయవాడలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గొల్లపూడిలోని ఫ్రీడం రిఫైండ్ ఆయిల్ గోదాములో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు వ్యాపించాయి. గోదాములో మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్నఅగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.