high drama
-
దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్ట్ విఫలం
సియోల్: అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ (Yoon Suk Yeol) అరెస్టు విఫలమైంది. కోర్టు నుంచి అంగీకారపత్రంతో శుక్రవారం తెల్లవారుఝామునే కరప్షన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(CIO) అధికారులు సియోల్లోని అధ్యక్ష భవనానికి చేరుకున్నారు. అయితే అక్కడ వాళ్లకు చాలా సమయం అడ్డగింత ఎదురైంది. దీంతో చేసేది లేక అధ్యక్ష నివాసం నుంచి అధికారులు వెనుదిరిగారు. ఎమర్జెన్సీ మార్షల్ లా(Martial Law)ను ప్రకటించిన కేసులో విచారణకు సహకరించకపోవడంతో యూన్ సుక్ యోల్పై అరెస్టు వారెంటు జారీ అయింది. అయితే విచారణాధికారులు యూన్ నివాసంలోకి వెళ్లకుండా సైన్య బృందంతో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఒకానొక టైంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు.. అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీఐవో చీఫ్ ఓహ్ డోంగ్ వున్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే అన్నివైపులా ప్రతిఘటన ఎదురుకావడంతో సుమారు ఆరు గంటలపాటు హైడ్రామా నడిచింది. చివరకు.. సీఐవో అధికారులు అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది .ఇక.. మార్షల్ లా ప్రకటించిన కేసులో.. అధ్యక్ష భవనంలో సోదాలకు విచారణ అధికారులు ప్రయత్నించినప్పుడు కూడా ఇలాంటి ప్రతిఘటనే ఎదురైంది. అయినప్పటికీ అధికారులు పోలీసుల సాయంతో బలవంతంగా లోపలికి వెళ్లి తనిఖీలు జరిపారు. మరోవైపు ఈ కేసులో మూడుసార్లు విచారణకు పిలిచినా ఆయన హాజరుకాకపోవడంతో అధికారులు అరెస్ట్ వారెంట్ కోరుతూ కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం అంగీకరించింది. అదే జరిగితే దక్షిణ కొరియా చరిత్రలో అరెస్ట్ అయిన తొలి అధ్యక్షుడిగా నిలుస్తారు.అరెస్ట్ జరిగితే.. కోర్టు 6వ తేదీ వరకూ గడువిచ్చిందని, ఆలోపే యూన్ను అరెస్టు చేస్తామని సీఐవో మరోమారు స్పష్టం చేశారాయన. యూన్ గనుక అరెస్ట్ అయితే.. ఆయన్ని గవాచియాన్లోని సీఐవో కార్యాలయానికి తరలించే అవకాశం ఉంది. మార్షల్ లా విధింపు కేసులో అక్కడ ఆయన్ని విచారణ జరపనున్నారు. అరెస్ట్ వారెంట్ నేపథ్యంతో.. 48 గంటలపాటు ఆయన్ని అదుపులో ఉంచుకునే అధికారం సీఐవోకు ఉంటుంది. అయితే అటుపై కస్టడీ కోసం కోర్టును అభ్యర్థించాల్సి ఉంటుంది.విఫలయత్నాలే..దక్షిణ కొరియాలో ఇలాంటి పరిణామాలు కొత్తేం కాదు. 2000, 2004 సంవత్సరాల్లో చట్ట సభ్యులను అరెస్ట్ చేయాలని ప్రయత్నించారు. అయితే.. రెండు సందర్భాల్లోనూ అరెస్ట్ వారెంట్ గడువు ముగిసేదాకా(ఏడురోజులపాటు) వాళ్ల పార్టీ సభ్యులు, మద్దతుదారులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో అది సాధ్యపడలేదు. హైటెన్షన్సెంట్రల్ సియోల్లో ఎటు చూసిన భారీగా బలగాలు కనిపిస్తున్నాయి. యూన్ను అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో ఆయన అనుచరులు భారీగా అధ్యక్ష భవనం వద్దకు చేరి మోహరించారు. గురువారం యూన్ వ్యతిరేకులకు, మద్దతుదారులకు మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో భద్రతా బలగాలు కొందరిని అదుపులోకి తీసుకున్నాయి. మరోవైపు.. యూన్ మద్దతుదారులు అమెరికా జెండాలతో నినాదాలు చేస్తూ కనిపించడం కొసమెరుపు. యూన్ అరెస్ట్ నేపథ్యంలో.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2,700 మంది పోలీసులు మోహరింపజేసినట్లు సమాచారం.మార్షల్ లాతో చిక్కుల్లో..ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ.. యూన్ ఇటీవల ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ విధించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రతిపక్షాలు ‘మార్షల్ లా’ అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకురాగా.. పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో యూన్ తన అధ్యక్ష అధికారాలు, విధులకు తాత్కాలికంగా దూరమయ్యారు. యూన్ను పదవి నుంచి తప్పించాలా, కొనసాగించాలా అన్న అంశాన్ని కోర్టు 180 రోజుల్లోగా తేల్చనుంది.మరోవైపు యూన్ మద్దతుదారులు సియోల్లోని ఆయన నివాసం ఎదుట భారీగా మోహరించారు. వారిని ఉద్దేశిస్తూ యూన్ మాట్లాడారు. తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించి దేశాన్ని ప్రమాదంలో పడేసేందుకు పనిచేస్తున్న శక్తులపై చివరివరకు పోరాడతానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. మరోవైపు యూన్ను అరెస్టు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన తరఫు న్యాయబృందం హెచ్చరించింది. ఇంకోవైపు.. దక్షిణ కొరియాను మరో ఉత్తర కొరియాగా మార్చేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఆయన అరెస్టును అడ్డుకుని తీరతామంటూ నివాసం ఎదుట భారీగా మోహరించారు. అభిశంసన ఇలా.. మార్షల్ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్(జాతీయ అసెంబ్లీ)లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా.. 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో ఆయన తన అధ్యక్ష అధికారాలను, విధులను ప్రధానమంత్రి హన్ డక్ సూకీకి అప్పగించాల్సి ఉంటుంది. తీర్మానప్రతులను రాజ్యాంగ న్యాయస్థానానికి పార్లమెంటు పంపుతుంది. యూన్ను తప్పించాలా, కొనసాగించాలా అన్న అంశాన్ని ఈ కోర్టు 180 రోజుల్లోపు తేలుస్తుంది. మరోవైపు యూన్ స్వచ్ఛందంగా దక్షిణ కొరియా అధ్యక్ష పదవి నుంచి వైదొలిగే యోచనలో ఉన్నట్లు ఆయన సీనియర్ సలహాదారులు, కార్యదర్శులు చెబుతున్నారు. చదవండి👉🏻: కరోనా ప్యాటర్న్లోనే.. చైనా నుంచి మరో వైరస్ -
బడాబాబులే ఆమె టార్గెట్..
-
వెరిఫికేషన్ కి వచ్చి తాళాలు లేవని ఎన్నికల అధికారుల హై డ్రామా
-
ఔటర్ రింగ్ రోడ్డుపై హైడ్రామా
-
విజయనగరం పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ వద్ద హైడ్రామా
-
HYD: యువతి హైడ్రామా.. రాజేంద్రనగర్ చోరీ కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్ దొంగతనం కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఒక యువతి ఆడిన నాటకాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఆన్లైన్ గేమ్లో డబ్బులు పోగొట్టుకొని యువతి చోరీ డ్రామాకు తెరతీసింది. ఉదయం తాను వాష్ రూమ్కి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు ఉన్నారని తెలిపిన యువతి.. పట్టుకునే క్రమంలో తనను తోసేసి పారిపోయారంటూ వెల్లడించింది. స్థానికులు సమాచారంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అసలు విషయాన్ని బయటపెట్టారు. పథకం ప్రకారమే ఆమె ఇంట్లో బీరువాలో ఉన్న బట్టలు ఇతర వస్తువులను చిందరవందరగా పడేసింది. ఆన్లైన్లో గేమ్స్ ఆడి 25 వేలు పొగొట్టుకుని భయంతో డ్రామా క్రియేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇదీ చదవండి: ‘డెత్’లైన్ గేమ్స్! -
టీడీపీ హైడ్రామా
శ్రీకాకుళం: కాలువను ఆక్రమించారు.. ఆక్రమణ తొలగింపును అడ్డుకోవాలనుకున్నారు.. ఫిర్యాదు చేశారన్న కోపంతో ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో టీడీపీ నాయకులు తమకు అలవాటైన రీతిలో నీచ రాజకీయాలకు పాల్పడ్డారు. శనివారం రాత్రి చినబడాంలో హైడ్రామా సృష్టించి హడావుడి చేశారు. స్థానిక చోటా నాయకులకు తోడుగా నియోజకవర్గ నేతలు కూడా ఈ రాజకీయ డ్రామాలో పాలు పంచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 7వ వార్డు చినబడాంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు సాగునీటి కాలువను ఆక్రమించారు. ఖరీఫ్ పనులు ఊపందుకోవడం, సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతుండడంతో ఈ ఆక్రమణలపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆక్రమణలను తొలగించడానికి అధికారులు కూడా సిద్ధమైనట్టు సమాచారం. అయితే దీనిపై సమాచారం అందుకున్న టీడీపీ నాయకులు ఈ అంశాన్ని రాజకీయం చేయడానికి చూశారు. అధికారులకు ఫిర్యాదు చేశారనే కారణంతో నలుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. బాధితులు కాశీబుగ్గ పోలీసులను ఆశ్రయించారు. ఆక్రమిత స్థలం వద్ద రాత్రిపూట కుర్చీలు వేసుకుని మరీ కూర్చున్నారు. అధికారులు వస్తే అడ్డుకుందామని, ఈ గొడవను రాజకీయంగా వాడుకుందామని అనుకున్నారు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, గౌతు శిరీష ఆక్రమిత స్థలం వద్దకు వచ్చి ఆక్రమణదారుడికి మద్దతు పలకడం గమనార్హం. -
6 బంతుల్లో 4 పరుగులు.. చేతిలో 5 వికెట్లు.. అయినా ఓటమి
ఆస్ట్రేలియన్ వుమెన్స్ నేషనల్ క్రికెట్ లీగ్ తుది సమరంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. హోబర్ట్ వేదికగా సౌత్ ఆస్ట్రేలియా-టాస్మానియా జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 25) జరిగిన ఫైనల్ మ్యాచ్ అనూహ్య మలుపులు తిరిగి క్రికెట్లోని అసలుసిసలు మజాను ప్రేక్షకులకు అందించింది. అసలు ఏం జరిగిందంటే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టాస్మానియా నిర్ణీత 50 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. One of the wildest finishes to a cricket match condensed down to a minute. You're welcome #WNCLFinal pic.twitter.com/97hUMPcuxE — cricket.com.au (@cricketcomau) February 25, 2023 ఆ తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ను 47 ఓవర్లకు కుదించి (డక్వర్త్ లూయిస్ పద్ధతిలో), సౌత్ ఆస్ట్రేలియాకు 243 పరుగుల టార్గెట్ను కుదించారు. ఈ క్రమంలో చివరి నిమిషం వరకు సౌత్ ఆస్ట్రేలియా గెలుపు దిశగా సాగింది. చివరి ఓవర్కు ముందు సమీకరణలు ఇలా ఉన్నాయి. ఆఖరి ఓవర్లో సౌత్ ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే 4 పరుగులు చేయాల్సి ఉండింది. చేతిలో 5 వికెట్లు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సౌత్ ఆస్ట్రేలియా జట్టు గెలుపు నల్లేరుపై నడకే అని అంతా అనుకున్నారు. ఇక్కడే మ్యాచ్ అనూహ్య మలుపులు తిరిగింది. సౌత్ ఆస్ట్రేలియా జట్టు చివరి ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పరుగు తేడాతో ఓటమిపాలైంది. టాస్మానియా బౌలర్ కోయటే ఆఖరి ఓవర్లో మ్యాజిక్ చేసింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టడంతో పాటు రెండు రనౌట్లు చేసి తన జట్టును వరుసగా రెండో ఏడాది ఛాంపియన్గా నిలబెట్టింది. -
కాకినాడ జిల్లా అనపర్తిలో చంద్రబాబు హైడ్రామా
-
చంద్రబాబు హైడ్రామా.. రెచ్చగొట్టే ప్రసంగాలతో.. విద్వేషాలు రగిల్చేలా..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రజలను రెచ్చగొట్టేలా.. స్థానికంగా విద్వేషాలు రగిల్చేలా.. స్థానిక ప్రజాప్రతినిధులను చులకన చేసి ఇష్టానుసారంగా మాట్లాడుతూ చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగింది. ప్రతి చోటా హైడ్రామా సృష్టించి టీడీపీ కేడర్ గందరగోళం చేయడానికి ప్రయత్నించింది. పర్యావసానంగా కొయ్యలగూడెం మండలంలో చంద్రబాబుకు తీవ్రస్థాయిలో నిరసన సెగ తగిలింది. గో బ్యాక్ బాబు అంటూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, స్థానికులు ప్లకార్డులు చూపారు. మొత్తం మీద ఏలూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన నిరసనలు, స్వల్ప ఉద్రిక్తతలు, ధర్నాల నడుమ ముగిసింది. రెచ్చగొట్టే ప్రసంగాలతో.. కొయ్యలగూడెంలో చంద్రబాబు బీసీ సదస్సులో మాట్లాడి రోడ్షో ప్రారంభించి ప్రతి చోటా ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. అధినేతే అలా మాట్లాడుతుండటంతో టీడీపీ శ్రేణులు మరింతగా రెచ్చిపోయారు. కొయ్యలగూడెంలో చంద్రబాబుకు గో బ్యాక్ అంటూ వైఎస్సార్ సీపీ శ్రేణులు నిరసన తెలియజేయడంతో రెచ్చిపోయిన టీడీపీ కేడర్ వారిపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు మూర్తిరాజు తలకు గాయమైంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో టీడీపీ రోడ్షో కొనసాగింది. అక్కడ నుంచి పోలవరం చేరుకున్న చంద్రబాబు నానా హడావుడి చేశారు. నా మానసపుత్రిక అయిన ప్రాజెక్టును చూడటానికి నన్నే అనుమతించరా అంటూ మహిళా డీఎస్పీపై మండిపడ్డారు. ప్రాజెక్టులో పనులు జరుగుతున్న క్రమంలో సందర్శించడానికి పోలీసు అనుమతి తప్పనిసరని, ముందుగా అనుమతి తీసుకోవాలని, పైగా మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా అనుమతించడం లేదని చంద్రబాబుకు డీఎస్పీ చెప్పినా హడావుడి చేసి పెద్ద పెద్ద కేకలు వేసి టీడీపీ నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు సీరియస్గా పట్టించుకోకపోవడంతో 15 నిమిషాలు తర్వాత అక్కడ నుంచి లేచి వెళ్లి సభలో మాట్లాడి కొవ్వూరుకు చంద్రబాబు పయనమయ్యారు. ప్రతి చోటా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని తీవ్రస్థాయిలో దూషించడంతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు లక్ష్యంగా విమర్శలు ఆయన చేశారు. చదవండి: చంద్రబాబుకు చాదస్తం మరీ ఎక్కువైంది -
అర్ధరాత్రి ఐటీ అధికారుల ల్యాప్టాప్పై హైడ్రామా.. అసలేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, బంధువులు, భాగస్వాముల ఇళ్లలో, విద్యా సంస్థల్లో ఐటీ అధికారుల దాడులు ముగిశాయి. భారీగా నగదుతో పాటు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో పన్ను ఎగవేతకు సంబంధించిన కీలక సమాచారం లభించినట్లు తెలిసింది. కాగా, అర్ధరాత్రి ఐటీ అధికారుల ల్యాప్ టాప్పై హైడ్రామా చోటుచేసుకుంది. మొదట ఆసుపత్రిలో ఐటీ అధికారి రత్నాకర్ ల్యాప్టాప్ వదిలివెళ్లారు. రత్నాకర్ను బోయిన్పల్లి పీఎస్కు మంత్రి మల్లా రెడ్డి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో ఉండిపోయిన ల్యాప్టాప్ను మల్లా రెడ్డి అనుచరులు పీఎస్కు తీసుకుని వచ్చారు. అప్పటికే పోలీస్ స్టేషన్ను కేంద్ర బలగాలు తమ ఆధీనంలో ఉంచుకున్నాయి. ల్యాప్టాప్ను లోపలికి తీసుకెళ్లేందుకు మల్లారెడ్డి అనుచరులు ప్రయత్నించారు. బోయినపల్లికి చెందిన కానిస్టేబుల్.. ల్యాప్టాప్ను లోపలికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానిస్టేబుల్ను అడ్డుకున్న కేంద్ర బలగాలు.. ల్యాప్టాప్ను బయటే పెట్టించాయి. బోయినపల్లి పీఎస్ గేటు ముందే ల్యాప్టాప్ను మంత్రి అనుచరులు వదిలి వెళ్లారు. మల్లారెడ్డిపై ఐటీ అధికారులు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ను కేంద్ర బలగాలు ఖాళీ చేశాయి. కేంద్ర బలగాలు వెళ్లిన తర్వాత ల్యాప్టాప్ను బోయినపల్లి పీఎస్ లోపలికి పోలీసులు తీసుకెళ్లారు. ప్రస్తుతం బోయినపల్లి పీఎస్లోనే ల్యాప్టాప్ ఉంది. చదవండి: మంత్రి మల్లారెడ్డికి ఐటీ నోటీసులు.. సోదాల్లో ఎంత నగదు దొరికిందంటే? -
యనమలకుదురు వంతెన విషయంలో టీడీపీ డ్రామాలు
-
కుప్పంలో టీడీపీ మరో డ్రామా
-
అనంతపురం జిల్లాలో ప్రేమ..పెళ్లి హైడ్రామా
-
అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ డ్రామాలు
-
కర్ణాటక అసెంబ్లీలో హైడ్రామా
-
ఉదయం దీక్ష.. మధ్యాహ్నం ఫైట్!
సాక్షి, అమరావతి/ఉయ్యూరు (పెనమలూరు)/గుడివాడ/ఉంగుటూరు (గన్నవరం): ఉద్యోగులు, ఉపాధ్యాయుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు ఆ పార్టీ నేతలు మంగళవారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టారు. ఎంపీ సీఎం రమేష్, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీలు మాధవ్, వాకాటి నారాయణరెడ్డి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణ రాజు, విష్ణువర్దన్రెడ్డి దీక్షలో పాల్గొన్నారు. ఉద్యోగులను ప్రభుత్వం రోడ్డు మీదకు తీసుకొచ్చిందని సోము వీర్రాజు ఆరోపించారు. కాగా, దీక్షను మధ్యాహ్నానికి విరమించి, బీజేపీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామంటూ సోము నేతృత్వంలో పార్టీ నేతలు గుడివాడకు బయలుదేరి వెళ్లారు. నందమూరు అడ్డరోడ్డు వద్ద హైడ్రామా గుడివాడలో సంక్రాంతి సంబరాలను టీడీపీ వివాదాస్పదంగా మార్చింది. దీనికి వంతపాడుతూ గుడివాడ పర్యటనకు బయలుదేరిన బీజేపీ నాయకులను నందమూరు అడ్డరోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సోము వీర్రాజు, విష్ణువర్దన్రెడ్డి, సీఎం రమేష్ సహా 35 మంది బీజేపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ శ్రేణులు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగి, ఘర్షణకు దిగారు. వీర్రాజుతో పాటు 18 మందిని ఉంగుటూరు స్టేషన్కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. వీర్రాజు మాట్లాడుతూ.. తాము చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడకున్నా అరెస్టు చేయడం దారుణమన్నారు. ఎందుకు అడ్డుకున్నారు? బీజేపీ ఎంపీ జీవీఎల్ సాక్షి, న్యూఢిల్లీ: సంక్రాంతి కార్యక్రమాల ముగింపు వేడుకలకు కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలోని బీజేపీ నేతల బృందం గుడివాడ వెళ్తుంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అసలు బీజేపీ బృందాన్ని ఎందుకు అడ్డుకున్నారని, అరెస్ట్ చేసి బయటకు తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పోలీసుల ప్రవర్తన చూస్తే ఎంత అరాచకంగా వ్యవహరించారో తెలిసిపోతుందన్నారు. ముగ్గుల పోటీలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలంటే వైఎస్సార్సీపీ నేతలకు చేదా అని అడిగారు. -
వనమా రాఘవేందర్ అరెస్టుపై హైడ్రామా!
సాక్షి,భద్రాద్రి కొత్తగూడెం: రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఉదంతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేందర్రావు అరెస్టుపై హైడ్రామా కొనసాగుతోంది. కొత్తగూడెం పోలీసులు గురువా రం మధ్యాహ్నం రాఘవేందర్ను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నట్లు ప్రసార మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. స్వయంగా ఎమ్మెల్యేనే తన కుమారుడిని పోలీసులకు అప్పగించారని, విచారణ నిమిత్తం రాఘవేందర్ను పోలీసులు కొత్తగూడెం తీసుకెళ్లారనే ప్రచారం సాగింది. కానీ రాత్రి వరకు జిల్లా పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో మీడి యాతో మాట్లాడిన పాల్వంచ ఏఎస్పీ రోహిత్రాజ్.. రాఘవేందర్ కోసం తెలంగాణ, ఏపీలో ఎనిమిది ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. ఆయన గత నేరచరిత్రనూ వెలికితీసి పాత కేసులకు సంబంధించి స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తామని తెలిపారు. అంతే కాకుండా రౌడీషీట్ తెరుస్తామని వెల్లడించారు. ఒకవేళ రాఘవేందర్ బెయిల్ పిటిషన్ దాఖలుచేసినా గట్టిగా కౌంటర్ దాఖలు చేస్తామని ఏఎస్పీ చెప్పారు. కాగా, వీలైనంత త్వర లో అతడిని పట్టుకుని కోర్టులో హాజరుపరుస్తామని ఎస్పీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కేసులో కీలకంగా కారు ఇదిలాఉంటే.. రామకృష్ణకు చెందిన కారు (ఏపీ 28 బీ2889) ఈ కేసును కీలక మలుపు తిప్పింది. భార్య, ఇద్దరు పిల్లలతో సహా తానూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న రామకృష్ణ.. తన కారులోనే ఆత్మహత్యకు కారణాలపై సెల్ఫీ వీడియో చిత్రీకరించారు. అనంతరం ఫోన్ను అదే కారులో పెట్టారు. ఇటు సూసైడ్ నోట్ కూడా పోలీసులకు రామకృష్ణ కారు నుంచే లభ్యమైంది. ఫోన్, సూసైడ్ నోట్ తన తల్లి, సోదరికి చిక్కుతుందనుకున్నారో లేక మంటల్లో కాలి సాక్ష్యాలు పోలీసులకు దొరకవనుకున్నారో తెలియదు గానీ.. ఫోన్, సూసైడ్ నోట్ను కారులోనే ఉంచి ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
గుంటూరు జీజీహెచ్ వద్ద టీడీపీ హైడ్రామా
-
మాజీ మంత్రి ‘కాలవ’ హైడ్రామా
బొమ్మనహాళ్(అనంతపురం జిల్లా): అనుమతుల్లేకుండా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టిన మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులును పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు... పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించాలంటూ ఉద్దేహాళ్ నుంచి బొమ్మనహాళ్కు పాదయాత్ర చేపట్టారు. ఇందుకు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు పొందలేదు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి, అనుచరులతో కలిసి పాదయాత్రగా ఉప్పరహాళ్ క్రాస్ వద్దకు చేరుకున్న కాలవను కళ్యాణ దుర్గం ఇన్చార్జ్ డీఎస్పీ ఆంథోనప్ప, సీఐ రాజా, ఎస్ఐలు రమణారెడ్డి, రామకృష్ణారెడ్డి కలిసి మాట్లాడారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ పాదయాత్ర చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. విషయం ఏదైనా నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం అందజేయాలని సూచించారు. దీనిపై హైడ్రామాకు కాలవ తెరలేపారు. ఇష్టం వచ్చిన రీతిలో పాదయాత్రలు, నిరసనలు, ధర్నాలు చేపడతామని, తమను ఎవరూ అడ్డుకోలేరంటూ వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో చివరకు అరెస్ట్ చేసి, కణేకల్లు పోలీసు స్టేషన్కు తరలించారు. కాగా, పాదయాత్రకు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తమనుంచి ఎలాంటి అనుమ తులు తీసుకోలేదని డీఎస్పీ ఆంథోనప్ప తేల్చిచెప్పారు. శనివారం సాయంత్రం బొమ్మనహాళ్ ఎస్ఐ రమణారెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో వినతిపత్రాలు అందజేశారని, బొమ్మనహాళ్ మండలంలో ఇందుకు విరుద్ధంగా పాదయాత్ర చేస్తూ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శ్రీనివాసులును అరెస్ట్ చేసి, సాయంత్రం సొంత పూచీకత్తుపై విడిచిపెట్టినట్లు పేర్కొన్నారు. ఇవీ చదవండి: ఎక్కువగా బిర్యానీ, ఫాస్ట్ఫుడ్ తింటున్నారా.. ఈ సమస్య రావొచ్చు చిన్న పత్రికలకు అక్రిడిటేషన్ నిబంధనల సవరణ -
‘కత్తులు దూసి.. కరచాలనంతో కలిసి’
జైపూర్ : కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వంతో సంప్రదింపుల అనంతరం తిరిగి పార్టీ గూటికి చేరిన తిరుగుబాటు నేత సచిన్ పైలట్ రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ను గురువారం ఆయన నివాసంలో కలిశారు. పైలట్ తిరుగుబాటుతో రాజస్తాన్లో నెల రోజులు పైగా రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. రాజస్తాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అశోక్ గహ్లోత్ నివాసంలో ఏర్పాటైన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి సచిన్ పైలట్ హాజరయ్యారు. పైలట్ను సాదరంగా ఆహ్వానించిన గహ్లోత్ చిరునవ్వులు చిందిస్తూ యువనేతతో కరచాలనం చేశారు. ఈ భేటీలో ఇరువురు నేతలు పక్కపక్కనే కూర్చున్నారు. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో గహ్లోత్ సర్కార్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని బీజేపీ వెల్లడించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, పైలట్ సహా ఆయనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలందరూ సీఎల్పీ సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాధ్రాలతో సంప్రదింపుల అనంతరం పైలట్ సొంతగూటికి తిరిగివచ్చేందుకు అంగీకరించిన సంగతి తెలసిందే. పైలట్ పార్టీ ముందుంచిన ప్రధాన డిమాండ్లనూ నెరవేర్చుతామని హైకమాండ్ ఆయనకు హామీ ఇచ్చింది. రెబెల్ నేతలు తిరిగి పార్టీలోకి రావడంతో వారిని మన్నించి ముందుకు సాగుదామని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కోరారు. మరోవైపు రాజస్తాన్లో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ను కాంగ్రెస్ అధిష్టానం రాజస్తాన్కు పంపింది. 200 మంది సభ్యులు కలిగిన రాజస్తాన్ అసెంబ్లీలో మెజారిటీకి 101 మంది సభ్యులు అవసరం కాగా, కాంగ్రెస్ పార్టీకి 107 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇండిపెండెంట్లు, చిన్నపార్టీల ఎమ్మెల్యేలు కలుపుకుని ఆ పార్టీకి 125 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇక విపక్ష బీజేపీకి 72 మంది ఎమ్మెల్యేలున్నారు. చదవండి : రాజస్తాన్: కుటుంబ పెద్దపై అలకబూనాం అంతే! #WATCH Jaipur: Congress leader Sachin Pilot meets CM Ashok Gehlot at his residence. Congress Legislature Party meeting to take place here, ahead of the special session of the #Rajasthan Assembly tomorrow. pic.twitter.com/0pIZ1vr2dM — ANI (@ANI) August 13, 2020 -
రాజస్తాన్ హైడ్రామా : కేబినెట్ భేటీ షురూ
జైపూర్ : రాజస్తాన్లో అశోక్ గహ్లోత్ సర్కార్పై ఆ పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ తిరుగుబాటుతో నెలకొన్న రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. అసెంబ్లీ సమావేశాలపై కేబినెట్ నుంచి తాజా ప్రతిపాదనను గవర్నర్ కల్రాజ్ మిశ్రా కోరడంతో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ నేతృత్వంలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. గవర్నర్ పంపిన మార్గదర్శకాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై గవర్నర్కు మంత్రిమండలి మరోసారి విజ్ఞప్తి చేస్తుందని గహ్లోత్ శిబిరం పేర్కొంది. కాగా అసెంబ్లీని సమావేశపరచాలని అంతకుముందు ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను తోసిపుచ్చుతూ గవర్నర్ పంపిన నోట్లో పలు అంశాలను ప్రస్తావించారు. ఆ నోట్లో ‘21 రోజుల నోటీస్ వ్యవధికి ప్రభుత్వం అంగీకరిస్తే శాసనసభను సమావేశపర్చవచ్చు. లేదా, సమావేశం ఎజెండా బలనిరూపణే అయితే, ఆ నోటీస్ కాల వ్యవధిని తగ్గించవచ్చు. ఒకవేళ విశ్వాస పరీక్ష జరిగితే.. ఆ మొత్తం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాల’ని పేర్కొన్నారు. అయితే రాజస్తాన్ అసెంబ్లీలో బీజేపీ తన పరిస్థితి మెరుగుపర్చుకునేందుకు అసెంబ్లీ సమావేశాలకు ముందు 21 రోజుల నోటీసు ఇవ్వాలన్న నిబంధనను తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ ఆరోపించింది. ఇది ప్రలోభాలకు ఆస్కారం ఇచ్చినట్టేనని, కాంగ్రెస్ సహా మిత్రపక్షాలు ఇలాంటి కుట్రలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ సీనియర్ నేత అధీర్ రంజన్ పేర్కొన్నారు. కాగా బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనంపై కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్కు గుణపాఠం చెబుతామని విలీనాన్ని సవాల్ చేస్తూ న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన ఆ పార్టీ అధినేత్రి మాయావతి హెచ్చరించారు. ఇక కాంగ్రెస్లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఓ బీజేపీ ఎమ్మెల్యే రాజస్తాన్ హైకోర్టులో మంగళవారం తాజా పిటిషన్ దాఖలు చేశారు. చదవండి : మళ్లీ మార్చి పంపండి! -
రాజస్తాన్ హైడ్రామా : స్పీకర్ పిటిషన్ వెనక్కి..
జైపూర్ : రాజస్తాన్లో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. అశోక్ గహ్లోత్ సర్కార్పై సచిన్ పైలట్ తిరుగుబాటుతో నెలకొన్న ఉత్కంఠకు తెరపడలేదు. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ సహా అసంతృప్త ఎమ్మెల్యేలకు జారీచేసిన అనర్హత పిటిషన్లపై హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను రాజస్తాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ సోమవారం ఉపసంహరించుకున్నారు. మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్తో పాటు ఆయనకు మద్దతిస్తున్న 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ప్రక్రియను వాయిదా వేయాలని ఈనెల 21న రాజస్ధాన్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ స్పీకర్ సీపీ జోషీ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రాజస్తాన్ హైకోర్టు ఈనెల 24న యథాతథ స్ధితి కొనసాగించాలని ఆదేశిస్తూ జారీ చేసిన సమగ్ర ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు లేవనెత్తిన న్యాయపరమైన అంశాలన్నింటినీ ప్రస్తావించినందున ఈ పిటిషన్ను ఉపసంహరించేందుకు అనుమతించాలని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ను స్పీకర్ సీపీ జోషీ కోరారు. జోషీ తరపు న్యాయవాది కపిల్ సిబల్ వినతి మేరకు పిటిషన్ ఉపసంహరణకు అనుమతించేందుకు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కృష్ణ మురారి సభ్యులుగా ఉన్న సుప్రీంకోర్టు బెంచ్ అంగీకరించింది. మరోవైపు రాజస్తాన్ అసెంబ్లీ సమావేశాలను జూలై 31 నుంచి ప్రారంభించాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కేబినెట్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాకు పంపిన ప్రతిపాదనను గవర్నర్ తోసిపుచ్చారు. కేంద్రం ఒత్తిడికారణంగానే గవర్నర్ అసెంబ్లీని సమావేశపర్చే నిర్ణయం తీసుకోవడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. అర్థం లేని కారణాలు చూపుతూ అసెంబ్లీని సమావేశపర్చడం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి అభి షేక్ సింఘ్వీ విమర్శించారు. మరోవైపు... ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడాన్ని తప్పుబడుతూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ను రాజస్తాన్ హైకోర్టు నేడు విచారించనుంది. ఈ క్రమంలో బీఎస్పీ సైతం ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చదవండి : ప్రధాని ఎదుట ధర్నా చేస్తాం -
జగ్గయ్యపేటలో అర్ధరాత్రి హైడ్రామా
-
గవర్నర్ గో బ్యాక్.. సభలో తీవ్ర గందరగోళం
తిరువనంతపురం: అత్యంత హైడ్రామా నడుమ కేరళ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉయదం ప్రారంభమయ్యాయి. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు నిరసనకు దిగడం.. యాంటీ సీఏఏ పోస్టర్లు పట్టుకొని.. ‘గవర్నర్.. గో బ్యాక్’ నినాదాలు చేయడంతో సభ దద్దరిల్లిపోయింది. దీంతో మార్షల్స్ రంగప్రవేశం చేసి.. నిరసనకు దిగిన ఎమ్మెల్యేలను బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. మార్షల్స్ భద్రత మధ్య అసెంబ్లీలోకి ప్రవేశించిన గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్.. తనను ఉద్దేశించి నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలకు చేతులు జోడించి ‘కృతజ్ఞతలు’ తెలిపారు. ఆయనకు ఇరువైపుల సీఎం పినరయి విజయన్, స్పీకర్ పీ శ్రీరామకృష్ణన్ ఉన్నారు. మార్షల్ భద్రత నడుమ గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆయన ప్రసంగం ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ.. సభ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీ గేటు వద్దకు చేరుకొని వారు ధర్నాకు దిగారు. సీఎం చదవమన్నారని.. చదువుతున్నా! తన ప్రసంగంలో భాగంగా సీఏఏ వ్యతిరేక తీర్మానంలోని కొంతభాగాన్ని గవర్నర్ చదివి వినిపించారు. అయితే, ఇది తన అభిప్రాయం కాదని, కేవలం ప్రభుత్వ అభిప్రాయం మాత్రమేనని, ప్రభుత్వ అభిప్రాయంతో ఏకీభవించనప్పటికీ.. సీఎం కోరిక మేరకు, ఆయన దీనిని నేను చదవాలని కోరుతున్నందుకే చదివి వినిపించానని గవర్నర్ ఖాన్ వివరించారు. సీఏఏకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో సీఎం విజయన్కు, గవర్నర్ ఖాన్కు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. విజయన్ సర్కారు తీరును గవర్నర్ బాహాటంగానే తప్పుబడుతున్నారు. -
టీడీపీ నేత కోడెల డ్రామా..
-
నూజివీడులో ‘టీడీపీ’ హైడ్రామా
నూజివీడు: పట్టణంలో పురపాలక సంఘం చేపట్టిన పలు సిమెంట్ రోడ్ల ప్రారంభోత్సవాలను ఎమ్మెల్యే ప్రతాప్ శనివారం నిర్వహిస్తుండగా, అడ్డుకునేందుకు కొందరు టీడీపీ కార్యకర్తలు హైడ్రామా నడిపించారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలో పూర్తి చేసిన అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను శని వారం పురపాలక సంఘం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావ్ నెహ్రూపేటలోని సిమెంట్ రోడ్డును ప్రారంభించేందుకు వెళ్లారు. ఎమ్మెల్యే అక్కడకు చేరుకున్న సమయంలో అదే ప్రాంతంలో ఉన్న టీడీపీ పట్టణ కార్యదర్శి మోచర్ల కృష్ణంరాజు, అతని అనుచరులు ఎమ్మెల్యేపై నినాదాలు చేశారు. అయినా అవేమీ పట్టించుకోకుండా ఎమ్మెల్యే అక్కడ ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం సిమెంట్ రోడ్డు ప్రారంభించేందుకు రాగా టీడీపీ కార్యకర్తలు శిలాఫలకానికి అడ్డుగా నిల్చుని నినాదాలు చేశారు. ఒకదశలోతోపులాట, వాగ్వాదం చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్యే సంయమనం.. తనపై నినాదాలు చేస్తున్నా దాదాపు 300మందికి పైగా కార్యకర్తలు వెంట ఉన్నా ఎమ్మెల్యే ప్రతాప్ చా లాసేపు సంయమనం పాటించారు. కార్యకర్తలు, నా యకులను కూడా శాంతంగాఉండమని సూచించారు. మునిసిపాలిటీ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయలే దని టీడీపీ కార్యకర్తలు కేకలు వేయడంతో అప్పటి కప్పుడు డీఈ సత్యన్నారాయణను పిలిపించి వివరా లు వెల్లడించమన్నారు. చైర్పర్సన్, కమిషనర్ల ఆదేశం మేరకే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డీఈ చెప్ప డంతో పోలీసులు కార్యకర్తలను పంపించి వేశారు. కాగా, ఎమ్మెల్యే వెళ్లాక సీఐ రామ్కుమార్.. టీడీపీ పట్టణ కార్యదర్శి కృష్ణంరాజు, అతని అనుచరుల వద్దకు వెళ్లి ప్రారంభోత్సవాలను అడ్డుకోలేకపోయారంటూ ఎద్దేవా చేయడం వివాదాస్పదంగా మారింది. -
ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్!?
కారంచేడు: గుండుతో ఉన్న వ్యక్తి తమకు ఏవో కొనిస్తామని ఆశ చూపి బాపట్లలో కిడ్నాప్ చేయడంతో భయపడి తప్పించుకొచ్చామని ఇద్దరు విద్యార్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం వేకువ జాము వరకు కారంచేడు పోలీసుస్టేషన్ వద్ద హైడ్రామా నడిచింది. వివరాల్లోకి వెళితే... పర్చూరు మండలం గర్నెపూడికి చెందిన పులి నరేష్ కుమారుడు ఆకాష్, గుంటూరు జిల్లా బాపట్ల మండలం కర్లపాలేనికి చెందిన జాలాది ఆనంద్ కుమారుడు జాన్వెస్లీలు గుంటూరు జిల్లా బాపట్ల మూర్తినగర్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. వీరు శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో కారంచేడు పోలీస్స్టేషన్ సమీపంలో సంచరిస్తుంటే డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ప్రసన్నకుమార్ గమనించాడు. మీరు ఎవరు? ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారని ప్రశ్నించడంతో తమను ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి చీరాల వైపు తీసుకెళ్తుంటే తప్పించుకొచ్చామని చెప్పారు. వెంటనే స్పందించిన ప్రసన్నకుమార్ స్థానిక ఎస్ఐతో పాటు ఉన్నతాధికారులకు సమాచారం అందించి అందరినీ అలర్ట్ చేశాడు. ఉన్నతాధికారుల సూచన మేరకు చిన్నారులిద్దరినీ పోలీస్స్టేషన్కు తీసుకొచ్చి విచారించారు. వారు కొద్ది సేపు పొంతన లేని సమాధానాలు చెప్పారు. అప్పటికే వారు ఆకలితో ఉండటంతో ఆ సమయంలో స్టేషన్ సమీపంలోని చిల్లర దుకాణం తెరిపించి చిరుతిళ్లు తినిపించారు. ఆకలి తీరిన తర్వాత ప్రసన్నకుమార్ వారిని నిదానంగా విచారించాడు. అప్పుడు వారు తమ హాస్టల్లోని టీచర్ కొడుతుండటంతో హాస్టల్ నుంచి పారిపోయి వచ్చామని అంగీకరించారు. వెంటనే బాపట్ల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హాస్టల్ నిర్వాహకులు వేకువ జామున 4 గంటలకు వచ్చి విద్యార్థులను తీసుకెళ్లారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థులను గమనించి గంటల సమయంలో వారిని గమ్య స్థానాలకు సురక్షితంగా చేర్చడంలో చకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ ప్రసన్నకుమార్ను, ఆయనకు సహకరించిన వెంకట్రావును ఉన్నతాధికారులు, సిబ్బంది, హాస్టల్ నిర్వాహకులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. -
బురిడీ బాబా హైడ్రామా
నెల్లూరు (వేదాయపాళెం): ఆధ్యాత్మిక ముసుగులో భక్తులను నయవంచనకు గురిచేసిన సుధాకర్ మహరాజ్ అలియాస్ టీచర్ సుధాకర్ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు హైడ్రామా ఆడుతున్నారు. గత 13 రోజులుగా నగరంలోని సింహపురి ఆస్పత్రిలో వైద్యం పేరిట అజ్ఞాతంలోకి వెళ్లారు. వైద్య చికిత్సలకు సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితిని బహిర్గతం చేయాల్సిన వైద్యులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరురూరల్ పోలీసులు కూడా కేసు దర్యాప్తును నీరుగారుస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. నగరంలోని ప్రశాంతినగర్లో ఉన్న సుధాకర్ మహరాజ్ ఆశ్రమంలో మంత్ర పీటం పేరిట 262 భక్తుల నుంచి రూ.3.72 కోట్ల వసూళ్లకు పాల్పడిన వ్యక్తులు అజ్ఞాతంలోకి వెళ్లిన వైనం గత నెల 15న వెలుగుచూసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మోసపోయిన బాధితులు న్యాయం కోసం నెల్లూరు రూరల్ పోలీస్స్టేషన్, జిల్లా ఎస్పీలను కలిసి కోరుతున్నారు. అయితే నెల్లూరూరల్ పోలీసులు సుధాకర్మహరాజ్తోపాటు ఇందులో భాగస్వామ్యమైన వాసవి, భాస్కర్, నారాయణరెడ్డి, యశ్వంత్ సింగ్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సుధాకర్ మహరాజ్ ఆశ్రమం కార్యాలయంలో పనిచేసే సాయి, శ్రీనుపై కూడా విచారణ చేపడుతున్నారు. రాజకీయ నాయకులు, ప్రముఖులతో సుధాకర్కు పరిచయాలు, సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో వీరి ఒత్తిడి పోలీసులపై ఉన్నట్లు తెలుస్తోంది. వాసవి, మిగతా వ్యక్తులు 13 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ పోలీసులు వీరి జాడను గుర్తించలేకపోతున్నారు. కళ్ల ముందు కనిపించే సుధాకర్ను సైతం ప్రశ్నించేందుకు చొరవ చూపడం లేదు. ఆస్పత్రిలో చేరిన కొద్ది రోజులు ఇంటెన్సీవ్ కేర్లో ఉన్న సుధాకర్ను ఇటీవల ప్రత్యేక గదిలోకి మార్చారు. సుధాకర్ అల్లుడు సంపత్ ఆస్పత్రి వద్ద ఉంటూ ఎవరినీ గదిలోకి పంపటం లేదు. నెల్లూరురూరల్ సీఐ శ్రీనివాసులు రెడ్డి ఒకటి రెండు సార్లు సుధాకర్ను విచారించేందుకు గదిలోకి వెళ్లినప్పటికీ సుధాకర్ సైగలు చేస్తూ సమాధానం చెప్పకపోవడంతో సీఐ వెనుదిరగాల్సి వచ్చింది. చిన్నపాటి దొంగతనాలు చేసే వ్యక్తులతో ఎంతో కఠనంగా వ్యవహరించే పోలీసులు బడా మోసానికి పాల్పడిన సుధాకర్ను తమదైన శైలిలో పోలీసులు ఎందుకు విచారణ సాగించడం లేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే సింహపురి ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులను సుధాకర్ ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని పోలీసులు కోరుతున్నప్పటికీ పోలీసులకు ఎలాంటి నివేదికలు అందలేదు. ఆస్పత్రిలో ఆశ్రయం పొందుతూ వైద్యం పేరిట సుధాకర్ బాధితుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కోర్టు ద్వారా బెయిల్ కోసం ప్రముఖ లాయర్లు ద్వారా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బెయిల్ వచ్చే వరకు ఆస్పత్రిలోనే ఉంటూ కాలయాపన చేయాలనే భావనలో ఉన్నట్లు తెలుస్తుంది. బాధితులకు న్యాయం చేసే దిశగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. మీడియా ప్రతినిధులు భాగస్వాములే నగరంలోని కొన్ని చానళ్ల ప్రతి నిధులు, పత్రికల విలేకరులు కూడా సుధాకర్ మహరాజ్కు కొమ్ము కాశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఓ చానల్లో పనిచేస్తున్న భాస్కర్ అనే వ్యక్తి భక్తుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డాడు. నెల్లూరురూరల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయివుంది. నిందితుడు ఫరారీలో ఉన్నాడు. ఇదే తరహాలో పలు పత్రికల విలేకరుల కూడా సుధాకర్తో కుమ్మక్కు అయినట్లు తెలుస్తుంది. సుధాకర్తో సంబంధాలు ఉన్న మీడియా వారి వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పురుగు మందు ఆశ్రమంలోకి ఎలా వచ్చింది!. సుధాకర్ ఆశ్రమంలో మోసాలు వెలుగు చూడడంతో ఒక్కసారిగా సుధాకర్ పురుగుమందు తాగాడని పెద్ద ఎత్తున హైడ్రామా ఆడుతూ హుటాహుటిన సింహపురి ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ప్రశాంతతకు నెలవైన ఆశ్రమంలో పురుగు మందు డబ్బా ముందుగా ఎందుకు తేవాల్సి వచ్చిందో తెలియాల్సి ఉంది. ముందుగానే ఓ పథకం ప్రకారం పురుగు మందు డబ్బాను తెచ్చి ఉంచినట్లు తెలుస్తుంది. పరిస్థితి తల కిందులైనప్పుడు హైడ్రామాకు పురుగు మందు డబ్బా ఉపయోగపడుతుందని ముందస్తు వ్యూహంలో భాగంగానే వ్యవహరించారని తెలుస్తుంది. -
అదే హై డ్రామా..!
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని పూల మార్కెట్ విషయంలో నెలకొన్న వివాదంలో ఆదివారం కూడా నాటకీయ పరిణామాలు నెలకొన్నాయి. పూల మార్కెట్ వద్ద మాజీ ఎమ్మెల్యే సీకే బాబు మళ్లీ నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సీకే బాబు ఉంటున్న కట్టమంచికి ఆదివారం ఉదయం నుంచే పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పూల మా ర్కెట్ వద్దకు వెళ్లేట్లయితే అదుపులోకి తీసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. సీకే బాబు పలమనేరు రోడ్డులోని క్లబ్ వద్దకు చేరుకున్నారు. ఆయన్ను 50 మంది వరకు పోలీసులు వెంబడించారు. తనను ఎందుకు అనుసరిస్తున్నారని సీకేబాబు పోలీసులను ప్రశ్నించారు. తన వెంట రావద్దని సూచించారు. ఇక టీడీపీ నేతలు సైతం ఎమ్మెల్సీ దొరబాబు కార్యాలయం వద్ద సమాలోచనలు జరిపారు. అటు నుంచి ఎమ్మెల్యే సత్యప్రభ, మేయర్ హేమలత, జిల్లా టీడీపీ అధ్యక్షుడు నాని తదితరులు కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకు ని నగర అభివృద్ధిపై కమిషనర్తో చర్చిం చారు. పూల మార్కెట్ విషయంలో వెన క్కు తగ్గకూడదని నిర్ణయం తీసుకున్నారు. పేదల కడుపుకొట్టొద్దు.. 11 గంటల ప్రాంతంలో సీకే బాబు వన్టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ డీఎస్పీ సుబ్బారావుతో మాట్లాడారు. పూల మార్కెట్ను అక్కడే ఉంచి పేదలకు న్యాయం చేయాలని కోరారు. అలా కానిపక్షంలో పాత బస్టాండులో తాత్కాలికంగా దుకాణాల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని సూచించారు. పేదల కడుపుకొట్టకుండా హుందాగా వ్యవహరిం చాలని కోరారు. దీనిపై స్పందించిన డీఎస్పీ మార్కెట్ తరలింపుపై నగరపాలక సంస్థ నిర్ణయం మేరకు మునిసిపల్ కమిషనర్ ఇక్కడ దుకాణాలు ఉంచకూడదని, పోలీసు బందోబస్తు కల్పించాలని తమకు లేఖ రాశారని తెలిపారు. ఇక్కడ దుకాణా లు పెడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటా మన్నారు. ఈ పరిణామాలపై ప్రజాకోర్టులో తేల్చుకుంటామని చెప్పి సీకే బాబు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 30 మందిపై కేసులు.. డీఎస్పీ సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ మున్సిపాలిటీ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూల మార్కెట్ వద్ద జేసీబీ తీసుకొచ్చి స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించిన 30 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. ఇందులో సీకే బాబు సైతం ఉన్నారని పేర్కొన్నారు. అలాగే కార్తీక్, భాస్కర్, మణి, ప్రదీప్, సురేష్, రవి, షేరు, కార్పొరేటర్ చందు, అఫ్జల్ఖాన్, జీవరత్నం, అమీర్ అబ్బాస్, కిశోర్, శ్రీనివాస్ తదితరులను శనివారం రాత్రే అదుపులోకి తీసుకున్నామని చెప్పా రు. వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచామన్నారు. వారికి 14 రోజుల రిమాండుకు ఆదేశించడంతో చిత్తూరు జిల్లాకు జైలుకు తరలించారు. -
వెంకటాపురంలో హైడ్రామా
పశ్చిమగోదావరి , ఏలూరు రూరల్: ఏలూరు మండలం వెంకటాపురం పం చాయతీలో మంగళవారం హైడ్రామా నడిచింది. మధ్యాహ్నం 2 గంటలకు పంచాయతీ కార్యాయలంలో పాలకవర్గ సమావేశం జరగాల్సి ఉంది. అయితే సమావేశానికి హాజరుకా వాల్సిన మాజీ సర్పంచ్ రెడ్డి అప్పలనాయుడుకు మద్దతు ఇచ్చిన వార్డు సభ్యులను టీడీపీ నాయకులు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వదంతులు హల్చల్ చేశాయి. ఈ విషయాన్ని కొందరు వార్డు సభ్యులు స్వయంగా మీడియాకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో గ్రామంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో మధ్యాహ్నం 1 గంట సమయంలో సర్పంచ్ చెరుకూరి దీప్తిఉష స మావేశానికి హాజరుకావడం లేదంటూ ఇన్చార్జి కార్యదర్శి రత్నం సమావేశాన్ని వాయిదా వేశామని వెల్లడించారు. దీంతో అప్పటికే వచ్చిన అప్పలనాయుడు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేసి వెనుదిరిగారు. గంట ముందు వాయిదా నోటీసు అందిస్తారా అంటూ ప్రశ్నించారు. పరువు కోసం పాకులాట టీడీపీ నుంచి బహిష్కృతుడైన రెడ్డి అప్పలనాయుడుకు మద్దతుగా 9 మంది వార్డు సభ్యులు పార్టీకి రాజీనామా చేయడం ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జికి సవాల్గా మారింది. గ్రామంలో 3.27 ఎకరాల్లో ఏర్పాటుచేసే లే–అవుట్, కొత్తగా నిర్మించతలపెట్టిన మూడు అపార్ట్మెంట్లకు అనుమతి ఇస్తూ అజెం డాలో పేర్కొన్న అంశాలకు తీర్మానాలు ఇవ్వాలని గతంలో ఎమ్మెల్యే వార్డు సభ్యులకు సూచించినట్టుగా తెలిసింది. అయితే వీటిని పాలకవర్గ సమావేశంలో అప్పలనాయుడు వర్గం తిరస్కరించేందుకు సిద్ధమయ్యింది. దీనిని గుర్తించిన ఎమ్మెల్యే వర్గీయులు తీర్మానం వీగిపోతే పరువు పోతుందనే ఆలోచనతో సభ్యులను కిడ్నాప్ చేస్తామంటూ బెదిరించారని పలువురు చెబుతున్నారు. చివరకు సర్పంచ్ను సమావేశానికి వెళ్లవద్దంటూ ఆదేశించి సమావేశాన్ని వాయిదా వేయించారని సభ్యులు అంటున్నారు. పాలకవర్గ సభ్యులు ప్రమేయం లేకుండా గ్రామంలో తీర్మానాలు, అభివృద్ధి పనులు తమ వర్గీయులకే ఎమ్మెల్యే బుజ్జి వర్గం కేటాయిస్తోందని అప్పలనాయుడు వర్గం ఆరోపిస్తోంది. మొత్తం 20 మంది వార్డు సభ్యుల్లో 9 మంది అప్పలనాయుడుకు మద్దతు ప్రకటించారు. 8 మంది ఎమ్మెల్యే వర్గం వైపు ఉన్నట్టుగా తెలుస్తోంది. మిగిలిన ముగ్గురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు. -
స్వేచ్ఛకు సంకెళ్లా..?
► రాజధానిలో పోలీసుల అత్యుత్సాహం ► అధికార పార్టీ నేతల అండతో హడావుడి ► సామాన్యుడికి అన్యాయం జరిగినా నోరెత్తని ఖాకీలు ► రవికిరణ్ను అరెస్టుచేసి హైడ్రామా ► సోషల్ మీడియాలో లోకేష్ను కించపరిచారనే. సామాన్యుడు ఫిర్యాదుచేస్తే చూద్దాంలే అంటారు. చూసీచూడనట్టు పోతారు. భూములు కాజేస్తున్నారని, ప్రశ్నించినవారి పొలాలు నాశనం చేస్తున్నారని చెప్పినా స్పందించరు. కానీ, చినబాబు విషయంలో మాత్రం ఆగమేఘాలపై పరుగులు పెడతారు మన రాజధాని పోలీసులు. శుక్రవారం రాత్రి తుళ్లూరు పోలీస్స్టేషన్, మందడం ఏఎస్పీ కార్యాలయం వద్ద ఖాకీల అత్యుత్సాహం, హైడ్రామా స్వామిభక్తిని చాటింది. సాక్షి, అమరావతి బ్యూరో/తుళ్లూరు రూరల్ : నవ్యాంధ్ర రాజధాని అమరావతి అధికారపార్టీ నేతల దౌర్జన్యాలకు అడ్డాగా మారింది. టీడీపీ నేతల ఆగడాలకు ఖాకీలే సాక్షిగా మిగిలారు. రాజధానిగా ప్రకటించిన నాటి నుంచి నేడు సోషల్మీడియాకు సంకెళ్లు వేయడం వరకు జరిగిన అనేక సంఘటనలే ఇందుకు నిదర్శనం. అమరావతి నిర్మాణానికి వేల ఎకరాలు కావాలంటూ రాజధానివాసుల మెడపై కత్తిపెట్టి మరీ బంగారంలాంటి వ్యవసాయ భూములు లాక్కున్నారు. జీవనాధారమైన భూములు పోగొట్టుకుంటే మేమెలా బతకాలని వ్యతిరేకించినా.. టీడీపీ పెద్దలు ఒప్పుకోలేదు. భయపెట్టి.. అక్రమ కేసులు బనాయించి.. ప్రశాంతంగా జీవించే స్వేచ్ఛను కాలరాశారు. భూములు తీసుకున్న వారికి పరిహారం పేరుతో ఇస్తామన్న ప్లాట్లలోనూ తీవ్ర అన్యాయం చేశారు. హామీలనూ తుంగలో తొక్కి విలువైన ప్లాట్లను టీడీపీ నేతలు కొట్టేశారు. ఊరికి దూరంగా, పొలిమేరల్లో విలువలేని ప్లాట్లను కట్టబెట్టారు. ఆన్లైన్ లాటరీ పేరుతో రాజధాని పరిధిలోని సామాన్యులను మోసం చేశారు. జరుగుతున్న మోసం గురించి మాట్లాడితే.. ప్రభుత్వ పెద్దల కనుసైగతో పోలీసులు రంగంలోకి దిగి తరిమేసే పరిస్థితి నెలకొంది. తమకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడే స్వేచ్ఛను పోలీసుల సాక్షిగా కాలరాశారు. కోర్టు ద్వారా స్టే తెచ్చుకుని సాగు చేసుకుంటున్న రైతులపైనా టీడీపీ నేతలు ప్రతాపం చూపారు. దౌర్జన్యంగా భూముల్లోకి ప్రవేశించి యంత్రాలతో పంటలను నాశనం చేయడం, తగులబెట్టి భయభ్రాంతులకు గురిచేసిన సంఘటనలూ అనేకం. బాధితులపైనే ఎదురు కేసులు సెంట్ల రూపంలో భూములు మాయం చేశారని బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఫిర్యాదు చేసిన బాధితులపైనే పోలీస్స్టేషన్లకు పిలిపించి, భయపెట్టి నోరెత్తకుండా చేసిన ఘనత ప్రభుత్వ పెద్దలకే దక్కింది. ఎన్నో ఏళ్ల నుంచి అనుభవంలో ఉన్న లంక, అసైన్డ్ భూములను కొట్టేసేందుకు చట్టాలను సైతం అతిక్రమిస్తున్నారు. అందరితో సమాన ప్యాకేజీకి లంక, అసైన్డ్ రైతులకు అర్హత లేదని వారి హక్కులను కాలరాస్తున్నారు. ఏడాదిలో ఐదు పంటలు పండే భూములను మెట్టగా మార్చి రైతులను మోసం చేస్తున్నా.. ఏ అధికారి, పోలీసులు పట్టించుకోరు. బాధిత రైతులు ఫిర్యాదు చేసినా న్యాయం చేయాల్సిన పోలీసులకు అవి కఠినంగా వినిపిస్తాయి. నదిలోని ఇసుకను యంత్రాలతో తవ్వరాదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినా.. ఏపీ రాజధాని అమరావతిలో మాత్రం ప్రభుత్వ పెద్దలకు వినిపించవు, కనిపించవు. తమకు జరుగుతున్న అన్యాయాలపై రైతులంతా ఏకమై చర్చించుకోవాలని పలుమార్లు ప్రయత్నించినా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పోలీసులు ఉక్కుపాదంతో తొక్కేశారు. కళ్లముందే అనేక అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నా పోలీసులకు కనిపించలేదు. అనేక పోరాటాల ఫలితంగా ఏర్పడిన 2013 భూ సేకరణ చట్టాన్నే టీడీపీ పెద్దలు సవరణలు చేశారు. రాజధాని పరిధిలో సేకరణకు అవకాశమే లేదని తెలిసినా వరుసగా భూ సేకరణకు నోటిఫికేషన్లు ఇచ్చి రైతులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు చేపట్టారు. రవికిరణ్ అరెస్టులో హైడ్రామా రకరకాలుగా తమ బాధలను చెప్పుకుంటున్నా కళ్లుండీ చూడని ప్రభుత్వ పెద్దలు, అధికారులు భావ ప్రకటనా స్వేచ్ఛపైనా ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు కుమారుడు, మంత్రి లోకేష్బాబును కించపరుస్తూ పోస్టు పెట్టారని ఫిర్యాదుపై రవికిరణ్ అనే వ్యక్తిని అరెస్టుచేసి శుక్రవారం అర్ధరాత్రి వరకు చూపించలేదు. రైతులు తమకు జరిగిన అన్యాయాలు, అక్రమాలపై ఎన్నో ఫిర్యాదులు ఇచ్చినా స్పందించని పోలీసులు సీఎం చంద్రబాబు కుమారుడిపై ఇచ్చిన ఫిర్యాదుపై మాత్రం వెంటనే స్పందించారు. 24 గంటలు కూడా గడవకముందే రవికిరణ్ను అరెస్ట్ చేశారు. సామాన్య జనం ఇచ్చిన ఫిర్యాదులపై ఇదే వేగంతో పోలీసులు స్పందించకపోవడం స్థానికులను ఆగ్రహానికి గురిచేస్తోంది. రవికిరణ్ను అరెస్టుచేసి తుళ్లూరు స్టేషన్కు తీసుకురావాల్సిఉన్నా.. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పోలీసులు హైడ్రామా నడిపించారు. ఒక వ్యక్తిని అరెస్టు చేసి మీడియాని, ప్రజలను తప్పుదోవ పట్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని అక్రమాలు, అన్యాయాలు, మోసాలకు అడ్డాగా మారుస్తుండటంపై స్థానిక ప్రజలు ప్రభుత్వ పెద్దలు, అధికారులపై మండిపడుతున్నారు. -
ప్రత్యేక హోదా భిక్ష కాదు..ఏపీ హక్కు
-
ఏపీకి ప్యాకేజీపై ఢిల్లీలో హైడ్రామా
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాలనుకుంటున్న ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనపై ఢిల్లీలో హైడ్రామా కొనసాగుతోంది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక ప్రకటన వెలువరిస్తారనే సమాచారంతో ఉదయం నుంచి నార్త్ బ్లాక్ లోని ఆర్థిక మంత్రిత్వ కార్యాలయంలో హడావిడినెలకొంది. ఇది ఏపీ భవిష్యత్తును ప్రభావితం చేయబోయే కీలక నిర్ణయం కావడంతో తెలుగు వార్తాసంస్థలకేకాక జాతీయ మీడియా ప్రతినిధులు సైతం పెద్ద సంఖ్యలో అరుణ్ జైట్లీ కార్యాలయానికి చేరుకున్నారు. టీడీపీ కేంద్ర మంత్రి సుజనా కొందరు ఎంపీలతో కలిసి ఉదయం నుంచి ఆ కార్యాలయం చుట్టూతిరుగూ కనిపించారు. ఇటు విజయవాడలో సీఎం చంద్రబాబు అందుబాటులో ఉన్న మంత్రులతో వరుసభేటీలు నిర్వహించారు. మరోవైపు ఏపీ బీజేపీ నేతలంతా ఢిల్లీకి రావాలని బీజేపీ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ కీలకనేతలైన హరిబాబు, విష్ణు కుమార్ రాజు, పురందేశ్వరిలు ప్రస్తుతం విశాఖలోనే ఉన్నారు. వీరితోపాటు మరికొందరు ముఖ్యనేతలు రేపు ఉదయం ఢిల్లీ వెళతారని సమాచారం. ప్రకటన వెలువడుతోందని, జైట్లీ, ఇతర మంత్రులు ముసాయిదాను సిద్ధం చేస్తున్నారని, మరికొద్ది సేపట్లో మీడియా సమావేశం ఉంటుందని.. ఇలా నిమిషనిమిషానికి పరిస్థితులు ఒక్కోలా మారాయి ఆర్థిక శాఖ కార్యాలయం వద్ద. ప్యాకేజీ ముసాయిదాను ప్రధాని కార్యాలయానికి పంపారని, అక్కడి నుంచి ఆమోదం లభిస్తేనే ప్రకటన ఉంటుందని లీకులు ఇచ్చారు. -
జిల్లా కోర్టు వద్ద హైడ్రామా
ఏలూరు (అర్బన్) : న్యాయవాది రాయల్ హత్యకేసులో నిందితులు జిల్లా కోర్టులో లొంగిపోనున్నారనే ప్రచారం గురువారం జోరుగా సాగింది. రోజంతా హైడ్రామా నడిచింది. దీంతో కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. నిందితులెవరో తెలిసినప్పటికీ వారిని అదుపులోకి తీసుకోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలు రావడంతో పోలీసులు ఈ కేసును సవాల్గా తీసుకున్నారు. నిందితులకు కోర్టులో లొంగిపోయే అవకాశం ఇవ్వరాదనే ఉద్దేశంతో ఉదయం నుంచే కోర్టు పరిసరాలతోపాటు న్యాయస్థానానికి వచ్చే అన్ని దారుల్లో నిఘా పెంచారు. గతంలో కొన్ని కేసుల్లో నిందితులు మారువేషాల్లో, న్యాయవాదుల అవతారాల్లో, కార్లలో నేరుగా కోర్టు ఆవరణలోకి వచ్చి న్యాయమూర్తి ఎదుట లొంగిపోయిన ఘటనలు ఉన్న నేపథ్యంలో పోలీసులు వాటిని పరిగణనలోకి తీసుకుని నిఘా ఏర్పాటు చేశారు. గురువారం కోర్టు వేళలు ముగిసే సమయానికి కూడా నిందితులు రాకపోవడంతో వారికోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కోర్టుకు మూడు రోజులు సెలవు శుక్రవారం ఉగాది, ఆపై రెండో శనివారం, ఆదివారం కావడంతో జిల్లా కోర్టుకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాయల్ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రభుదాసుతోపాటు మిగతావారు ఈ మూడురోజుల్లో కోర్టులో లొంగిపోయే అవకాశాలు లేవు. దీంతో వారిని ఎలాగైనా ఈలోగానే పట్టుకోవాలని పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితులు లొంగిపోక ముందే అరెస్టు చేసి పరువు నిలుపుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిందితుల స్నేహితులు, బంధువులను ఆరా తీయడం ద్వారా త్వరగా పట్టుకోవచ్చనే అభిప్రాయానికి పోలీసులు వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. కొందరిపై నిఘా కూడా పెట్టినట్టు సమాచారం. విచారణాధికారిగా సీసీఎస్ డీఎస్పీ తోట! రాయల్ హత్యకేసులో విచారణాధికారిని మారుస్తూ పోలీసు అధికారులు గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులెవరో తెలిసినా.. ప్రస్తుతం విచారణాధికారిగా ఉన్న టౌన్ సీఐ ఎన్.రాజశేఖర్ వారిని అదుపులోకి తీసుకోవడంలో పురోగతి సాధించ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. సీసీఎస్ డీఎస్పీ తోట సత్యనారాయణను విచారణాధికారిగా నియమించారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. నిందితులకు సహాయ నిరాకరణ ఏలూరు (సెంట్రల్) : న్యాయవాది రాయల్ను అతి దారుణంగా హత్య చేసిన నిందితుల తరఫున బెయిల్ పిటీషన్లు వేయడం కానీ, వారికి న్యాయ సలహాలు ఇవ్వడం గానీ చేయకూడదని జిల్లా కోర్టు లోని న్యాయవాదులు తీర్మానం చేశారు. గురువారం బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో న్యాయవాది ఎన్.కృష్ణారావు అధ్యక్షతన రాయల్ సంతాప సభ ఏర్పాటు చేశారు. రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ప్రముఖ న్యాయవాది రోనాల్డ్ రాజు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభాకర్ రాయల్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. న్యాయవాది మంచినపల్లి సూర్యనారాయణ మాట్లాడుతూ నిందితులకు శిక్షపడే వరకూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్బినేని విజయ్కుమార్, జనరల్ సెక్రటరీ సీహెచ్ రాజేంద్రప్రసాద్, సీనియర్ న్యాయవాది కానాల రామకృష్ణ, గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
కిత్తన్నపేటలో హైడ్రామా!
కిత్తన్నపేట(లక్కవరపుకోట): మండలంలోని కిత్తన్నపేట గ్రామంలో గురువారం హైడ్రామా నెలకొంది. ఒకేరోజు ఇద్దరు మరణించడంతో అనుమానం వచ్చిన పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణకు పట్టుపట్టారు. దీంతో గ్రామస్తులు, పోలీసులకు మధ్య వాగ్వాదం నడిచింది. చివరకు ఇద్దరి మృతికి సంబంధించి ఎలాంటి వివాదం లేదని గ్రామస్తులు వాంగ్మూలం ఇవ్వడంతో పోలీసులు వెనుదిరిగారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, గ్రామస్తులు అందించిన వివరాలిలా ఉన్నాయి..కిత్తన్నపేట గ్రామానికి చెందిన వంకాల లక్ష్మి(15) విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతూ గురువారం తెల్లవారుజామున ఎస్.కోటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ నెల 21 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్న తరుణంలో లక్ష్మి మృతి చెందడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులతో పాటు లక్కవరపుకోట పాఠశాల విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. అదే గ్రామానికి చెందిన దుక్క త్రినాథ్(21) ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, నిరుద్యోగం కారణంగా మనస్తాపానికి గురై గురువారం తెల్లవారుజూమునే పశువుల పాకలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లవారుజూమున తండ్రి అచ్చిబాబు చూడగా త్రినాథ్ విగతజీవిగా దర్శనమిచ్చాడు. దీంతో వెంటనే దహన కార్యక్రమాలు జరిపించారు. ఒకే రోజు ఇద్దరు మృతి చెందిన విషయం తెలుసుకున్న పోలీసులు ఎస్ఐ ఎ.నరేష్ ఆధ్వర్యంలో గ్రామానికి వచ్చి ఉదయం 10 గంటల ప్రాంతంలో విచారణ నిర్వహించారు. అప్పటికే త్రిమూర్తులు దహనసంస్కరణలు పూర్తవగా, లక్ష్మి దహణ సంస్కరణలకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్మశాన వాటికకు లక్ష్మి మతదేహం తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు కలుగజేసుకొని మరణాలు ఎటువంటి వివాదాస్పదం కావని వాంగ్మూలం ఇవ్వడంతో పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు. -
టీడీపీ నేత కిడ్నాప్.. హైడ్రామా!
► రూ. 3 కోట్ల డిమాండ్ ► రూ. 50 లక్షలకు కుదిరిన బేరం ► పోలీసుల జోక్యంతో విడుదలైన భజలింగం యాదమరి/పలమనేరు/చిత్తూరు (అర్బన్): చిత్తూరు జిల్లా యాదమరి మండలానికి చెందిన టీడీపీ నాయకుడు భజలింగాన్ని గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. హైడ్రామా అనంతరం పలమనేరు సమీపంలోని మొగిలి ఘాట్లో వదిలేశారు. పోలీసుల కథనం మేరకు యాదమరి మండలం గోందివాళ్ల గ్రామానికి చెందిన భజలింగం తమిళనాడులోని పరదరామి నుంచి స్కార్పియో వాహనంలో ఇంటికి వస్తున్నాడు. పాచిగుంట గ్రామం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కారుతో వాహనాన్ని అడ్డగించి కళ్లలో కారం కొట్టి కిడ్నాప్ చేశారు. అనంతరం అతన్ని పలమనేరు సమీపంలోని మొగిలి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి తీవ్రంగా గాయపరిచారు. రూ.3 కోట్లు ఇస్తే భజలింగంను వదిలేస్తామని, లేకుంటే చంపేస్తామని వారి కుమారులకు ఫోన్లో తెలిపారు. మంగళవారం రాత్రంతా బేరసారాలు ఆడి చివరకు రూ.50 లక్షలకు సెటిల్ చేసుకున్నారు. నగదును పలమనేరు అటవీ ప్రాంతంలోని మొగిలి ఘాట్లో వాహనంలో ఉంచి వెళ్లాలని చెప్పడంతో భజలింగం కుమారులు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలోనే బాధితుడి కుమారుడు నిత్యానందం 100కు డయల్ చేసి విషయం పోలీసులకు తెలిపారు. గంగవరం మొబైల్ పార్టీ పోలీసులు మొగిలిఘాట్ వద్దకు చేరుకున్నారు. దుండగులు ఈ విషయాన్ని గమనించి భజలింగాన్ని, వాహనాన్ని వదిలేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని గంగవరం పోలీసులు చిత్తూరు ఆస్పత్రికి తరలించారు. భజలింగం కుమారులు గోవర్ధన్, నిత్యానందం డబ్బులు తీసుకుని మొగిలిఘాట్ వద్ద కిడ్నాపర్లలో ఒకడికి ఇచ్చాడని, అయినా తండ్రిని వదలకపోవడంతో నిత్యానందం ఫోన్ చేశాడని పోలీసులు చెబుతున్నారు. పాత నేరస్తులపైనే అనుమానం భజలింగం కిడ్నాప్లో పాత నేరస్తులపై పోలీసులు అనుమానిస్తున్నారు. 2014, 2015లో జిల్లాలో జరిగిన పలు కిడ్నాప్లకు సంబంధించి ఆరితేరిన ముఠానే తాజా ఘటనకు కారణంగా భావిస్తున్నారు. బుధవారం భజలింగం చిత్తూరు ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడుతూ తాను మంగళవారం పరదరామి నుంచి కారులో వస్తుండగా కొందరు దుండగులు రోడ్డుకు అడ్డంగా కారు పెట్టి అడ్డగించారని తెలిపారు. అనంతరం తనను పలమనేరు అడవుల్లోకి తీసుకెళ్లి రూ.3 కోట్లు డిమాండ్ చేసినట్లు చెప్పాడు. ఈ వివరాలు గత ఏడాది జూన్లో చిత్తూరు పోలీసులు అరెస్టు చేసిన కిడ్నాప్ ముఠా చెప్పిన విషయాలతో సరిపోలడంతో పాత నేరస్తులకు ఇందులో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు బలోపేతమవుతున్నాయి. -
తుది ఘట్టానికి ‘దానం’ హైడ్రామా
-
తుది ఘట్టానికి ‘దానం’ హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ మంత్రి దానం నాగేందర్ పొలిటికల్ హైడ్రామా క్లైమాక్స్కు చేరింది. అంతా సవ్యంగా సాగితే సోమవారం మధ్యాహ్నం టీఆర్ఎస్లో చేరదామని ఆదివారం ఉదయం పార్టీ శ్రేణులకు సంకేతాలిచ్చిన ఆయన... మధ్యాహ్నానికల్లా మనసు మార్చుకున్నట్టు చెబుతున్నారు. ‘మనమంతా కాంగ్రెస్లోనే కొనసాగుదాం’ అని వారికి చెప్పినట్లు సమాచారం. దీంతో ఖైరతాబాద్ నియోజకవర్గ శ్రేణులు పూర్తి అయోమయానికి గురయ్యాయి. దానం టీఆర్ఎస్లో చేరే సందర్భంలో తాను ఆహ్వానించి కండువా కప్పలేనని, ఒక వేళ నగర మంత్రులు, ఇతర ముఖ్యనాయకుల సమక్షంలో ఆయన చేరితే అభ్యంతరం లేదని టీఆర్ఎస్ అగ్రనేత స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో దానం మనసు మార్చుకున్నట్లు సమాచారం. తాను అగ్రనేత సమక్షంలో అయితేనే పార్టీలోకి వస్తానని, ఇతరులైతే రాలేనని... దానం సైతం మధ్యవర్తులకు తేల్చిచెప్పారు. ఇదే విషయాన్ని పార్టీలోని ఒకరిద్దరు సన్నిహితులతోనూ ఆయన చర్చించి, తానిక కాంగ్రెస్లోనే కొనసాగుతానంటూ స్పష్టం చేసినట్టు తెలిసింది. సోమవారం సాయంత్రానికి దానం ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించి ఊహాగానాలకు తెరదించే అవకాశం కనిపిస్తోంది. -
చట్టంలోని హామీలకు ప్యాకేజీ రంగు!
-
సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద హైడ్రామా
హైదరాబాద్: బేగంపేటలోని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు క్యాంప్ ఆఫీస్ వద్ద బుధవారం రాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. ఏపీ సీఐడీ అధికారులు.. మంత్రి కేటీఆర్ గన్మన్, కారు డ్రైవర్లకు నోటీసులు ఇవ్వజూసిన క్రమంలో ఈ తతంగం జరిగింది. ఓటుకు కోట్లు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు ప్రమేయం ఉందని చెప్పాలంటూ కేసులో నాలుగో నిందితుడైన జెరుసలేం మత్తయ్యను బెదిరించారని, దీనికి సంబంధించి తమ ఎదుట విచారణకు హాజరుకావాలని మంత్రి కేటీఆర్ గన్ మన్, డ్రైవర్లు అయిన జానకీరామ్, సత్యనారాయణలకు నోటీసులు ఇచ్చేందుకు ఏపీ సీఐడీ అధికారులు రాత్రి సమయంలో సీఎం క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే క్యాంప్ ఆఫీస్ భద్రతా సిబ్బంది.. ఏపీ సీఐడీ అధికారుల్ని గేటు వద్దే అడ్డుకుని అలాంటి పేర్లు గల వ్యక్తులెవరూ ఇక్కడ లేరని వెనక్కి పంపించారు. దీనికి ప్రతిగా ఓ సారి లోపలికి వెళ్లి చూసొస్తామని ఏపీ అధికారులు అనడంతో.. అందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ లోనికి అనుమతించేదిలేదంటూ భద్రతా సిబ్బంది తేల్చిచెప్పారు. అంతేకాదు మీరు ఇచ్చే నోటీసులు తీసుకోబోమన్నారు. దీంతో సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వెనుదిరిగిన ఏపీ సీఐడీ అధికారులు కొద్దిసేపటి తర్వాత మళ్లీ అలాంటి ప్రయత్నమే చేశారు. అప్పుడు కూడా భద్రతా సిబ్బంది ఏపీ అధికారుల్ని లోనికి అనుమతించలేదు. కాగా, రెండోసారి వారు రావడానికి కొద్ది క్షణాల ముందే సీఎం కాన్వాయ్ క్యాంప్ ఆఫీస్ లోపలికి ప్రవేశించడం గమనార్హం. ఇంతటితో ముగిసిందనుకున్న హైడ్రామా నందినగర్ లోని కేటీఆర్ క్యాంప్ కార్యాలయం వద్ద మళ్లీ మొదలైంది. కేటీఆర్ క్యాంప్ కార్యాలయం (కేసీఆర్ స్వగృహం) వద్దకు చేరుకున్న ఏపీ సీఐడీ అధికారులు కేటీఆర్ గన్ మన్, కారు డ్రైవర్లను గురించి అక్కడున్న భద్రతా సిబ్బందిని వాకబు చేశారు. అలాంటి పేర్లున్నవారెవరూ లేరని చెప్పడంతో మళ్లీ వెనుదిరిగిపోయారు. గారు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ మేం తాకేదే లేదన్నారు. 'మేము నోటీసులు ఇవ్వాలనుకుంటున్న వ్యక్తులెవరూ ఇక్కడ లేరని భద్రతా సిబ్బంది చెప్పడంతో వెనుదిరిగి వెళ్తున్నాం' అని ఏపీ సీఐడీ అధికారులు పేర్కొన్నారు. -
ఎన్నికల్లో ఓట్లు దండుకుని నేడు డ్రామా
-
హైడ్రామా
ప్రతిపక్షం లేకుండా చేసేందుకు అధికార పార్టీ అన్ని అడ్డదారులు తొక్కుతోంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ పోలీసుల సహాయంతో అందిపుచ్చుకుంటోంది. ఓటుకు నోటు వ్యవహారంతో తెలంగాణలో బజారున పడిన టీడీపీ.. జిల్లాలో బలం లేకపోయినా ఎమ్మెల్సీ బరిలో అభ్యర్థిని నిలిపి ఇక్కడా అలాంటి బాగోతమే నడిపింది. చివరకు ఓటమి తప్పదని భావించి.. వైఎస్ఆర్సీపీకి జిల్లాలో పెద్దదిక్కుగా ఉన్న భూమా నాగిరెడ్డి లక్ష్యంగా పోలీసులను ఉసిగొలిపింది. ‘తాను ప్రజాప్రతినిధి.. తాకొద్దు’ అన్నందుకు అట్రాసిటీ కేసు బనాయింపజేసింది. ఆ తర్వాత ఎలాగైనా జైలుకు తరలించేందుకు విచారణ పేరిట 12 గంటల హైడ్రామాకు అధికార పార్టీ దర్శకత్వం వహించింది. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు హైదరాబాద్లోని నిమ్స్కు తరలించాలని సూచించినా.. సెక్యూరిటీ కల్పించలేమని చేతులెత్తేసిన పోలీసు శాఖ తాము అధికార‘పక్షం’ అని చాటుకుంది. ఎట్టకేలకు భూమా దీక్షతో దిగొచ్చిన పోలీసులు చికిత్స నిమిత్తం ఆయనను శనివారం రాత్రి 9 గంటలకు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో శనివారం జరిగిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కేసు వ్యవహారం అధికార పార్టీ వేధింపులకు సాక్షిగా నిలిచింది. ఓ వైపు అధికారుల హైడ్రామా.. మరో వైపు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల ఆందోళన ఆళ్లగడ్డలో ఉద్రిక్తతకు దారితీసింది. శుక్రవారం నంద్యాలలో నమోదైన కేసులో అరెస్ట్ అయిన భూమా నాగిరెడ్డిని శనివారం తెల్లవారుజామున 5.45 గంటలకు ఆళ్లగడ్డ సబ్జైల్కు తరలించారు. జైలు నిబంధనల మేరకు ముందుగా వైద్య పరీక్షల నిమిత్తం ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించాలి. అక్కడి వైద్యురాలు సుజాత బీపీ, చాతీ నొప్పి పరిశీలించి ‘గతంలో వైద్యం చేయించుకున్న వైద్యులను సంప్రదించండి’ అని సూచించారు. ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఉదయం 7గంటలకు ఆయనను సబ్ జైల్కు తీసుకెళ్లారు. భూమానాగిరెడ్డికి ప్రత్యేక వైద్యబృందంచే వైద్యపరీక్షలు చేయించాలని పోలీస్లు కలెక్టర్కు లేఖ ఇచ్చినట్లు తెలిసింది. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంఅండ్హెచ్ఓ మీనాక్షిమహదేవన్, సివిల్సర్జన్ శ్రీనివాసులు, నంద్యాల వైద్యాధికారి శ్రీనివాసులతో కూడిన కమిటీ భూమానాగిరెడ్డికి సాయంత్రం 4.30 గంటల సమయంలో 7గంటల వరకు వైద్య పరీక్షలు నిర్వహించారు.చికిత్స నిమిత్తం భూమానాగిరెడ్డిని కర్నూలులోని పెద్దాసుపత్రికి తరలించాలని వైద్యబృందం సూచించింది. వైద్యబృందం సూచనల మేరకు 7.15 గంటలకు కర్నూలు తరలించారు. దాదాపు 12 గంటల పాటు ఆసుపత్రికి తరలించకుండా జైల్లోనే ఉంచారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భూమానాగిరెడ్డి సబ్జైలులో ఉండడంతో గ్రామాల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సబ్జైలు ఆవరణం ప్రజలతో కిక్కిరిసిపోయింది. ప్రజలు భారీ ఎత్తున తరలివస్తుండడంతో ఉదయం సబ్జైలు సమీపంలో ప్రజలను లేకుండా తరిమివేశారు. పోలీస్లు మధ్య మధ్యలో అత్యుత్సాహం ప్రదర్శించి ప్రజలను తోసివేశారు. భూమానాగిరెడ్డిని కర్నూలుకు తరలించే వరకు ప్రజలు సబ్జైలు వద్ద ఉన్నారు. భూమా దీక్షతో ఆసుపత్రికి తరలింపు: భూమానాగిరెడ్డిని సబ్జైలు నుంచి ఆసుపత్రికి తరలించమని వైద్యురాలు సుజాత సూచించినా పోలీస్లు ఎస్కార్ట్ పేరుతో ఆలస్యం చేయడాన్ని నిరసిస్తూ భూమానాగిరెడ్డి సబ్జైలులో నిరాహార దీక్షకు దిగారు. సబ్జైలు ఆవరణంలో మాత్రలతో సహ టిఫిన్, భోజనం తీసుకోకుండా దీక్ష చేపట్టారు. భూమా దీక్ష చేస్తున్నారనే సమాచారం తెలుసుకున్న నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య సబ్జైలుకు వచ్చి భూమాతో భేటీ అయ్యారు. సబ్జైలు నుంచి బయటకు వచ్చిన ఐజయ్య విలేకరులతో మాట్లాడుతూ భూమానాగిరెడ్డిని ఆసుపత్రికి వైద్యపరీక్షల కోసం తీసుకపోకపోతే భూమాకు సంఘీభావంగా జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆళ్లగడ్డకు వచ్చి దీక్ష చేపడుతామని హెచ్చరించారు. భూమా దీక్ష చేస్తున్నట్లు తెలియడంతో సబ్జైలు సమీపంలో దీక్ష చేపట్టడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఎట్టకేలకు భూమాను కర్నూలు ఆసుపత్రికి తరలించడంతో నాయకులు, కార్యకర్తలు దీక్షా నిర్ణయాన్ని ఉపసంరించుకున్నారు. భూమా అరెస్ట్ దారుణం ఆలూరు రూరల్: నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. శనివారం ఆయన ఫోన్లో సాక్షితో మాట్లాడారు. అధికార పార్టీ నేతలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా తమపార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకటేశ్వరరెడ్డి విజయం ఖాయమని చెప్పారు. అప్రజాస్వామికం ఆళ్లగడ్డటౌన్: నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అరెస్టు అప్రజాస్వామ్యం అని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. శనివారం ఆళ్లగడ్డ సబ్ జైలులో రిమాండ్లో ఉన్న భూమానాగిరెడ్డిని పరమార్శించిన ఆయన అనంతరం జైలు బయట విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో బలంగా ఉన్న వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టాలనే..టీడీపీ నేతలు ఇలాంటి కుట్రలు పన్నుతున్నారన్నారు. టీడీపీకి ప్రజలే బుద్ధిచెబుతారు ఆదోని టౌన్: అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న టీడీపీకి ప్రజలే బుద్ధిచెబుతారని ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అక్రమ అరెస్ట్ ఆయన ఖండించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖర్రెడ్డిపై కూడా కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తమ పార్టీ ఎంపీటీసీ సభ్యుడ్ని తాము ఎలా కిడ్నాప్ చేస్తామని ప్రశ్నించారు. -
అధ్యక్ష ఎన్నికలో హైడ్రామా !
శ్రీకాకుళం: జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఎన్నికలో హైడ్రామా నడిచింది. అధ్యక్ష ఎన్నిక కోసం శ్రీకాకుళంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఆదివారం జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అయితే ఇందులో పాల్గొన్న నేతలు అధికారికంగా కొత్త అధ్యక్షులు ఎవరనే విషయాన్ని ప్రకటించకుండానే దాటవేశారు. దీనికి తోడు ఐవీఆర్ఎస్ సర్వేలో లేని వ్యక్తికి పట్టం కట్టినట్టు తెలుసుకుని కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. క్యాడర్ అభిప్రాయానికి పార్టీ అధిష్టానం విలువ ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్ర టీడీపీ అధిష్టానం కేడర్ అభిప్రాయానికి విలువ నివ్వలేదని ఆదివారం జరిగిన జిల్లా టీడీపీ అధ్యక్ష ఎన్నికను ఉదాహరణగా పలువురు చెప్పుకుంటున్నారు. అధ్యక్ష స్థానానికి ఎవరు అర్హులని కొద్ది రోజుల క్రితం అధిష్టానం ఐవీఆర్ఎస్ విధానం ద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాన్ని సేకరించింది. ఇందులో టీడీపీ ప్రస్తుత అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి (బాబ్జీ), పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందరశివాజీ, పంచాయతీరాజ్ చాంబర్ ప్రధాన కార్యదర్శి కలిశెట్టి అప్పలనాయుడులలో ఎవరిని బలపరుస్తారని మాత్రమే ప్రశ్నించింది. ఈ మూడు పేర్లు కాకుండా గౌతు శిరీష పేరును పార్టీ పరిశీలకులు ఖరారు చేయడం చూస్తే కేడర్ అభిప్రాయానికి అధిష్టానం విలువనివ్వలేదని చెప్పవచ్చు. అధిష్టాం ఆదేశాల మేరకు, శివాజీ దగ్గర భయమో తెలియనప్పటికీ.. జిల్లా ఇన్చార్జి మంత్రి పరిటాల సునీత, ఎన్నికల పరిశీలకులు బొండా ఉమామహేశ్వరరావు, తోట నర్శింహంల ఎదుట శాసనసభ్యులంతా గౌతు శిరీషను బలపరిచినట్టు తెలిసింది. ఈ ఐవీఆర్ఎస్ విధానంలో మంత్రులు, శాసనసభ్యులు కూడా తమ అభిప్రాయాలను తెలియజెప్పారు. అప్పట్లో గౌతు శిరీష పేరు లేకపోవడంతో ఆమె పేరును సూచించే అవకాశాలే లేవు. అటువంటప్పుడు శిరీషను ఏ విధంగా బలపరిచారో అర్థం కావడం లేదు. వాస్తవానికి ఈ పదవికి శిరీష అర్హురాలే అయినప్పటికీ ఐవీఆర్ఎస్ సర్వేలో ఆమె పేరును పొందుపరచకుండా ప్రస్తుతం నేరుగా ఎంపిక చేయడం చూస్తే అధిష్టానం వద్ద శిరీష భర్తకు ఉన్న పలుకుబడి అర్థమవుతుంది. శాసనసభ్యులు, మంత్రులు శిరీషకు మద్దతు తెలిపినప్పటికీ జిల్లా ఇన్చార్జి మంత్రి, పరిశీలకులు అధికారికంగా ఆ పేరును ప్రకటించకుండా అధిష్టానానికి నివేదించి అక్కడే ప్రకటిస్తామని చెప్పడంపై టీడీపీ కేడర్ తప్పు పడుతోంది. దీనివల్ల తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయని, జిల్లాలో పేరును ప్రకటిస్తే కొందరు నాయకులు, కార్యకర్తల నుంచి బహిరంగంగా వ్యతిరేకత వ్యక్తమవ్వొచ్చునని భావించే ఇలా చేశారని పలువురు అభిప్రాయ పడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అలాగే అధికారంలోకి రాకముందు కేడర్పై అధిష్టానానికి పట్టు ఉండేదని, అధికారంలోకి వచ్చిన తరువాత కేడర్పై పట్టులేదని కూడా పలువురు నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. అందువల్లనే పేరును ప్రకటించ లేకపోయారని వారంటున్నారు. ఇన్చార్జి మంత్రి సునీత, జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఇద్దర పరిశీలకులు, ఐదుగురు శాసనసభ్యులు ఉండి కూడా కేడర్కు భయపడి పేరును ప్రకటించక పోవడాన్ని పలువురు ఆక్షేపిస్తూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గౌతు కుటుంబానికే పదవి అని ముందే చెప్పిన ‘సాక్షి’ జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి గౌతు కుటుంబానికే వచ్చే అవకాశం ఉందని సాక్షి మొట్టమొదటిగా కథనాన్ని ప్రచురించింది. అది వాస్తవమని నేడు రుజువైంది. శివాజీ కాకుంటే శిరీషకే ఆ పదవిని ఇస్తారని మొదటి నుంచి సాక్షిలో కథనాలు ప్రచురితమయ్యాయి. శివాజీ అనారోగ్యాన్ని భావించో, వృద్ధాప్యంలో ఉన్న కారణంగానో అధిష్టానం ఆయనకు కాకుండా అతని కుమార్తెకు అధ్యక్ష పదవి కట్టబెట్టిందని టీడీపీలోని ఓ వర్గం చె బుతోంది. అధిష్టానం వద్ద శివాజీ అల్లుడికి ఉన్న పలుకుబడితోనే శిరీషకు ఆ పదవి వరించిందని మరో వర్గం చెబుతోంది. ఏదిఏమైనా చౌదరి బాబ్జీ, కలిశెట్టి అప్పలనాయుడు వంటి ఆశావహులు మాత్రం కొంతమేర అసంతృప్తి చెందినట్టు కొట్టచ్చినట్టు కన్పించింది. తాము నమ్ముకున్న ఏ నాయకుడు తమకు సహకరించ లేదన్న నిరాశ వారిలో కన్పించింది. -
‘ఖాకీ’ల హైడ్రామా.!
సాక్షి, విశాఖపట్నం : ఏయూ తెలుగు విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ జెర్రా అప్పారావు అరెస్టు వెనుక హైడ్రామా నడిచిందా? పోలీసులు చెబుతున్న దానికి, ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలకు పొంతన కుదరడం లేదా? రిమాండ్ రిపోర్ట్లో ఆయన్ని ఏయూ క్వార్టర్స్లో అరెస్టు చేసినట్టు, అప్పారావు భార్య మైనావతికి ఇచ్చిన అరెస్ట్ రిపోర్ట్లో నర్సీపట్నం శివారులో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు పేర్కొనడం మరింత అనుమానానికి తావిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు అతిగా వ్యవహరించి విమర్శలు పాలైన సంగతి తెలిసిందే. వీళ్లంతా ఎవరు.. ఏజెన్సీలో గనుల తవ్వకాలకు నీలాపు రాజబాబు అనే వ్యక్తి లెసైన్స్ తీసుకున్నారు. అతని వద్ద వాసుపరి ప్రసాద్ ఏజెంట్గా ఉన్నారు. తరువాత అతని వద్ద జగదీష్ చాపరాతిపాలెంలో మైనింగ్కు సబ్ లీజు తీసుకున్నాడు. జగదీష్ వద్ద సుబ్బరాజు ఏజెంట్. చాపరాతిపాలెం మైనింగ్లో నష్టం రావడంతో తనకు దేవుడు క్యారీ మైనింగ్ కూడా లీజుకు ఇవ్వాల్సిందిగా రాజబాబును జగదీష్ కోరాడు. ఆ పనిలో భాగంగా ప్రొఫెసర్ అప్పారావు నివాసానికి ప్రసాద్, సుబ్బరాజు వెళ్లారు. మావోయిస్టులు చెప్పిన పనులు చేసిపెట్టాలని అప్పారావు తమకు సూచించినట్లు ప్రసాద్ పోలీసులకు వెల్లడించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఏలేశ్వరం నుంచి పేలుడు సామగ్రి మరోవైపు మైనింగ్కు వాడే పేలుడు పదార్థాలను తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం ప్రాంతంలో కొనుగోలు చేశారు. నర్సీపట్నంలోని పెదబోడ్డేపల్లి గ్రామంలో ఆడిగర్ల శ్రీరామ్మూర్తి ఇంటిని అద్దెకు తీసుకుని అందులో ఉంచారు. ఈ నెల 6వ తేదీ ఉదయం 5 గంటలకు నర్సీపట్నం ఎస్ఐ జి.అప్పారావు తన సిబ్బందితో దాడిచేసి ప్రసాద్, సుబ్బరాజులను అరెస్ట్ చేశారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలించి ఉదయం 8 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు రెండు బృందాలుగా ఏర్పడిన పోలీసులు కాకినాడలో జగదీష్ను, విశాఖపట్నంలో అప్పారావును అరెస్ట్ చేశారు. సాయంత్రానికి నర్సీపట్నం జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుకు ఎఫ్ఐఆర్ పంపించారు. పొంతన ఏదీ? నర్సీపట్నం ఎస్ఐ తానే ఫిర్యాదుదారుడిగా ఉదయమే నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో నలుగురిని నిందితులుగా పేర్కొన్నారు. కానీ ఆ రోజు సాయంత్రం 5 గంటల వరకూ నిందితుల అరెస్ట్ను పోలీసులు ధృవీకరించలేదు. నర్సీపట్నం ఏఎస్పీ డి.సత్య ఏసుబాబు రాసిన రిమాండ్ రిపోర్ట్లో ప్రొఫెసర్ అప్పారావును 6వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు యూనివర్సిటీ క్వార్టర్స్లో అరెస్ట్ చేసి, 4 గంటలకు నర్సీపట్నం తీసుకువెళ్లినట్లు ఉంది. 7వ తేదీ తెల్లవారుజామున 2 గంటల సమయంలో విశాఖలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్డులో హాజరుపరిచినట్లు నిందితుల తరపు న్యాయవాదులు చెబుతున్నారు. 7వ తేదీ తెల్లారేసరికి నిందితులు విశాఖ కేంద్ర కారాగారంలో ఉన్నారు. మరోవైపు అప్పారావు భార్య మైనావతికి ఇచ్చిన అరెస్ట్ రిపోర్ట్లో అప్పారావును నర్సీపట్నం శివారులో అరెస్ట్ చేశామని పోలీసులు పేర్కొనడం గమనార్హం. మరో విచిత్రమేమిటంటే అప్పారావును 6వ తేదీ మధ్యాహ్నం అరెస్ట్ చేస్తే వర్సిటీ విద్యార్థులు ఆయన అరెస్టుకు ముందే ఉదయం నుంచి ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారనుకోవాలన్నమాట. చార్జ్షీట్కు ఆరు నెలలు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్-2008(ఉపా చట్టం-రాజద్రోహ నేరం) కింద జీకె వీధి మండలం చాపరాతిపాలెంకి చెందిన వాసుపరి ప్రసాద్, తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన గణపతిరాజు సుబ్బరాజు అలియాస్ వర్మ, కొవ్వూరు జగదీష్, ఏయూ ప్రొఫెసర్ జెర్రా అప్పారావులపై పలు సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. సాధారణంగా నిందితులకు 90 రోజుల్లో చార్జ్షీట్ వేయాలి. కానీ ఈ యాక్ట్ ప్రకారం అరెస్ట్ అయితే చార్జ్షీట్ ఫైలు చేయడానికి 180 రోజులు గడువు ఉంటుంది. అంటే దాదాపు ఆరు నెలల పాటు చార్జ్షీట్ లేకుండానే నిందితులను నిర్బంధంలో ఉంచవచ్చు. ఈ లోగా నిందితులు బెయిల్ కోసం న్యాయ స్థానంలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. -
ఫలించని జానా దౌత్యం
వనపర్తి: వనపర్తిని జిల్లాగా ప్రకటిం చాలని మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి దీక్షను విరమించజేసేందుకు సీఎల్పీ నేత జానారెడ్డి చేసిన ప్రయత్నం ఫలించలేదు. సోమవారం హైదరాబాద్లో జానారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రెడ్డితో చిన్నారెడ్డి దీక్ష విషయం చర్చించిన అనంతరం ఆయన రాత్రి వనపర్తికి వచ్చారు. చిన్నారెడ్డిని పరామర్శించి ఆయనతో మాట్లాడుతూ ప్రస్తుతానికి దీక్ష విరమించాలని.. అసెంబ్లీ వేదికగా వనపర్తి జిల్లా కోసం పోరాటం సాగిద్దామని చెప్పారు. తాను సీఎంతో మాట్లాడానని.. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పరిశీలిస్తామని సీఎం చెప్పారని వివరించారు. అయితే, దీక్ష విరమణకు చిన్నారెడ్డి ఒప్పుకోలేదు. వనపర్తిని జిల్లాగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం నేరుగా ప్రకటించే వరకు దీక్షను కొనసాగిస్తానని చిన్నారెడ్డి చెప్పారు. జానారెడ్డి మాట్లాడుతూ చిన్నారెడ్డికి వనపర్తి ప్రజల ఆకాంక్ష అత్యంత ముఖ్యమే అయినా.. ఆయన జాతీయస్థాయిలో కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా పని చేస్తున్నారని.. ఆయన సేవలను మిగతా అంశాల్లో వినియోగించుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇచ్చి ఉంటే రెండు నిమిషాల్లో వనపర్తిని జిల్లాగా చేసేవారమని జానారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు కాంగ్రెస్ పార్టీ అన్నం పెడ్డితే.. తమ పార్టీకి ఇక్కడి ప్రజలు సున్నం పెట్టారని అన్నారు. పదవులు పోగోట్టుకుని పార్టీని ఫణంగా పెట్టి ఆనాడు తాము తెలంగాణ తెచ్చే విషయంలో సోనియాగాంధీని ఒప్పించామన్నారు. తాము పడిన కష్టాన్ని ఓటర్లు గుర్తించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆమరణ నిరాహార దీక్ష కు మద్దతిచ్చిన అఖిలపక్షాలతో చర్చించిన అనంతరం వారు దీక్ష కొనసాగింపునకే మొగ్గు చూపడంతో దీక్షను విరమించేది లేదని చిన్నారెడ్డి తెగేసి చెప్పారు. దీంతో జానారెడ్డి ఆయన వెంట వచ్చిన కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్కుమార్లు వెనుదిరిగారు. -
అర్ధరాత్రి హైడ్రామా..!
వనపర్తి టౌన్: వనపర్తిని జిల్లాగా ఏర్పా టు చేయూలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే చిన్నారెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలో అర్థరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. తన దీక్షను భగ్నం చేసి, ఆసుపత్రికి తరలించేందుకు ఆదివారం అర్ధరాత్రి పోలీసులు ప్రయత్నాలు చేపట్టడంతో వారి రాకను ముందే పసిగట్టిన ఆయన హటాత్తుగా ఇంట్లోకి వెళ్లి గేటుకు తాళం వేసుకుని అక్కడే దీక్ష ను కొనసాగించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మార్గమధ్యమంలో జరి గిన తోపులాటలో చిన్నారెడ్డి కింద పడిపోవడంతో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు రాపిడ్ యాక్షన్ బలగాలను రంగంలోకి దింపారు. అరుుతే కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు చిన్నారెడ్డి ఇంటి ఎదుటే డీఎస్పీ చెన్నయ్య, సీఐ మధుసూదన్రెడ్డిలను అడ్డుకున్నారు. తామె ఎమ్మెల్యేతో మాట్లాడేందుకు మాత్రమే వచ్చామని చెప్పడం తో ఆయన లోపలినుంచే వారితో మాట్లాడారు. తాను దీక్ష చేపట్టి రెండు రోజులు కూడా కాలేదని, తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. మీ ఆరోగ్యం క్షీణిం చిందని డాక్టర్లు చెప్పినందునే తాము వ చ్చినట్లు డీఎస్పీ చెప్పినా ఆయన విని పించుకోకుండా దీక్షను కొనసాగించారు. పోలీసులు మొండిగా వ్యవహరిస్తే ఆత్మార్పన చేసుకుంటామని కార్యకర్తలు హెచ్చరించడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. సోమవారం ఉదయం 6 గంటలకు ఆయ న దీక్ష స్థలికి వచ్చి దీక్షలో కూర్చున్నారు. హామీ ఇచ్చారు..అమలు చేయూల్సిందే...! వనపర్తి : ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో మెుదటివిడతలో నే వనపర్తి జిల్లా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినట్లుగానే జిల్లాను ఏర్పాటు చేయూలని జి.చిన్నారెడ్డి అన్నారు. చిన్నారెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సోమవారం మూడో రోజు కొనసాగింది. ఆయన మాట్లాడుతూ తన దీక్షను భగ్నం చేసేందుకు ఆదివారం రాత్రి అధికారులు విఫలయత్నం చేయడం మంచి పద్దతి కాదన్నారు. వనపర్తికి చారిత్రక ప్రాధాన్యత ఉన్నదని, భౌగోళికంగానూ జిల్లా ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. నిలకడగా చిన్నారెడ్డి ఆరోగ్యం... చిన్నారెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉందని ప్రభుత్వ వైద్యులు తెలిపారు. సాయంత్రం ఆయనకు బీపీ, షుగర్ పరీక్షలను నిర్వహించగా, బీపీ 138 నమోదు కాగా, షుగర్ 102గా నమోదైంది. -
హైడ్రామా
జమ్మలమడుగు: మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో జమ్మలమడుగులో రెండో రోజూ హైడ్రామా నడిచింది. రాత్రి 11 గంటల వరకు ఎన్నిక విషయంలో అధికారులు ఎటూ తేల్చలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చిన తరువాతే ఎన్నికను నిర్వహిస్తామని 11గంటల తరువాత ఆర్డీఓ ప్రకటించి వెళ్లిపోయారు. శుక్రవారమే ఎన్నికను నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల అధికారులు సూచించినా ప్రిసైడింగ్ అధికారి రఘునాథరెడ్డి తనకు ఆరోగ్యం సరిగా లేదంటూ డ్రామాకు తెరలేపారు. ఆయన ఆరోగ్యం సరిగానే ఉందంటూ వైద్యులు తేల్చిచెప్పారు. మరోవైపు రెండో రోజుకూడా తెలుగుతమ్ముళ్లు స్వైర విహారం చేశారు. రాళ్లు రువ్వడంతో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. దాదాపు గంటసేపు టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఒకటో వార్డు కౌన్సిలర్ అయిన తన కుమారుడు ముల్లా జానీ కిడ్నాప్ అయినట్లు ఆయన తల్లి నూర్జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసిన తర్వాతే చైర్మన్ ఎన్నికను నిర్వహిస్తామని ప్రిసైడింగ్ అధికారి రఘునాథరెడ్డి పేర్కొన్నారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఆరోగ్యం సక్రమంగా లేకపోవడంతో వైద్యం చేయించుకోవడానికి వెళ్లాలని ముండ్లజానీ ఆర్డీఓకు ఫ్యాక్స్ ద్వారా తెలిపారు. అంతేగాక గోవాలోని పనాజీ కోర్టుకు హాజరై తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని వాంగ్మూలం ఇచ్చాడు. వివిధ టీవీ ఛానల్స్తో కూడా మాట్లాడారు. దీనిని అధారంగా చేసుకుని పోలీసులు నివేదిక తయారు చేసి ఆర్డీఓకు సమర్పించారు. దీనిపై ప్రిసైడింగ్ అధికారి సరైన నిర్ణయం తీసుకోలేదు. కోరం ఉన్నా ఎన్నికను వాయిదా వేయడం సరికాదని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ మున్సిపల్ కార్యాలయంలోనే ధర్నా నిర్వహించారు. తొలుత కౌన్సిల్ సమావేశానికి ప్రిసైడింగ్ ఆఫీసర్గా వ్యవహరించిన ఆర్డీఓ జి.రఘునాథరెడ్డి హజరుకాగానే అధికారులు వచ్చిన కౌన్సిలర్, ఎమ్మెల్యే, ఎంపీలతో సంతకాల కార్యక్రమాన్ని చేపట్టారు. వైఎస్సార్సీపీకి చెందిన వారు సంతకాలు చేసిన తర్వాత టీడీపీ సభ్యులతో సంతకాల కార్యక్రమం చేపట్టగా తాము దొంగ సంతకాలు చేయమని తమ కౌన్సిలర్ ముల్లా జానీ తమ ముందుకు వచ్చిన తర్వాతనే సమావేశాన్ని నిర్వహించాలని గొడవకు దిగారు. 20 వార్డు కౌన్సిలర్ అయిన నూర్జహాన్ కౌన్సిల్ సమావేశం హాలులోనికి కారం పోడిపొట్లం తెచ్చి ఎంపీ వైఎస్ ఆవినాష్రెడ్డిపై చల్లే ప్రయత్నం చేశారు. కారం పొడి ఎంపీ చొక్కా, టేబుల్పై పడింది. -
హైడ్రామాకు తెర
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మావోయిస్టు దారగోని శ్రీనివాస్ అలియాస్ విక్రమ్ లొంగుబాటు హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. విక్రమ్ లొంగిపోయినట్లు పోలీసులు అధికారికంగా ధ్రువీకరించారు. అయితే లొంగుబాటు సందర్భంగా విక్రమ్ వెల్లడించిన విషయాలు, పోలీసులకు చెబుతున్న వాటికి పొంతన కుదరడం లేదు. మూడు రోజుల క్రితమే లొంగిపోయినట్లు విక్రమ్ చెబుతున్నా పోలీసులు మాత్రం బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు తమ వద్దకు వచ్చాడని చెబుతున్నారు. గతనెల 19న ప్రకాశం జిల్లా మురారికురువ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ము గ్గురు మావోయిస్టులు మృతిచెంది నట్లు పోలీసులు ప్రకటించారు. అయి తే ఈ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న విక్రమ్ను మాజీ మావోయిస్టుగా పోలీసులు పేర్కొంటున్నారు. జానా బాబూరావు, అతని అనుచరు లు పార్టీతో సంబంధం లేకుండా ఆ యుధాలతో సంచరించినా వారికి మా వోయిస్టులతో సంబంధాలు తెగినందున మాజీలుగా భావిస్తున్నామని ఎస్పీ ప్రకటించడం గమనార్హం. ఎన్కౌంటర్ ఘటన జరిగిన నాటి నుంచే విక్రమ్ పోలీసుల అదుపులో ఉన్నాడనే ప్రచారం జరిగినా అధికారులు తోసిపుచ్చుతూ వచ్చారు. కాగా, మూడురోజుల క్రితమే పోలీసుల ఎదుట విక్రమ్ లొంగిపోయినా నాటకీయ పరిణామా ల మధ్య బుధవారం మీడియాకు చూ పారు. మావోయిస్టులు తనను కోవర్టుగా భావిస్తున్నందునే లొంగిపోయేం దుకు విక్రమ్ నిర్ణయించుకున్నాడని పోలీసులు పేర్కొంటున్నారు. మరోవైపు విక్రమ్ వద్ద 12 బోర్ తపంచాను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించగా తనపై అక్రమంగా మరోకేసు నమోదు చేశారని మీడియా ఎదు ట నిందితుడు గోడు వెల్లబోసుకున్నా డు. లొంగిపోతే ఎలాంటి కేసులు ఉం డవనే పోలీసుల హామీతో వచ్చిన తన పై మళ్లీ కేసులు నమోదు చేయడంపై విక్రమ్ మీడియా సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ఇదీ విక్రమ్ నేపథ్యం అమ్రాబాద్ మండలం బీకే తిర్మలాపూర్కు చెందిన దారగోని శ్రీనివాస్ అలి యాస్ విక్రమ్ 2004లో మావోయిస్టు కార్యకలాపాలకు ఆకర్షితుడై అప్పటి జిల్లా కమిటీ కార్యదర్శి సాంబశివుడు, జిల్లా కమిటీ సభ్యుడు రమాకాంత్ ప్రభావంతో పార్టీలో చేరాడు. ఆమనగల్లు ఎంపీపీ ఆర్.పంతునాయక్ హత్యకేసులో నిందితుడిగా ఉన్న విక్రమ్ను 2008 జనవరి 4న వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి ఏకే 47 ఆయుధాన్ని స్వాధీనపర్చుకున్నారు. ఈ ఆయుధాన్ని మహబూబ్నగర్లోని ఎనిమి దో అదనపు కోర్టులో డిపాజిట్ చేశారు. ఏడో అదనపు కోర్టులో విచారణకు హాజరవుతున్న క్రమంలో 2013 జూన్ 19న కోర్టు ఆవరణ నుంచి ఏకే 47 ఆయుధంతో విక్రమ్ పరారయ్యాడు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నంబయ్య, శ్రీనివాస్ను పోలీ సులు అరెస్టు చేయగా, అతడు మా త్రం అజ్ఞాతంలోకి వెళ్లాడు. నల్లమల అటవీ ప్రాంతంలో తన సహచరులు జానా బాబూరావు, నాగమణి అలియాస్ భారతి, కల్పనతో కలిసి జట్టుగా ఏర్పడి గుంటూరు, ప్రకాశం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల పరిధిలో కార్యకలాపాలు కొనసాగించేవారు. ఈ క్రమంలో గతనెల 19న సరుకులు తెచ్చేందుకు విక్రమ్ సమీప గ్రామానికి వెళ్లిన సమయంలో జానా బాబూరావు బృందానికి, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బాబూరావుతో పాటు మరో ఇద్దరు మహిళా మావోయిస్టులు మరణిం చారు. ఎన్కౌంటర్ వార్తను తెలుసుకున్న విక్రమ్ బంధువుల సహకారంతో ఆత్మకూరు సీఐ కిషన్, కానిస్టేబుల్ వెంకటేశ్ బృందం ఎదుట లొంగిపోయాడు. విక్రమ్ వద్ద నుంచి తపంచాను స్వాధీనం చేసుకున్నారు. -
నూకలవాడలో హైడ్రామా!
బలిజిపేట రూరల్, న్యూస్లైన్ : మండలంలోని నూకలవాడ పోలింగ్ కేంద్రంలో హై డ్రామా నెలకొంది. ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చినా.. పోలింగ్ సిబ్బంది వైఎస్సార్ సీపీ ఏజెంట్లను కేంద్రంలోకి అనుమతించలేదు.దీంతో పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. పలగర ప్రాదేశికంలో ఉన్న నూకలవాడలో రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని వైఎస్సార్ సీపీ నాయకులు ముందుగానే అధికారులకు విన్నవించారు. దీనిపై స్పందించిన అధికారులు కేంద్రంలో సిసి కెమేరాలు, వీడియోలు అమర్చి, గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ గ్రామంలో 38, 39 పీఎస్లు ఉన్నాయి. 1488 మంది ఓటర్లు ఉం డగా 1229 ఓట్లు పోలయ్యాయి. అయితే ఏజెంట్లు, జనరల్ ఏజెంట్ నియామకంలో పార్టీ అభ్యర్థులు మొదటే పలగర ప్రాదేశికం నుంచి ఏజెంట్లను తీసుకువచ్చేందుకు అధికారుల అనుమతి కోరారు. అందుకు అధికారులు కూడా అంగీ కరించడంతో పార్టీ నాయకులు పలగర నుంచి ఏజెంట్లను నియమించారు. అయితే పోలింగ్ సమయంలో పలగర గ్రామానికి చెందిన ఏజెంట్లు పనికిరారని ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ..పోలింగ్ సిబ్బంది వారిని రెండు కేంద్రాల నుంచి బయ టకు పంపించివేశారు. దీంతో ఏజెంట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారి ఆదేశాల మేరకు పోలింగ్ సిబ్బంది తిరిగి ఏజెంట్లను కేంద్రాల్లోకి అనుమతించారు. మళ్లీ కొంత సమయం తరువాత వారిని బయటకు పంపించివేశారు. దీనిపై కేంద్రాలను పరిశీలించడానికి వచ్చిన ఉన్నతాధికారులను ఏజెంట్లు ప్రశ్నించగా.. వారు ఎలాంటి సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయూరు. కాగా ఈ విషయమై వైఎస్సార్ సీపీ నాయకులు శ్రీకాంత్, సత్యనారాయణరాజు,ఎస్. సత్యంనాయుడు మాట్లాడుతూ వైఎస్సా ర్ సీపీ ఏజెంట్లు, జనరల్ ఏజెంట్ను పోలింగ్ సిబ్బంది బయటకు పంపిం చి, రిగ్గింగ్ చేశారని ఆరోపించారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. అవసరమైతే కోర్టును కూడా ఆశ్రయిస్తామన్నారు. దీనిపై ఆర్ఓ వేణుగో పాలనాయుడును ‘న్యూస్లైన్’ వివరణ కోరగా మైక్రో అబ్జర్వర్ల సమాచారం మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. -
కోడెల మరో హైడ్రామా !
సాక్షి, గుంటూరు: ప్రతి విషయంలో తనకేదో తీవ్ర అన్యాయం జరిగిపోతోందనే భావన కల్పిండం.. తద్వారా వచ్చే సానుభూతితో రాజకీయంగా ఎదగాలని ప్రయత్నించడంలో మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడెల శివప్రసాదరావు దిట్ట. ఆయన చెప్పేదొకటి చేసేదొకటి అన్న సంగతి నరసరావుపేట నియోజకవర్గంలో అందరికీ తెలిసిందే. గతంలో జరిగిన పలు ఘటనలు ఇందుకు నిదర్శనం. సార్వత్రిక ఎన్నికల్లో నరసరావుపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తే గెలుపు సాధ్యం కాదని గ్రహించిన కోడెల సత్తెనపల్లి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అక్కడి నాయకుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఏం చేయాలో పాలుపోక పార్టీ అధినేత చ ంద్రబాబు చుట్టూ చక్కర్లు కొట్టారు. అనంతరం తమ పార్టీ బీజేపీతో పొత్తుపెట్టుకునే యోచనలో ఉందని గ్రహించి, నరసరావుపేటను ఆ పార్టీకి కేటాయించాలని, తనను సత్తెనపల్లి పంపాలని చంద్రబాబుకు విన్నవించినట్లు సమాచారం. నరసరావుపేటను బీజేపీకి కేటాయించడం వల్ల తనకు అన్యాయం జరిగిపోతోందని కార్యకర్తల్లో సానుభూతి పొంది చివరకు పార్టీ ఆదేశాలంటూ సత్తెనపల్లికి వెళ్లేందుకు కోడెల పథక రచన చేశారు. బీజేపీ టికెట్ ఆశ చూపి... పొత్తులో సీటు కోల్పోయి సత్తెనపల్లికి వస్తున్న తనకు ఆ నియోజకవర్గంలో సైతం సానుభూతి పెరుగుతుందనేది కోడెల ఆలోచన. ఆలోచన వచ్చిందే త డవుగా నరసరావుపేటలోని తిరుమల డైరీ యజమానుల్లో ఒకరిని బీజేపీ టిక్కెట్టు ఇప్పిస్తానంటూ వారం రోజుల క్రితం వారితో చర్చలు జరిపారు. వెంటనే అధిష్టానం వద్దకు వె ళ్లి నరసరావుపేట అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించాల్సిందిగా సూచించారు. దీని ద్వారా నరసరావుపేటలో గెలిచినా, ఓడినా తన చేతిలోనే ఉంటుందనేది ఒక భావన. పొత్తులో సీటు కోల్పోయి పార్టీ ఆదేశాల మేరకు సత్తెనపల్లికి వస్తున్న కోడెలకు అక్కడ కూడా ఆదరణ లభిస్తుందనేది ఆయన రాజకీయ ఎత్తుగడ. ఇటీవల తనను అధినేత చంద్రబాబు సత్తెనపల్లి వెళ్లమన్నారంటూ కార్యకర్తల సమావేశంలో మొసలి కన్నీరు కార్చి కార్యకర్తల వద్ద సానుభూతి పొందారు. అంతటితో ఆగకుండా తన అనుయాయులతో ఆత్మహత్యాయత్నాలు చేయించి రాష్ట్రవ్యాప్తంగా పార్టీలో కోడెలకు తీవ్ర అన్యాయం జరిగిపోతుందనే భావాన్ని కల్పించే యత్నం చేశారు. ఈ హైడ్రామాను గమనించిన చంద్రబాబు కోడెలను పిలిచి మందలించడంతో డ్రామాకు తెరపడింది. ఇలాంటి చౌకబారు రాజకీయాలకు దిగినప్పుడల్లా దురదృష్టవశాత్తు పాపం కోడెల దొరికి పోతున్నారు. ఆయన సూచన మేరకు నరసరావుపేట అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తూ అధిష్టానం ప్రకటించగానే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తనకు అన్యాయం జరుగుతుందంటూ గగ్గోలు పెట్టారు. పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడేలా చేశారు. తాను అధిష్టానం వద్ద తేల్చుకుంటానంటూ హడావుడిగా హైదరాబాదు బయలుదేరి వెళ్లారు. ఈ విషయం కూడా ఆనోటా, ఈనోటా నాని బహిర్గతం కావడంతో కోడెల అటు నరసరావుపేట, ఇటు సత్తెనపల్లి నియోజకవర్గాల ప్రజలకు చులకనయ్యారు. ప్రస్తుతం కోడెల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. -
బిల్డింగ్పై నుంచి దూకేందుకు ఓ వ్యక్తి హల్చల్
-
ఢిల్లీలో టిడిపి ఎంపీల హైడ్రామా
-
రాష్ట్ర విభజన పై టిడిపి సరికొత్త రాజకీయడ్రామా