ifs officer
-
కార్పొరేట్ జాబ్ వదిలేసి మరీ సివిల్స్ ప్రిపరేషన్..ఏడు సార్లు వైఫల్యం..చివరికి..
యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ అన్నది చాలామంది యువత డ్రీమ్. కానీ దాన్ని అందుకోవడం అంత ఈజీ కాదు. ఈ ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్ మాములుగా చుక్కలు చూపించదు. మూడు దశల ఎగ్జామ్లో ఎక్కడైనా ఏమరపాటుతో ఉన్నామో.. అంతే సంగతులు. అప్పటి దాక పడ్డ కష్టం క్షణంలో వృధా అయిపోతుంది. మళ్లీ మొదట నుంచి అంటే.. కన్నీళ్లు వచ్చేస్తాయి. అంత ఓపికతో వ్యవహరిస్తేనే తమ కలను సాకారం చేసుకోగలరు. అలాంటి వారెందరో ఉన్నారు కూడా. ఆ క్రమంలో కొందరూ ఎడతెగని వైఫల్యాలు ఎదర్కొంటే ఆత్మవిశ్వాసం శూన్యం అయిపోతుంది. అస్సలు గెలుపు అన్నది జీవితంలో లేదేమో అన్నంతగా డీలా పడిపోతారు. దారులన్నీ మూసుకుపోయినట్లుగా అయిపోతుంది. అలాంటి కఠినతర పరిస్థితులను కొందరు మాత్రం ఎదురొడ్డి నిలబడిన తమ కలను సాకారం చేసుకుంటారు. అలాంటి కోవకు చెందిందే ఆంధ్రప్రదేశ్కి చెందిన వెన్నమ్ అనూష.ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాకు చెందిన వెన్నమ్ అనూష సివిల్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఫేస్ చేసిన కష్టాలు చూస్తే కన్నీళ్లు వచ్చేస్తాయి. బాబోయ్..! ఇంతలా భరిస్తూ అన్నిసార్లు ఎలా ప్రయత్నాలు చేసిందా..! అని ఆశ్చర్యపోతారు. అంతలా ఓటమిపాలవ్వుతున్నా..వెనక్కి తగ్గకుండా ఎప్పటికైనా గెలుపు తనని తప్పక వరిస్తుందన్న నమ్మకంతో ప్రయత్నించి విజయం సాధించింది. ఆమె టీనేజ్లో ఉన్నప్పుడు కూడా కష్టాలను ఎదుర్కొంది. ఇంటర్మీడియెట్ వరకు టాపర్గా ఉన్నఆమె తండ్రి మరణంతో తీవ్ర మానసిక వేదనకు గురై వెనకబడింది. ఆ ప్రభావం బీటెక్ ఎంట్రన్స్ ఎగ్జామ్పై పడి..అందులో ఉత్తీర్ణత సాధించడానికి నానా ఇబ్బందుల పడింది. చివరికీ..ఏదో రకంగా సీటు తెచ్చుకుంది. అలా 2014లో బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఐటీలో బీటెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లు ఓ ప్రైవేటు జాబ్ చేసింది. ఆ తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలేసి మరీ 2017 నుంచి సివిల్స్కి ప్రిపేరయ్యింది. ఇక అక్కడ నుంచి వరుసగా ఆ ఎగ్జామ్లో వైఫల్యాలే ఎదుర్కొంటూ వచ్చింది. అలా 2021 వరకు ఏడుసార్లు వైఫల్యం ఎదుర్కొంది. మొదటి ప్రయత్నంలో ఆప్టిట్యూడ్ టెస్ట్లో జస్ట్ అర మార్కు తేడాతో పోయింది. పోనీలే అని మరోసారి రాస్తే.. ఈసారి మెయిన్స్. ఆ తర్వాత ఇంటర్వ్యూ రౌండ్కు చేరుకున్నాక తుది ఎంపికలో విఫలమైంది. అలా ఏకంగా ఏడుసార్లు వైఫల్యాలు చవిచూడటంతో పూర్తి నైరాశ్యంలో మునిగిపోయింది. ఇక ఏది గెలవలేనన్నా భయంతో డీలా పడింది. ఆ సమయంతో ఆమె గురువులో ఒకరు ఎందుకు యూపీఎస్సీ ఐఎఫ్ఎస్ ప్రయత్నించకూడదు. ఇన్నిసార్లు ఓటిమిని ఎదర్కొన్నప్పుడూ.. సంపాదించిన జ్ఞానం వృధాగా పోదని ప్రోత్సహించడంతో అనూష ఆ దిశగా అడుగులు వేసింది. ఈసారి గెలుపు తలుపు తట్టింది. విజయం ఆమె ఒళ్లోకి వచ్చి వాలింది. యూపీఎస్సీ ఐఎఫ్ఎస్ తొలి ప్రయత్నంలోనే 73వ ర్యాంకుతో అర్హత సాధించి ఐఎఫ్ఎస్ అధికారిణి అయ్యింది. ఈమె కథ ఓటములు వరుస పెట్టి పలకరించి బాధల్లోకి నెట్టేస్తే..భయంతో పారిపోకూడాదనే పాఠాన్ని నేర్పడమే గాక అలాంటి సమయంలో గురువులు లేదా శ్రేయాభిలాషుల అండదండలతో పుంజుకోవాని ప్రూవ్ చేసింది. పైగా ఓటిమికి దాసోహం కాకూడదని చెబుతోంది. దేవుడు అన్నిదారులు మూసి వేసినా ఒక్క తలుపు మనకోసం తెరిచే ఉంచుతాడంటారు. కాకపోతే ఆ తలుపు ఏదో వెతికేందుకుకే సమయం పడుతుంది అంతే..!.(చదవండి: వందేళ్ల నాటి పైథానీ చీరలో బరోడా మహారాణి రాధికా రాజే..! అచ్చమైన బంగారంతో..) -
రూ.5 వేలకు చిరు ఉద్యోగం, అయిదు సార్లు ఓటమి..కట్ చేస్తే..!
విజయం సాధించాలంటే ఎంత కష్టమైనా భరించాలి. నిబద్దత, పట్టుదల ఉంటే చాలు ఓటమి ఎన్నిసార్లు వెక్కిరించినా విజయం వచ్చి ఒడిలో వాలుతుంది. కావాల్సిందల్లా సాధించాలనే కసి. కడు పేదరికం నుంచి కూడా ఓర్పు, అభిరుచి ఉంటే విజయం సాధించ వచ్చు. అలాంటి సక్సెస్ స్టోరీని తలుసుకుందాం...రండి..! తమిళనాడులోని కోయంబత్తూర్ పాలక్కాడ్కు చెందిన ఆర్ ముత్తులక్ష్మి, ఆర్ చంద్రశేఖర్ల ఏకైక కుమార్తె రమ్య. తల్లిదండ్రుల కష్టాలను చూస్తూపెరిగిన రమ్య చదులు రాణించింది. పదవతరగతి ఆ తరువాత పాలిటెక్నిక్ డిప్లమా చేసింది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ,ఆ తర్వాత IGNOUలో ఎంబీఏ చేసింది. ఐఏఎస్ కావాలను కలలు కంది.ఇంతలో తండ్రి అనూహ్య మరణంతో కుటుంబ బాధ్యతను భుజాన వేసుకుంది. బెంగళూరుకు చెందిన ఇన్స్ట్రుమెంటేషన్ కంపెనీలో మూడేళ్లపాటు పనిచేసింది. ఉద్యోగం చేస్తూనే ఐఏఎస్ ఆఫీసర్ కలలు కంది. క్రమంగా ఆ కల నెర్వేర్చుకోవాలనే పట్టుదలా పెరిగింది. అలా 2017 లో యూపీఎస్సీ నోటిఫికేషన్ రావడం ఆలస్యం, ఉద్యోగానికి రాజీనామా చేసి చెన్నైకి వెళ్లిపోయింది. కానీ తన ఖర్చులకైనా ఏదో ఒక పని చేసుకోవాలి అందుకే రోజుకు మూడు గంటలు పనిచేసేలా డేటా ఎంట్రీ ఉద్యోగంలో చేరింది. ఆ సమయంలో ఆమె వేతనం ఐదు వేలు మాత్రమే. మిగిలిన సమయాన్ని చదువుకోసం కేటాయించేది. కానీ తొలి పరీక్షలో కనీసం ప్రిలిమ్స్ కూడా పాస్ కాలేక పోయింది. అయినా పట్టువీడలేదు. ఐదు సార్లు ఫలితం దక్కక పోయినా ఏ మాత్రం నిరాశ పడలేదు. అపజయాలే విజయానికి సోపానాలు అన్న మాటను అక్షరాలా నిజం చేస్తూ 2021 లితాల్లో ఏకంగా జాతీయ స్థాయిలో 46వ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. తల్లి సహకారం, తోడ్పాటుతోనే ఈ విజయం సాధించానంటూ ఆమో సంతోషంతో ఉప్పొంగిపోయింది. ప్రస్తుతం ఆమె ఐఎఫ్ఎస్ అధికారిణిగా పనిచేస్తున్నారు. -
చిరుత కుటుంబం ఇంత సన్నిహితమా?
వన్యప్రాణులకు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు, వీడియోలను తరచూ పంచుకునే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కస్వాన్ తాజాగా ఇన్స్టాగ్రామ్లో పర్షియన్ చిరుతపులి కుటుంబానికి సంబంధించిన ఫుటేజీని షేర్ చేశారు. తుర్క్మెనిస్తాన్ వన్యప్రాణి సంరక్షకుడు నరిన్ టి రోసెన్ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరా ద్వారా ఈ దృశ్యాలు చిత్రీకరించారు. చిరుతపులి ఉపజాతిలో పర్షియన్ చిరుతపులి అతిపెద్దది. ప్రస్తుతం అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉంది. ప్రపంచంలో వెయ్యికి తక్కువగానే ఈ జాతి చిరుతపులులు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ‘పర్షియన్ చిరుతపులి కుటుంబం వసతి ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నప్పుడు.. ట్రాప్ కెమెరా ముందు.. మీరు చూస్తున్న ఈ అద్భుత వీడియో గొప్పదనం @NarynTRకి చెందుతుంది’ అంటూ వీడియోకు క్యాప్షన్ జతచేశారు. ఈ అరుదైన వీడియోలో నాలుగు పర్షియన్ చిరుతపులుల కుటుంబం విశ్రాంతి తీసుకుంటూ కనిపిస్తుంది. చిరుతపులి కూనలు చేస్తున్న సౌండ్స్ కూడా ఈ వీడియోలో వినిపిస్తాయి. ఇంటర్నెట్ యూజర్స్ ఈ వీడియోను అమితంగా ఇష్టపడుతున్నారు. ఒక యూజర్ ఇలా రాశాడు ‘వావ్.. ఇది నిజంగా అద్భుతం. ప్రకృతి ఒడిలో పర్షియన్ చిరుతపులి కుటుంబం’. మరొక యూజర్ ‘నేను చాలా కాలం తరువాత చూసిన అద్భుతం’ అని రాశారు. కాగా ట్రాప్ కెమెరా అనేది ఇన్ఫ్రారెడ్ సెన్సార్కు జోడించిన డిజిటల్ కెమెరా. ఇది వన్యప్రాణులు, వాటి ఆవాసాలు, జాతుల స్థానం, జనాభా పరిమాణం, జాతుల పరస్పర చర్యలకు సంబంధించిన డేటాను పొందుపరుస్తుంది. ఏదైనా జంతువు కెమెరా సెన్సార్ దగ్గరికు వెళ్ళినప్పుడు అది కెమెరాను ట్రిగ్గర్ చేస్తుంది. తర్వాత వీడియోను రికార్డ్ చేస్తుంది. ఇది కూడా చదవండి: 72 ఏళ్ల క్రితం మూసిన ఆలయం తెరవగానే.. When a Persian Leopard family decided to make home in front of a trap camera. The best thing you will watch. Credits to @NarynTR for raising awareness about them. pic.twitter.com/5hp8R4Whh1 — Parveen Kaswan, IFS (@ParveenKaswan) October 14, 2023 -
మహారణ్యానికి మహిళా బాస్
అస్సాంలో వెయ్యి చదరపు కిలోమీటర్ల కజిరంగా నేషనల్ పార్క్... 118 ఏళ్ల ఘన చరిత్ర... కాని ఇంతకాలం వరకూ ఒక్కసారి కూడా ఫీల్డ్ డైరెక్టర్ బాధ్యతలు మహిళలకు అప్పజెప్పలేదు. ఇన్నాళ్లకు ఐ.ఎఫ్.ఎస్ అధికారి సొనాలి ఘోష్ చరిత్ర సృష్టించింది. సెప్టెంబర్ 1 నుంచి కజిరంగాలోని చెట్టూ పుట్టా ఖడ్గమృగాలూ ఏనుగు గుంపులూ సొనాలి కనుసన్నల్లో మెలగనున్నాయి. శక్తి సామర్థ్యాలతో ఈ స్థాయికి ఎదిగిన సొనాలి ఘోష్ పరిచయం. మొత్తానికి ఒక స్త్రీ రక్షించిన అరణ్యానికి మరో స్త్రీ సర్వోన్నత అధికారి కావడం విశేషం అనే చెప్పుకోవాలి. అస్సాంలో గోలఘాట్, నగౌన్ జిల్లాల మధ్య విస్తరించి ఉన్న కజిరంగా నేషనల్ పార్క్ ఒకప్పుడు, ఇప్పుడు ఒంటికొమ్ము ఖడ్గమృగానికి ఆలవాలం. అయితే ఏనాటి నుంచో వందల, వేల ఖడ్గమృగాలు ఇక్కడ వేటగాళ్ల బారిన పడేవి. 1904లో నాటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ భార్య మేరీ కర్జన్ వన విహారానికి వచ్చినప్పుడు ఇక్కడ యధేచ్ఛగా సాగుతున్న ఖడ్గమృగాల హననం చూసి చలించిపోయింది. వెంటనే ఆమె భర్తకు ఈ విషయం చెప్పి ఎలాగైనా ఈ వేటకు అడ్డుకట్ట వేసి ఖడ్గమృగాలను కాపాడమని కోరింది. దాంతో అతడు 1905లో కజిరంగా అరణ్యాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించి ఈ ప్రాంతాన్ని కాపాడాడు. అప్పటి నుంచి మొదలయ్యి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పూనికతో కజిరంగా నేషనల్ పార్క్గా రక్షణ పొందడమే కాక యునెస్కో వారి గుర్తింపు కూడా పొందింది. అయితే ఇంత ఖ్యాతి ఉన్న ఈ పార్క్కు ఫీల్డ్ డైరెక్టర్గా ఇంతకాలం వరకూ పురుషులే పని చేశారు. ఇన్నేళ్లకు సెప్టెంబర్ 1 నుంచి ఈ బాధ్యతలను సొనాలి ఘోష్ స్వీకరించనుంది. అడవి అంటే ప్రేమ సొనాలి ఘోష్ ఒక ఆర్మీ కుటుంబంలో జన్మించింది. తండ్రి ఉద్యోగరీత్యా అడవులు ఆమెకు బాల్యం నుంచే తెలుసు. అలా వాటిపై ప్రేమ ఏర్పడింది. డిగ్రీ అయ్యాక వైల్డ్లైఫ్ సైన్స్ చదివి, ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ లా చదివింది. మానస్ నేషనల్ పార్క్లో పులులను ట్రాక్ చేసేందుకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల కలిగే లాభనష్టాలను పరిశోధించి డాక్టరేట్ పొందింది. ఈ చదువుంతా ఆమెకు ఐ.ఎఫ్.ఎస్. ర్యాంకు సాధించడంలో ఉపయోగపడింది. ఐ.ఎఫ్.ఎస్. 2000–2003 బ్యాచ్లో టాపర్గా నిలిచింది. ఆమెకు అస్సాం కేడర్ కేటాయించారు. అప్పటి నుంచి ఆమె తన ఉద్యోగరంగంలో దూసుకుపోసాగింది. స్త్రీలకు సవాలు ‘అడవుల్లో పని చేయడం స్త్రీలకు సవాలే. కాని ఆ సవాలును స్త్రీలు సమర్థంగా ఎదుర్కొంటున్నారు. నేను ఐ.ఎఫ్.ఎస్.లో చేరేనాటికి 100 కు లోపే ఐ.ఎఫ్.ఎస్. మహిళాధికారులు ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య బాగా పెరిగింది. ఇక రేంజర్లుగా, డిప్యూటి రేంజర్లుగా స్త్రీలు పెద్ద సంఖ్యలో ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు. వారంతా ఏదో ఒక ఉద్యోగం అని అడవుల్లోకి రాలేదు. అడవులంటే ఇష్టం కాబట్టే వచ్చారు. అయితే మాకు సమస్యల్లా కుటుంబ జీవనం, వృత్తి జీవనం బేలెన్స్ చేసుకోవడం. అటవీశాఖలో పని చేసే మహిళల పిల్లలను చూసుకునే శిశు కేంద్రాలు సరైనవి ఉంటే తల్లులు నిశ్చింతతో ఇంకా బాగా పని చేయగలరు. అంతే కాదు అడవుల్లో తిరిగే ఈ మహిళా ఉద్యోగులకు తగినన్ని టాయిలెట్లు, స్నానాల గదులు ఉంటే వారికి సౌకర్యంగా ఉంటుంది. నా ఉద్దేశంలో మంచి బడి, మంచి వైద్యం అందుబాటులో ఉంటే గనక అటవీశాఖలో పని చేసే స్త్రీలు తమ పిల్లల్ని అడవులతోపాటుగా పెంచాలని కోరుకుంటారు. ఎందుకంటే అడవికి మించిన గురువు లేడు. స్త్రీలు మంచి కమ్యూనికేటర్లు. అడవుల అంచున జనావాసాలు ఉంటాయి. మనుషుల వల్ల అటవీ జీవులకు వచ్చే ప్రమాదాలను నివారించడంలో మనుషులు ఎలా వ్యవహరించాలో పురుషులు చెప్పడం కంటే స్త్రీలు చెప్తే ఎక్కువ వింటారు. అందుకని కూడా అటవీశాఖలో ఎక్కువమంది పని చేయాలి. అడవులంటే వేటగాళ్లను నిరోధించడం మాత్రమే కాదు. అన్ని జీవుల సమగ్ర జీవన చక్రాలను కాపాడాలి. అది ముఖ్యం’ అంటుంది సొనాలి ఘోష్. ఆమె ఆధ్వర్యంలో కజిరంగా మరింత గొప్పగా అలరారుతుందని ఆశిద్దాం. -
Jaipur Literature Festival 2023: త్రీలు– పని: నా డబ్బులు తీసుకో అనొద్దు
‘ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటున్నావు?’ ‘ఇప్పుడు ఏం అవసరం వచ్చింది?’ ‘డబ్బులు కావాలా?’ ఈ ప్రశ్నలు స్త్రీలను పురుషులు అడుగుతారు. ‘డబ్బులు కావాలంటే నా డబ్బులు తీసుకో’ అని భార్యతో భర్త, కూతురితో తండ్రి, తల్లితో కొడుకు, చెల్లితో అన్న అంటారు. ‘నేను సంపాదించుకున్న నా డబ్బులు నాకు కావాలి’ అని స్త్రీలు చెప్తే వీరు తెల్లముఖం వేస్తారు. స్త్రీల ఇంటి పని (కేర్ వర్క్)కి విలువ ఇవ్వక, స్త్రీలు బయట పని చేస్తామంటే పట్టించుకోక పోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా స్త్రీ, పురుషుల మధ్య ఆర్థిక తారతమ్యాలు తొలగడానికి ఐక్యరాజ్య సమితి అధ్యయనం ప్రకారం 120 ఏళ్లు పట్టనుందని శనివారం ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో పాల్గొన్న రచయిత్రులు అన్నారు. భవిష్యత్తులో ‘కేర్ వర్క్’ పెద్ద ఉపాధి రంగం కానుందని తెలిపారు. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఒక అధ్యయనం చేసింది. రాబోయే రోజుల్లో ఎటువంటి పనులు గిరాకీ కోల్పోయి ఎటువంటి పనులు గిరాకీలోకి వచ్చి ఉపాధిని ఏర్పరుస్తాయి అనేదే ఆ అధ్యయనం. అందులో దినదిన ప్రవర్థమానమయ్యే పని రంగంగా సంరక్షణా రంగం (కేర్ వర్క్) వచ్చింది. ఇంటి సంరక్షణ, పిల్లల సంరక్షణ, వృద్ధుల సంరక్షణ, ఇంటి శుభ్రత, ఇంటి ఆరోగ్యం... ఇవన్నీ కేర్ వర్క్ కింద వస్తాయి. ఈ కేర్ వర్క్ తరాలుగా స్త్రీలు చేస్తున్నారు. అసంఘటిత రంగంలో ఉన్న స్త్రీల చేత లెక్కా జమా లేని అతి తక్కువ వేతనాలకు చేయిస్తున్నారు. ఇంటిలో పని చేసే గృహిణుల కేర్ వర్క్కు విలువ కట్టడం లేదు. కేర్ వర్క్ను ప్రభుత్వ, ప్రయివేటు రంగాలు ఒక ఉపాధి రంగంగా అభివృద్ధి చేస్తే తప్ప కేర్ ఎకానమీ స్వరూపం, ఉనికి, ఉపయోగం అర్థం కాదు. మగవాడు ఇంటి బయట జీతానికి చేసే పని ఒక్కటే పని కాదు. ఇంటి లోపల జీతం లేకుండా స్త్రీలు చేసే పని కూడా పనే’ అని జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో శనివారం జరిగిన ‘విమెన్ అండ్ వర్క్’ అనే సెషన్లో పాల్గొన్న రచయిత్రులు అన్నారు. వీరిలో ‘సిస్టర్హుడ్ ఎకానమి’ పుస్తకం రాసిన శైలి చోప్రా, ఇస్రో మహిళా శాస్త్రవేత్తల మీద ‘దోజ్ మేగ్నిఫీషియెంట్ విమెన్ అండ్ దెయిర్ ఫ్లయింగ్ మెషిన్స్’ పుస్తకం రాసిన మిన్ని వైద్, ఐక్యరాజ్యసమితి మాజీ అసిస్టెంట్ సెక్రెటరీ జనరల్ లక్ష్మి పురి ఉన్నారు. ‘స్త్రీలు ఉండదగ్గ చోటు ఇల్లు అనడమే పెద్ద అవరోధం. అన్ని చోట్లు స్త్రీలు ఉండదగ్గ చోట్లే. కాని ఇంట్లో ఉండటం వల్ల, బిడ్డను కనే శారీరక ధర్మం ఆమెకే ఉండటం వల్ల ప్రేమ, బాధ్యత అనే మాటల్లో ఆమెను పెట్టి ఇంటి పని చేయిస్తున్నారు. అంతులేని ఈ ఇంటి చాకిరికి విలువ ఉంటుందని స్త్రీ ఎప్పుడూ అనుకోదు. విలువ సంగతి అటుంచితే... అంత పని స్త్రీ నెత్తిన ఉండటం గురించి కూడా మాట్లాడరు. గ్లోబల్గా చూస్తే పురుషుల కంటే స్త్రీలు 2.9 శాతం ఎక్కువ పని చేస్తున్నారు. భారతదేశంలో ఇది పది శాతమైనా ఉంటుంది. స్త్రీ, పురుషుల శరీర నిర్మాణంలో భేదం ఉంది. కాని ఈ భేదం భేదభావంగా వివక్షగా మారడం ఏ మాత్రం సరి కాదు’ అని లక్ష్మి పురి అన్నారు. ‘స్త్రీలు పని చేస్తామంటే పురుషులు అడ్డంకులు వేస్తూనే ఉంటారు. ఎందుకు పని చేయడమంటే అది స్త్రీల లక్ష్యం కావచ్చు. ఎంపిక కావచ్చు. ఇష్టం కావచ్చు. ఆర్థిక స్వావలంబన కోసం కావచ్చు. నా డబ్బు తీసుకో ఉంది కదా అని భర్త, తండ్రి, కొడుకు అంటూ ఉంటారు. ఎందుకు తీసుకోవాలి. తాము సంపాదించుకున్న డబ్బు కావాలి అనుకోవచ్చు స్త్రీలు. భారతదేశంలో స్త్రీల జనాభా జపాన్ దేశపు జనాభాకు ఎనిమిది అంతలు ఉంటుంది. అంతటి జనాభా ఉన్నప్పటికీ మన దేశ స్త్రీల అభిప్రాయాలను, భావాలను పరిగణనలోకి తీసుకోరు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి’ అని శైలి చోప్రా అన్నారు. ‘మగవారి మధ్య బ్రదర్హుడ్ ఉంటుంది. స్త్రీల మధ్య సిస్టర్హుడ్ బలపడితే అన్నింటిని మార్చగలం. అందుకే నా పుస్తకానికి సిస్టర్హుడ్ ఎకానమీ అని పేరు పెట్టాను’ అన్నారామె. ‘ఇస్రో మహిళా శాస్త్రవేత్తల మీద నేను పుస్తకం రాశాను. వాళ్ల నుంచి విన్న మొదటి మాట మహిళా అనొద్దు... మేమూ శాస్త్రవేత్తలమే... ప్రత్యేకంగా ఎంచడం వల్ల ఏదో ప్రోత్సహిస్తున్న భావన వస్తుంది అంటారు. చాలా బాగుంది. కాని ఇస్రోలో ఇప్పటికీ 16 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు ఇస్రోకు మహిళా శాస్త్రవేత్త డైరెక్టర్ కాలేదు. ఎప్పటికి అవుతారో తెలియదు. మంగళయాన్ వంటి మిషన్ను స్త్రీలు విజయవంతం చేసినా... నా కుటుంబం సపోర్ట్ చేయడం వల్లే చేశాను... నా భర్త సపోర్ట్ చేయడం వల్లే చేశాను... వారు చేయనివ్వడం వల్ల చేశాను అని చెప్పుకోవాల్సి వస్తోంది. ‘చేయనివ్వడం’ అనేది స్త్రీల విషయంలోనే జరుగుతుంది. ఎంత చదివినా, ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా భర్తో/కుటుంబమో వారిని ‘చేయనివ్వాలి’... ఈ స్థితి మహిళలకు ఎలాంటి మానసిక అవస్థను కలిగిస్తుందో మగవాళ్లకు తెలియదు. ఉద్యోగం చేస్తున్న స్త్రీ తారసపడితే ఆఫీసు, ఇల్లు ఎలా బేలెన్స్ చేసుకుంటున్నావు అని అడుగుతారు. మగవాడిని ఎందుకనో ఈ ప్రశ్న అడగరు’ అన్నారు మిన్ని వైద్. ‘కుటుంబ పరమైన, సామాజిక వొత్తిళ్ల వల్ల పిల్లలు కనే వయసులోని స్త్రీలు తమ వృత్తి, ఉపాధి నుంచి దూరమయ్యి పని చేయడం మానేస్తున్నారు. వారు తమ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే పని చేసే, చేయగలిగే వాతావరణం పూర్తి స్థాయి ఏర్పడాలంటే మగవాళ్లు ఇంకా మారాల్సి ఉంది’ అని ఈ వక్తలు అభిప్రాయ పడ్డారు. – జైపూర్ నుంచి సాక్షి ప్రతినిధి -
పిచ్చి అంటారండి దీన్ని!.. కాస్త ఉంటే..
మనుషులకు-వన్యప్రాణులకు మధ్య జరిగే సంఘర్షణ గురించి తెలియంది కాదు. నగరీకరణ, అడవుల్లో కార్పొరేట్ వ్యవహారాలు పెరిగి పోయే కొద్దీ.. అలాంటి ఘటనలు మరిన్ని చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. జనావాసాల వైపుగా వచ్చిన ఏనుగుల మందను తరిమే క్రమంలో ఓ కుర్రాడు.. కర్రతో ఏనుగును కొట్టాడు. చిర్రెత్తుకొచ్చిన ఆ గజరాజు ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సురేందర్ మెహతా.. ట్విటర్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. జస్ట్ మ్యాడ్నెస్(కేవలం పిచ్చి) అనే క్యాప్షన్ ఉంచారాయన. Just madness…🐘#Wildlife #conflict @susantananda3 pic.twitter.com/Il8jx4AqgZ — Surender Mehra IFS (@surenmehra) December 4, 2022 ఇదీ చదవండి: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం -
ఇదేం పామురా అయ్యా.. తిండి వేశారు అనుకుందో ఏమో..
సాధారణంగా మన ఇంటి పక్కన ప్రదేశాల్లో పాము కనిపిస్తే ఏం చేస్తారు?. కొందరు పామును చంపేస్తారు.. మరికొందరు అక్కడి నుంచి పారిపోతారు. ఈ వీడియోలో కూడా ఓ పాము తమ ఇంటి వద్ద కనిపించడంతో ఓ వ్యక్తి దానిపైకి చెప్పును విసిరాడు. దీంతో, అతను దానికి తిండి వేశాడు అనుకుందో ఏమో.. పాము తన నోటితో ఆ చెప్పును పట్టుకుని అక్కడి నుంచి పరుగు తీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్లో ఈ వీడియోను షేర్ చేశారు. పింక్ కలర్లో ఉన్న రబ్బర్ చెప్పును నోట కరుచుకున్న పాము, తల పైకి ఎత్తి చాలా కోపంతో వేగంగా పాకుతున్నట్లు అందులో ఉంది. ‘ఈ పాము ఆ చెప్పుతో ఏం చేస్తుందో అని ఆశ్చర్యంగా ఉంది. దానికి కాళ్లు లేవుగా’ అని ఆయన ఫన్నీ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఇది ఎక్కడ జరిగిందో తెలియదని ఆయన పేర్కొన్నారు. ఇక, ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. చెప్పు వాసన వల్ల ఏదో తినే పదార్థంగా భావించిన పాము దానిని నోట కరుచుకుని ఉంటుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. I wonder what this snake will do with that chappal. He got no legs. Unknown location. pic.twitter.com/9oMzgzvUZd — Parveen Kaswan, IFS (@ParveenKaswan) November 24, 2022 -
ఆశ్చర్యం..‘ఇలాంటివి మానవుల్లో కామనేగానీ.. పులుల్లో చాలా అరుదు’
ఎందుకు.. ఆశ్చర్యం అని చెప్పుకునేలోపు.. మనమో చిన్న కథ చెప్పుకుందాం.. అనగనగా.. ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. ఇద్దరికి చెరో నలుగురు పిల్లలు. ఓరోజు అక్క భర్తకు ఎందుకో కోపమొచ్చింది.. అక్కను చంపేశాడు.. అలాగే ఓ బిడ్డనూ చంపేశాడు. అక్క పిల్లలు అనాథలయ్యారు.. చెల్లెలే ధైర్యంగా నిలబడింది.. వారిని చేరదీసింది. వారి కన్నీళ్లను తుడిచింది. ఎలా మెలగాలో చెప్పింది.. ఎలా బతకాలో నేర్పింది. బతుకుదెరువు చూపింది. ప్రయోజకుల్ని చేసింది.. ఏంటీ.. పాతకాలపు సెంటిమెంటు స్టోరీ అనేగా మీ డౌటు..ఈ స్టోరీ మనుషులది కాదు.. ఈ పులులది అని చెబితే.. ఆశ్చర్యమే కదా..ఎందుకంటే.. ఇలాంటివి మానవుల్లో కామనేగానీ.. పులుల్లో చాలా అరుదు అని ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా అన్నారు. అవి ఆహారాన్ని ఆరగిస్తున్న చిత్రాన్ని ట్విట్టర్లో షేర్ చేసిన ఆయన.. ఈ ఫొటో వెనకున్న కథను నెటిజన్లకు తెలిపారు. Tigress takes care of 3 cubs of her dead sister along with 4 of her own. It is also reported that she gives precedence during hunting to the cubs of her sister. Rare. (Source:Forest Department) pic.twitter.com/V5wK28Qlgy — Susanta Nanda IFS (@susantananda3) August 22, 2022 -
మొక్కలు కూడా యుద్ధం చేస్తాయా..?
ఒడిశా: మొక్కలు సాధారణంగా ఎవరినీ నొంపించవనే మనకు తెలుసు. కానీ వుడ్ సోరెల్ అని పిలవబడే ఓ మొక్క ఉంది. అయితే దానిని ఎవరైనా ముట్టుకుంటే దానికి కోపం వస్తుంది. ఎంతలా అంటే దాని దగ్గరున్న ఆయుదాలతో ఆపకుండా యుద్ధం చేస్తుంది. అదేంటి మొక్క యుద్ధం చేయడమేంటనుకుంటున్నారా..? ఇది నిజమే ఆ మొక్కను ఎవరైనా ముట్టుకుంటే వారి బారి నుంచి కాపాడుకోవడానికి మిస్సైళ్లను పేల్చుతుంది. మిస్సైల్స్ అంటే ఎలాంటి బాంబులనో కాదు. ఆ మొక్క విత్తనాలనే బాంబుల్లా విసిరేస్తుందన్నమాట. వుడ్ సోరెల్ కాయలు చూడటానికి అచ్చం బెండకాయల్లా ఉంటాయి. ఎవరైనా దానిని తాకిన వెంటనే ఆపకుండా వరుసగా విత్తనాలను విసురుతుంది. ఒక్కటి రెండో కాదు కాసేపు అలా వాటిని వదులుతూనే ఉంటుంది. మిస్సైళ్ నుంచి బాంబులను వదిలినట్టుగా ఈ మొక్క విత్తనాలను వదలుతుంది. ఇలా దాదాపు నాలుగు మీటర్ల వరకు విత్తనాలను విసరగలిగే శక్తి ఈ వుడ్ సోరెల్ మొక్కలకు ఉంటుంది. ఒత్తిడితో పాటు దానికున్న శక్తి వల్ల అది విత్తనాలను విసరగలుగుతుంది. అయితే ఈ విత్తనాలు తగిలితే మనుషులకు పెద్దగా నొప్పి లేకపోవచ్చు కానీ చిన్నచిన్న కీటకాలకు తగిలితే వాటికి మాత్రం నొప్పి పుడుతుంది. తాజాగా ఈ మొక్కకు సంబంధించిన ఓ వీడియోను ఒడిశాకు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా ట్విట్ చేయడంతో అది వైరల్గా మారింది. ఇక ఈ వుడ్ సోరెల్ మొక్క బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మినహా ఈ మొక్క ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉంటుందని తెలుస్తుంది. మన దేశంలో కూడా కొన్ని ప్రదేశాల్లో వుడ్ సోరెల్ కనిపిస్తుందని సమాచారం. Ballistic missiles as seen in the on going war are not humans prerogative only.. Wood Sorrel plant explodes & goes ‘ballistic’ when touched. Seeds are thrown as far as 4 metres away due to stored strain energy, with the plant targeting the object that agitated it. 🎥Arun Kumar pic.twitter.com/uRVWO2MOut — Susanta Nanda IFS (@susantananda3) February 26, 2022 -
ఈ విషయం తెలిస్తే చైనా ఆగుతుందా
సాక్షి, నూఢిల్లీ: సోషల్ మీడియా వినియోగం పెరిగాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అరుదైన, అబ్బురపరిచే విషయాల గురించి అందరికి తెలుస్తున్నాయి. ట్విటర్ను ఎక్కువగా ఫాలో అయ్యేవారికి ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద తెలిసే ఉంటారు. అరుదైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు సుశాంత నంద. ఈ క్రమంలో తాజాగా ఆయన ట్వీట్ చేసిన ఓ ఫోటో తెగ వైరలవుతోంది. ఇక దీనిపై నెటిజనులు చేసే కామెంట్స్ చూస్తే.. విరగబడి నవ్వుతారు. ఇంతకు ఆయన షేర్ చేసిన ఫోటో.. ఆ వివరాలు.. (చదవండి: వైరల్ వీడియో: సృష్టికర్తకు జోహార్లు) సుశాంత నంద తన ట్విటర్లో శనివారం ఓ ఫోటోని షేర్ చేశారు. సడెన్గా చూస్తే.. అది డ్రాగన్ ఫోటోనో, పెయింటింగో అనిపిస్తుంది. కానీ కాదు. అది పోర్చుగల్లో ప్రవహిస్తున్న ఓ నది. ఆకాశం నుంచి చూస్తే.. అది అచ్చాం డ్రాగన్ మాదిరే ఉంది. ఇక ఈ ఫోటోపై నెటిజనులు చేసే కామెంట్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. (చదవండి: ‘ఒకే ఫ్రేమ్లో 3 లెజెండ్స్.. కేటీఆర్ చాలా యంగ్గా ఉన్నారు’) ‘‘ఈ ఫోటోని చైనా వాడు చూస్తే.. మా డ్రాగన్లకు పోర్చుగల్ సంతోనోత్పత్తి కేంద్రంగా ఉంది. కనుక ఆ దేశం కూడా మాకు చెందినదే అంటుంది’’.. ‘‘ఇప్పటి నుంచి పోర్చుగల్ కూడా మా దేశంలో భాగమే. వారిని మాలో కలుపుకుంటాం అంటుంది’’ అని కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. (చదవండి: అదృష్టం.. భూమ్మిద ఇంకా నూకలున్నాయ్!) When river look like a dragon... From Portugal. 🎬Faces in Things pic.twitter.com/0NWYPsXLQZ — Susanta Nanda (@susantananda3) November 27, 2021 -
అంత సమయం ఇవ్వలేం
సాక్షి, హైదరాబాద్: అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్లోని భారత రాయబార కార్యాలయంపై ఉగ్రవాద దాడిలో మృతిచెందిన ఐఎఫ్ఎస్ అధికారి వి.వెంకటేశ్వర్రావు కుటుంబానికి ఇంటిస్థలం అప్పగింతకు మూడు నెలల సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభు త్వం కోరడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దాదాపు 12 ఏళ్లుగా బాధిత కుటుంబం స్థలం కోసం ఎదురు చూస్తోందని, అంత సమయం ఇవ్వలేమని, 3 వారాల్లో ఇంటి స్థలం కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. భరణి లేఔట్లో కేటాయించనున్న ప్లాట్ నంబర్ 54ను వారం రోజుల్లో వెంకటేశ్వర్రావు భార్య మాలతీరావుకు చూపించాలని, ఆ ప్లాట్ తీసుకునేందుకు ఆమె అంగీకరిస్తే మరో 2 వారాల్లో కేటాయించాలని, ఆగస్టు 23లోగా ప్లాట్ అప్పగింతకు సంబంధించిన పూర్తి వివరాలను పేర్కొంటూ సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తన భర్త 2008లో తీవ్రవాదుల దాడిలో చనిపోయారని, ఇంటి స్థలం కేటాయిస్తూ 2014లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవో జారీచేసినా ఇప్పటికీ స్థలం అప్పగించలేదంటూ మాలతీరావు రాసిన లేఖను ధర్మాసనం గతంలో సుమోటో పిటిషన్గా విచారణకు స్వీకరించింది. మాలతీరావు అంగీకరిస్తే భరణి లేఔట్లోనే గతంలో కేటాయించిన ప్లాట్ నంబర్ 58 బదులుగా 475 గజాల స్థలం ఉన్న ప్లాట్ నంబర్ 54 ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రెవెన్యూ శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది భాస్కర్రెడ్డి నివేదించారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించడంతో...కనీసం 4 వారాల సమయం అయినా ఇవ్వాలని కోరారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం ఆగస్టు 23లోగా ప్లాట్ కేటాయింపు ప్రక్రియ పూర్తిచేసి మాలతీరావుకు అప్పగించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. -
వైరల్ వీడియో: సృష్టికర్తకు జోహార్లు
అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ ప్రేమను వర్ణించడానికి మాటలు చాలవు. అమ్మ ప్రేమకు హద్దులుండవు.. అనంతం. బిడ్డల్ని సంరక్షించడంలో తల్లి తర్వాతనే ఎవరైనా. వర్షం వస్తే పిల్లలకు తాను గొడుగవుతుంది.. ఎండలో నీడవుతుంది... ఇలా అన్ని వేళలా బిడ్డను కంటికి రెప్పలా కాపాడుతుంది తల్లి. అందుకే ఓ మాట అంటుంటారు.. సృష్టికర్త తాను అన్ని చోట్ల ఉండలేక.. తల్లిని సృష్టించాడంటారు. ఈ మాట అక్షరాల నిజం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఓ వీడియో చూస్తే.. తల్లి ప్రేమను అనుభూతి చెందుతారు. ఆ వివరాలు.. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుధా రామెన్ తన ట్విటర్లో ఓ వీడియో షేర్ చేశారు. 12 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో జోరుగా వర్షం కురుస్తుంటుంది. నిలువుగా పొడవుగా ఉన్న ఓ కర్రలాంటి దాని మీదున్న గూడులో ఓ కొంగ, పిల్లలతో కలిసి ఉంటుంది. పైన ఏ ఆధారం లేకపోవడంతో గూడు, దానిలోని పిల్లలు తడుస్తుంటాయి. ఈ క్రమంలో తన పిల్లలను వర్షంలో తడవకుండా ఉండటం కోసం కొంగ తన రెక్కలను తెరచి.. దాని కాళ్ల మధ్య పిల్లలను నిలుపుతుంది. అయినా పిల్లలు తడుస్తుండటంతో ఆ తల్లి కొంగ అలానే తన రెక్కలను విప్పార్చి.. కూర్చుంటుంది. ‘‘ఎందుకంటే తనొక అమ్మ’’ అనే క్యాప్షన్తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు ఆ కొంగ చూపిన తల్లి ప్రేమను ప్రశంసిస్తున్నారు. ‘‘తను ఒక అమ్మ.. ప్రకృతి తనకు ప్రేమను పంచడం, రక్షించడం, దారి చూపడం వంటి ఎన్నో లక్షణాలను అందించింది. తల్లి అంటేనే ప్రేమ.. సృష్టికర్తకు జోహార్లు..’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. -
అంతెత్తు లేచింది.. వెంటపడి తరిమింది..!
న్యూఢిల్లీ: జంతువులను వేటాడే విషయంలో పులిదే అగ్రస్థానం. పంజా విసిరితే.. ఎంత పెద్ద జంతువైనా తల వంచాల్సిందే. అయితే తాజాగా ఓ ఎలుగుబంటి తరుముతుంటే.. పులి తుర్రున పారిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుంతోంది. 24 సెకన్ల నివిడి గల ఈ వీడియోలో ఓ పులి చెరువు దగ్గర నిలబడి ఉంది. అయితే పులిని గుర్తించిన ఎలుగుబంటి దాన్ని భయపెట్టడానికి ముందరి కాళ్లతో లేచి.. పెలి మీదకి ఉరికింది. అంతే పులి కాళ్లకు పని చెప్పి అక్కడి నుంచి పారిపోయింది. ఈ వీడియోను భారత అటవీ అధికారి సుధా రామెన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్గా మారింది. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ అవును! అడవి జంతువులు అడవిలో నివసిస్తాయి. కానీ అడవి పాలన ఏం చెబుతుంది? అక్కడ బలవంతుడిదే మనుగడ. అది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.’’ అంటూ కామెంట్ చేశారు. ఇక మరో నెటిజన్ ‘‘ పోరాటంలో దూకుడుగా ఉన్న వ్యక్తిదే పై చేయి అయినట్లు.. ఏ జంతువైతే మరో జంతువును త్వరగా భయపెట్ట గలదో.. దానికి అడవిలో రక్షణ ఉంటుంది.’’ అంటూ రాసుకొచ్చారు. Sloth bear scaring away a Tiger - not quite a rare thing in the forests! Most bears (esp mumma bears) do attempt to scare the predator at the first instance by raising it's forelimbs to make them look large in size. This trick worked out for this bear. Video shared by a senior pic.twitter.com/SIikET7Asm — Sudha Ramen 🇮🇳 (@SudhaRamenIFS) July 10, 2021 -
బలంగా తన్నాడు.. మొద్దు వచ్చి మీద పడింది.. అంతే!
చర్యకు ప్రతి చర్య అనేది సహజం. మనిషి చేసే ప్రతి పనికి ఫలితం అనుభవంచి తీరాల్సిందే అని పెద్దలు వూరికే అనలేదు. ఇక మనుషుల రకరకాలుగా ఉన్నట్లే.. వారి మనస్తత్వం కూడా అనేక విధాలుగా ఉంటుంది. తాజాగా ఓ వ్యక్తి చెట్టును తన్నుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వీడియోలోని వ్యక్తి తన బలాన్ని చూపించుకోవాలనుకున్నాడేమో.. అదే పనిగా మొద్దుబారిన ఓ చెట్టును తన్నడం మొదలు పెట్టాడు. బలంగా తన్నుతున్నాడు గానీ.. బుద్దికి పని చెప్పినట్టు లేడు. ఇంకేముంది చెట్టు విరిగింది. కానీ మొద్దు వచ్చి తలపై పడింది. అంతే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ వీడియోను భారతీయ అటవీ అధికారి సుధా రామెన్ ‘‘మీరు చేసేది.. మీకు తిరిగి వస్తుంది. అది మంచైనా.. చెడైనా’’ అనే క్యాప్షన్తో సోషల్ మీడియాలో షేర్ చేయగా.. 91 వేల మంది నెటిజన్లు వీక్షించారు. వందల మంది కామెంట్ చేస్తున్నారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘కర్మ ఫలం అంటే ఇదే.. మనం ఏ చేస్తామో.. అది తిరిగి వస్తుంది.’’ అంటూ కామెంట్ చేశాడు. ఇక మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ గొప్పకు పోయాడు.. చివరకు పాఠం నేర్చుకున్నాడు.’’ అని రాసుకొచ్చారు. కాగా ఈ ఘటన ఎక్కడ జరిగిందో మాత్రం తెలిరాలేదు. కానీ.. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. All that you do comes back to you - Good and Bad pic.twitter.com/kMHZGF3NLi — Sudha Ramen 🇮🇳 (@SudhaRamenIFS) July 1, 2021 చదవండి: 97 శాతం బడుల్లో.. బాలికలకు మరుగుదొడ్లు పువ్వును వాసన చూసి నరకం అనుభవించిన అమ్మాయిలు -
వావ్.. అంకుల్ స్టెప్పులిరగదీశాడు కదా..!
సరదాగానో, ఇంట్లో ఎవరు లేనప్పుడో, పెళ్లిల్లు, ఇతర ఫంక్షన్లలో డ్యాన్స్ చేయడం కామన్. కానీ సంప్రదాయ నృత్యం చేయడం అంత సులభం కాదు. ముఖ్యంగా భరత నాట్యం, కూచిపుడి వంటి డ్యాన్స్లు చేయడం చాలా కష్టం.. అది కూడా ఆ నృత్యాలకు సంబంధించిన వస్త్రాలు ధరించి. కానీ ఇక్కడ ఉన్న వీడియో చూస్తే మీరు ఆశ్చర్యతో నోరు వెళ్లబెడతారు. మాములుగా భరతనాట్యం డ్రెస్ ధరించి.. డ్యాన్స్ చేయడానికి ఆడవారే కాస్త ఇబ్బంది పడతారు. అలాంటిది ఓ పురుషుడు భరతనాట్యం డ్రెస్ ధరించి.. ఎంతో అందంగా నృత్యం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సుశాంత్ నంద అనే ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ వ్యక్తి పైన చొక్క, కింద భరతనాట్యం డ్రెస్ ధరించి ఉన్నాడు. ఇక అతడు ఎంతో అద్భుతంగా.. చాలా సులభంగా.. అందంగా భరతనాట్యం చేశాడు. ఈ వీడియో చూసిన వారంతా ప్రతి ఒక్క స్టెప్ కూడా ఎంతో అందంగా, క్లియర్గా చేశారు.. అద్భుతమైన డ్యాన్సర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. చదవండి: పాపం ప్యాంటు తడిసిపోయి ఉంటుంది; వీడియో వైరల్ -
వామ్మో.. కోతులు ఏమాత్రం భయం లేకుండా.. స్పైడర్మాన్లా..
న్యూఢిల్లీ: సాధారణంగా కోతులు ఒకప్పుడు అడవులలో ఎక్కువగా ఉండేవి. పాపం.. వాటికి సరైన ఆహారం దొరక్క జనావాసాల మధ్యన చేరుకున్నాయి. అయితే, కోతులు చేసే హంగామా.. మాములుగా ఉండదు. అవి ఆహారం కోసం గుంపులు గుంపులుగా ఇళ్లపై దాడిచేసి, చేతికందినవి ఎత్తుకు పోతుంటాయి. ఈ క్రమంలో కోతులు ఒక్కోసారి ప్రవర్తించే తీరు చాలా ఫన్నీగా ఉంటుంది. అవి పెద్ద చెట్లపై అమాంతం ఎక్కి, కొమ్మలను పట్టుకొని వేలాడుతుంటాయి. అదే విధంగా, ఒక ఇంటిపై నుంచి మరొక ఇంటిపై దూకుతూ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ క్రమంలో ఒకదానిపై మరొకటి దాడిచేసుకోవడం మనకు తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఈ కోవకు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిలో రెండు కోతులు ఎనిమిది అంతస్థుల భవనంపైకి ఎక్కాయి. అవి వెళ్లిన పని అయిపోయిందేమో.. మరేమో.. కానీ ఆ తర్వాత ఒక గోడను ఆధారంగా చేసుకుని.. ఒకదాని తర్వాత మరొకటి మెల్లగా, పాకుతూ నేలను చేరుకున్నాయి. కాగా, ఈ వీడియోను టైకూన్కు చెందిన వ్యాపారవేత్త హార్ష గొయెంకా తన ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. ‘ఆ కోతులు అంత ఎత్తున ఉన్న బిల్డింగ్పై నుంచి కూడా.. ఎంత తెలివిగా, జాగ్రత్తగా దిగుతున్నాయో.. మనిషి కూడా అదే విధంగా ఎంత పెద్ద సమస్యలు ఎదురైనా వాటిని తేలికగా ఎదుర్కొవచ్చని ’ చెప్పారు. ఇదే వీడియోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుషాంత్నందా కూడా తన ఇన్స్టాలో వేదికగా పోస్ట్ చేశారు. దీనికి ఆయన ‘మనిషి జీవింతంలో సమస్యలు ఉండటం సహాజం.. కానీ, వీటిని మరింత జటిలం చేసుకుంటున్నారని ’ అని కోడ్ చేశారు. ఈ వీడియో ఎంతో స్పూర్తీవంతంగా ఉందని అన్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ ఈ కోతులకు ఫైర్ డిపార్ట్మెంట్లో ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా..’, ‘స్పైడర్మెన్ ఏంటా జారటం..’, ‘పట్టు తప్పితే.. ఇంకేమైనా ఉందా..’, ‘వాటి తెలివికి జోహర్లు..’ ‘హమ్మయ్య.. మొత్తానికి కిందకు చేరుకున్నాయి.’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. There are simple things in life you see and they light up your day….. pic.twitter.com/ceciyhKTox — Harsh Goenka (@hvgoenka) June 19, 2021 చదవండి: సైకిల్పై వచ్చి చోరీ.. వీడియో తీస్తూ నిలబడిన కస్టమర్లు.. -
ఈ కుక్క రోడ్ల పై ఎవరినీ చెత్త వేయనివ్వడం లేదు
-
వైరల్: ఈ కుక్కకి రోడ్ల పై చెత్త వేస్తే నచ్చదు..
సాధారణంగానే కుక్కలకు మానవులు ఎలా ప్రవర్తించాలి, ఏది ఎలా చేయాలి అనే అంశాలపై శిక్షణను ఇచ్చినప్పుడు అవి తూచా తప్పకుండా పాటించడం మనకి తెలుసు. ఒక్కోసారి మనం మర్చిపోయినా అవి మర్చిపోవు. ఇదే క్రమంలో ఈ కుక్క రోడ్ల పై ఎవరినీ చెత్త వేయనివ్వడం లేదు. అసలు ఎవరు ఈ కుక్క ఇలా ట్రైనింగ్ ఇచ్చారో గానీ ఇది చేసిన పని చూస్తే మాత్రం ఎవరికైనా ఆశ్చర్యం వేయక మానదు. అదే మున్సిపాలిటీ అధికారులు గనుక చూస్తే స్వచ్ఛ భారత్కు దీన్నే బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేస్తారేమో.. అసలు ఇంతకీ ఏం చేసిందో ఈ శునకం తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే.. కారు లోపల కూర్చున్న ఓ వ్యక్తి రోడ్డుపై పేపర్ విసురుతాడు. అకస్మాత్తుగా, ఆ కారు గుండా వెళుతున్న ఒక కుక్క, ఆ వ్యక్తి కారోలోంచి నిర్లక్ష్యంగా పారేసిన ప్లాస్టిక్ కవర్ని తన నోటితో ఎత్తుకొని తిరిగి కారులోకి వదిలేస్తుంది. ఇదే కుక్క స్థానంలో మనిషే ఉండుంటే చూసి చూడనట్లు వెళ్లిపోయేవాడు. కానీ ఆ కుక్క మాత్రం అందుకు భిన్నంగా శుభ్రతకు సంబంధించిన ఓ పాఠాన్నే మనకు నేర్పిందనే చెప్పాలి. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుధా రామెన్ తన ట్విట్టర్లో షేర్ చేశారు. “ప్రియమైన మానవులారా, ఇది మనకు ఒక పాఠం.. ఈ కుక్క తనకిచ్చిన శిక్షణను అనుసరిస్తున్నందుకు అభినందించాల్సిందే ” అని తన పోస్ట్కు ఈ శీర్షికను పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ కుక్క చేసిన పనికి నెటిజన్లు మనం ఇలాంటివి చూసైనా మారాలంటూ కామెంట్లు పెడుతున్నారు. ( చదవండి: హమ్మా! కాకికే షాకిచ్చిందిగా..!! వైరల్ వీడియో ) -
బిడ్డ కోసం పెంగ్విన్ల ఆరాటం
-
వైరల్: ‘బిడ్డా లే.. అమ్మ వచ్చింది చూడు’
న్యూఢిల్లీ: బిడ్డకు చిన్న దెబ్బతగిలితేనే తల్లి హృదయం విలవిల్లాడుతుంది. పిల్లలు ఏ చిన్నాపాటి అనారోగ్యానికి గురైన అమ్మ మనసు సహించదు. బిడ్డలు కోలుకునే వరకు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. దురదృష్టం కొద్ది బిడ్డ మరణిస్తే.. ఆ తల్లి కడుపుకోతను వర్ణించడానికి మాటలు చాలవు. ఇలాంటి తల్లి ప్రేమ మనుషులకే కాదు.. జంతువులకు కూడా ఉంటుంది. వాటి బిడ్డలకు ఏం జరిగినా అవి కూడా తట్టుకోలేవు. ఇందుకు నిదర్శనంగా నిలిచే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన ప్రతి ఒక్కరి హృదయం ద్రవిస్తోంది. చనిపోయిన పిల్ల పెంగ్విన్ని చూసి దాని తల్లిదండ్రులు హృదయవిదారకంగా విలపించాయి. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్లో ఇందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు. ‘‘జీవితం అంటేనే ఇలా ఉంటుంది. తమ బిడ్డను కోల్పోయినందుకు ఈ రెండు పెంగ్విన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మహమ్మారి టైంలో తమ ప్రియమైన వారిని కోల్పోయి.. బాధపడుతున్న వారికి దేవుడు ఆత్మనిబ్బరాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అంటూ సుశాంత నంద వీడియో షేర్ చేశారు. ఇక దీనిలో ఓ పెంగ్విన్ జంట చనిపోయిన బిడ్డను అటు ఇటు దొర్లిస్తూ.. ముక్కుతో దాన్ని కదుపుతూ లేపే ప్రయత్నం చేశాయి. కానీ దానిలో ఎలాంటి చలనం లేదు. బిడ్డ చనిపోయిందని తెలిసి ఆ పెంగ్విన్ల గుండె పగిలింది. బిడ్డను చూస్తూ.. మౌనంగా రోదించాయి. వాటి వేదన ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. చదవండి: షాకింగ్: తెలిసిన వాడని ఫోటో పంపితే.. దాన్ని మార్ఫ్ చేసి -
ఆకలి ఆక్రోశం: గిన్నె ఎత్తిపడేసిన శునకం
మనుషుల మాదిరి జంతువులకు దాదాపు అన్ని భావోద్వేగాలు ఉంటాయి. ఒక విధంగా చూస్తే అంతకంటే ఎక్కువ ఉంటాయి. తాజాగా ఓ శునకానికి యమ కోపం వచ్చేసింది. ఆకలవుతుందని భౌ భౌ అని అరుస్తుంటే ఎంతకీ యజమాని పట్టించుకోవడం లేదు. దీంతో చిర్రెత్తుకొచ్చి ఆ శునకం తిన్నె గిన్నెను నోటితో కరచుకుని విసిరి కొట్టేసింది. దానికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఇండియన్ ఫారెస్ట్ అధికారి (ఐఎఫ్ఎస్) ప్రవీణ్ అంగుసామి తన పెంపుడు కుక్కకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేశాడు. తనకు ఆకలి అయ్యిందని ఆ కుక్క అరుస్తుంటుంది. కొద్దిసేపటికి కోపమొచ్చి వెంటనే గదిలోకి వెళ్లి తాను తినే గిన్నెను నోటితో పట్టుకొచ్చి ఎత్తేసింది. ‘0.5 సెకండ్ల తర్వాత నాకు ఆకలి అవుతుంది’ అని దానికి సంబంధించిన వీడియోను ప్రవీణ్ పంచుకున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. దీనిపై తెగ కామెంట్లు వస్తున్నాయి. ఎంత కోపం? ఆకలైతే అంతే.! తదితర కామెంట్లు చేస్తున్నారు. మీరు చూసేయండి ఆ వీడియో.. -
ఇలాంటి ఏప్రిల్ ఫూల్ని ఎక్కడా చూసుండరు
ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్.. ఫూల్స్ డే. చిన్న చిన్న అబద్ధాలు చెప్పి స్నేహితులను ఫూల్స్ చేసి తెగ సంబరపడతాం. ఈ రోజు ఫూల్స్ డే అని మనకు తెలుసు కనక.. సరదగా ఆటపట్టిస్తాం. మరి ఈ పిట్టకు ఈ రోజు ఫూల్స్ డే అని తెలిసి ఇలా చేసిందో.. లేక ప్రాణం కాపాడుకునే ప్రయత్నమో తెలియదు కానీ ఏకంగా పిల్లితోనే ప్రాంక్ చేసింది. సమయం చూసుకుని తుర్రుమని ఎగిరిపోయింది. పిట్ట తెలివికి అవాక్కయిన పిల్లి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేసింది కానీ అది విఫలమయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియో కడుపుబ్బ నవ్వించడం ఖాయం. ఏప్రిల్ ఫూల్ అనే క్యాప్షన్తో షేర్ చేసిన ఈ వీడియోలో పిల్లి కాళ్ల కింద ఓ పిట్ట వుంటుంది. చూడ్డానికి అది మరణించనట్లు ఉంటుంది. దాంతో పిల్లి దాన్ని నేల మీద అటూ ఇటూ దొర్లిస్తూ ఆడుతూ ఉంటుంది. సమయం చూసుకుని ఆ పిట్ట ఒక్క ఉదుటున అక్కడ నుంచి తుర్రుమంటుంది. ఊహించని ఈ ఘటనకు షాక్ తిన్న పిల్లి.. పిట్టను పట్టుకునే ప్రయత్నం చేస్తుంది.. కానీ అప్పటికే అది అందనంత దూరం వెళ్లి పోతుంది. April fool😊 pic.twitter.com/2lbUAkhzP1 — Susanta Nanda IFS (@susantananda3) April 1, 2021 ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు పిట్ట తెలివిని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ఇది మన కంటే స్మార్ట్.. తెలివైన పిట్ట గెలిచింది.. అతి విశ్వాసం ఉన్న పిల్లి ఓడింది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: పులా.. పిల్లా.. ఎందుకిలా చేస్తోంది? -
‘లేడీ సింగమ్’ ఆత్మహత్య..
-
‘లేడీ సింగమ్’ ఆత్మహత్య.. మహారాష్ట్రలో ప్రకంపనలు
ముంబై: అటవీ శాఖ అధికారిణి బలవన్మరణానికి పాల్పడడం మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. ఆమె ఆత్మహత్యకు పాల్పడడానికి కారణం ఉన్నతాధికారి వేధింపులేనని తేలింది. ఆత్మహత్యకు పాల్పడే ముందు ఆమె తన సూసైడ్ నోట్లో తాను బలవన్మరణానికి పాల్పడడానికి గల కారణాలను వివరించింది. ఆ వ్యక్తెవరో కూడా పేర్కొనడంతో అతడిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఘటన అధికార వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆమె అటవీ మాఫియాకు ముచ్చెమటలు పట్టించిన ఆమె ఆత్మహత్యకు పాల్పడడం కలచివేస్తోంది. మహారాష్ట్రలో యంగ్ అండ్ డైనమిక్గా అధికారిణిగా దీపాలి చవాన్ మొహితే (28) గుర్తింపు పొందింది. లేడీ సింగమ్గా పేరు పొందారు. అయితే ఆమె అమరావతి జిల్లాలోని టైగర్ రిజర్వ్ సమీపంలోని హరిసాల్ గ్రామంలో ఉన్న అధికారిక నివాసంలో గురువారం సాయంత్రం దీపాలి తన సర్వీస్ రివాలర్వ్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. అంతకుముందు ఆమె రాసిన లేఖ లభ్యమైంది. అందులో శివకుమార్ తనతో గడపాలని, అలా చేయకపోతే అదనపు డ్యూటీలు వేయడం.. వేధించడం చేసేవాడని వాపోయింది. దీంతోపాటు తాను గర్భిణిగా ఉన్న సమయంలో కొండల్లోకి లాక్కెళ్లాడని ఆరోపించింది. అతడి వలన తనకు గర్భస్రావం అయ్యిందని లేఖలో కన్నీటి పర్యంతమైంది. తనను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి తీవ్రంగా వేధించారని ఆరోపించింది. ఆయనే ఐఎఫ్ఎస్ అధికారి, అటవీ శాఖ డిప్యూటీ కన్జర్వేటర్ వినోద్ శివకుమార్ అని తెలిపింది. కొన్ని నెలలుగా ఆయన లైంగికంగా వేధించిన విషయాన్ని పూసగుచ్చినట్టు లేఖలో రాసింది. మానసికంగా కూడా చిత్రహింసలకు గురి చేశాడని వాపోయింది. అతడు తన అధికారాన్ని దుర్వినియోగంతో చేసిన కార్యాలను వివరించింది. ఆమె ఆత్మహత్య విషయం తెలుసుకున్న వినోద్ శివకుమార్ పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నాగ్పూర్ రైల్వే స్టేషన్లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: 10 మంది సజీవ దహనం: నన్ను క్షమించండి.. చదవండి: వివాహేతర సంబంధం: మంచం కింద దాక్కొని హత్య -
ఐఎఫ్ఎస్ భర్తపై ఐపీఎస్ భార్య ఫిర్యాదు
బనశంకరి: భర్త కట్నం కోసం వేధిస్తున్నాడని ఓ వివాహిత పోలీసులను ఆశ్రయించింది. అయితే ఆమె సాదాసీదా మహిళ కాదు, ఓ ఐపీఎస్ అధికారిణి కావడం గమనార్హం. బాధితురాలు బెంగళూరు కబ్బన్పార్కు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాలు.. ఉత్తరప్రదేశ్కి చెందిన 2009 బ్యాచ్కు ఐపీఎస్ అధికారిణి వర్తికా కటియార్ బెంగళూరు పోలీసు ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. 2011లో ఆమెకు భారతీయ విదేశాంగ సర్వీసు (ఐఎఫ్ఎస్) అధికారి నితిన్ సుభాష్తో వివాహమైంది. భర్త ఢిల్లీలోని భారత రాయబార కార్యాలయంలో పనిచేసేవారు. భర్త మద్యపానం, ధూమపానం తదితర దురలవాట్లకు లోనయ్యారని, వీటిని వదలిపెట్టాలని అనేకసార్లు మొరపెట్టుకోగా కోపంతో దాడి చేశాడని వర్తికా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2016లో ఇదే విషయమై దౌర్జన్యం చేసి తన చేయి విరిచాడని తెలిపారు. దీపావళికి కానుక ఇవ్వలేదంటూ విడాకులు కావాలని బెదిరించాడని వర్తికా పేర్కొన్నారు. తన అమ్మమ్మ వద్ద రూ.5 లక్షలు, ఇంటి కొనుగోలుకని రూ. 35 లక్షల నగదు తీసుకున్నాడని పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు నితిన్ సుభాష్, అతని కుటుంబసభ్యులు మొత్తం 7 మందిపై వరకట్న వేధింపులు, దాడులు, ప్రాణ బెదిరింపులు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
ఏకంగా ఇంటినే మోసేశారు..
నాగాలాండ్: ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించగలమని నాగాలాండ్లోని గ్రామస్తులు మరోసారి నిరూపించారు. గ్రామస్తులు తలో చేయి వేసి ఏకంగా ఓ గుడిసెను ఓ చోటు నుంచి మరో చోటుకి తరలించారు. గ్రామస్తులు గుంపులుగా విడిపోయి గుడిసె నాలుగు దిక్కుల్లోని పునాదులను పైకి లేపి కాలి నడకనే గుడిసెను నూతన గమ్యానికి చేర్చారు. ఈ ఆసక్తికర సన్నివేశానికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సుధా రామన్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఐకమత్యమే మహా బలమని ఈ నాగాలు మరోసారి నిరూపించారంటూ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చెక్కర్లు కొడుతోంది. పోస్ట్ చేసిన గంటలోనే ఏకంగా 9000 వ్యూవ్స్ను సొంతం చేసుకుంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. Yet another video where the Nagas show us that Unity is strength! House shifting in progress at village in Nagalandpic.twitter.com/XUGhiEGNe7 — Sudha Ramen IFS 🇮🇳 (@SudhaRamenIFS) February 5, 2021 -
పులా.. పిల్లా.. ఎందుకిలా చేస్తోంది?
సిమ్లా: సాధారణంగా పులి పేరు చెబితేనే గుండెలు జారి పోతాయి. ఇక గత కొద్ది రోజులుగా తెలంగాణలో పులి సంచారం కలకలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. అడవిలో ఉండాల్సిన ఈ కృరమృగాలు జనారణ్యంలోకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మనుషులను, సాధు జంతువులను వెంటాడి ప్రాణాలు సైతం తీస్తున్నాయి. ఇది మన దగ్గర పరిస్థితి అయితే.. హిమాచల్ ప్రదేశ్లో ఇందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఓ చిరుత ఏకంగా మనుషులతో ఆడుతుంది. వారి మీదకు ఎక్కి గారాలు పోతుంది. ఈ వింత ప్రవర్తన అటవీ అధికారులను, జంతు శాస్త్రవేత్తలని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. (చదవండి: ఏ పులి ఎక్కడ తిరుగుతుందో!) వివరాలు.. హిమాచల్ ప్రదేశ్లోని తీర్థన్ వ్యాలీ ప్రాంతంలో చిరుత రోడ్డు మీదకు వచ్చింది. అక్కడే గుంపుగా ఉన్న మనుషుల దగ్గరకు వెళ్లింది. ఇక చిరుత తమ దగ్గరకు రావడంతో.. వారంతా భయంతో పరుగు లంకించుకున్నారు. ఒక్క వ్యక్తి మాత్రం కదలకుండా అక్కడే ఉన్నాడు. ఇక చిరుతని చూసి జడుసుకుని దూరంగా పోయిన వారంతా అది.. సదరు వ్యక్తిపై దాడి చేస్తుందని భావించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ.. చిరుత ఆ వ్యక్తితో ఆడటం ప్రారంభించింది. అతడి మీదకు ఎక్కి గారాలు పోయింది. ఇక చిరుత వింత వేషాలను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్ దీన్ని తన ట్విట్టర్లో షేర్ చేయడంతో ఇది తెగ వైరలవుతోంది. (చదవండి: చిరుతకు ఝలక్: ఈ జింక చర్య ఊహాతీతం) ‘ఈ చిరుత ప్రవర్తనని అంచాన వేయలేకపోతున్నాం. చాలా వింతగా ప్రర్తిస్తుంది’ అనే క్యాప్షన్తో ప్రవీణ్ వీడియోను షేర్ చేశారు. ఇక దానితో ఆడుతున్న మనుషుల్ని కూడా ఆయన విమర్శించారు. చిరుతతో జనాల ప్రవర్తన సరిగా లేదు. నిన్నటి నుంచి ఈ వీడియో వైరలవుతోంది అన్నారు. ఇక కామెంట్ సెక్షన్లో కస్వాన్ అనే వ్యక్తి చిరుతపులి పెంపుడు జంతువులాగా ప్రవర్తిస్తుందని.. అంతేకాక అది ఏదైనా ఎస్టేట్ నుంచి తప్పించుకొని ఇలా వచ్చి ఉంటుందని అభిప్రాయపడ్డారు. దీన్ని సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి రమేష్ పాండే సమర్థించారు. "మనుషులు పెంచిన జంతువుల విషయంలో ఇలాంటి ప్రవర్తన సాధ్యమవుతుంది. ఈ విషయంలో మరింత దర్యాప్తు అవసరం. అడవి జంతువులను పెంపుడు జంతువులుగా పెంచితే ఇలాంటి అసాధారణమైన, ఆశ్చర్యకరమైన పద్దతిలో ప్రవర్తిస్తాయి. అయితే ఇది ఆందోళన కలిగించే అంశం అంటూ పాండే ట్వీట్ చేశారు. -
పెద్దల అనుమతితో ప్రేమ వివాహం: నందిని
కుంకుమ పూల సౌరభాలు.. మంచు కొండల సోయగాలు.. పచ్చని ప్రకృతి ఆమె చిన్ననాటి నేస్తాలు. సమస్త జంతుజాలం చెట్టు చేమలతో నిండిన అందమైన అడవి ఆమెకు ఎంతో ఇష్టం. కొమ్మల మాటున దాగిన పక్షుల కువకువలు తననే పలకరిస్తున్నట్లు .. చెంగుచెంగున దూకే లేత పసికూనల్లాంటి లేడిపిల్లలు తన వెంటే వస్తున్నట్లు.. వనమంతా తామై స్వేచ్ఛగా విహరించే వన్యప్రాణులు తమను సంరక్షించమన్నట్లు వెంటాడిన ఆ భావన హిమసీమల్లో వికసించిన ఆ విద్యాసుమాన్ని అటవీశాఖవైపు నడిపించాయి. అలా తన మనసుకు నచ్చిన వన్యప్రాణి సంరక్షణనే వృత్తిగా మలచుకున్న కాశ్మీరీ కుసుమం నందినీ సలారియా ఇందిరాగాంధీ జూ పార్కు క్యూరేటర్గా బదిలీపై వచ్చారు. భూతలస్వర్గంగా పిలిచే జమ్ముకశ్మీర్ నుంచి పర్యాటకుల స్వర్గధామమైన విశాఖ వరకు ఆమె జీవనప్రయాణం .. ఈ వారం ఆర్మీ స్కూల్లో విద్యాభ్యాసం మాది జమ్ములోని కథువా. అమ్మ, నాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. నా బాల్యమంతా జమ్ములోనే. జమ్మూకశ్మీర్లోని ఆర్మీ స్కూల్లో 12వ తరగతి వరకు చదువుకున్నాను. తర్వాత హర్యానాలోని జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కాలేజీలో వెటర్నరీ సైన్స్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. తర్వాత వెటర్నరీ సైన్స్లో పీహెచ్డీలో చేరాను. ఒక సంవత్సరం తర్వాత 2013లో ఐఎఫ్ఎస్కు ఎంపిక కావడంతో పీహెచ్డీ మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. అలా ఐఎఫ్ఎస్కు .. నాకు ముందు నుంచి వన్యప్రాణులపై ఆసక్తి ఉండేది. డిగ్రీ సమయంలో ఐఎఫ్ఎస్ గురించి తెలిసింది. మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో 24వ ర్యాంక్ రావడంతో నాకిష్టమైన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) ఎంచుకున్నాను. డెహ్రాడూన్లోని ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో ఐఎఫ్ఎస్ ట్రైనింగ్ తీసుకున్నాను. రెండేళ్ల శిక్షణ అనంతరం మరో పది నెలలు వైల్డ్లైఫ్లో డిప్లమో చేశాను. అమ్మ, నాన్నలే ఇన్స్పిరేషన్ అమ్మ, నాన్న ఇద్దరూ ఉద్యోగులు కావడంతో వాళ్లలా ఉన్నత ఉ ద్యోగం చేయాలి అనే తపన ఉండేది. ఆ క్రమంలోనే సివిల్స్కు ప్రిపేర్ అయ్యాను. మొ దటి ప్రయత్నంలోనే ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యాను. అడవులన్నీ చుట్టేశా ట్రైనింగ్ సమయంలో దాదాపు అడవులన్నీ చూశాను. రెండేళ్ల శిక్షణలో ఒక నెల రోజులు తరగతులు ఉంటే మరో 20, 25 రోజులు ఫీల్డ్ ట్రిప్ ఉండేది. అలా దాదాపు ఉత్తర భారతదేశంలోని అడవులన్నీ తిరిగాం. ఎత్తయిన ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆక్సిజన్ అందేది కాదు. ఆ పరిస్థితులన్నీ తట్టుకోగల ఫిట్నెస్ చాలా అవసరం. మా శిక్షణలో అదీ భాగమే. కాకినాడలో ఫస్ట్ పోస్టింగ్ 2016లో నా మొదటి పోస్టింగ్ కాకినాడలో. డీఎఫ్వోగా చేరాను. 2020 జూన్ వరకు అక్కడే. తర్వాత బదిలీపై విశాఖ జూ పార్కు క్యూరేటర్గా వచ్చాను. ప్రశాంత వాతావరణంలోనే.. జమ్ము, కశ్మీర్ అంటే సెన్సిటివ్ ప్రాంతమే. కానీ మేము ఉన్న కథువా ప్రశాంత ప్రదేశం. ఎలాంటి అలజడులు లేవు. వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. సందేశాత్మక చిత్రాలు ఇష్టం నాకు వాస్తవానికి దగ్గరగా ఉండే సినిమాలు, సందేశాత్మక చిత్రాలు ఇష్టం. కాలేజ్ డేస్లో ఇంగ్లిష్, హిందీ మూవీస్ బాగానే చూశాను. ఇపుడు చూడటం తగ్గించేశాను. ప్రస్తుతం సినిమాల్లో డ్రెస్సింగ్ బాగా లేదు. ఇప్పుడిప్పుడే మంచి స్టోరీ ఉన్న తెలుగు మూవీస్ చూస్తున్నాం. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ నచ్చాయి. అమ్మాయిలు ఇండిపెండెంట్గా ఉండాలి అమ్మాయిలు ఇండిపెండెంట్గా ఉండాలి. అభద్రతా భావం పోవాలి. చట్రంలోంచి బయటపడాలి. వాళ్లు ఎంచుకున్న రంగంలో ఉన్నతస్థాయికి వెళ్లడానికి కృషి చేయాలి. వన్యప్రాణుల దత్తతకు ముందుకు రావాలి నాకు వన్యప్రాణులంటే ఎంతో ఇష్టం. వాటికి సంబంధించిన పుస్తకాలే అధ్యయనం చేస్తున్నాను. విశాలమైన అరణ్యంలో స్వేచ్ఛగా తిరిగే జంతువులను, పక్షులను జూలో ఎన్క్లోజర్లకే పరిమితం చేస్తున్నాం. అలాంటి వాటిపై ప్రేమ, మానవత్వం చూపించాలి. ఎందరో దాతలు అన్నదానాలకు లక్షల రూపాయల్లో విరాళాలిస్తారు కదా, మరి నోరు తెరిచి చెప్పలేని మూగజీవులను ఎందుకు పట్టించుకోరు అనిపిస్తుంది. జంతుప్రేమికులు జూలో వన్య ప్రాణులను దత్తత తీసుకునేందుకు ముందుకు రావాలి. ప్రపంచస్థాయి జూపార్కుల్లో ఒకటిగా నిలపాలని.. విశాఖ జూపార్కును ప్రపంచస్థాయి జూపార్కుల్లో ఒకటిగా నిలపాలని నా ఆలోచన. ఇక్కడి అవకాశాలు, వాతావరణంపై సీజెడ్ఏఐకి నివేదిక ఇచ్చాను. ఇక్కడ లేని జంతువులు, పక్షులను ఇతర దేశాల జూపార్కుల నుంచి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. సందర్శకులు ఆకట్టుకునేలా దీనిని తీర్చిదిద్దాలి. అందుకు ప్రయత్నిస్తున్నా. తెలుగు బాగా నేర్చుకున్నా.. రెండేళ్ల ఐఎఫ్ఎస్ శిక్షణలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని కడపలో కొద్ది నెలలు శిక్షణ పొందాను. మొదటి పోస్టింగ్ కూడా కాకినాడలో వచ్చింది. ఇక్కడ ప్రాంతీయ భాష తెలుగు కావడంతో నేర్చుకోవాలి అనే ఆసక్తి కలిగింది. తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నించాను. అలా ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడగలుగుతున్నాను. మా మాతృభాష డోగ్రీతో పాటు ఇంగ్లిష్, హిందీలో ఫ్లూయెన్సీ ఉంది. పెద్దల అనుమతితో ప్రేమ వివాహం ఐఎఫ్ఎస్ శిక్షణ కాలంలో నా బ్యాచ్మేట్ అనంత్ శంకర్తో పరిచయం ప్రేమగా మారింది. ఆయనది జార్ఖండ్. ఇరువైపుల పెద్దల అంగీకారంతో 2017లో మా వివాహం జరిగింది. ఆయన ఇప్పుడు విశాఖ డీఎఫ్వోగా చేస్తున్నారు. నన్ను ఆయన ఎంతగానో ప్రోత్సహిస్తారు. ఎప్పుడూ మన ప్రయాణం ఆగకూడదు.. మనం ఏం చేసినా గుర్తింపు ఉండాలి. ఉన్నత స్థాయికి చేరాలి అంటే ప్రయత్నిస్తూనే ఉండాలి అని చెబుతారు. -
కోడి పిల్లలు అనుకుంటే పొరపాటే..
భోపాల్: కప్ప అంటే సాధారణంగా ఆకుపచ్చ వర్ణంలో ఉంటుందని మనందరికి తెలిసిన విషయమే. కానీ పసుపు రంగులో ఉన్న కప్పలను ఎప్పుడైనా చూశారా. అది కూడా భారీ సంఖ్యలో. లేదు కదా అయితే ఈ వీడియో చూడండి. పదుల సంఖ్యలో పసుప పచ్చ వర్ణంలో ఉన్న కప్పలు వాన నీటిలో ఆడుతున్న దృశ్యాలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. సడెన్గా చూస్తే.. కోడిపిల్లల్లా అనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్ వద్ద ఈ అరుదైన దృశ్యం కనిపించింది. దీన్ని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్లో షేర్ చేశారు. ‘మీరు ఎప్పుడైనా పసుపు పచ్చ వర్ణంలో ఉన్న కప్పలను చూశారా. అయితే ఇప్పుడు చూడండి. ఇండియన్ బుల్ ఫ్రాగ్ జాతికి చెందిన ఈ పసుపు రంగు కప్పలు నర్సింగ్పూర్లో కనిపించాయి. ఆడ కప్పలను ఆకర్షించడం కోసం ఇవి ఇలా పసుపు రంగులోకి మారతాయి. వాన నీటిలో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాయో చూడండి’ అంటూ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. అయితే ఈ కప్పలు ఎప్పుడు ఇంత ప్రకాశవంతమైన పసుపు రంగులో ఉండవు. కేవలం సంతానోత్పత్తి కాలంలో అది కూడా వర్షాకాలంలో మాత్రమే ఆడకప్పలను ఆకర్షించడానికి ఇలా పూర్తిగా పసుపు వర్ణంలోకి మారతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. -
కప్పలు ఇలా కూడా ఉంటాయా..!
-
‘ఉస్సెన్ బోల్ట్ కూడా నన్ను పట్టుకోలేడు’
కింగ్ కోబ్రా పేరు వింటేనే కాళ్లల్లో వణుకు, గుండెల్లో దడ వచ్చేస్తాయి. దాన్ని దగ్గర నుంచి చూడటం అంటే ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవడం లాంటిదే. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన సర్పం కింగ్ కోబ్రా. దాని పేరు తలుచుకోవడానికే మనం వణికిపోతుంటే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా దానికి తలస్నానం చేయిస్తున్నాడు. వినడానికి ఏ మాత్రం నమ్మశక్యంగా లేకపోయినా ఇది మాత్రం పచ్చి నిజం. వివరాలు.. కేరళకు చెందిన వావా సురేష్ అని వ్యక్తి పాములను పట్టడంలో, వాటిని పరిరక్షిచడంలో నిపుణులు. ఈ నేపథ్యంలో సురేష్ కింగ్ కోబ్రాకు తల స్నానం చేయించాడు. ఓ బకెట్లో నీళ్లు తెచ్చి కింగ కోబ్రా తల మీద పోస్తాడు. ఆ పాము నీళ్లు పోసిన వ్యక్తిని ఏమి అనకుండా, ఎలాంటి భావాలు పలికించకుండా కామ్గా ఉంటుంది. అలా రెండు బక్కెట్ల నీటిని పోసి కింగ్ కోబ్రాకు తలస్నానం చేయిస్తాడు సురేష్. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. Summer time.. And who doesn’t like a nice head bath🙏 Can be dangerous. Please don’t try. pic.twitter.com/ACJpJCPCUq — Susanta Nanda IFS (@susantananda3) May 24, 2020 ‘వేసవి కాలం.. తలస్నానం ఎవరికి ఇష్టం ఉండదు. అయితే ఇలాంటివి చాలా ప్రమాదం. ఇంటి దగ్గర ప్రయత్నించకండి’ అంటూ ఈ వీడియోను ట్వీట్ చేశారు సుశాంత నంద. దాదాపు 51 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటికే 70 వేల మంది పైగా వీక్షించారు. ‘నిజంగా అతడి ధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే.. ఈ వీడియో చూసి నేను పరిగెట్టడం మొదలు పెట్టాను. ఉస్సెన్ బోల్ట్ సైతం నన్ను పట్టుకోలేడు’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. భూమి పైన ఉన్న పొడవైన విషపు పాముల జాతి. నేషనల్ జీయోగగ్రాఫిక్ వారు చెప్పిన దాని ప్రకారం ఈ పాము నిలబడటమే కాక తన కళ్లతో పూర్తిగా ఎదిగిన ఓ మనిషిని చూడగలదు. దీని ఒక్క కాటులో వెలువడే విషంతో 20 మందిని ఒక్కసారే చంపవచ్చు. -
‘నా ముందు నువ్వేంత అనుకుంది.. కానీ’
బలవంతుడి చేతిలో బలహీనుడు ఓడిపోవడం సర్వ సాధారణం. కానీ ఆ బలహీనుడు తిరగబడితే.. బలవంతుడు కూడా తోక ముడవక తప్పదు. ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది ఈ వీడియో. ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుశాంత నంద ‘కాలం మారుతోంది. కప్ప, చిరుతల మధ్య నమ్మశక్యం కానీ పోరు. ఎవరు గెలుస్తారో చూడండి’ అంటూ ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనిలో ఓ చిరుత పులి తన పంజాతో పదే పదే కప్పను తాకుతూ ఉంటుంది. రెండు సార్లు చిరుత మొరటుతనాన్ని భరించిన కప్ప.. మూడో సారి చిరుత ప్రతిఘటిస్తుంది. దాంతో ఓటమిని ఒప్పుకుని అక్కడ నుంచి వెళ్లిపోతుంది చిరుత.(ఆ ఫోటో వెనక ఇంత కథ ఉంది) Times are changing..... Unbelievable fight between a frog & leopard. And see who wins😊 🎬Science Girl pic.twitter.com/g8kqnBLDcr — Susanta Nanda IFS (@susantananda3) May 21, 2020 18 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటికే 5 వేల మంది వీక్షించారు. ‘పిల్లి కుటుంబానికి చెందిన జంతువులు కప్పలను వేటాడవు.. కేవలం ఆడుకుని వదిలేస్తాయి.. ఈ పులి ఇంకా చిన్నదే. ఈ ప్రపంచం గురించి ఇంకా పూర్తిగా తెలియదనుకుంటా. అందుకే తన ముందు ఉన్న జీవి ఏంటో గుర్తించేందుకు ప్రయత్నిస్తుంది’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు.(వీడియోలోని జీవి ఏంటో చెప్పగలరా?!) -
వీడియోలోని జీవి ఏంటో చెప్పగలరా?!
పాత వీడియో ఒకటి ప్రస్తుతం ట్విట్టర్లో తెగ ట్రెండ్ అవుతోంది. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నంద ఈ వీడియోను రెండు రోజుల క్రితం తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. అయితే వీడియోతో పాటు ఓ పజిల్ను కూడా ఇచ్చారు సుశాంత నంద. వీడియో చూసి రకరకాల సమాధానాలు చెప్తున్నారు నెటిజన్లు. ఈ వీడియోలో నీలాకుపచ్చ వర్ణం నీటిలో ఓ జీవి తన తలను ముంచి ఈదుతుంది. ఓ 20 సెకన్ల తర్వాత బయటకు వస్తుంది. అయితే మొదటి పది సెకన్లలోనో ఆ జీవి ఏంటో గుర్తించగలరా అంటూ సుశాంత నందా ఓ చాలెంజ్ విసిరారు. ఇప్పటికి 10 వేల మంది ఈ వీడియోను చూశారు. అయితే చాలా కొద్ది మంది మాత్రమే సరైన సమాధానం చెప్పగలిగారు. మీరు ఓ సారి ప్రయత్నించండి. గెస్ చేయలేకపోతే.. సమాధానం కోసం వీడియో పూర్తిగా చూడండి. ఇక్కడ నీటిలో ఈదుతున్న జీవి పేరు మూస్. దుప్పి జాతికి చెందిన ఈ జంతువు రష్యా, అమెరికా, కెనడాలో ఎక్కువగా కనిపిస్తుంది. ఏడేళ్ల క్రితం వేన్ ఎల్లెట్ అనే వ్యక్తి అమెరికా, మోంటానాలోని హిమానీనద జాతీయ ఉద్యానవనంలో ఈ వీడియోను తీశాడు. సుశాంత నంద మళ్లీ రీ పోస్ట్ చేయడంతో మరోసారి వైరల్ అవుతోంది. -
లాక్డౌన్: గ్రామంలో చిరుత నివాసం
లాక్డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితమ్యారు. దీంతో అడవి తీరంలోని గ్రామాల్లో సింహాలు, పులులు సంచరిస్తూ కలకలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ చిరుత పులి రాజస్థాన్లోని ఓ ఇంటిలో ఏకంగా తన మూడు పిల్లలతో కలిసి నివాసం ఏర్పరుచుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీసీ ఫుటేజ్లో రికార్డైనా ఈ వీడియోను ఆటవీ అధికారి పర్వీన్ కశ్వన్ గురువారం ట్విటర్లో షేర్ చేశాడు. ఈ వీడియోలో రాత్రి తిరిగి ఇంటికి వచ్చిన చిరుత.. తన పిల్లలను నోటితో కరుచుకుని తీసుకువెళ్తు కనిపించింది. ఇక ఈ వీడియోకు ఇప్పటీ వరకు వేలల్లో వ్యూస్, వందల్లో కామెంట్లు వస్తున్నాయి. ‘ఈ వీడియో పంచుకున్నందుకు ధన్యవాదాలు’, ‘ఇది అద్బుతం’ ‘ఎంత ముద్దుగా ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (చండీగఢ్లో అడవి జంతువు కలకలం!) While everybody was inside the mother #leopard found an unused house & started raising her three cubs. In Tantol village of Rajasmand. Mother is coming in night & in daytime she goes for food. Cubs are doing fine. So now dept has put staff & cameras to monitor things. VC Raj FD. pic.twitter.com/zDIbhKKUvf — Parveen Kaswan, IFS (@ParveenKaswan) April 16, 2020 అయితే ఆ ఇంటి ముందు సీసీ కెమారాలను ఏర్పాటు చేసి నిరంతరం చిరుత కదలికలను అధికారులు గమనిస్తున్నట్లు పర్విన్ తెలిపాడు. 21 సెకన్ల నిడివి గల ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘లాక్డౌన్ కారణంగా అందరూ ఇంటికే పరిమితయ్యారు. ఈ క్రమంలో ఈ తల్లి చిరుత కూడా నివాసం కోసం తంటోల్ గ్రామంలోని పాతబడిన కోటను తన పిల్లల కోసం నివాసం చేసుకుంది. ఇక ఈ చిరుత రోజంతా ఆహార వేటకు వెళ్లి తిరిగి రాత్రిపూట తన పిల్లల దగ్గరికి వస్తుంది. ప్రసుతం చిరుత పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నాయి’ అంటూ ట్వీట్ చేశాడు. -
‘అది ఏం చేయదు.. వెళ్లిపో’
డెహ్రాడూన్: నగర శివారులో ఖాళీగా ఉన్న రోడ్డుపైకి షీకారుకు వచ్చిన ఓ ఏనుగును చూసి వాహనదారుడు బెంబెలేత్తి పారిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను అటవీ అధికారి సుశాంత్ నందా తాజాగా ట్విటర్లో షేర్ చేశారు. ‘అది ఏం చేయదు.. నీ దారిన నువ్వు వెళ్లిపో’ అనే క్యాప్షన్తో ఈ వీడియోను షేర్ చేసిన ఈ వీడియోలో.. పొద్దున్నే పాలు అమ్మేందుకు వెళ్తున్న ఓ వ్యక్తికి ఏనుగు ఎదురుపడింది. దాన్ని చూసి కంగుతిన్న ఆ వాహనదారుడు ఒక్కసారిగా ఆగిపోయాడు. అతన్ని చూసిన ఏనుగు కూడా కాస్తా ఆగి అతన్ని గమనించింది. (కరోనా: చేతులు కడుక్కున్న చింపాంజీ) ‘Kuch nahin karega yaar, Sidha chaal ra he’😊😊 The person saying this at the end should face elephant head on once to become an expert & air his commentary.... Be careful as Vaibhav @VaibhavSinghIFS says. Human elephant interface can be scary. Don’t assume things🙏 https://t.co/rFu3ukOVMc — Susanta Nanda IFS (@susantananda3) April 3, 2020 ఇక వెంటనే ఏనుగు అతని వైపుకు నడవడం మొదలు పెట్టగానే ఆ వ్యక్తి తన బండిని కింద పడేసి పరిగెత్తి జాగ్రత్త పడ్డాడు. అయితే అదే సమయంలో ఈ సంఘటనను వీడియో తీస్తున్న వ్యక్తి ‘‘అది ఏం చేయదు... నీ దారిన నువ్వు వెళ్లిపో’’ అంటూ అరుస్తున్నాడు. ఇక ఆ వ్యక్తి మాటలకు సుశాంత్ నందా స్పందిస్తూ ‘ఏనుగును ఎదుర్కొవాలంటే ధైర్యం కావాలి. నిపుణత కలిగిన వారు మాత్రమే దానిని ఎదుర్కొగలరు. మనిషి, ఏనుగు ఎదురుపడినప్పుడు అది భయానక ఘటనగానైనా మారవచ్చు. కానీ ఏదేమైనా ఆ వాహనదారుడిలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది’’ అంటూ ట్వీట్ చేశారు. -
‘ఈ వింత జీవిని ముందెన్నడూ చూసుండరు!’
గజిబిజి గడ్డి ఎముకలతో కూడిన ఓ వింత కీటకం చెట్టుపై పాకుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ వింత జీవి ఎంటో తెలుసుకోవడానిక నెటిజన్ల తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. పర్వీన్ కశ్వన్ ఓ అనే ఆటవీ అధికారి దీనికి సంబంధించిన ఫొటోలను, వీడియోను ట్విటర్లో సోమవారం షేర్ చేశారు. ‘ప్రకృతిలోని ఈ అద్భుతం చూడండి. ప్రతి జీవికి ఓ పేరుంటుంది. కానీ ఈ జీవిని మాత్రం ఎప్పుడూ మనం గమనించలేదు. అయితే నేను కచ్చితంగా చెప్పగలను.. దీనిని ఇంతకు ముందెన్నడూ మీరు చూసుండరు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియోలో కీటకం చెట్టుపైకి మెల్లి మెల్లిగా పాకుతూ కనిపిస్తుంది. దీన్ని మిడతేమో అంటూ అందరూ అభిప్రాయపడుతున్నారు. అయితే సన్నని గడ్డిలాంటి ఎముకలతో ఉన్న ఈ కీటకం కదలడానికి కూడా కష్టపడుతుంది. #Nature has filled every detail with precisel. Details which many a times we don't observe. Video by Maria Chacon. Believe me you have never seen such creature till now. #AmazingNature pic.twitter.com/jy0h9za8o0 — Parveen Kaswan, IFS (@ParveenKaswan) March 16, 2020 కాగా.. 44 సెకన్ల నిడివి గల ఈ వీడియో షేర్ చేసిన గంటలోపే 3 వేలకు పైగా వ్యూస్ను సంపాందించింది. ఈ వింత జీవి ఎంటో తెలుసుకోవడానికి నెటిజన్లు పదే పదే గమనిస్తున్నప్పటికీ వారికి స్పష్టత రావడంలేదు. ఇది పాకుతున్న తీరును చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ‘ఆకు, కర్రల్లాంటి పురుగులను చూశాం. అవి చెట్లపై ఎగురడం, గెంతడం చేస్తాయి. కానీ ఇలాంటి గడ్డి పొరకలతో కూడి.. పాకుతున్న కీటకాన్ని మాత్రం ఎప్పుడూ చూడలేదు. ఇది చాలా వింతగా ఉంది’ అని ’ఇది నిజంగా అద్భుతం.. మిడత అస్థిపంజరంలా ఉంది, దీన్ని మొదటి సారి చూస్తున్నా.. ఇది ఎక్కడా ఉంది.. దీని పేరేంటి?’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
‘ఆమె ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు’
నేడు(జనవరి 24) జాతీయ బాలికల దీనోత్సవం. ఈ సందర్భంగా పర్వీన్ కాస్వాన్ అనే అటవీ అధికారి ఓ ప్రత్యేకమైన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆయన తన ట్విటర్లో మంగళ మణి అనే మహిళా ఫొటోను షేర్ చేస్తూ ఆమె సాధించిన ఘనతను గుర్తు చేశారు. అటవీ అధికారి షేర్ చేసిన ఫొటోని మహిళా పేరు మంగళ మణి. ఇస్రో మొట్టమొదటి మహిళా శాస్త్రవేత్త. మణి 2018లో అరుదైన ఘనతను సాధించారు. 56 ఏళ్ల వయసులో అంటార్కిటికా చలి ఖండంలో ఏడాదికి పైగా గడిపిన మొట్టమొదటి భారతీయ మహిళాగా చరిత్రాకెక్కారు. మొత్తం 23 మంది వెళ్లిన ఈ బృందంలో 22 మంది పురుషులు కాగా ఈమె ఒక్కరే మహిళా ఉండటం విశేషం. పర్వీన్ ‘మహిళా అయినా కూడా ఇంటికి ఎంత దూరంగా వెళ్లారో చూడండి!’ అనే క్యాప్షన్తో షేర్ చేసిన ఈ పోస్టుకు ఇప్పటి వరకు లక్షల్లో లైక్లు రాగా, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి. ‘వావ్! ఆమె ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు. ఈ విషయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. "Ladki hai, Ghar se kitna hi door jaegi". Mangala Mani recently became first Indian woman to live in Antarctica for 403 days. An ISRO scientist on expedition. On #NationalGirlChildDay lets recognise role played by such women in country's progress. Ladki padhao, aage badhao !! pic.twitter.com/FK1p6r8Dum — Parveen Kaswan, IFS (@ParveenKaswan) 24 January 2020 అత్యంత శీతల ఖండంగా పేరుగాంచిన అంటార్కిటికాలో 403 రోజులు గడిపిన భారతీయ మొదటి మహిళగా మంగళ మణి రికార్డు సృష్టించారు. ‘ఇంతటి ఘనతను సాధించిన ఇస్రో మహిళా శాస్త్రవేత్తను ప్రత్యేక రోజు గుర్తు చేస్తూ ఇతరులలో స్పూర్తి నింపాలనే ఉద్దేశంతోనే ఈ ఫొటో షేర్ చేశాను’ అంటూ పర్వీన్ రాసుకొచ్చారు. అదేవిధంగా మంగళ మణి వంటి ఎంతోమంది స్త్రీలు దేశం గర్వించదగ్గ ఘనతలను సాధిస్తున్నారనే వాస్తవాన్ని కూడా ప్రతిఒక్కరూ గ్రహించాలని పేర్కొన్నారు. -
ఐఎఫ్ఎస్ అధికారిణి శోభకు పీసీసీఎఫ్గా పదోన్నతి
సాక్షి, హైదరాబాద్: అదనపు పీసీసీఎఫ్గా పనిచేస్తున్న ఆర్.శోభ (ఐఎఫ్ఎస్)కు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్)గా పదోన్నతి కల్పించారు. ఇక్కడి ప్రధాన కార్యాలయంలో పీసీసీఎఫ్ ఎఫ్సీఏగా ఆమెకు పోస్టింగ్ ఇచ్చారు. ఈమేరకు శనివారం సీఎస్ ఎస్.కె.జోషి ఉత్తర్వులు జారీచేశారు. ఈ పదోన్నతితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో పీసీసీఎఫ్ ర్యాంకు పొందిన తొలి ఐఎఫ్ఎస్ అధికారిణిగా శోభ నిలిచారు. -
సీబీఐ నోటీసుల కలకలం
తణుకు: ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ (వెస్ట్ మీరట్)గా పని చేసిన ఐఎఫ్ఎస్ మాజీ అధికారి ముత్యాల రాంప్రసాద్రావు వ్యవహారంలో సీబీఐ వేగం పెంచినట్లు తెలుస్తోంది. తణుకు పట్టణానికి చెందిన ఐఎఫ్ఎస్ మాజీ అధికారి రాంప్రసాదరావు ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టారన్న ఆ రోపణలపై గతేడాది అక్టోబరులో ఆయన ఇంటిలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు ఆయనతోపాటు ఆయన భార్య ఆకుల కనకదుర్గపైనా కేసులునమోదు చేశారు. చాలా కాలం తర్వాత మరోసారి సీబీఐ అధికారులు దృష్టి సారించారు. రాంప్రసాదరావు అక్రమాస్తుల వ్యవహారంలో ఆస్తులు విక్రయించిన వారితోపాటు సాక్షులుగా వ్యవహరించిన, బినామీలుగా ఉన్న వ్యక్తులకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. గత రెండ్రోజులుగా తణుకు పరిçసర ప్రాంతాల్లోని పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సీబీఐ నోటీసులు అందుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే వంద మందికి పైగా ఈ నోటీసులు అందుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరిని ఏప్రిల్ మొదటి వారంలో దఫదఫాలుగా ఇచ్చిన తేదీల్లో విశాఖపట్టణంలోని సీబీఐ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్లో కేసు నమోదు కేంద్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్, ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఎఫ్ఎస్ అధికారిగా ముత్యాల రాంప్రసాదరావు పనిచేస్తున్న సమయంలోనే సీబీఐ అధికారులు తణుకులోని ఆయన నివాసంపై దాడి చేసి గతేడాది అక్టోబర్ 11న కేసు నమోదు చేశారు. ఈయన గతంలో ఎన్టీపీసీలో చీఫ్ విజిలెన్స్ అధికారిగా పనిచేసిన సమయంలో ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, విశాఖపట్టణం, న్యూఢిల్లీ, మీరట్లలో ఏకకాలంలో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రూ.10.72 కోట్ల విలువైన చర, స్థిరాస్తి డాక్యుమెంట్లుతోపాటు రూ.37.25 లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలను అప్పట్లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.150 కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా వేశారు. రాంప్రసాదరావు అక్రమార్జన ద్వారా సంపాదించిన సొమ్ముతో ఆయన భార్య ఆకుల కనకదుర్గ తణుకు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన సమాచారంతో రాంప్రసాదరావుతోపాటు ఆయన భార్య కనకదుర్గ పైనా అధికారులు కేసు నమోదు చేశారు. అప్పట్లో ప్రధానమంత్రి పేషీకి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ దాడులు చేసినట్లు తెలిసింది. ఈయన సంపాదించిన అక్రమ ఆస్తులతో తణుకులోని ఆయన భార్య ఆకుల కనకదుర్గ భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కనకదుర్గకు బినామీ లుగా ఉన్న కొందరు రియల్ వ్యాపారులపైనా దృష్టి సారించిన అధికారులు తాజాగా నోటీసులు జారీ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రియల్ వ్యాపారుల్లో గుబులు ఐఎఫ్ఎస్ మాజీ అధికారి ముత్యాల రాంప్రసాదరావు, ఆయన భార్య ఆకుల కనకదుర్గ ఇంట్లో సీబీఐ అధికారుల దాడులు తదనంతరం కేసు నమోదు నేపథ్యంలో దాదాపు అయిదు నెలల తర్వాత సీబీఐ నోటీసులు జారీ చేయడంతో రియల్ వ్యాపారుల్లో గుబులు రేగుతోంది. సీబీఐ కార్యాలయం, విశాఖపట్టణం పేరుతో తపాలాశాఖ ద్వారా రిజిస్టర్ పోస్టులో అందుతున్న నోటీసులు చూసిన కొందరు ఆందోళన చెందుతున్నారు. గత పదేళ్లుగా జరిగిన క్రయవిక్రయాలపై దృష్టి పెట్టిన అధికారులు ఆస్తులు అమ్మిన వారితోపాటు సాక్షులుగా వ్యవహరించిన వారికి సైతం సీబీఐ నోటీసులు జారీ చేయడం విశేషం. ఆస్తుల విక్రయించిన సమయంలో మార్కెట్ విలువ, రిజిస్ట్రార్ విలువలో వ్యత్యాసాన్ని గుర్తించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు లావాదేవీలు జరిగిన సమయంలో కొందరు రియల్ వ్యాపారులకు ఐటీరిటన్స్ లేకపోవడంపైనా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఒక్క పైడిపర్రులోనే సుమారు యాభై మంది నోటీసులు అందుకున్నట్లు సమాచారం. నోటీసులు అందుకున్న వారిలో కొందరు అధికార పార్టీకి చెందిన నేతలు ఉండగా ప్రముఖ విద్యాసంస్థల అధినేత ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. -
బంజారాహిల్స్ పీఎస్లో ఐఎఫ్ఎస్ అధికారి ఫిర్యాదు
తన భార్యను కారుతో ఢీకొట్టడమే కాకుండా ఇదేమిటని అడిగినందుకు తనపై దుర్భాషలాడిన జూబ్లీహిల్స్ చెక్పోస్టు పెట్రోల్ బంక్ యజమాని సునీల్పై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా ఐఎఫ్ఎస్ అధికారి చందన్మిత్రా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పెట్రోల్బంక్ యజమానిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ అదనపు ప్రిన్సిపల్ సీసీఎఫ్ చందన్మిత్రా శనివారం ఉదయం 6.40 గంటల ప్రాంతంలో తన భార్య నందితా మిత్రాతో కలిసి బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కుకు వాకింగ్ వచ్చారు. భార్యను రోడ్డుపై దింపి కారును పార్కింగ్ చేసేందుకు చందన్మిత్రా వెళ్లారు. అదే సమయంలో క్యాన్సర్ ఆస్పత్రి వైపు నుంచి ఏపీ 09 బీజీ 446 నంబర్ కారు మితిమీరిన వేగంతో వచ్చి రోడ్డు పక్కన నిలబడ్డ నందితామిత్రాను ఢీకొట్టింది. ఈఘటనలో ఆమె కాలుకు స్వల్ప గాయాలయ్యాయి. ఇదేమిటని ఆమె ప్రశ్నిస్తుండగానే నిర్లక్ష్యంగా, దురుసుగా ప్రవర్తిస్తూ సదరు వ్యక్తి పార్కులోకి వాకింగ్కు వెళ్లాడు. జరిగిన విషయాన్ని నందిత తన భర్త చందన్మిత్రాకు తెలిపింది. కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తుండగా కనిపించిన సునీల్ను అంత నిర్లక్ష్యం ఏంటని కనీస మర్యాద లేదా అంటూ చందన్మిత్రా ప్రశ్నించగా ఆయనపై కూడా దురుసుగా ప్రవర్తించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. అసభ్య పదజాలంతో దూషించాడు. నిర్లక్ష్యంగా కారు నడిపి అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేయాల్సిందిగా ఐఎఫ్ఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 279 కింద కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రైవేట్ సెక్రటరీగా దేవయాని కోబ్రాగడే
న్యూఢిల్లీ: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయమంత్రి రామ్దాస్ అథవాలేకు ప్రైవేట్ సెక్రటరీగా అమెరికాలో భారత మాజీ ఉప దౌత్యవేత్త దేవయాని కోబ్రాగడే నియమితులయ్యారు. దేవయాని న్యూయార్క్లో భారత డిప్యూటీ కాన్సుల్ జనరల్గా ఉన్న సమయంలో తన ఇంట్లో పనిచేస్తున్న మహిళకు సంబంధించిన వీసా పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ఆమెను న్యూయార్క్ పోలీసులు 2013లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమె 2.5 లక్షల డాలర్ల పూచీకత్తుపై బయటకొచ్చారు. దేవయానిపై పెట్టిన అభియోగాలను ఉపసంహరించుకునేలా అమెరికా ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి చేసినా ఫలితం లేకపోయింది. కాగా, దేవయాని ఇద్దరు కూతుళ్లు భారత పౌరులు కాదని కేంద్ర ప్రభుత్వం జనవరిలో ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఎలాంటి నోటీసు జారీ చేయకుండా, చట్ట విరుద్ధంగా తమ కుమార్తెలకు సంబంధించిన పాస్పోర్టులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని ఆమె కోర్టును ఆశ్రయించడంతో కేంద్రం ఈమేరకు నివేదించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖకు తెలియజేయకుండా, చట్టాన్ని ఉల్లంఘించి దేవయాని కూతుళ్లు అమెరికా, భారత్ పౌరసత్వాలు పొందారని పేర్కొంటూ కేంద్రం వారి పాస్పోర్టులను రద్దు చేసింది. -
ఐఎఫ్ఎస్ అధికారి ఆత్మహత్య
ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి ఒకరు దేశ రాజధానిలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభాస్ దాస్ (42) అనే ఈ అధికారి పశ్చిమ ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో గల తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మృతదేహాన్ని ముందుగా ఆయన డ్రైవర్ చూశారు. ఆ సమయంలో ఆయన కుటుంబ సభ్యులంతా బయటకు వెళ్లారు. డ్రైవర్ వెంటనే ప్రభాస్ దాస్ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఇంట్లో ఎలాంటి ఆత్మహత్య లేఖ లభించలేదని పోలీసులు తెలిపారు. ప్రభాస్ దాస్ ఎందుకింత తీవ్ర నిర్ణయం తీసుకున్నారో ఇంకా తెలియాల్సి ఉంది. బీహార్ రాష్ట్రానికి చెందిన దాస్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవలే ఆయనకు దుబాయ్లోని భారత రాయబార కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. ఇంకా అక్కడకు వెళ్లి చేరడానికి ముందే.. బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు.