impact
-
సినిమాయకు మంత్రం లేదా!
‘హోమ్వర్క్ చేయలేదేంటి?’ టీచర్ ప్రశ్న. ‘చెయ్యలా’... అన్నాడా స్టూడెంట్ తల వంకరగా పెట్టి.‘నిర్లక్ష్యంగా బదులిస్తావేంటి... క్లాసయ్యే వరకు నిలబడు’‘తగ్గేదేలే’ అంటూ విచిత్రంగా అభినయించాడు.భుజం తిప్పుతూ వికారంగా ముఖం పెట్టాడు.ఇది ఇప్పుడు స్కూళ్లను పట్టి పీడిస్తున్న జబ్బు.ఆ జబ్బుకు విరుగుడు కూడా రోగం మొదలైన చోటే ఉంది.‘మా స్కూల్లో సగం మంది విద్యార్థులు ‘ఫలానా’ సినిమా చూసిన తర్వాత చెడిపోయారు. విద్యార్థుల భాష మారిపోయింది, జుట్టు స్టైల్, డ్రెస్సింగ్ విచిత్రంగా ఉంటోంది. టీచర్లుగా వారికి మంచి మాట చెప్పే ప్రయత్నం చేస్తుంటాం. ఎంత చెప్పినా మా మాట వినడం లేదు. భాష మార్చుకోవాలని చెప్పినప్పుడు నిర్లక్ష్యంగా స్పందిస్తున్నారు. ఇలాంటి సినిమాలకు ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇస్తోంది? ఇలాంటి సినిమాలకు సెన్సార్బోర్డు సర్టిఫికేట్ ఎలా ఇస్తోంది?’ ఇటీవల విద్యాశాఖ కమిషనర్ మీటింగ్లో ఓ టీచర్ వెలిబుచ్చిన ఆవేదన ఇది. ఈ సంఘటన హైదరాబాద్లో జరిగింది. ఆమె ఒక్కరే కాదు, బయటకు చెప్పలేక ఎందరో టీచర్లు ఇలాగే ఆవేదన చెందుతున్నారు. ఎవరూ పట్టించుకోకపోతే విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. జాతీయోద్యమకాలం సినిమాలు ‘‘సినిమా అనేది చాలా ప్రభావవంతమైన మాధ్యమం. అది ప్రధానంగా వినోదసాధనమే. కానీ సామాజిక బాధ్యత కూడా ఉండాలి. సామాజిక బాధ్యతతో కూడిన వినోదాన్ని అందించాలి. జాతీయోద్యమకాలంలో సినిమాలు ఈ పాత్ర పోషించాయి. జనంలో స్వాతంత్య్రపోరాట స్ఫూర్తిని రగిలించాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన సినిమాలకు ఒక సామాజిక లక్ష్యం అనేది లేకుండా పోయింది. సినిమా ప్రభావం పిల్లల మీద మంచి–చెడు రెండు వైపులా ఉంటుంది. సినిమాలో ప్రధానంగా ఏం ఉందో అదే నేర్చుకుంటారు. ఏ విషయాన్ని హీరోయిక్గా చూపించారో దానికే ఆకర్షితమవుతారు. సెన్సార్బోర్డు ఒక సినిమాకు ప్రదర్శనకు అనుమతి ఇచ్చే ముందు పిల్లలను దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ‘ఏ’ సర్టిఫికేట్ సినిమాలకు పిల్లలను తీసుకెళ్లకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. తల్లిదండ్రులు శృంగార దృశ్యాలున్న సినిమాలకు మాత్రమే పిల్లలను మినహాయిస్తున్నారు. హింస ఉన్న సినిమాల విషయంలో పట్టింపుగా ఉండడం లేదు. పిల్లలను పక్కదారి పట్టిస్తున్న మాధ్యమాల్లో సినిమాలతోపాటు టీవీ ప్రసారాలు, సోషల్ మీడియాను కూడా ప్రస్తావించాలి. పిల్లల క్షేమం దృష్ట్యా ఆలోచించి నప్పుడు మనదేశాల్లో పటిష్టమైన నియమాలు లేవు.’’ అన్నారు విద్యావేత్త రేఖారావు. పాడైన విద్యార్థుల లెక్క తేలేదెలా? పిల్లల మీద సినిమాల ప్రభావం తీవ్రరూపం దాల్చింది. ఆ దుష్ప్రభావం పిల్లల భవిష్యత్తు మీద కూడా చూపిస్తుందని టీచర్లు ఆందోళనపడుతున్నారు. పిల్లలను సరిచేయడానికి మందలింపుగా ఒక మాట అంటే చాలా హింసాత్మకంగా స్పందిస్తున్నారని, ఇలాగే కొనసాగితే సమాజానికి మంచి పౌరులను అందించలేమని ఆవేదన చెందుతున్నారు. మరి ఇలాంటి సినిమాలు తీసిన ఫిల్మ్ మేకర్లు ఏం చేస్తున్నారు? సదరు సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందనే లెక్కల గొప్పలు చెప్పడానికి ముందుంటారు. కానీ తమ సినిమా చూసిన తర్వాత ఎంతమంది పిల్లలు పాడయ్యారో లెక్కచెప్పే ధైర్యం వాళ్లకుంటుందా? ఒకప్పుడు సిగరెట్ గాల్లోకి ఎగరేసి పెదవులతో పట్టుకోవడం హీరోయిజంగా ఒక ట్రెండ్ సెట్ చేసింది. కేవలం స్టయిల్ అనే భావనతో సిగరెట్ అలవాటు చేసుకున్న నాటి యువతరం ఇప్పుడు అరవైలు– డెబ్బైలకు చేరి క్రమం తప్పకుండా లంగ్స్ టెస్ట్లు చేసుకుంటోంది. హీరోలు తమ పిల్లలను కూడా ఈ మత్తులోనే ఉంచుతున్నారా? సమాజంలోని పిల్లల పట్ల వారికి బాధ్యత అక్కర్లేదా? లేజీ పేరెంటింగ్ పరిణామాలివన్నీ ప్రశాంతంగా ఉండాల్సిన పిల్లలు ముఖాలు ఆవేశంగా, అలసటగా, ఆందోళనగా కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి వరకు సినిమాలు చూసి, పగలు క్లాస్రూమ్లో కునికిపాట్లు పడుతుంటారు. దీనికి బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలకు కథలు చెప్పే ఓపిక లేక వీడియో గేమ్స్కు అలవాటు చేస్తున్నారు. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ పిల్లల తల్లిదండ్రులు స్కూల్కి వచ్చి పిల్లలు తమ మాట వినడం లేదని కంప్లయింట్ చేస్తుంటారు. సినిమాలు చూసి పాడయిపోతున్న మాట నిజమే. పిల్లల ఖాళీసమయాన్ని సద్వినియోగం చేస్తే కదా! పెద్దవాళ్లను, టీచర్లను గౌరవించాలనే బుద్ధి పుట్టించే కథలను వాళ్లకు చెప్పి ఉంటే తల్లిదండ్రులను, టీచర్లను ధిక్కరించే ఆలోచనే రాదు. కథలు చెప్పే ఓపిక చాలామంది పేరెంట్స్కు ఉండడం లేదు. క్రిటికల్ థింకింగ్, క్రియేటివ్ సొల్యూషన్స్ ఉన్న కథలు మనకెన్నో ఉన్నాయి. కాకి నీటి కోసం కుండలో రాళ్లు వేసిన కథ. నోటిమాటతో డోర్ ఓపెన్ అయ్యే కథల్లో టెక్నాలజీ దాగి ఉంది. ఎలుకలను అమ్మే కథలో స్టార్టప్ మార్గం ఉంది. పంచతంత్ర కథల్లో లేనిదేమిటి? పిల్లల్లో ఇలాంటి అవాంఛిత ధోరణికి సినిమా అనేది ప్రత్యక్ష కారణం అయితే లేజీ పేరెంటింగ్ పరోక్ష కారణం. – రేఖారావు, విద్యావేత్త – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Bird Flu Effect: తగ్గిన చికెన్ బిర్యానీ సేల్స్
సాక్షి, హైదరాబాద్ : బిర్యానీ.. ఈ పేరు వినగానే మాంసాహార ప్రియులకు పండగే. లొట్టలు వేసుకుంటూ లాగించాల్సిందే. చికెన్ బిర్యానీ అంటే మరింత మక్కువ. కానీ.. ప్రస్తుతం నగరంలో చికెన్ బిర్యానీల విక్రయాలు తగ్గిపోయాయి. ఫిష్, మటన్ బిర్యానీల వైపు మొగ్గు కనిపిస్తోంది. చికెన్ బిర్యానీ అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. దీని అంతటికీ కారణం బర్డ్ఫ్లూ ఎఫెక్ట్. ఈ వైరస్ కారణంగా కోళ్లు చనిపోతుండటంతో చికెన్ బిర్యానీల విక్రయాలు ఒక్కసారిగా పడిపోయాయి. చికెన్తో చేసే వంటకాలకూ డిమాండ్ తగ్గిపోవడంతో హోటళ్ల పరిశ్రమ లబోదిబోమంటోంది. ఈ పరిణామాలు చివరికి గిగ్వర్కర్లపైనా పడింది. టేక్ అవే.. ఇతర ఆన్లైన్ ఆర్డర్లు కూడా తగ్గిపోవడంతో స్విగ్గీ, జొమాటో తదితర ఆహార పదార్థాల సరఫరాల రంగంపైనా ప్రభావం చూపుతోంది. ఐకానిక్ చికెన్ బిర్యానీ పరిస్థితి ఇలావుంటే.. కోడిగుడ్ల అమ్మకాలు క్రమంగా పడిపోతున్నాయి. బర్డ్ఫ్లూ ప్రభావం మన రాష్ట్రంలో లేదని పౌల్ట్రీరంగం, ప్రభుత్వం నిత్యం చెబుతున్నా.. పక్క రాష్ట్రంలో దీని ఆనవాళ్లు భారీగా ఉండడంతో చికెన్, గుడ్డు తినే అంశంపై జనాలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. మాంసం, సీ ఫుడ్స్కే ప్రాధాన్యం.. గ్రేటర్ పరిధిలో ప్రతిరోజు 15 నుంచి 20 లక్షల చికెన్ బిర్యానీలు అమ్ముడవుతుండగా.. తాజాగా ఇవి సగానికి తగ్గిపోయినట్లు ప్రముఖ హోటల్ షాదాబ్ యజమాని స్పష్టం చేశారు. దీని స్థానంలో శాకాహార వంటకాలు లేదా మాంసం, సీ ఫుడ్స్కు ప్రాధాన్యమిస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బర్డ్ఫ్లూ మూలంగా చికెన్ బిర్యానీ ఆర్డర్లు భారీగా తగ్గాయని షాదాబ్ హోటల్ యజమాని ఆదిల్ సోహెల్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ నేపథ్యంలో చికె¯Œ ఆర్డర్ను కూడా తగ్గించినట్లు ఆయన చెప్పారు. ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఫిష్, మటన్ను ఎక్కువ వండి వడ్డిస్తున్నట్లు తెలిపారు. వీటికి డిమాండ్ పెరగడంతో వీటి సరఫరాదారులు ధరలు కూడా పెంచినట్లు ఆయన వివరించారు. ‘ఇంతకు ముందు మేం రోజుకు 70– 80 హండీల బిర్యానీ సిద్ధం చేసేవాళ్లం. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ బిర్యానీ విక్రయాలు తగ్గాయి. 30 హండీలు కూడా సేల్ కావటం లేదు. గతంలో మేం 15 హండీల మటన్ మాత్రమే విక్రయించేవాళ్లం. ప్రస్తుతం మటన్ బిర్యానీకి గిరాకీ పెరిగింది. గతంలో కంటే మూడు రెట్లు ఎక్కువగా దాదాపు 45 హండీల మటన్ బిర్యానీ విక్రయిస్తున్నాం’ అని అఫ్జల్గంజ్లోని న్యూ గ్రాండ్ çహోటల్ యజమాని మహ్మద్ హుస్సేన్ యావరీ తెలిపారు. కాగా.. సాధారణ రోజుల్లోనే గ్రేటర్ పరిధిలో 3 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు ఉండగా.. ఆదివారం 10– 12 లక్షల కిలోలు అమ్మేవారు. ప్రస్తుతం లక్ష కిలోల చికెన్ విక్రయాలు కూడా జరగడం లేదు. తగ్గిన ఆన్లైన్ ఆర్డర్లు.. స్విగ్గీ ఆర్డర్లలో 90 శాతం చికెన్ బిర్యానీ ఉంటుంది. నాలుగు రోజులుగా స్విగ్గీ, జొమాటో నుంచి చికెన్ బిర్యానీలు ఆర్డర్ చేసే వారి సంఖ్య 70 శాతం మేరకు పడిపోయినట్లు సమాచారం. -
జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన మార్పులు ఇవే..
కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం. ఈ రోజు జనవరి 1, 2025 నుంచి దేశవ్యాప్తంగా కొన్ని అంశాల్లో మార్పులు అమలు అవుతున్నాయి. ఈపీఎఫ్ఓ, యూఎస్ వీసా, ఎల్పీజీ సిలిండర్ ధరలు, కార్ల ధరలు, రేషన్ కార్డులకు కేవైసీ నమోదు చేయడం వంటి వాటిలో మార్పులు వచ్చాయి. ఈమేరకు ఇప్పటికే ఆయా విభాగాలు ప్రకటనలు విడుదల చేశాయి. అందులో కొన్ని ముఖ్యమైన వాటి వివరాలు తెలుసుకుందాం.ఎల్పీజీ సిలిండర్ ధరలుజనవరి 1, 2025 నుంచి ప్రధాన నగరాల్లో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు తగ్గాయి. మారిన ధరలు కింది విధంగా ఉన్నాయి.ఢిల్లీ: రూ.1,804 (రూ.14.5 తగ్గింది)ముంబై: రూ.1,756 (రూ.15 తగ్గుదల)కోల్కతా: రూ.1,911 (రూ.16 తగ్గింది)చెన్నై: రూ.1,966 (రూ.14.5 తగ్గింది)14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర స్థిరంగా ఢిల్లీలో రూ.803, కోల్కతాలో రూ.829, ముంబైలో రూ.802.50, చెన్నైలో రూ.818.50గా ఉంది.కార్ల ధరలుమారుతి సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా, బీఎండబ్ల్యూ(BMW) వంటి ప్రధాన ఆటో కంపెనీలు కార్ల ధరలను 3% వరకు పెంచాయి.రేషన్ కార్డులకు ఈ-కేవైసీరేషన్ కార్డుదారులకు ఈ-కేవైసీ(e-KYC) తప్పనిసరి. 2024 డిసెంబర్ 31లోగా ఈ-కేవైసీ పూర్తి చేయని రేషన్కార్డులు రద్దవుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.పెన్షన్ ఉపసంహరణ నిబంధనలుపెన్షనర్లు అదనంగా ఎలాంటి ధ్రువీకరణ అవసరం లేకుండా ఏదైనా బ్యాంకు నుంచి పెన్షన్ను ఉపసంహరించుకోవడానికి ఈపీఎఫ్ఓ అనుమతించింది.ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్డ్రాసులభంగా పీఎఫ్(PF) ఖాతాలోని నగదును ఉపసంహరించుకోవడానికి ఏటీఎం కార్డు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది.ఇదీ చదవండి: ఏడాది మొదటిరోజు తులం బంగారం ఎంతంటే..యూపీఐ పరిమితి పెంపుయూపీఐ 123పే కింద ఫీచర్ ఫోన్ యూజర్లకు చెల్లింపు పరిమితిని రూ.10,000కు కేంద్రం పెంచింది. ఇది గతంలో రూ.5,000గా ఉండేది. జనవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తున్నట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించింది.యూఎస్ వీసా రూల్స్నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా(Visa) దరఖాస్తుదారులు జనవరి 1 నుంచి ఒకసారి ఉచితంగా అపాయింట్మెంట్ను రీషెడ్యూల్ చేసుకోవచ్చు. -
ఆ భయం వల్లేనా..!
సాక్షి,హైదరాబాద్: హైడ్రా భయం భవన నిర్మాణాలపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీకి గతంలో వచ్చిన ఆదాయం ఈ సంవత్సరం రాలేదు. చెరువులు, సరస్సులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన హైడ్రా ఎందుకనోగానీ ప్రజల్లో..ముఖ్యంగా రియల్టర్లలో వణుకు పుట్టిస్తోంది. వాస్తవానికి హైడ్రా రియల్టర్ల జోలికి వెళ్లడం లేదు. ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదుల మేరకు చెరువులను కబ్జాలు చేసి నిరి్మస్తున్న భవనాలనే కూల్చివేస్తోంది. కానీ అనవసర భయాలతో రియల్టర్లు కొత్త ప్రాజెక్టులకు వెనుకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. జీహెచ్ఎంసీకి గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం భవన నిర్మాణ ఫీజుల ద్వారా రావాల్సిన ఆదాయం గణనీయంగా తగ్గడం ఇందుకు ఉదాహరణ. పెద్దపెద్ద నిర్మాణాలు జరిగితేనే ఫీజుల రూపేణా అధిక ఆదాయం వస్తుంది. పెద్ద నిర్మాణాలు స్తంభించడంతో ఆదాయం తగ్గినట్లు తెలుస్తోంది. గడచిన ఆరి్థక సంవత్సరం (2023–24)లో జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ విభాగం ద్వారా రూ.1695 కోట్ల ఆదాయం జీహెచ్ఎంసీ ఖజానాకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం (2024–25) అక్టోబర్ నెలాఖరు వరకు వచి్చంది రూ.459 కోట్లు మాత్రమే. నవంబర్, డిసెంబర్లలోనూ పెద్ద నిర్మాణాల అనుమతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. 2023–24 తోపోలిస్తే ఇంకా సగం ఆదాయం కూడా రాలేదు. ప్రస్తుత ఆరి్థక సంవత్సరం ముగిసేందుకు మిగిలిన మూడునెలల్లో ఏమేర ఆదాయం వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రూ.1000 కోట్లు సమకూరడం కూడా కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేనిపోని భయాలు కొత్త నిర్మాణాలకు రియల్టర్లు వెనుకడుగు వేస్తుండటంతో మెజార్టీ రియల్టర్లు ఇంతకాలం చెరువులు, సరస్సులను కబ్జాచేసే నిర్మాణాలు చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే భారీ నిర్మాణాలు జరిగినందున ఖాళీ స్థలాలంటూ లేనందున కొత్తగా నిర్మాణాలు జరగడం లేవని టౌన్ప్లానింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సాచురేషన్ స్థాయి మించిపోయిందని అంటున్నాయి. పాతభవనాలను కూల్చి అధునాతనంగా నిరి్మంచే వారుంటే తప్ప పెద్ద నిర్మాణాలు వచ్చే అవకాశాల్లేవని కూడా చెబుతున్నాయి. కూల్చివేతలకే కాదు.. హైడ్రా అనగానే ప్రజలకు కూల్చివేతలే గుర్తుకొస్తుండటం దారుణం. మూసీ పునరుజ్జీవనానికి సంబంధించి ఆస్తులు కూల్చివేసింది రెవెన్యూ విభాగం అయినప్పటికీ, హైడ్రా కూల్చివేసిందనే ప్రచారంతో అదే ముద్ర పడింది. హైడ్రా ఉన్నది కేవలం కూల్చివేతలకే కాదు..దానికున్న విధుల్లో అదొక భాగం మాత్రమే. అన్ని రకాల ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణలు కూడా ఉన్నాయి. ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికీ పనిచేస్తుంది. వీటి గురించి సామాన్య ప్రజలకు తగిన అవగాహన లేకపోవడం హైడ్రా నిందల పాలయ్యేందుకు కారణమైంది. ఈ అంశంలో ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాల్సిన అవసరముందని పట్టణ ప్రణాళిక నిపుణులు చెబుతున్నారు. -
సూరీడు రాక నాలుగు రోజులైంది
శివమొగ్గ: ఖరీఫ్ సీజన్లో భారీ వర్షాలు కురిసిన మలెనాడులో ఇప్పుడు బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన తుపాను ప్రభావంతో చలికాలంలోనూ జోరు వర్షాలు కురుస్తున్నాయి. ఫెంగల్ తుపాను ప్రభావంతో గత మూడు రోజులుగా జిల్లాలో ఆకాశం మేఘావృతమైంది. సోమవారం సాయంత్రం నుంచి ప శి్చమ కనుమలతో పాటు పలు చోట్ల చెదురుమదురు వర్షాలు కురిశాయి. వర్షంతో పాటు చల్లగాలులు కూడా జోరుగా వీస్తున్నాయి. ఇలా అనూహ్యమైన వాతావరణంతో ప్రజల ఆరోగ్యం కూడా తలకిందులవుతోంది. చలిజ్వరం, దగ్గు పడిశంతో చిన్నా పెద్దా ఆస్పత్రులకు వెళ్తున్నారు. కాగా రాబోయే రెండు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం ఎల్లో అలర్ట్ ఉంటుంది. గత మూడు నాలుగు రోజుల నుంచి సూర్యుడు కనిపించడం మానేశాడు. పగటి వేళలో కూడా చల్లని వాతావరణం కొనసాగుతోంది. ప్రజలు ఎండ కోసం తపించాల్సి వస్తోంది. -
ఇళ్ల కొనుగోలులో కీలకంగా వడ్డీ రేట్లు
ముంబై: గృహ రుణాలపై వడ్డీ రేట్లు 9 శాతం దాటితే తమ ఇళ్ల కొనుగోలు నిర్ణయంపై గణనీయమైన ప్రభావం పడుతుందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఫిక్కీ, అనరాక్ నిర్వహించిన సర్వేలో 90 శాతం మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇరు సంస్థలూ ‘హోమ్ బయ్యర్ సెంటిమెంట్ సర్వే’ వివరాలను ముంబైలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ సదస్సులో భాగంగా విడుదల చేశాయి. 7,615 మంది అభిప్రాయాల ఆధారంగా ఈ వివరాలను రూపొందించాయి. ఇళ్ల కొనుగోలుపై పెరిగిన రుణ రేట్ల ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేశాయి. సర్వేలో వ్యక్తమైన అభిప్రాయాలు.. → గృహ రుణ రేట్లు 8.5 శాతం దిగువనే కొనసాగితే తమ ఇంటి కొనుగోలు నిర్ణయంపై ఎలాంటి ప్రభావం ఉండదని 71 శాతం మంది స్పష్టం చేశారు. → 9 శాతం దాటితే తమ నిర్ణయాలు ప్రభావితం అవుతాయని 87 శాతం మంది తెలిపారు. 8.5–9 శాతం మధ్య రేట్లు కొనసాగితే తమ నిర్ణయాలపై ఓ మోస్తరు ప్రభావమే ఉంటుందని 54 శాతం మంది చెప్పారు. → 59 శాతం మందికి రియల్ ఎస్టేట్ ప్రాధాన్య పెట్టుబడి సాధనంగా ఉంది. 67 శాతం మంది సొంత నివాస అవసరాలకే కొనుగోలు చేస్తున్నారు. → రూ.45–90 లక్షల ఇళ్లకు 35 శాతం మంది మొగ్గు చూపిస్తుంటే, రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల బడ్జెట్ ఇళ్లకు 28 శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారు. → 93 శాతం మంది నిర్మాణంలో నాణ్యతకు, 72 శాతం మంది మంచి వెలుతురు ఉండే ఇళ్లకు ప్రాధాన్యం చూపిస్తున్నారు. చెప్పుకోతగ్గ మార్పు..‘‘భారత రియల్ ఎస్టేట్ రంగం చెప్పుకోతగ్గ పరిణామక్రమాన్ని చూసింది. ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల కంటే నిర్మాణంలోని ప్రాపర్టీల వైపు వినియోగదారులు మొగ్గు చూపిస్తుండడం డెవలపర్ల పట్ల, నియంత్రణ వాతావరణం పట్ల పెరిగిన విశ్వాసాన్ని తెలియజేస్తోంది’’అని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమాని తెలిపారు. నివాస ఇళ్ల మార్కెట్ 2029 నాటికి 1.04 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఫిక్కీ అర్బన్ డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ చైర్మన్ రాజ్ మెండా తెలిపారు. ఏటా 25.6 శాతం వృద్ధి చెందుతుందన్నారు. ఈ కన్జ్యూమర్ సర్వేకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్ వాతావరణంలో వినియోగదారుల ప్రాధాన్యతలకు ఇది అద్దం పడుతుందన్నారు. దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ ధోరణలను తెలియజేస్తుందన్నారు. రీట్లకు పెరుగుతున్న ఆదరణను టాటా రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ, సీఈవో సంజయ్ దత్ ఈ సదస్సులో భాగంగా గుర్తు చేశారు. పాక్షిక యాజమాన్యంలో ఉన్న సానుకూలతలను ప్రస్తావించారు. తక్కువ పెట్టుబడితోనే నాణ్యమైన ఆస్తుల్లో వాటాను వీటి ద్వారా పొందొచ్చన్నారు. -
సిబిల్ స్కోర్ తక్కువుంటే ఏకంగా ఇంత నష్టమా?
ఒక వ్యక్తి రుణ అర్హతను నిర్ణయించడంలో క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ కీలకం. సరళంగా చెప్పాలంటే, ఇది రుణగ్రహీత ఆర్థిక ఆరోగ్యం గురించి తెలియజేస్తుంది. బ్యాంకులు, రుణదాతలు ఈ స్కోరును బట్టి కస్టమర్కు రుణం, క్రెడిట్ కార్డు లేదా ఇతర సేవలను ఇవ్వవచ్చో లేదో నిర్ణయించడానికి ఉపయోగిస్తారు.సాధారణంగా 750 కంటే ఎక్కువ స్కోరును మంచిగా పరిగణిస్తారు. ఈ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీ రేటుతో సులభంగా క్రెడిట్ కార్డు లేదా రుణాన్ని పొందవచ్చు. 600 కంటే తక్కువ స్కోరు ఉంటే అప్పు పొందడాన్ని కష్టతరంగా, ఖరీదైనదిగా చేస్తుంది.రూ.19 లక్షలు అదనంగా చెల్లించాలి..మీరు రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకున్నారనుకుంటే తక్కువ క్రెడిట్ స్కోర్ కారణంగా రూ.19 లక్షలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అదెలాగో ఇప్పుడు వివరంగా చూద్దాం..మీకు క్రెడిట్ స్కోర్ 820 అనుకుంటే రూ.50 లక్షల గృహ రుణం 20 ఏళ్ల కాలానికి 8.35 శాతం వడ్డీ రేటుతో పొందొచ్చు. ఈ కాల వ్యవధి పూర్తయ్యేలోపు నెలవారీ ఈఎంఐ రూ.42,918 చొప్పున మీరు తిరిగి చెల్లించే మొత్తం రూ.1.03 కోట్లు (రూ.50 లక్షల అసలు, రూ.53 లక్షల వడ్డీ) అవుతుంది.అదే మీ క్రెడిట్ స్కోర్ 580 అయితే అదే మొత్తంపై వడ్డీ రేటు 10.75 శాతం వరకు ఉంటుంది. 20 ఏళ్లలో రూ.1.21 కోట్లు (రూ.50 లక్షల అసలు, రూ.71.82 లక్షల వడ్డీ) రుణదాతకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీకు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న కారణంగా రూ .18.82 లక్షలు అదనంగా చెల్లించాలి.మంచి క్రెడిట్ స్కోరు కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలుమీ క్రెడిట్ కార్డ్ బిల్లులు, లోన్ ఈఎంఐలు, ఇతర ఆర్థిక బాధ్యతలను సకాలంలో చెల్లించేలా చూసుకోండి. ఆలస్యంగా చెల్లింపులు లేదా డిఫాల్ట్లు మీ సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్ను గణనీయంగా ప్రభావితం చేస్తాయి.మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తిని (మీరు ఉపయోగిస్తున్న మీ క్రెడిట్ లిమిట్ శాతం) 30 శాతం కంటే తక్కువగా ఉంచుకోండి. అధిక వినియోగం అధిక క్రెడిట్ రిస్క్ను సూచిస్తుంది. మీ క్రెడిట్ స్కోరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.మీ క్రెడిట్ రిపోర్ట్ను క్రమం తప్పకుండా పరిశీలించుకోండి. తప్పులను వెంటనే సరిదిద్దుకోవడం వల్ల మీ సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్కు అనవసరమైన నష్టాన్ని నివారించవచ్చు.రుణాలు వంటి క్రెడిట్ కోసం తరచుగా వచ్చే దరఖాస్తులు మీ నివేదికపై అనేక కఠినమైన విచారణలకు దారితీస్తాయి. ఇది మీ స్కోరును తగ్గిస్తుంది. అవసరమైనప్పుడు మాత్రమే కొత్త క్రెడిట్ కోసం దరఖాస్తు చేసుకోండి. -
ఈశాన్య బంగాళాఖాతం వైపు వెళ్తున్న వాయుగుండంకు రెమల్ తుపానుగా పేరు
-
సోషల్ మీడియా అసాంఘిక శక్తులు బలి తీసుకున్న జీవితాలు
-
డెల్టాలను ముంచి ఉల్టా రాతలా!?
సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపాను ప్రభావంతో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో ఆ రెండు డెల్టాల్లో అక్కడక్కడ పల్లపు ప్రాంతాల్లో కొంతమేర పంటలు ముంపునకు గురయ్యాయి. ప్రభుత్వమే ఆ పంటలను ముంచేసినట్లు చిత్రీకరిస్తూ సీఎం జగన్పై రామోజీరావు ఇష్టమొచ్చినట్లు రాసిపారేశారు. డ్రెయిన్లు, కాలువల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యంవల్లే డెల్టాల్లో పంటలు ముంపునకు గురైనట్లు చేతికొచ్చింది అచ్చేశారు. నిజానికి.. టీడీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణాడెల్టా ఆధునీకరణకు వినియోగించాల్సిన రూ.175 కోట్లను కృష్ణా నది కరకట్టపై తాను నివాసం ఉంటున్న అక్రమ నివాసాన్ని సుందరీకరించేందుకు చంద్రబాబు మళ్లించారు. అలాగే, గోదావరి డెల్టా ఆధునీకరణ నిధులనూ గోదావరి పుష్కరాలకు మళ్లించారు. ఆ పనులు చేయకుండానే కాంట్రాక్టర్ల ముసుగేసుకున్న టీడీపీ నేతలకు రూ.150 కోట్లకు పైగా దోచిపెట్టారు. ఏటా డ్రెయిన్లలో గుర్రపుడెక్క, తట్టెడు పూడిక ఎత్తకుండానే ఎత్తినట్లు చూపి రూ.వందల కోట్లను పచ్చమందకు దోచిపెట్టారు. చంద్రబాబు అవినీతివల్లే కృష్ణా, గోదావరి డెల్టాల్లో డ్రెయిన్లలో పూడిక పేరుకుపోయింది. గత నాలుగున్నరేళ్లుగా కృష్ణా, గోదావరి డెల్టాల్లో ఆయకట్టు చివరి భూములకు నీళ్లందిస్తూ దన్నుగా నిలుస్తున్న సీఎం జగన్కు రైతులు అండగా నిలుస్తుండటాన్ని భరించలేక రామోజీరావు నిద్రపట్టడంలేదు. దీంతో చంద్రబాబు అవినీతిని కప్పెట్టి.. ఆ నెపాన్ని సీఎం జగన్పై రుద్దుతూ ‘ప్రభుత్వం ముంచింది’ అంటూ ‘ఈనాడు’లో తప్పుడు కథనాన్ని అచ్చేశారు. రెండు పంటలకు సమృద్ధిగా సాగునీరు.. సీఎం జగన్ ఆదేశాల మేరకు గత నాలుగున్నరేళ్లుగా గోదావరి, కృష్ణా డెల్టాల్లో రబీ పంటల కోతలు పూర్తికాగానే కాలువలకు మరమ్మతులు చేస్తూ.. డ్రెయిన్లలో గుర్రపుడెక్కను తొలగిస్తూ.. ఆయకట్టు చివరి భూములకు అధికారులు నీళ్లందిస్తున్నారు. గోదావరి డెల్టాతోపాటు కృష్ణాడెల్టా చరిత్రలో గత నాలుగేళ్లుగా రబీ పంటకూ నీళ్లందిస్తున్నారు. కాలువలు, డ్రెయిన్లను సమర్థవంతంగా నిర్వహిస్తూ సమృద్ధిగా నీళ్లందిస్తుండటంతో పంటల ఉత్పత్తులు పెరగడం.. గిట్టుబాటు ధరలు దక్కడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. తుపాన్లు, భారీ వర్షాలవల్ల పంటలకు నష్టం వాటిల్లితే.. ఆ సీజన్ ముగిసేలోగానే నష్టపోయిన రైతులకు సీఎం జగన్ పరిహారం చెల్లిస్తూ దన్నుగా నిలుస్తున్నారు. దీంతో సీఎం జగన్కు రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో ఆదరణ పెరుగుతున్నట్లుగానే.. కృష్ణా, గోదావరి డెల్టా రైతుల్లోనూ ఆయనకు నానాటికీ మద్దతు పెరుగుతోంది. డెల్టాల ఆధునీకరణ నిధులు స్వాహా.. కృష్ణా, గోదావరి డెల్టాను ఆధునీకరించడం ద్వారా పంటలకు సమృద్ధిగా నీళ్లందించి రైతులకు బాసటగా నిలవాలని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పించారు. జలయజ్ఞం కింద గోదావరి, కృష్ణా డెల్టాల ఆధునీకరణ పనులు చేపట్టారు. తన హయాంలో గోదావరి డెల్టా ఆధునీకరణకు రూ.748.58 కోట్లు, కృష్ణాడెల్టా ఆధునీకరణకు రూ.1,093.77 కోట్లు ఖర్చుచేసి కాలువలు, డ్రెయిన్లను అభివృద్ధి చేశారు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన బాబు.. డెల్టాల ఆధునీకరణ నిధులను దోచేశారు. ► కృష్ణాడెల్టా ఆధునీకరణకు 2014–19 మధ్య రూ.1,239.24 కోట్లు ఖర్చుచేస్తే.. ఇందులో రూ.175 కోట్లను తాను నివాసం ఉంటున్న అక్రమ కట్టడం సుందరీకరణకు మళ్లించారు. ► కాలువలు, డ్రెయిన్ల ఆధునీకరణ పనులు తూతూమంత్రంగా చేపట్టి కాంట్రాక్టర్ల ముసుగులోని టీడీపీ నేతలతో కలిసి చంద్రబాబు దోచేశారు. ► గోదావరి డెల్టా ఆధునీకరణకు 2014–19 మధ్య రూ.813.02 కోట్లు ఖర్చుచేసిన చంద్రబాబు.. అందులో చాలావరకు నిధులను గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు మళ్లించేశారు. ►పనులు చేయకుండానే చేసినట్లు చూపి పచ్చమందకు దోచిపెట్టారు. -
గురకతో వచ్చే ఆరోగ్య అనర్థాలు అన్నీఇన్నీ కావు! ఒక్కోసారి..
నిద్రలో కొంతమందికి గురక వస్తుంది. గురక మంచి నిద్రకు సూచన అని చాలామంది అనుకుంటారు. కానీ ఇది సరికాదు. నిద్రలో అన్ని కండరాల్లాగే గొంతు కండరాలూ రిలాక్స్ అవుతాయి. దాంతో ఊపిరితిత్తులకు వెళ్లే నాళం ముడుచుకుపోయినట్లుగా (ఫ్లాపీగా) అవుతాయి. అందులోంచి గాలి వెళ్తున్నప్పుడూ, అంగిలికి తాకినప్పుడూ... అందులో ప్రకంపనలు కలిగి, గురక వస్తుంది. ఇలా గురక వస్తూ వాయునాళంలోంచి పది సెకండ్లకు పైగా గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లకపోతే... ఆ కండిషన్ను ‘ఆప్నియా’ అంటారు. అప్పుడు తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో పాటు కార్బన్ డై ఆక్సైడ్ మోతాదులు పెరుగుతాయి.. దాంతో మెదడుకు తగినంత ఆక్సిజన్ అందక, రాత్రిళ్లు నాణ్యమైన నిద్రలేక, పగలంతా జోగుతూ ఉంటారు. ఫలితంగా రక్తపోటు పెరగడం, డయాబెటిస్ ఉన్నవాళ్లలో చక్కెరలు నియంత్రణలో ఉండకపోవడం, పక్షవాతం, ఆస్తమా, సీవోపీడీ జబ్బు ఉన్నవాళ్లలో వాటి తీవ్రత పెరగడం, గుండెజబ్బులు రావడం వంటి సమస్యలూ వస్తాయి. ఒక్కోసారి స్లీప్ ఆప్నియా కారణంగా వచ్చే ఈ దుష్ప్రభావాలూ మరణానికి దారితీసే అవకాశాలూ లేకపోలేదు. ఆప్నియాను నివారణకు పాటించాల్సిన సూచనలివి... మంచి జీవనశైలి అలవాట్లతో ఆప్నియాను చాలావరకు నివారించవచ్చు. స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గాలి. ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు పూర్తిగా మానేయాలి. అలవాటు మానేయలేకపోతే... నిద్రపోవడానికి కనీసం నాలుగు నుంచి ఆరు గంటలకు ముందు ఆల్కహాల్ ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. అయితే ఇలా మానకపోవడం చాలామందిలో ప్రమాదకరంగా పరిణమించిన దాఖలాలు స్పష్టంగా ఉన్నాయి. అందుకే ఆల్కహాల్ను పూర్తిగా మానేయడమే మంచిది. (చదవండి: కొద్దిసేపటిలో ఊపిరితిత్తుల మార్పిడి..ఆ టైంలో వైద్యుడికి తీవ్ర గాయాలు!ఐనా.. ) ∙ -
బాణాసంచాకు బోలెడు కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: దీపావళి బాణాసంచాపై ఈసారి ఎన్నికల ప్రభావం స్పష్టంగా కని్పస్తోంది. ఎన్నికలు కూడా కలిసి రావడంతో అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని, అయితే అడుగడుగునా నిఘా నేపథ్యంలో వాటిని తీసుకురావడమూ కష్టంగానే ఉందని దుకాణాల యజమానులు అంటున్నారు. నగదు లావాదేవీలకు అడ్డంకులతో వ్యాపారులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తున్నారు. ఈ సంవత్సరం బాణాసంచా ధరలు పెరగడానికి ఇది కూడా కారణమయ్యే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. దసరాకు ముందు నుంచే వ్యాపారులు బాణాసంచాను తమిళనాడులోని శివకాశి నుంచి భారీగా తెచ్చి, నిల్వ చేస్తుంటారు. దీపావళికి కొద్ది రోజుల ముందు నుంచి అమ్మకాలు మొదలు పెడతారు. పండుగకు నాలుగు రోజుల ముందు అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఏటా రూ. 250–360 కోట్ల వ్యాపారం నడుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 500–700 కోట్ల వ్యాపారం ఉంటుందని అంచనా. ఇందులో పన్నులు చెల్లించకుండా జరిగే వ్యాపారమే ఎక్కువగా ఉంటుందని అంచనా. ఈ ఏడాది టపాసుల జోరు.. రాష్ట్రంలో ఎన్నికల కోలాహాలం నెలకొంది. పోటీ చేసే అభ్యర్థులు వివిధ వర్గాలతో కలిసి వేడుకల్లోనూ పాల్గొంటారు. పారీ్టలన్నీ మండల, నియోజకవర్గ స్థాయిలో ఆఫీసులను తెరుస్తాయి. దీంతో కార్యకర్తలు పోటీపోటీగా బాణాసంచా కాల్చడం రివాజు. డిసెంబర్ మొదటి వారంలో ఫలితాలు వెల్లడిస్తారు. విజయం సాధించిన అభ్యర్థులు బాణాసంచాతో పెద్ద ఎత్తున వేడుకలు చేసుకుంటారు. దీపావళికి ఎన్నికలు కూడా తోడవ్వడంతో ఈసారి బాణాసంచా అమ్మకాలు జోరుగానే ఉంటాయని వ్యాపారులు విశ్లేíÙస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మొత్తంలో శివకాశిలో ఆర్డర్లు కూడా ఇచ్చినట్టు హైదరాబాద్ మలక్పేటకు చెందిన ఓ బాణాసంచా వ్యాపారి ఖండేవాల్ తెలిపారు. బాణాసంచాలో దాదాపు 50 శాతానికి పైగా లాభాలుంటాయి. అధికారిక లెక్కల్లో చూపించే వాటికే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పన్నులు కడతారు. అంతకు రెండు రెట్లు ఎలాంటి పన్నులు కట్టకుండా తేవడం సాధారణంగా జరుగుతున్న వ్యవహారమే. నగదుతో చిక్కు.. వ్యాపారులు ప్రతి ఏటా ఆన్లైన్ లావాదేవీలకన్నా, ప్రత్యక్షంగా నగదు ఇచ్చి బాణాసంచా కొనుగోలు చేస్తుంటారు. ఎన్నికల నేపథ్యంలో సరిహద్దులు దాటి నగదు తీసుకెళ్లడం కష్టంగానే ఉందని హైదరాబాద్ బాణాసంచా వ్యాపారి సంజయ్ తెలిపారు. రూ. 50 వేలకు మించి నగదు పట్టుబడితే స్వా«దీనం చేసుకుంటున్నారు. ఇదే సమస్యగా మారిందని ఆయన చెప్పారు. ఆన్లైన్ లావాదేవీలపైనా నిఘా ఉందనేది వ్యాపారులను వణికిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక బృందాలు సరిహద్దుల్లోనే కాకుండా, అన్ని ప్రాంతాల్లో ఉండటం వల్ల పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొందని వ్యాపారులు చెబుతున్నారు. శివకాశిలోని వ్యాపారులకు ఫోన్పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపులను తెలిసిన వాళ్ల ద్వారా చేయాల్సి వస్తోందని వారు తెలిపారు. అయితే, అక్కడా సమస్యలు తప్పడం లేదంటున్నారు. డిజిటల్ లావాదేవీల వల్ల పన్నులు అధికంగా చెల్లించాల్సి వస్తోందన్న నెపంతో శివకాశిలోని వ్యాపారులు అభ్యంతరాలు తెలుపుతున్నారని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క, పట్టణ ప్రాంతాల్లో వ్యాపారులు నిఘాలేని పలు మార్గాలను ఎంచుకుంటున్నారు. కొన్ని చోట్ల తెలిసిన అధికారులను పట్టుకుని నగదు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది బాణాసంచా ధరలు 30 శాతం మేర పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. నిఘా కారణంగా అయ్యే ప్రత్యేక ఖర్చు వల్ల ఈ సంవత్సరం స్థానికంగా ధరలు 50 శాతం పెరగవచ్చనేది వారు అంచనా వేస్తున్నారు. -
ఆపదలో చేయూత.. క్రౌడ్ ఫండింగ్
శాంతి, ఏకాంబరం దంపతులు (పేరు మార్చాం) తొలి కాన్పులో పుత్రుడు అని తెలియగానే పొంగిపోయారు. బాబును చూస్తూ భవిష్యత్తుపై ఎన్నో కలలుగన్నారు. చిన్నారి మూడేళ్ల వయసుకొచ్చేసరికి కదల్లేని స్థితి ఏర్పడింది. హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ చిన్నారుల ఆస్పత్రిలో చూపించారు. స్పైనల్ మసు్క్యలర్ అట్రోఫీ(ఎస్ఎంఏ)తో బాధపడుతున్నట్టు తేలింది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే విదేశాల నుంచి ‘జోల్జెన్స్మా’ అనే ఇంజెక్షన్ను తీసుకొచ్చి ఇవ్వాలి. ఇందుకు సుమారు రూ.16 కోట్లు అవుతుందని వైద్యులు వెల్లడించారు. ఈ సమయంలో బాబు తల్లిదండ్రులకు ‘ఇంపాక్ట్ గురూ’ ప్లాట్ఫామ్ సంజీవనిగా కనిపించింది. చిన్నారి ఎదుర్కొంటున్న పరిస్థితిని వివరిస్తూ విరాళాలకు (ఫండ్ రైజింగ్) పిలుపునిచ్చారు. మూడున్నర నెలల్లో 65,000 మంది దాతల ఉదారంతో ఊహించనిది సాధ్యమైంది. విదేశాల నుంచి సదరు ఇంజెక్షన్ను తీసుకొచ్చి ఇవ్వడంతో బాబు కోలుకున్నాడు. వేణు నెట్ బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో ఓ బాలిక లివర్ సమస్యతో బాధపడుతుందన్న ‘కెట్టో’ ప్రకటన కనిపించింది. అది క్లిక్ చేయగా, ఆ సమస్య నుంచి బయటపడేందుకు రూ.30 లక్షలు అవుతుందని, దాతలు దయతలిస్తేనే తన కుమార్తె బయటపడుతుందంటూ చిన్నారి తల్లి ఆవేదనతో చెబుతున్న మాటలకు వేణు చలించిపోయాడు. కానీ, కాలేయ చికిత్సకు భారీ మొత్తాన్ని పేర్కొనడంపై అతడిలో అనుమానం కలిగింది. సదరు ప్రకటన నిజమేనా..? అంత ఖర్చు అవుతుందా..? ప్రభుత్వాలు ఎందుకు సాయం చేయవు? ఆస్పత్రులు అయినా బాధితుల విషయంలో కొంత లాభాపేక్ష తగ్గించుకుని చికిత్సలకు ముందుకు రావచ్చుగా..? ఇలాంటి ప్రశ్నలు మెదిలాయి. చివరికి తన సందేహాలన్నీ పక్కన పెట్టేసి రూ.500 అప్పటికప్పుడు డొనేట్ చేశాడు. ఎంత పెద్ద ఆరోగ్య సమస్య వచి్చనా, తమ వల్ల ఏమవుతుంది? అంటూ కుదేలు అయిపోవాల్సిన పని లేదని శాంతి దంపతుల కథనం ధైర్యాన్నిస్తోంది. ఆరోగ్య పరంగా ఎంత కష్టం వచి్చనా, దాతల నుంచి విరాళాలు తెచ్చి పెట్టేందుకు నేడు ఎన్నో వేదికలు పనిచేస్తున్నాయి. వేలాది మంది బాధితుల కుటుంబాల్లో సంతోషానికి దారి చూపిస్తున్నాయి. అదే సమయంలో ఇలాంటి బాధితులకు సాయం చేశామనే సంతృప్తి దాతలకు లభిస్తోంది. కాకపోతే విరాళం ఇచ్చే ముందు కాస్తంత విచారించి, కథనం నిజమైనదేనని నిర్ధారించుకోవడం ద్వారా తమ దానం నిష్ఫలం కాకుండా చూసుకోవచ్చు. మెడికల్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకుంటే.. వీటి సాయం పొందడమే కాకుండా, వీటి ద్వారా నలుగురికీ తోచినంత సాయం చేయడానికి అవకాశం లభిస్తుంది. మనోళ్లకు దాన గుణం ఎక్కువే.. 2021 వరల్డ్ గివింగ్ ఇండెక్స్ ప్రకారం దానంలో భారత్ 14వ స్థానంలో ఉంది. అపరిచితులకు మన దేశంలో 61 శాతం మంది సాయం చేస్తున్నారు. కాకపోతే విశ్వసనీయత విషయంలో ఉండే సందేహాలు ఈ దాతృత్వాన్ని మరింత విస్తరించకుండా అడ్డుకుంటున్నాయని చెప్పుకో వచ్చు. బాధితులకు, దాతలకు మధ్య వేదికగా నిలిచే విశ్వసనీయ సంస్థలు వస్తున్న కొద్దీ, క్రౌడ్ ఫండింగ్ మరింత పరిడవిల్లుతూనే ఉంటుంది. మరింత మంది బాధితులకు చేయూత లభిస్తుంది. నిధుల సమీకరణ ఇలా..? ► చికిత్సలకు దాతల సాయం అవసరమైన వారు క్రౌండ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లను (ఇంపాక్ట్గురూ, మిలాప్, కెట్టో మొదలైనవి) సంప్రదించాలి. ► పాన్, ఆధార్, మెడికల్ డాక్యుమెంట్లు సమర్పించాలి. ► వీటిని క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ ధ్రువీకరించుకుంటుంది. తగిన విచారణ అనంతరం బాధితుల కథనం నిజమేనని నిర్ధారించుకున్న తర్వాత వారి తరఫున నిధుల సమీకరణ పేజీని అవి సిద్ధం చేస్తాయి. ► ఇక ఇక్కడి నుంచి నిధుల సమీకరణ మొదలవుతుంది. సాయం అవసరమైన వారు ఈ పేజీ లింక్ను తమ నెట్వర్క్లో షేర్ చేసుకోవాలి. తమ వంతు ప్రచారం కలి్పంచుకోవాలి. అలాగే, ప్లాట్ఫామ్లు సైతం ప్రచారానికి తమ వంతు సాయం అందిస్తాయి. ► సమీకరించే విరాళంలో ఎక్కువ మొత్తాన్ని కమీషన్ రూపంలో మినహాయించుకునేందుకు సమ్మతి తెలియజేస్తే, వారి తరఫున క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లు సైతం విస్తృత ప్రచారాన్ని చేపడతాయి. ► బాధితులు ఎదుర్కొంటున్న సమస్య, వైద్యులు చెబుతున్న వెర్షన్, చికిత్సకు ఎంత ఖర్చవుతుంది? తదితర వివరాలన్నీ ఈ పేజీలో ఉంటాయి. దాతలు విరాళం చెల్లించేందుకు పేమెంట్ లింక్లు కూడా అక్కడ కనిపిస్తాయి. ► కనీసం 300–350 అంతకంటే ఎక్కువ విరాళాలనే అనుమతిస్తున్నాయి. ► దాతలు చేసే చెల్లింపులన్నీ కూడా ప్రత్యేక ఖాతాలో జమ అవుతాయి. ► కావాల్సిన మొత్తం వచి్చనా.. లేదంటే గడువు ముగిసినా లేదంటే అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి అకాలంగా మరణించినా నిధుల సమీకరణ ముగిసిపోతుంది. ► అనంతరం ఈ మొత్తం నుంచి కమీషన్ మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని హాస్పిటల్/బాధితులకు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లు చెల్లిస్తాయి. ఇలా చేసే ముందు హాస్పిటల్ బిల్లులను చెక్ చేస్తాయి. ► విరాళం ఇచి్చన వారికి ఎప్పటికప్పుడు మెయిల్ ద్వారా బాధితుల తాజా ఆరోగ్య పరిస్థితిపై వివరాలను ఇవి అప్డేట్ చేస్తుంటాయి. విశ్వసించడం ఎలా..? సాయం అవసరమైన వారికి క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లు మార్గాన్ని చూపిస్తున్నాయి. మరి విరాళం ఇచ్చే వారు ఈ కథనాలను విశ్వసించేది ఎలా..? ఈ సందేహం చాలా మందికి వస్తుంది. మన దేశంలో విరాళాలకు సంబంధించి భౌతిక వేదికలే ఎక్కువ. ఆన్లైన్ ప్లాట్ఫామ్ల సేవలు ఇటీవలి కాలంలోనే వెలుగులోకి వచ్చాయి. ఇంటర్నెట్ విస్తరణ ఇందుకు వీలు కలి్పంచిందని చెప్పుకోవాలి. ఆన్లైన్ ప్రపంచంలో అన్నింటినీ నమ్మలేం. సైబర్ మోసాలు గణనీయంగా పెరిగిపోయిన నేపథ్యంలో, అన్నీ విచారించుకున్న తర్వాతే విరాళం ఇవ్వడం సురక్షితంగా ఉంటుంది. కోటక్ ఆల్టర్నేటివ్ అస్సెట్ మేనేజర్స్ సీఈవో (ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ) లక్ష్మీ అయ్యర్ దీనిపై తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘నాకు రిఫరల్ ద్వారా వచ్చే వాటికే నేను దానం చేస్తాను. ఈ విషయంలో నా మార్గం చాలా స్పష్టం. సులభంగా డబ్బులు సంపాదించే మోసగాళ్లకు కొదవ లేదు’’అన్నది లక్ష్మీ అయ్యర్ అభిప్రాయంగా ఉంది. సన్సేరా ఇంజనీరింగ్ జాయింట్ ఎండీ ఎఫ్ఆర్ సింఘ్వి ఈ విషయంలో సందేహాలు వ్యక్తం చేశారు. ‘‘చాలా వరకు విరాళాలు కోరుతున్న ఆన్లైన్ కేసులు వైద్య పరమైనవే ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో అవి పేర్కొనే చికిత్సల వ్యయాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. నాకు ఒక ఆస్పత్రితో అనుబంధం ఉంది. కనుక చికిత్సల వ్యయాల గురించి తెలుసుకోగలను’’అని పేర్కొన్నారు. ఇలాంటిదే ఒక విరాళం కేసులో చికిత్సకు రూ.18–24 లక్షలు ఖర్చువుతుందన్న కొటేషన్ కనిపించగా, దీనిపై విచారించగా, తెలిసిన హాస్పిటల్లో రూ.5–6 లక్షలకే చేస్తున్నట్టు విని ఆశ్చర్యపోయినట్టు సింఘ్వి తెలిపారు. నిజానికి కొన్ని కేసుల్లో భారీ అంచనాలు పేర్కొంటున్న ఉదంతాలు లేకపోలేదు. హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న బాధితుల తరఫున నిధుల సమీకరణ కార్యక్రమాలు నడిపించే కొందరు మోసగాళ్ల ఉదంతాలు సైతం లోగడ వెలుగు చూశాయి. అలా అని కష్టాల్లో ఉన్న బాధితులకు విరాళాలు ఆగకూడదు కదా..? ముందస్తు పరిశీలన క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లు చికిత్సల వ్యయాలను ముందుగానే నిర్ధారించుకుంటామని చెబుతున్నాయి. హాస్పిటల్ వ్యయ అంచనాలను, చారిత్రక గణాంకాలు, బీమా థర్డ్ పార్టీ అగ్రిగేటర్ సంస్థల డేటా ఆధారంగా పోల్చి చూస్తామని ఇంపాక్ట్గురూ సీఈవో జైన్ తెలిపారు. తమ ప్యానల్ డాక్టర్లతోనూ దీనిపై నిర్ధారించుకుంటామని చెప్పారు. నిధుల సమీకరణ నిజమైన కారణాలతో చేసినప్పటికీ, తర్వాత ఆ నిధులు దురి్వనియోగం కాకుండా ఉండేందుకు కూడా ఇవి చర్యలు తీసుకుంటున్నాయి. ‘‘ఇంపాక్ట్ గురూ వేదికగా సమీకరించే నిధుల్లో 80 శాతానికి పైగా నేరుగా హాస్పిటల్స్కు బదిలీ చేస్తున్నాం. ఈ హాస్పిటల్స్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ జాబితాలోనివే’’అని జైన్ తెలిపారు. తమ ప్లాట్ఫామ్పై లిస్ట్ చేసే వైద్య పరమైన కేసుల్లో విరాళాలను హాస్పిటల్ బ్యాంక్ ఖాతా ద్వారానే తీసుకోగలరని కెట్టో అంటోంది. ► బాధితుల కేవైసీ పత్రాలను ముందుగా ఇవి నిర్ధారించుకుంటాయి. ► వైద్య పరమైన అన్ని డాక్యుమెంట్లు తీసుకుని వాటిని తనిఖీ చేస్తాయి. ► తమ ప్యానెల్ వైద్యులతో మాట్లాడి నిర్ధారణకు వస్తాయి. ► అవసరమైతే క్షేత్రస్థాయిలో హాస్పిటల్కు తమ ఉద్యోగిని పంపించి వాస్తవమా, కాదా అన్నది నిర్ధారించుకుంటాయి. ప్రచార మార్గం.. ఇంపాక్ట్ గురూ, కెట్టో, మిలాప్ ఇవన్నీ ప్రముఖ మెడికల్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లు. ఆన్లైన్ ప్రకటనలు, సామాజిక మాధ్యమాల ద్వారా బాధితుల తరఫున విరాళాల సమీకరణకు ఇవి ప్రచారం కలి్పస్తుంటాయి ఇంటర్నెట్ బ్రౌజ్ చేసే సమయంలో వైద్య చికిత్సల కోసం సాయం కోరుతూ ఈ సంస్థలకు సంబంధించి ప్రకటనలు కనిపిస్తుంటాయి. వీటిని క్లిక్ చేసి చూశారంటే, తర్వాత కూడా అలాంటి ప్రకటనలే మళ్లీ మళ్లీ కనిపిస్తుంటాయి. ప్రకటనల్లో బాధితుల కథనానికి ఆధారంగా వైద్యులు జారీ చేసిన లెటర్, టెస్ట్ రిపోర్ట్లను ఉంచుతున్నాయి. సామాజిక మాధ్యమాలతోపాటు, బాధితులు సైతం తమకు తెలిసిన వారికి ఈ లింక్లు పంపి సాయం కోరవచ్చు. ఒక్కసారి కావాల్సిన నిధులు లభించగానే, ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం ముగుస్తుంది. ఈ సంస్థలు విరాళం ఇచి్చన వ్యక్తులను నెలవారీ స్కీమ్లతో ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రతి నెలా తోచినంత దానం ఇచ్చే విధంగా స్కీమ్లు తీసుకొచ్చాయి. విరాళాలకు సెక్షన్ 80జీ కింద పన్ను మినహాయింపు కల్పిస్తున్నాయి. బాధితుల అనుభవాలు.. లాహిరి సోదరికి బ్రెయిన్ టీబీ నిర్ధారణ కావడంతో 2019 డిసెంబర్లో నిధుల సమీకరణ కోసం మిలాప్ సంస్థను సంప్రదించారు. మిలాప్ ఆమె అభ్యర్థనకు చక్కగా స్పందించింది. ఫొటోగ్రాఫ్లు, డాక్యుమెంట్లు అడిగారు. అవన్నీ ఇవ్వడంతో, వాటి ఆధారంగా ఒక ప్రచార ప్రకటనను మిలాప్ రూపొందించింది. తెలిసిన వారి సాయంతో దీనికి మంచి ప్రచారం కలి్పంచుకోవాలని మిలాప్ సూచించింది. తాము ఆ ప్రచారాన్ని చేపట్టబోమని, బాధితులే సొంతంగా నిర్వహించడం వల్ల మరింత విశ్వసనీయత ఉంటుందనే సూచన వచ్చింది. దీంతో లాహిరి తనకు తెలిసిన వారికి షేర్ చేశారు. అలా రూ.45,000 విరాళాలు వచ్చాయి. ఇందులో మిలాప్ తన కమీషన్గా రూ.5,000 మినహాయించుకుని, రూ.40,000ను లాహిరి చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చెల్లించింది. కానీ, మిలాప్ ద్వారా చేసిన ప్రచారం లాహిరి బంధు మిత్రులకు తెలిసిపోవడంతో, వారి నుంచి ఆమెకు మరో రూ.12 లక్షలు విరాళాల రూపంలో నేరుగా వచ్చాయి. మిలాప్ రూపొందించిన ప్రచారమే లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదని లాహిరి అనుభవం చెబుతోంది. దురదృష్టవశాత్తూ లాహిరి సోదరి బ్రెయిన్ టీబీతో 2020 ఫిబ్రవరిలో మరణించారు. విజయం ఎంత? మీరా అనే వ్యక్తి సైతం, తన భర్త సర్జరీ కోసం కెట్టో ద్వారా నిధుల సమీకరణ చేయగా, మంచి ఆదరణే లభించింది. కెట్టో రిప్రజెంటేటివ్ ఎప్పటికప్పుడు ఆమెతో సంపద్రింపులు చేస్తూ సహకారం అందించడంతో, సర్జరీకి కావాల్సిన మొత్తం 48 గంటల్లోనే సమకూరింది. దేశ, విదేశాల్లోని స్నేహితులు, కుటుంబ సభ్యులు విరాళం ఇచ్చేందుకు సముఖంగా ఉన్నారని తెలిసినా, అందుకు వీలుగా కెట్టో ప్లాట్ఫామ్ సాయాన్ని ఆమె తీసుకున్నారు. ఎక్కడ ఉన్నా కెట్టో ద్వారా విరాళం పంపడం సులభమని భావించి అలా చేసినట్టు చెప్పారు. అయితే, అందరికీ ఇదే తరహా అనుభవం లభిస్తుందా..? ప్రతి ఫండ్ రైజింగ్ విజయవంతం అవుతుందా? అంటే నూరు శాతం అవును అని చెప్పలేం. ఇదంతా తమకున్న పరిచయాలు, ఎంపిక చేసుకున్న ప్లాట్ఫామ్, రూపొందించిన ప్రకటన, ప్లాట్ఫామ్ నుంచి ప్రచారం తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ‘‘కొన్నేళ్ల క్రితం మేము సాయం కోసం ఇంపాక్ట్ గురూ ప్లాట్ఫామ్ను సంప్రదించాం. ఇంపాక్ట్ గురూ దాతల నెట్వర్క్ సాయంతో నిధులు సమకూర్చుతారని అనుకున్నాం. కానీ, ఇంపాక్ట్ గురూ అలా చేయలేదు. ప్రచార కార్యక్రమం పేజీని రూపొందించి, ఆ లింక్ను తమ పరిచయస్తులతో పంచుకోవాలని సూచించింది’’అని ఓ వ్యక్తి అనుభవం చెబుతోంది. తమ ప్లాట్ఫామ్పై వేలాది ప్రచార కార్యక్రమాలు నమోదవుతున్నందున.. ప్రతీ ఒక్క ప్రచారాన్ని తామే సొంతంగా చేపట్టడం సాధ్యం కాదని ఇంపాక్ట్ గురూ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పీయూష్ జైన్ స్పష్టం చేశారు. దాతల కమ్యూనిటీ నుంచి మంచి స్పందన వస్తుందనుకుంటే, తాము తప్పకుండా ప్రమోట్ చేస్తుంటామని చెప్పారు. కొంచెం కమీషన్.. క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ లు మొత్తం విరాళం నుంచి నిరీ్ణత మొత్తాన్ని కమీషన్/చార్జీ కింద మినహాయించుకుంటున్నాయి. ఇది ఒక్కో సంస్థలో ఒక్కో విధంగా ఉంటుంది. ‘‘అంతర్జాతీయంగా చూస్తే ప్రతీ మెడికల్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ ఎంతో కొంత స్వల్ప ఫీజును వసూలు చేస్తున్నాయి. తమ కార్యకలాపాలు నిర్విరామంగా కొనసాగేందుకే ఇలా చేస్తున్నాయి. టెక్నాలజీ సదుపాయాలు, సిబ్బంది, నిధుల సమీకరణ, ముందస్తు విచారణలకు సంబంధించి వ్యయాలు అవుతాయి. మేము నిలదొక్కుకున్నప్పుడే మా లక్ష్యాన్ని (ఫండ్ రైజింగ్) సాధించగలం’’ అని పీయూష్ జైన్ తెలిపారు. ఈ ప్లాట్ఫామ్లలో కొన్ని ప్రీమియం సేవలను కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇంపాక్ట్ గురూ అయితే 0 శాతం, 5 శాతం, 8 శాతం ఇలా మూడ్ స్కీమ్ల కింద ఈ సేవలను ఆఫర్ చేస్తోంది. మోసాలుంటాయ్.. జాగ్రత్త అవగాహన, జాగ్రత్తలు లేకపోతే ఆన్లైన్ మోసాల బారిన పడే రిస్క్ ఉంటుంది. క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా విరాళాలు కోరినా లేక విరాళం ఇచ్చినా సరే.. ఆ తర్వాత ఫోన్ కాల్ లేదా వాట్సాప్ మెస్సేజ్ లేదా మెయిల్ రావచ్చు. కష్టంలో ఉన్న బాధితులకు సంబంధించి అందులో సాయం కోరొచ్చు. లేదంటే అప్పటికే విరాళం ఇచ్చిన కేసుకు సంబంధించి అప్డేట్ అంటూ మోసగాళ్లు మెయిల్ పంపించొచ్చు. ఒక్కసారి విరాళం ఇస్తే, ఆ తర్వాత నుంచి క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లు ఇతర బాధితులకు సంబంధించిన వివరాలను మెయిల్స్, వాట్సాప్ మెస్సేజ్లు, కాల్స్ రూపంలో మార్కెటింగ్ చేస్తుంటాయి. ఇదంతా ఇబ్బందికరంగా అనిపించొచ్చు. చాలా మంది సాయం చేయాలని భావిస్తుంటారని, బాధితుల వివరాలను వారు మెయిల్ లేదా వాట్సాప్ సందేశాలు, కాల్స్ రూపంలో తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని జైన్ తెలిపారు. ఇవి వద్దనుకునే వారు అన్సబ్స్క్రయిబ్ చేసుకోవాలని సూచించారు. క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లు అన్నీ కూడా సురక్షిత చెల్లింపుల సాధనాలనే వినియోగిస్తున్నాయి. కానీ, వీటి పేరుతో సైబర్ నేరస్థులు ఆకర్షించే కథనాలు, మోసపూరిత పేమెంట్ లింక్లు పంపించి, బ్యాంక్ ఖాతాలో బ్యాలన్స్ మొత్తాన్ని ఊడ్చేసే ప్రమాదం లేకపోలేదు. అందుకే విరాళం ఇచ్చే ముందు సంబంధిత సంస్థల యూఆర్ఎల్ను జాగ్రత్తగా గమనించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
వడ్డీ రేట్లు పెరిగితే ఇళ్ల కొనుగోలుపై ప్రభావం
న్యూఢిల్లీ: వడ్డీ రేట్లు ప్రస్తుత స్థాయి నుంచి మరింత పెరిగి 9.5 శాతం దాటితే తమ ఇళ్ల కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం పడుతుందని, మెజారిటీ ఔత్సాహిక కొనుగోలుదారులు అభిప్రాయపడుతున్నారు. ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ ఇండియా నిర్వహించిన ‘కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే’తో పలు ఆసక్తికర అంశాలు తెలిశాయి. ఈ వివరాలను అనరాక్ ఓ నివేదిక రూపంలో విడుదల చేసింది. మెజారిటీ ప్రజలు మధ్యస్థ, ప్రీమియం ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కువ మంది మూడు పడకల ఇళ్లకు తమ ప్రాధాన్యం అని చెప్పారు. అధిక ద్రవ్యోల్బణంతో 66 శాతం మంది (సర్వేలో పాల్గొన్న) ఖర్చు చేసే ఆదాయంపై ప్రభావం పడినట్టు తెలిపారు. వడ్డీ రేటు 9.5 శాతం దాటితే అది తమ కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావిం చేస్తుందని సర్వేలో పాల్గొన్న వారిలో 98 శాతం మంది చెప్పారు. ప్రస్తుతం సగటు గృహ రేటు 9.15 శాతంగా ఉంది. 59 శాతం మంది రూ.45 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య బడ్జెట్ పరిధిలోని ఫ్లాట్ల కోసం చూస్తున్నట్టు చెప్పారు. రూ.45 - 90 లక్షల మధ్య ఇళ్ల కొనుగోలుకు 35 శాతం మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ఇంటి కోసం 24 శాతం మంది చూస్తున్నారు. 48 శాతం మంది 3బీహెచ్కే ఇళ్లకు, 39 శాతం మంది 2బీహెచ్కే ఇళ్ల పట్ల ఆసక్తిగా ఉన్నారు. 2022 మొదటి ఆరు నెలలతో పోలిస్తే ఈ ఏడాది అదే కాలంలో 3బీహెచ్కే ఇళ్లకు అనుకూలంగా ఉన్న వారు 41 శాతం నుంచి 48 శాతానికి పెరిగారు. రూ.40 లక్షల్లోపు ఇళ్లకు డిమాండ్ తగ్గుతోంది. 2020 మొదటి ఆరు నెలల్లో ఈ తరహా కొనుగోలు దారులు 40 శాతంగా ఉంటే, 2021 అర్ధ భాగంలో 28 శాతానికి, 2023 మొదటి ఆరు నెలల్లో 25 శాతానికి తగ్గారు. -
ఆ ఉద్యోగాలకు ముప్పే.. ఐబీఎం సీఈవో కీలక వ్యాఖ్యలు
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్తో కొన్ని రకాల ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని ఐబీఎం ఛైర్మన్, సీఈవో అరవింద్ కృష్ణ (Arvind Krishna) అన్నారు. చాట్జీపీటీ (ChatGPT), గూగుల్ బార్డ్ (Google Bard) వంటి జెనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ఉత్పాదకతను పెంచగలవని, అయితే "బ్యాక్ ఆఫీస్, వైట్ కాలర్" ఉద్యోగాలపై వాటి ప్రభావం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలలో జనాభా పెరుగుదల క్షీణతను ప్రస్తావించారు. ఏఐ టెక్నాలజీలు మానవులకు నాణ్యమైన జీవనాన్ని అందించడంతో తోడ్పడగలవని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టిఫీషియల్ సానుకూలతను ఉపయోగించుకోవడానికి ఐబీఎం కూడా ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలోనే ఐబీఎం ఇటీవల వాట్సన్ఎక్స్ను అనే జనరేటివ్ ఏఐ ప్లాట్ఫామ్ సూట్ను పరిచయం చేసింది. సాంకేతికతను సురక్షితంగా ఉపయోగించుకోవడంలో కంపెనీలకు సహాయం చేయడానికి దీన్ని రూపొందించారు. ఇంతకు ముందు మేనెలలో జరిగిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలోనూ ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తమ కంపెనీలో 30 శాతం ఉద్యోగాలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఆటోమేషన్ టెక్నాలజీతో భర్తీ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఫలితంగా, వచ్చే ఐదేళ్లలో కంపెనీ 7,800 ఉద్యోగాలను తొలగిస్తుందని అంతా ఆందోళన చెందారు. తర్వాత తన వ్యాఖ్యలపై మరింత స్పష్టతనిస్తూ, కొత్త టెక్నాలజీ ఆఫీసు పనిని భర్తీ చేస్తుందని, ఐబీఎంలో కూడా ఇదే జరుగుతుందని పేర్కొన్నారు. -
కాలుపై కాలు వేసుకుని దర్జాగా కూర్చొన్నారో..ప్రమాదంలో పడినట్లే!
'పుష్ప'.. సినిమాలో అల్లు అర్జున్ డైలాగు మాదిరిగా ఈ కాలు నాదే ఆ కాలు నాదే అంటూ కాలుపై కాలు వేసుకని దర్జాగా కూర్చోన్నారు అంతే సంగతి. ఇలా కూర్చొంటే చాల దుష్ప్రభావాలు ఎదుర్కొనక తప్పదంటున్నారు నిపుణులు. అధ్యయనాల్లో ఎన్నో సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. జాగ్రత్తగా ఉండకపోతే రానురాను పరిస్థితి కష్టమైపోతుందని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు కాలు మీద కాలు వేసి కూర్చొవడం వల్ల నష్టాలు, లాభాలు రెండు ఉన్నాయని వెల్లడించారు. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం మనం మూడు రకాలుగా కూర్చొంటారని చెబుతున్నారు. 62 శాతం మంది తమ కాళ్లను కుడివైపు క్రాస్ చేస్తుండగా, 26 శాతం మంది ఎడమవైపుకి, ఇక 12 శాతం మంది ఎటువీలైతే అటు క్రాస్ చేస్తుంటారని అధ్యయనాల్లో పేర్కొన్నారు. అలాగే క్రాస్ చేసి కూర్చొవడంలో కూడా రెండు రకాలుగా కూర్చొంటారని అంటున్నారు వైద్యులు ఒకటి, రెండు మోకాళ్లను ఒకదానిపై ఒకటి క్రాస్ చేయడం, రెండు, చీలమండలం క్రాస్ చేసి కూర్చొవడం. కాలుమీద కాలు వేసి కూర్చొవడం వల్ల..? 👉హిప్స్ అమరికలో తేడాలు వస్తాయి రెండింటిని పోలిస్తే ఒకటి పెద్దగా అవుతుంది. అంతేకాదు కాలు మోకాలు, హిప్ , పాదాలు వంటి కింద భాగాలకు సరఫరా అయ్యే రక్త ప్రసరణలో తేడా వస్తుంది. 👉నిజానికి చీల మండలం దగ్గర క్రాస్ చేసుకుని కూర్చోవడం కంటే మోకాలిపై మోకాలు క్రాస చేసి కూర్చొవడమే అత్యంత ప్రమాదకరం అని అధ్యయనాలు చెబుతున్నాయి. 👉ఇలా కాళ్లు క్రాస్ చేసి కూర్చోవడం వల్ల సిరల్లో రక్తప్రవాహం తగ్గి రక్తపోటు అధికమవుతుంది. శరీరంపై ఏర్పడే దుష్ప్రభావమెంత అంటే..? 👉కాలు మీద కాలు వేసుకుని సుదీర్ఘకాలం పాటు కూర్చొంటే ..కండరాల పొడవు, పెలివిక్ బోన్స్ అమరికలో దీర్ఘకాలిక మార్పులు వస్తాయి. 👉శరీరం ముందుకు వంగిపోయే గుణం భుజాలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది. 👉అలాగే మెడ ఎముకల్లో మార్పు రావడం వల్ల తలభాగం అమరికలో కూడా మార్పులు వస్తుంటాయి. దీని వల్ల మెడ కూడా ప్రభావితమవుతుంది. ఎందుకంటే?.. ఇలా కూర్చొన్నప్పుడూ శరీరంలో ఒకవైపు.. మరోవైపుతో పోలిస్తే బలహీనంగా మారుతుంది. 👉ఇక పొత్త కడుపు కండరాల్లో మెన్నుముక కింద భాగంలో కూడా ఇదేరకమైన మార్పులు రావచ్చు. ఒకవేళ పిరుదులు, కండరాలపైనే ఎక్కువ సమయం పాటు భార పడటం వల్ల పొత్తి కడుపు కూడా తన సర్దుబాటు లక్షణాలను కోల్పోయి బలహీనంగా మారి గూని వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా మన శరీరంలో భాగాలు అసాధారణమైన ఆకారంలోకి మారే ప్రమాదం కూడా ఉంది. క్రాస్ లెగ్స్ వల్ల ఫైబులర్ నరాలుగా పిలిచే పెరోనియల నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ వ్యాధికి గురైన వ్యక్తి తన కాలి వేళ్లను ముందు భాగాన్ని సొంతంగా కదిలించలేడు. ఐతే ఇది చాలా కేసుల్లో చాలా స్వల్పకాలికమే. కొన్ని నిమిషాల తర్వాత ఇవి మళ్లీ సాధారణస్థితికి వచ్చేస్తాయి. 👉వీర్య కణాల ఉత్పత్తిపై కూడా ప్రభావం చూపుతుందని పరిశోధనల్లో రుజువైంది సాధారణంగా శరీర ఉష్ణోగ్రతల కన్నా టెస్టికల్స్ ఉష్ణోగ్రత 2 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉండాలి. ఇలా కూర్చొవడం వల్ల వీటి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియల్ పెరుగుతాయి. పైగా క్రాస్ లెగ్ స్థితిలో కూర్చొన్నప్పుడూ.. ఉస్ణోగ్రతలు 3.5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది. టెస్టికల్స్లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వీర్యకణాల ఉత్పత్తి నాణ్యత తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇక మహిళలు, పురుషుల్లో శరీర నిర్మాణానికి సంబంధించి చాలా మార్పులు ఉంటాయి. పురుషులతో పోలిస్తే మహిళలే తేలికగా కాలుపై కాలు వేసుకుని కూర్చొగలుగుతారు. అందువల్లే వారికే ఈ ప్రమాదం ఎక్కువ అని పరిశోధనలు పేర్కొన్నాయి. క్రాస్ లెగ్స్ వల్ల ప్రయోజనాలు.. ఒక కాలు పొడువు ఉన్నవారు ఇలా కూర్చొవడం వల్ల పొత్తికడుపులో ఇరువైపు లో పొడవు సర్దుబాటు అయ్యి అమరికలు మెరుగయ్యాని 2016లో ఒక అధ్యయనంలో గుర్తించింది క్రాస్ లెగ్ వల్ల కండరాల పనిభారం తగ్గుతుంది. ముఖ్యమైన కండరాలు ఉపశమంనం పొంది అతిశ్రమ భారం నుంచి విముక్తి పొందవచ్చు. చివరిగా మనం కూర్చొనే విధానం సౌకర్యంవంతంగా ఉండటం తోపాటు ఆరోగ్యవంతంగా ఉండటం చాలా ముఖ్యం. సాధ్యమైనంత వరకు కాలు మీద కాలు వేసుకుని కూర్చొకపోవడమే మంచిది. కాలుమీద కాలు వేసుకుని కూర్చొవడం వల్ల పైన చెప్పినవే గాక ఇంకా ఇతరత్ర సమస్యలకు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని వల్ల ఊబకాయం, కదలకుండా ఒకేచోట కూర్చొనే జీవన విధానాన్ని అలవడుతుందని పరిశోధనలు పేర్కొన్నాయి. అందువల్ల చాలాసేపు ఒకేవిధానం కూర్చొకూడదు. కనీసం మధ్యమధ్యలో లేవడం తోపాటు కొద్ది దూరం నడవాలి. (చదవండి: అత్యంత వృద్ధుడికి.. లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్) -
ద్రవ్యోల్బణంపై రుతుపవనాల ప్రభావం
ముంబై: భారత్లో రుతువవనాలు ఆలస్యం అవ్వడం రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేస్తుందని జర్మనీకి చెందని డాయిష్ బ్యాంక్ అంచనా వేసింది. మే నెల ద్రవ్యోల్బణం డేటా శాంతించినట్టు అధికారిక గణాంకాలు చూపించినా కానీ, ఈ విషయంలో సంతృప్తి చెందడానికి లేదని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (202324)లో సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 5.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఇది ఆర్బీఐ అంచనా 5.1 శాతానికి దగ్గరగానే ఉంది. విశ్లేషకులు అయితే 5 శాతంగా ఉండొచ్చని భావిస్తున్నారు. ‘‘రుతుపవన వర్షాలు ప్రస్తుతం సాధారణ స్థాయికి 53 శాతం తక్కువగా ఉన్నాయి. వర్షపాతం బలహీనంగా ఉన్నప్పుడు ఆహారం ధరలు పెరిగిపోతాయని చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. అందుకని, భారత్కు సంబంధించి ద్రవ్యోల్బణం రిస్క్ల విషయంలో ఇప్పటి వరకైతే సంతృప్తికి అవకాశం లేదు’’అని డాయిష్ బ్యాంక్ తెలిపింది. జూలై, ఆగస్ట్లో ఆహార ధరలు పెరగకుండా, అదృష్టం తోడయితేనే రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతం, అంతకంటే తక్కువలో ఉండొచ్చని పేర్కొంది. వర్షాకాలంలో జూలై నెల కీలకమని, సాధారణంగా ఆహార ధరలు ఈ నెలలోనే ఎక్కువగా పెరుగుతాయని వివరించింది. చివరిగా 2009, 2014 సంవత్సరాల్లో వర్షాలు తక్కువగా ఉన్న సందర్భాల్లో జూలైలోనే ధరలు అధికంగా పెరిగినట్టు గుర్తు చేసింది. ఇప్పటి వరకు నైరుతి రుతుపవన సీజన్లో 53 శాతం వర్షపాతం తక్కువగా ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించడం గమనార్హం. కూరగాయాల్లో ఎక్కువగా డిమాండ్ ఉండే ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, టమాటోల ధరలు రానున్న నెలల్లో గణనీయంగా పెరగొచ్చని డాయిష్ బ్యాంక్ అంచనా వేసింది. 2023లో ఎల్నినో రిస్క్ ఉన్నందున వర్షాలు ఆలస్యంగా రావడం ద్రవ్యోల్బణం పరంగా ఆందోళన కలిగించే అంశమని అభిప్రాయపడింది. వృద్ధిపైనా ప్రభావం రుతుపవనాలు బలహీనంగా ఉంటే అది దేశ జీడీపీ వృద్ధిపైనా ప్రభావం చూపించొచ్చని డాయిష్ బ్యాంక్ తెలిపింది. వర్షాలు నిరాశపరిచి, వ్యవసాయ వృద్ధి 2004, 2009, 2014 కరువు సంవత్సాల్లో మాదిరే 1 శాతం స్థాయిలో ఉంటే, జీడీపీ వృద్ధి 0.30 శాతం తగ్గిపోవచ్చని అంచనా వేసింది. -
'AI' ఎఫెక్ట్ ఉద్యోగాలు ఉఫ్...
-
2000వేల నోట్ల రద్దు మార్కెట్ పై ప్రభావం
-
ఎకానమీపై ప్రభావం.. చాలా స్వల్పం
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థపై రూ. 2,000 నోట్ల ఉపసంహరణ ప్రభావం ‘‘చాలా చాలా స్వల్పం’’గానే ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. చలామణీలో ఉన్న కరెన్సీలో వీటి వాటా 10.8 శాతమేనని (విలువపరంగా రూ. 3.6 లక్షల కోట్లు) వెల్లడించారు. కరెన్సీ నిర్వహణ కార్యకలాపాల్లో భాగంగానే ఉపసంహరణ ప్రక్రియను చేపట్టినట్లు సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇంతకు ముందు 2013–14లో కూడా ఈ తరహా ప్రక్రియ నిర్వహించినట్లు, అప్పట్లో 2005కు పూర్వం ముద్రించిన నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించినట్లు ఆయన వివరించారు. స్వచ్ఛ నోట్ల విధానంలో భాగంగానే తాజాగా రూ. 2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు చెప్పారు. ‘‘చలామణీలో ఉన్న కరెన్సీలో రూ. 2,000 నోట్ల వాటా కేవలం 10.8 శాతమే కాబట్టి ఎకానమీపై దీని ప్రభావం చాలా చాలా తక్కువగానే ఉంటుంది. పైగా ఈ నోట్లను లావాదేవీల్లో ఎక్కువగా ఉపయోగించడం లేదని మా పరిశీలనలో తేలింది. కాబట్టి ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావమేమీ ఉండదు’’ అని ఆయన వివరించారు. ప్రస్తుతానికి రూ. 2,000 నోట్ల చెల్లుబాటు యథాప్రకారంగానే కొనసాగుతుందన్న దాస్.. డిపాజిట్ చేసేందుకు, మార్చుకునేందుకు నిర్దేశించిన సెప్టెంబర్ 30 తర్వాత కూడా చెల్లుబాటవడంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దానిపై అప్పుడు తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. 10 నోట్లను మాత్రమే మార్చుకునేందుకు అవకాశం కల్పించడం వెనుక హేతుబద్ధతపై స్పందిస్తూ 2014 జనవరిలో కూడా దాదాపు ఇదే విధానం పాటించినట్లు దాస్ చెప్పారు. ఇక రూ. 1,000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టడంపై బదులిస్తూ.. అది ఊహాజనిత ప్రశ్న అని, ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనేదీ లేదని స్పష్టం చేశారు. పుష్కలంగా నిధులు.. ద్రవ్య నిర్వహణపై ఉపసంహరణ ప్రభావాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజల నుంచి నిధులకు ఉండే డిమాండ్ను బట్టి ఇది ఉంటుందన్నారు. ‘‘కొంత మొత్తం బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ అవుతుంది. మరికొంత మొత్తాన్ని మార్చుకుంటారు. మార్చుకున్న కరెన్సీ అంతా తిరిగి ప్రజల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఖాతాల్లో డిపాజిట్ అయిన మొత్తాలను మాత్రం కస్టమర్లు బ్యాంకులోనే అట్టే పెట్టుకోవడమో లేదా తమ అవసరాల కోసం వెనక్కి తీసుకోవడమో జరగొచ్చు. ఏదైనా బ్యాంకింగ్ వ్యవస్థలో పుష్కలంగా నిధులు అందుబాటులో ఉన్నాయి’’ అని దాస్ చెప్పారు. ప్రస్తుత నిబంధనలే కొనసాగింపు... వ్యవస్థలోకి నల్లధనం వచ్చే అవకాశాలపై స్పందిస్తూ.. ఖాతాలో డిపాజిట్ చేయాలన్నా, నోట్లను మార్చుకోవాలన్నా ప్రస్తుతం నిర్దిష్ట ప్రక్రియ ఉందని దాస్ చెప్పారు. దాన్నే కొనసాగించాలని బ్యాంకులకు సూచించామని, అదనంగా కొత్త నిబంధనలేమీ పెట్టలేదని తెలిపారు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం రూ. 50,000 దాటి నగదు డిపాజిట్ చేస్తే పాన్ తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందన్నారు. ఇక ఈ కసరత్తుతో కరెన్సీ నిర్వహణ వ్యవస్థపై పడే ప్రభావాలకు సంబంధించిన ప్రశ్నలకు స్పందిస్తూ.. మన వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉందని శక్తికాంత దాస్ తెలిపారు. తోటి దేశాలతో పోలిస్తే డాలరుతో భారత కరెన్సీ మారకం ఒడిదుడుకులకు లోనవడం చాలా తక్కువేనని చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం, సంపన్న దేశాల్లో కొన్ని బ్యాంకుల మూసివేతతో అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో సంక్షోభాలు తలెత్తినప్పటికీ భారతీయ కరెన్సీ స్థిరంగా నిల్చుందని దాస్ తెలిపారు. అప్పుడేం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేను ప్రస్తుతం రూ. 2,000 నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటవడం కొనసాగుతుందని దాస్ చెప్పారు. ఎన్ని నోట్లు తిరిగి వస్తాయో వేచిచూడాల్సి ఉంటుందన్నారు. ‘‘ఇప్పటికైతే చాలా మటుకు నోట్లు తిరిగి వచ్చేస్తాయనే అనుకుంటున్నాం. ఎన్ని వస్తాయన్నది చూడాలి. సెప్టెంబర్ 30 (మార్చుకునేందుకు, డిపాజిట్ చేసేందుకు ఆఖరు తేది) దగ్గరయ్యే కొద్దీ తగిన నిర్ణయాలు తీసుకుంటాం. దాని గురించి ఇప్పుడే నేను ఊహాజనిత సమాధానాలు ఇవ్వలేను’’ అని దాస్ వ్యాఖ్యానించారు. నోట్ల మార్పిడికి, బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేసేందుకు బోలెడంత సమయం ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. విదేశీ పర్యటనల్లో ఉన్న వారు, వర్క్ వీసాలతో విదేశాల్లో ఉన్న వారు ఎదుర్కొనే సమస్యలను కూడా తాము పరిగణనలోకి తీసుకున్నామని, ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ కలుగకుండా ఈ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడటమే తమ ప్రధాన ఉద్దేశమని దాస్ వివరించారు. నీరు, నీడ కల్పించండి.. రూ. 2,000 నోట్లను మార్చుకునేందుకు లేదా డిపాజిట్ చేసేందుకు వచ్చే కస్టమర్లకు తగు సౌకర్యాలు కల్పించాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. వేసవిని దృష్టిలో పెట్టుకుని ఎండలో పడిగాపులు కాసే పరిస్థితి రాకుండా తగు నీడ, తాగడానికి నీరు వంటి సదుపాయాలు అందించాలని పేర్కొంది. నోట్ల మార్పిడి, డిపాజిట్ల డేటాను రోజువారీ రికార్డులను నిర్వహించాలని ఒక నోటిఫికేషన్లో సూచించింది. 2016లో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు నోట్లను మార్చుకునేందుకు చాంతాడంత లైన్లలో నిలబడి పలువురు మరణించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆర్బీఐ సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పీఎస్బీ చీఫ్లతో భేటీ.. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) చైర్మన్లు, డైరెక్టర్లతో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం సమావేశమయ్యారు. బ్యాంకుల్లో గవర్నెన్స్, నైతిక విలువలు తదితర అంశాలపై చర్చించారు. -
2027 నాటికీ డీజిల్ వాహనాలు నిషేధం
-
లెక్క ఎక్కువైనా పర్లేదు..మాకు కాస్ట్లీ ఇళ్లే కావాలి!
ముంబై: గృహ రుణాలపై వడ్డీ రేట్లు మరింత పెరిగితే అది తమ భవిష్యత్తు కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుందని 96 శాతం మంది కొనుగోలుదారులు (ఇల్లు కొనాలని అనుకుంటున్నట్టు) చెప్పారు. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్, సీఐఐతో కలసి దీనిపై ఓ సర్వే నిర్వహించింది. ‘ద హౌసింగ్ మార్కెట్ బూమ్’ పేరుతో నివేదిక విడుదల చేసింది. ఆర్బీఐ గతేడాది మే నుంచి ఇప్పటి వరకు రెపో రేటుని 2.5 శాతం మేర పెంచడం తెలిసిందే. ఇటీవలి ఏప్రిల్ సమీక్షలో మాత్రం రేట్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తటస్థ వైఖరిని ప్రదర్శించింది. ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారిలో 80 శాతం మంది తమకు ధరలు ముఖ్యమైన అంశమని చెప్పారు. ఒకవైపు నిర్మాణంలో వినియోగించే ముడి సరుకుల ధరలు పెరిగిన ఫలితంగా ప్రాపర్టీల ధరలకు సైతం రెక్కలు రావడం తెలిసిందే. దీనికి తోడు గృహ రుణాలపై రేట్లు 2.5 శాతం మేర పెరగడం భారాన్ని మరింత పెరిగేలా చేసింది. విశాలమైన ఇంటికే ప్రాధాన్యం.. ధరలు పెరిగినప్పటికీ వినియోగదారుల ప్రాధాన్యతల్లో పెద్ద మార్పు కనిపించలేదు. 42 శాతం మంది 3బీహెచ్కే ఇళ్లకే ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. 40 శాతం మంది 2బీహెచ్కే ఇళ్ల కొనుగోలుకు అనుకూలంగా ఉండగా, 12 శాతం మంది ఒక్క పడకగది ఇంటి కోసం చూస్తున్నారు. 6 శాతం మంది అయితే 3బీహెచ్కే కంటే పెద్ద ఇళ్లను సొంతం చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 58 శాతం మంది తాము రూ.45 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ధరలో ఇంటిని కొనుగోలు చేస్తామని చెప్పారు. ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేసుకునే ఇంటికే తాము ప్రాధాన్యం ఇస్తామని 36 శాతం మంది తెలిపారు. దేశ రాజధాని ప్రాంత పరిధిలో ఇల్లు కొనుగోలు చేయాలని చూస్తున్న వారిలో 45 శాతం మంది 3బీహెచ్కే తీసుకోవాలని అనుకుంటున్నారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో 42 శాతం మంది ఎంపిక 2బీహెచ్కేగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రాపర్టీ ధరలు చాలా ఎక్కువగా ఉండడం కొనుగోలు ప్రాధాన్యతల్లో మార్పునకు కారణమని తెలుస్తోంది. ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారిలో 52 శాతం మంది సొంత వినియోగానికేనని చెప్పారు. ప్రతికూల పరిస్థితుల ప్రభావం ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలో ఉండడం, అంతర్జాతీ య ఆర్థిక వ్యవస్థలో ఉన్న అనిశ్చితి ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశీయ హౌసింగ్ డిమాండ్పై ప్రభావం చూపిస్తున్నట్టు అనరాక్ చైర్మన్ అనుజ్పురి అన్నారు. మొత్తం మీద ఇళ్ల డిమాండ్లో రేట్ల పెంపు ఒక భాగమేనని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో పెద్దా, చిన్న కంపెనీల్లో ఉద్యోగాల కోతలు సైతం ఇళ్ల కొనుగోలు డిమాండ్పై ఎంతో కొంత ప్రభావం చూపిస్తాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు కోల్పోయిన వారు ఇంటి కొనుగోలును వాయిదా వేసుకోవచ్చన్నారు. 2024–25 నాటికి అన్ని సమస్యలు సమసిపోయి, హౌసింగ్ మార్కెట్ తిరిగి బలంగా పుంజు కుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
కొత్త పన్ను పొదుపునకు విఘాతమా? కేంద్ర రెవెన్యూ శాఖ ఏమన్నారంటే?
న్యూఢిల్లీ: నూతన పన్ను విధానానికి మళ్లడం అన్నది దేశ పొదుపు రేటునకు ఎంత మాత్రం ప్రమాదకరం కాబోదని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. పన్ను ఆదాకు సంబంధించిన పెట్టుబడి సాధనాల్లో గృహ పొదుపులు కేవలం రూ.4 లక్షల కోట్లుగానే ఉన్నాయని, మొత్తం పొదుపు నిధుల్లో (రూ.25 లక్షల కోట్లు) ఇవి 16 శాతమేనని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో కొత్త పన్ను విధానాన్ని ఆకర్షణీయంగా మార్చడం తెలిసిందే. కొత్త పన్ను విధానంలో రూ.7.5 లక్షల వరకు (రూ.50వేల స్టాండర్డ్ డిడక్షన్ సహా) ఎలాంటి పన్ను లేదు. ఆ తర్వాత కూడా తక్కువ పన్ను రేటు ప్రతిపాదించారు. కాకపోతే ఎలాంటి పన్ను మిహాయింపులు, తగ్గింపులు ఉండవు. దీనిపై వ్యక్తమవుతున్న ఆందోళనను తొలగించే ప్రయత్నాన్ని మల్హోత్రా చేశారు. ‘‘దేశ జీడీపీలో గృహ పొదుపు నిధులు నేడు 27–30 శాతంగా ఉన్నాయి. బడ్జెట్లో భాగంగా వృద్ధులు, మహిళలకు ప్రకటించిన పథకాలు దేశ పొదుపు రేటును పెంచుతాయి’’అని చెప్పారు. పాత పన్ను విధానంలో సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలు, సెక్షన్ 80డీ కింద 60 ఏళ్లలోపు వారికి హెల్త్ ఇన్సూరెన్స్ కోసం రూ.25,000, 60 ఏళ్లు నిండిన వారికి రూ.50,000, గృహ రుణంపై వడ్డీ చెల్లింపులు సహా ఎన్నో రకాల పన్ను ప్రయోజనాలు ఉండడం గమనార్హం. -
మోదీని ఎదుర్కొనే నేత కేజ్రీవాలా? రాహులా?
ఒక రాష్ట్రంలో మోదీ మేనియాతో ఊగిపోయే ప్రజలు, మరో రాష్ట్రంలో స్థానిక సమస్యలే ముఖ్యమని ఎలుగెత్తి చాటిన ఓటర్లు .. ఒకే రోజు రెండు రాష్ట్రాల్లో రెండు విభిన్నమైన తీర్పులు. ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్ని ఎలా ప్రభావితం చేస్తాయి ? ప్రధాని మోదీ బ్రాండ్ ఇమేజ్ చెక్కు చెదరకుండా ఉంటుందా ? మోదీని ఢీ కొట్టే నాయకుడు కేజ్రీవాలా ? రాహులా ? గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు చెబుతున్నదేంటి ? గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు సార్వత్రిక ఎన్నికలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయన్న చర్చ మొదలైంది. విపక్షాలను నిరీ్వర్యం చేసి అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని, హిందుత్వ–జాతీయవాదాన్ని జనంలోకి బాగా తీసుకువెళ్లాలని, ఉచితాలకు బదులుగా అభివృద్ధి బాట పడితేనే దేశానికి మేలు జరుగుతుందన్న బీజేపీ ఎజెండాకు గుజరాత్ ఫలితాలు ఆమోద ముద్ర వేశాయి. లోక్సభ ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములా పని చేస్తుందన్న ధీమాను నింపాయి. అదే సమయంలో స్థానిక సమస్యలపై గట్టి పోరాటం చేస్తే బీజేపీని, మోదీ బ్రాండ్ ఇమేజ్ను ఎదుర్కోవడం కష్టం కాదన్న ఆశ కూడా ప్రతిపక్ష పారీ్టల్లో చిగురించింది. బ్రాండ్ మోదీ ప్రభావం మోదీ ఇమేజ్ చెక్కు చెదరకపోయినప్పటికీ బలమైన స్థానికాంశాలుంటే రాష్ట్రాల్లో గెలుపుకు విపక్షాలకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఈ ఫలితాలు చెబుతున్నాయి. హిమాచల్లో పాత పెన్షన్ పునరుద్ధరిస్తామన్న ఒకే ఒక్క హామీ కాంగ్రెస్ని అధికార పీఠానికి చేర్చింది. సోలన్ ప్రాంతంలో మోదీ ర్యాలీలకు జనం పోటెత్తినా అక్కడి 5 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఒక్కటీ నెగ్గలేకపోయింది! కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హిందూత్వ, జాతీయవాదమే కీలకపాత్ర పోషించేలా కనిపిస్తున్నాయి. హిమాచల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఓట్ల శాతంలో తేడా ఒక్క శాతమే! ‘‘లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఢీ కొట్టడం సులభం కాదు. హిమాచల్లో మాదిరిగా స్థానికాంశాలు లోక్సభ ఎన్నికల్లో పని చేయవు’’ అని జేఎన్యూ పొలిటికల్ సైన్స్ ప్రొఫసర్ మణీంద్రనాథ్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. హిమాచల్ ఓటమితో ఇమేజ్కు వచి్చన ఢోకా ఏమీలేదన్నారు. కాంగ్రెస్ పక్కలో బల్లెం ఆప్ బీజేపీతో తలపడడానికి, హిందూత్వ ఎజెండాతో ఓటర్లను ఏకీకృతం చేస్తున్న కమలనాథుల కు చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్కు ఆప్ రూపంలో కొత్త శత్రువు ఎదురైంది. గుజరాత్లో ఆప్ ప్రధానంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకునే కొల్లగొట్టడంతో 17 స్థానాలకే పరిమితమవాల్సి వచి్చంది. కాంగ్రెస్ ఓట్లు 41% నుంచి 27శాతానికి పడిపోతే, ఆప్ 13% ఓట్లు సాధించిందంటే కాంగ్రెస్ ఓట్లకు గంటికొట్టినట్టయింది. ‘‘వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్కు అసలు సిసలు శత్రువు ఆప్ అంటే అతిశయోక్తి కాదు. విపక్షాల మధ్య ఓట్లు చీలిపోతుంటే బీజేపీ సేఫ్ గేమ్ ఆడుతోంది. ఆప్ను ఎదుర్కొనే బలమైన వ్యూహాన్ని కాంగ్రెస్ తక్షణమే రచించాలి.’’ అని ఎన్నికల విశ్లేషకుడు ఠాకూర్ హెచ్చరించారు. హిమాచల్ ప్రదేశ్పై ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దగా దృష్టి కేంద్రీకరించకపోవడం వల్ల కేవలం ఒక్క శాతం ఓట్లు మాత్రమే సాధించింది. అది కాంగ్రెస్కి కలిసొచ్చింది. అదే ఆప్ కూడా విస్తృతంగా ప్రచారం చేసి ఉంటే కాంగ్రెస్ పని అయిపోయి ఉండేదని ఆ పార్టీ మాజీ నాయకుడు సంజయ్ ఝా అన్నారు. అయితే హిమాచల్లో విజయం సాధించడం వల్ల కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు మూడుకి చేరడంతో పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని పెంచినట్టయింది. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సెమీ ఫైనల్స్ ఫలితాలే కీలకం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్కు ఉందా లేదా అనేది వచ్చే ఏడాది నాలుగు రాష్ట్రాల్లో జరిగే సెమీఫైనల్స్ వంటి ఎన్నికల ఫలితాలే కీలకం కానున్నాయి. కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగనున్నాయి. జాతీయ పార్టీ హోదా లభించిన ఉత్సాహంలో ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేయడానికి సిద్ధమవుతోంది. దీంతో కాంగ్రెస్ అటు బీజేపీ, ఇటు ఆప్ను సమర్థంగా ఎదుర్కోవాల్సి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నాలుగు రాష్ట్రాల ఫలితాలతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఎదుర్కొనే నాయకుడు కేజ్రివాలా? రాహులా? అన్నది తేలిపోతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధన.. బీసీసీఐ షాకింగ్ ట్విస్ట్!
బీసీసీఐ ఇటీవలే సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సాధారణంగా సబ్స్టిట్యూట్ అంటే ఫీల్డర్ గాయపడితే అతని స్థానంలో మైదానంలోకి వస్తాడు. కానీ అతనికి ఫీల్డింగ్ మినహా బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం ఉండదు. అయితే సబ్స్టిట్యూట్గా వచ్చే ఆటగాడికి బ్యాటింగ్, బౌలింగ్ చేసేలా బీసీసీఐ ''ఇంపాక్ట్ ప్లేయర్'' పేరిట కొత్త నిబంధన తీసుకొచ్చింది. దేశవాలీ టోర్నీలో హృతిక్ షోకీన్ తొలి ఇంపాక్ట్ ప్లేయర్గా చరిత్రకెక్కాడు. ఇక వచ్చే ఐపీఎల్ సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను తీసుకురానున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే నిబంధనల్లో కొన్ని మార్పులు చేసింది. ఈ రూల్ ప్రకారం.. ప్రతీ జట్టు మ్యాచ్ కు ముందు నలుగురు ప్లేయర్లను సబ్ స్టిట్యూట్స్ గా ప్రకటించాలి. 14 ఓవర్ల ఆట తర్వాత ఈ నలుగురిలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్ గా తుది జట్టులోకి తీసుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్పై చర్చ జరుగుతుండగానే బోర్డు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు షాకిచ్చింది. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కేవలం ఇండియన్ ప్లేయర్స్ కే వర్తింపజేయనున్నదట. లీగ్లో పాల్గొనే విదేశీ ఆటగాళ్లకు ఈ రూల్ వర్తించదని సమాచారం. ఈ రూల్ విదేశీ ప్లేయర్లకు వర్తించకపోవడానికి గల కారణాలను జట్లకు క్షుణ్ణంగా తెలిపినట్టు సమచారం. నిబంధనల ప్రకారం ఒక ఫ్రాంచైజీ మ్యాచ్ లో నలుగురు ఫారెన్ ప్లేయర్లను మాత్రమే ఆడించేందుకు అనుమతి ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్ కాన్సెప్ట్ ను అమలుచేస్తే అప్పుడు ఐదుగురు ఫారెన్ ప్లేయర్లను ఆడించినట్టు అవుతుంది. అది నిబంధనలకు విరుద్ధం. అందుకే ఈ రూల్ను కేవలం భారత క్రికెటర్లకే వర్తిస్తుందని బీసీసీఐ ఫ్రాంచైజీలకు వివరించే ప్రయత్నం చేసింది. ఒకవేళ ముగ్గురు విదేశీ ఆటగాళ్లను తీసుకుంటే అప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను వాడుకోవచ్చా..? అని ఫ్రాంచైజీలు ప్రశ్నించాయి. దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రస్తుతం సమాలోచనలు చేస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఇక త్వరలో జరుగనున్న ఐపీఎల్ వేలం అనంతరం ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది. చదవండి: Impact Player: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. కొత్త నిబంధన అమల్లోకి -
ఐపీఎల్ 2023లో కొత్త రూల్ ప్రవేశపెట్టనున్న బీసీసీఐ
ఐపీఎల్ 2023లో బీసీసీఐ కొత్త రూల్ ప్రవేశపెట్టనుంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అమలుచేయనుంది. ఇంపాక్ట్ ప్లేయర్ అంటే ఒక సబ్స్టిట్యూట్ లాగే అన్నమాట. అయితే ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ నిబంధనల్లో కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి. ఈ కొత్త రూల్ను వచ్చే సీజన్ నుంచి అమలు చేయనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఐపీఎల్లో పరిచయం చేస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కాస్త భిన్నంగా ఉంటుంది. రెండు ఇన్నింగ్స్లోనూ 14వ ఓవర్ ముగిసేలోపే ఈ ఇంపాక్ట్ ప్లేయర్ను బరిలోకి దించాల్సి ఉంటుంది. కెప్టెన్, హెడ్కోచ్, మేనేజర్ ఈ విషయాన్ని ఆన్ఫీల్డ్ అంపైర్లు, లేదా నాలుగో అంపైర్కు చెప్పాలి. ఒకవేళ గాయపడిన ప్లేయర్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ను తీసుకుంటే.. ఆ గాయపడిన ప్లేయర్ మళ్లీ ఫీల్డ్లోకి వచ్చే ఛాన్స్ ఉండదు. ఓ ఇంపాక్ట్ ప్లేయర్ను ఓవర్ ముగిసిన తర్వాతే తీసుకోవాల్సి ఉంటుంది. గాయపడిన సందర్భాల్లో అయితే ఇప్పుడున్న నిబంధనల ప్రకారమే ఇంపాక్ట్ ప్లేయర్ను ఆయా టీమ్స్ ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ బ్యాటింగ్ టీమ్ ఇంపాక్ట్ ప్లేయర్ను బరిలోకి దించాలని అనుకుంటే.. వికెట్ పడిన తర్వాత లేదంటే ఇన్నింగ్స్ బ్రేక్లో మాత్రమే చేయాలి. ముందుగానే ఈ విషయాన్ని నాలుగో అంపైర్కు చెప్పాలి. ఇంపాక్ట్ ప్లేయర్ అంటే ఏంటి? రూల్ ప్రకారం రెండు టీమ్స్ తమ తుది జట్టులోని ఓ ప్లేయర్ను మ్యాచ్ జరుగుతున్న సమయంలోనూ మరో ప్లేయర్తో భర్తీ చేయవచ్చు. ఇది కచ్చితం ఏమీ కాదు. ఒకవేళ వాళ్లకు అది ఉపయోగపడుతుందనుకుంటే ఈ ఆప్షన్ తీసుకోవచ్చు. ఇప్పటికే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ నిబంధనను బీసీసీఐ అమలు చేసింది. ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల హృతిక్ షోకీన్ తొలి ఇంపాక్ట్ ప్లేయర్గా నిలిచాడు. అతన్ని తీసుకున్న తర్వాత ఢిల్లీ టీమ్ 71 రన్స్తో ఆ మ్యాచ్ గెలిచింది. ఆ లెక్కన మ్యాచ్ల ఫలితాలను తారుమారు చేసే సత్తా ఇంపాక్ట్ ప్లేయర్కు ఉంటుంది. ఆస్ట్రేలియాలో జరిగే బిగ్బాష్ లీగ్లోనూ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ పేరుతో ఈ నిబంధన అమల్లో ఉంది. ఈ ప్లేయర్ను ముందుగానే 12 లేదా 13వ ప్లేయర్గా ప్రకటించాలి. ఫస్ట్ ఇన్నింగ్స్ 10వ ఓవర్ తర్వాత ఈ ప్లేయర్ను ఆయా టీమ్స్ తీసుకునే వీలుంటుంది. Time for a New season 😃 Time for a New rule 😎 How big an "impact" will the substitute player have this edition of the #TATAIPL 🤔 pic.twitter.com/19mNntUcUW — IndianPremierLeague (@IPL) December 2, 2022 చదవండి: షెల్డన్ జాక్సన్ వీరోచిత సెంచరీ.. విజయ్ హజారే ట్రోఫీ విజేత సౌరాష్ట్ర -
మెరుగ్గానే రిటైల్ రుణ వసూళ్లు
ముంబై:ఇటీవలి కాలంలో పెరిగిపోయిన వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం ప్రభావం సెక్యూరిటైజ్డ్ రిటైల్ రుణాల చెల్లింపులపై లేదని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. తాను రేటింగ్ ఇచ్చే సెక్యూరిటైజ్డ్ రుణాలకు సంబంధించి నెలవారీ వసూళ్ల రేషియో ఏ మాత్రం ప్రభావితం కాలేదని పేర్కొంది. రిటైల్ రుణ గ్రహీతలకు సంబంధించి చెల్లింపుల ట్రాక్ రికార్డు బలంగా ఉందని, ఆర్థిక కార్యకలాపాల్లో పురోగతి ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు వివరించింది. ఆర్బీఐ ఈ ఏడాది మే నుంచి మూడు విడతలుగా 1.4 శాతం మేర రెపో రేటను పెంచడం తెలిసిందే. దీంతో డిపాజిట్లు, రుణాలపై రేట్లు పెరిగేందుకు దారితీసింది. మార్ట్గేజ్ ఆధారిత సెక్యూరిటైజేషన్ రుణాల వసూళ్లు పుంజుకున్నట్టు వివరించింది. ఇక వాణిజ్య వాహన రుణాల వసూళ్లు ఈ ఏడాది ఏప్రిల్లో 105 శాతంగా ఉంటే, అవి జూన్ చివరికి 98 శాతానికి తగ్గినట్టు క్రిసిల్ తెలిపింది. చమురుపై పన్ను, సుంకాలు మోస్తరు స్థాయికి రావడంతో అది అంతమంగా వినియోగదారుడికి ఊరటనిచ్చినట్టు పేర్కొంది. ‘‘ద్విచక్ర వాహన రుణాల వసూళ్లు స్థిరంగా ఉన్నాయి. నెలవారీ కలెక్షన్ల రేషియో గత కొన్ని నెలలుగా 98–99 శాతంగా కొనసాగుతోంది. ఎంఎస్ఎంఈ రుణాల వసూళ్లు 97 శాతం నుంచి 95 శాతానికి తగ్గాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. -
పన్ను పోటు: భవిష్యత్తులో పసిడి ధర ఎంత పెరగనుంది?
సాక్షి, ముంబై: కేంద్ర ప్రభుత్వం బంగారంపై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 5 శాతం పెంచడంతో బంగారం ధరలు పెరగడం ఖాయమని మార్కెట్ వర్గాలు తేల్చి చెబుతున్నారు. ఇటీవలి కాలంలో బంగారం దిగుమతులు పెరగడం, పసిడి అక్రమ రవాణా నిరోధించే లక్ష్యం, అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి రికార్డు కనిష్టాలకు పడిపోతుండటం, కరెంట్ ఖాతాపై ఒత్తిడి లాంటి అంశాల నేపథ్యంలో ఆర్థికశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో బంగారం ధరలు కనీసం ఐదు శాతం పెరుగుతుందని అంచనాలు నెలకొన్నాయి. భారతదేశంలో బంగారంపై విధించే మొత్తం దిగుమతి సుంకం మూడు భాగాలను ఉంటుంది. బేస్ డ్యూటీ, వ్యవసాయ సెస్, సోషల్ సర్వీస్ సర్ఛార్జ్. వ్యవసాయ సెస్ 2.5 శాతం ఉండగా, సర్చార్జ్ రద్దయింది. అయితే దిగుమతి సుంకం పెంపుపై ఐబీజేఏ సురేంద్ర స్పందించారు. ఆయన అంచనా ప్రకారం భవిష్యత్తులో పసిడి 10 గ్రాములకు రూ. 2500 మేర పెరగనుంది. డాలర్తో రూపాయి పడి పోతున్న తీరు, బంగారం దిగుమతుల నేపథ్యంలో తాజా పెంపును ఊహించినప్పటికీ ప్రభుత్వం ఇంత త్వరగా ప్రకటిస్తుందని ఊహించ లేదన్నారు. మరోవైపు కేంద్రం బంగారంపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచిన మరుసటి రోజే పసిడి ప్రియులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఊహించినట్టుగానే దేశవ్యాప్తంగా శనివారం ఉదయం బంగారం ధరలు పుంజుకున్నాయి. -
స్టార్టప్లకు స్వర్గధామం.. టీఎస్ఐఆర్ఐఐ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో పురుడు పోసుకున్న పలు అంకుర పరిశ్రమలు ఇప్పుడు పల్లెబాట పట్టనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికవృద్ధి, ఉపాధి కల్పనకు బాటలు పరిచే అంకుర పరిశ్రమలకు ఆర్థిక చేయూతనందించేందుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (టీఎస్ఐఐసీ) అధిక ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ దిశానిర్దేశం మేరకు ఆయా స్టార్టప్లకు రూ.30 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేసే అవకాశాలున్నట్లు టీఎస్ఐఐసీ వర్గాలు తెలిపాయి. ఇందులో ప్రయోగాత్మకంగా చేపట్టే ప్రాజెక్టులకు సైతం సాయం అందుతుందని స్పష్టం చేశాయి. ఇందుకోసం తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్స్ ఫర్ రూరల్ ఇంపాక్ట్ ఇన్సెంటివ్స్ (టీఎస్ఐఆర్ఐఐ) పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపాయి. ► ఈ పథకం అమలుకు సంబంధించిన బాధ్యతలను తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ నిర్వర్తిస్తుందని పేర్కొన్నాయి. ఆర్థిక సాయం సూక్ష్మ, చిన్న, కుటీర, మధ్యతరహా పరిశ్రమలు, వీటికి సంబంధించిన సాంకేతికతను అభివృద్ధి చేసే స్టార్టప్ సంస్థలకు వర్తిస్తుందని తెలిపాయి. ఈ పథకానికి సంబంధించి హెచ్టీటీపీఎస్://టీమ్టీఎస్ఐసీ.తెలంగాణ.జీఓవీ.ఐఎన్/టీఎస్ఐఆర్ఐ–ఇన్సెంటివ్స్/ అనే సైట్ను సంప్రదించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న సంస్థలను టీఎస్ఐసీ ఏర్పాటు చేసిన గ్రాస్రూట్స్ అడ్వైజరీ కౌన్సిల్ మూల్యాంకనం చేస్తుందని.. ఆయా సాంకేతికత ద్వారా ఒనగూరే ప్రయోజనాలను విశ్లేషిస్తుందని టీఎస్ఐఐసీ వర్గాలు తెలిపాయి. నగరం నుంచి పల్లెలకు... ► నగరంలో అంకుర పరిశ్రమలకు స్వర్గధామంలా మారిన టీహబ్లో నూతనంగా వందలాది స్టార్టప్లు పురుడు పోసుకున్న విషయం విదితమే. వీటిలో ప్రధానంగా ఐటీ, అనుబంధ రంగాలు, సేవలు, బ్యాంకింగ్, హెల్త్కేర్, ఇన్సూరెన్స్ ఇతర సేవారంగ విభాగానివే అత్యధికంగా ఉన్నాయి. ఈ నూతన పథకంతో స్టార్టప్లు ఇప్పుడు నగరంలోనే పురుడు పోసుకున్నప్పటికీ.. పల్లెలకు తరలివెళ్లనున్నాయి. (క్లిక్: హెచ్ఎండీఏ ప్లానింగ్లో దళారుల దందా : ఆమ్యామ్యాలు లేకుంటే పెండింగే) ► గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా వ్యవసాయం, పాడి పరిశ్రమ, హార్టికల్చర్, చేనేత, ఇతర కుటీర పరిశ్రమలకు సాంకేతిక దన్ను అందించడం, వారి ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్ సదుపాయం కల్పించడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు స్టార్టప్లు రూపొందించే టెక్నాలజీ దోహదం చేయనుంది. ఈ సంస్థలు రూపొందించే ఉత్పత్తులు లేదా సాంకేతికత గ్రామీణుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ఈ పథకం ఉద్దేశమని నిపుణులు చెబుతుండడం విశేషం. -
టీఎస్ఆర్టీసీపై రష్యా- ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం
-
Union Budget 2022: వీరికి పండగే..! వారికి మాత్రం తీవ్ర నిరాశే..!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్-2022ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సారి బడ్జెట్ మూలధన వ్యయాన్ని 35. 4 శాతం మేర పెంచారు. వృద్ధి ప్రణాళికలకు మద్దతుగా ఆర్థిక వ్యవస్థ వార్షిక వ్యయం పరిమాణాన్ని రూ. 39.5 ట్రిలియన్కు (529 బిలియన్ డాలర్లు) పెంచాలని సీతారామన్ ప్రతిపాదించారు. ఇదిలా ఉండగా బడ్జెట్-2022 ప్రకటనలు పలు రంగాలకు బూస్ట్ను కల్పించగా..మిగతా వారికి నిరాశనే మిగిల్చింది. వీరికి పండగే..! ఈవీ బ్యాటరీ మేకర్స్ క్లీన్ ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీని ప్రోత్సహించడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్-2022లో ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొత్త స్వాపింగ్ విధానాలను ప్రవేశ పెడతామని తెలిపారు.ఈ నిర్ణయం దేశంలోని బ్యాటరీ తయారీదారులు లాభం పొందనున్నారు. రవాణా, మౌలిక సదుపాయాలు మూడు సంవత్సరాలలో రిమోట్ రోడ్లు, నగరాల్లో సామూహిక రవాణా, 400 కొత్త “వందే భారత్” రైళ్ల ప్రకటనతో ఎల్&టీ లిమిటెడ్, జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్, ఐఆర్బీ ఇన్ఫ్రా లిమిటెడ్, కంటైనర్తో సహా కీలకమైన మౌలిక సదుపాయాల సంస్థలకు ప్రయోజనం చేకూరనున్నాయి. వారితో పాటుగా కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆల్కార్గో లాజిస్టిక్స్ లిమిటెడ్, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లబ్ధి చేకూరనుంది. మెటల్ రంగం 38 మిలియన్ల ఇళ్లకు పైప్డ్ వాటర్ కోసం 600 బిలియన్ రూపాయల కేటాయింపులను ప్రభుత్వం ప్రకటించింది. దాంతో పాటుగా లాజిస్టిక్స్పై భారీగా ఖర్చు చేయడం వల్ల భారత్లోని లోహాల ఉత్పత్తిదారులైన వేదాంత లిమిటెడ్, టాటా స్టీల్ లిమిటెడ, జేఎస్డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్, జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్, పైప్మేకర్స్ జైన్ ఇరిగేషన్ లిమిటెడ్, కెఎస్బి ఇరిగేషన్ సిస్టమ్స్. ., కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. సోలార్ రంగం స్థానికంగా సోలార్ మాడ్యూళ్ల తయారీని పెంచడానికి 195 బిలియన్ రూపాయల విలువైన ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహకాలను బడ్జెట్-2022 ప్రస్తావించారు. దీంతో టాటా పవర్ లిమిటెడ్, సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్తో సహా ప్రముఖ ప్యానెల్ తయారీదారుల వృద్ధిపై దృష్టి సారించనున్నాయి. సిమెంట్, నిర్మాణ రంగం నగరాల్లోని తక్కువ-ఆదాయ కుటుంబాల కోసం మరిన్ని గృహాలను నిర్మించాలనే ప్రభుత్వ ప్రణాళికతో సిమెంట్, నిర్మాణ సంస్థలైన అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్, అంబుజా సిమెంట్స్ లిమిటెడ్, బిర్లా కార్పొరేషన్, ఏసీసీ లిమిటెడ్లకు మరిన్ని కాంట్రాక్ట్సు వచ్చే అవకాశం ఉంది. టెల్కోలు, డేటా సెంటర్లు 2022లో 5G స్పెక్ర్టమ్ వేలం ప్రారంభిస్తారనే నిర్ణయం టెల్కో రంగాన్నిమద్దతుగా నిలవనుంది.భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వోడాఫోన్ ఐడియా లిమిటెడ్, మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్, హెచ్ఎఫ్సిఎల్ లిమిటెడ్ వంటి కంపెనీలకు ప్రయోజనం చేకూరనుంది. డిఫెన్స్ పరికరాల తయారీదారులు వార్షిక బడ్జెట్లో సెక్టార్ క్యాపెక్స్లో 68 శాతం స్థానిక కంపెనీలకు కేటాయించాలనే సీతారామన్ ప్లాన్తో రక్షణ పరికరాలను తయారు చేసే కంపెనీలు భారీగా లాభపడే అవకాశం ఉంది. ఎల్&టీ లిమిటెడ్., భారత్ ఫోర్జ్ లిమిటెడ్, పారాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ గెయినర్స్గా ఉన్నాయి. డ్రోన్ స్టార్టప్లలో జ్యూస్ న్యూమెరిక్స్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ , బాట్ల్యాబ్ డైనమిక్స్కు ప్రయోజనాలు పొందనున్నాయి. వీరికి నిరాశే..! ప్రభుత్వ ఆధ్వర్యంలోని బ్యాంకులు డిజిటల్ కరెన్సీని ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోన్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. వర్చువల్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ల వైపు ప్రపంచ తరలింపునకు అనుగుణంగా దేశంలో సాంప్రదాయ బ్యాంకింగ్ నియమాలు మారే అవకాశం ఉంది. ఈ చర్యతో దేశంలోని ప్రాచీన రుణదాతలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్స్కు ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్రిప్టో కంపెనీలు క్రిప్టోకరెన్సీలు, నాన్-ఫంజిబుల్ టోకెన్లతో సహా డిజిటల్ అసెట్ లావాదేవీల నుంచి వచ్చే లాభాలపై 30 శాతం పన్ను విధించాలనే నిర్ణయంతో క్రిప్టో కంపెనీలకు తక్కువ లాభదాయకంగా మారే అవకాశం లేకపోలేదు. ఇది క్రిప్టో ఎక్స్ఛేంజీలను కూడా ప్రభావితం చేయనుంది. WazirX, Zebpay, CoinDCX, కాయిన్ స్విచ్ కుబెర్ వంటి క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ను భారీగా ప్రభావితం చేయనున్నాయి. కోల్, థర్మల్ పవర్ గ్రీన్ఎనర్జీ, సోలార్ పవర్ వైపు అడుగులు వేస్తున్న తరుణంలో ఈ రంగంలో భారీ ప్రోత్సాహకాలను అందిస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు. దీంతో కోల్ ఇండియా లిమిటెడ్. సింగరేణి కాలరీస్ కో., అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ లాంటి కోల్, థర్మల్ ఆధారిత కంపెనీలపై తీవ్ర ప్రభావాలను చూపే అవకాశం లేకపోలేదు. స్టెయిన్లెస్ స్టీల్ కంపెనీలు మెటల్ ధరల పెరుగుదల కారణంగా స్టెయిన్లెస్ స్టీల్, కోటెడ్ స్టీల్ ఫ్లాట్ ఉత్పత్తులు, అల్లాయ్ స్టీల్ బార్లు , హై-స్పీడ్ స్టీల్పై కొన్ని యాంటీ-డంపింగ్, కౌంటర్వైలింగ్ డ్యూటీలను ఉపసంహరించుకోవాలని కేంద్రం ప్రణాళికలను సిద్ధం చేసింది. దీంతో జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్, టాటా మెటాలిక్స్ లిమిటెడ్లపై ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఆటోమొబైల్ తయారీదారులు గ్లోబల్ సెమీకండక్టర్ కొరతతో ఆటోమొబైల్ కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయాయి. బడ్జెట్ ప్రకటన తర్వాత ఆటోమొబైల్ సెక్టార్లో నిరుత్సాహకరమైన వాతావరణం నెలకొంది. చదవండి: Union Budget 2022: పెరిగే..తగ్గే వస్తువుల జాబితా ఇదే..! -
కరోనా సెకండ్ వేవ్: ఆశ-నిరాశల ఎకానమీ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మొదటివేవ్ నుంచి 2020-21 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికాలూ కొంత కోలుకున్నాయని ఊరట చెందుతున్న నేపథ్యంలోనే సెకండ్ వేవ్ దేశంపై విరుచుకుపడింది. కరోనా కట్టడికి దేశ వ్యాప్త కఠిన లాక్డౌన్ నేపథ్యంలో 2020–21 తొలి జూన్ త్రైమాసికంలో ఎకానమీ 24.4 శాతం క్షీణతను నమోదు చేసుకుంది. తదుపరి జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో క్షీణత 7.3 శాతానికి పరిమితమైంది. అయితే మూడు, నాలుగు త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధి రేట్లు వరుసగా 0.5 శాతం, 1.6 శాతంగా నమోదయ్యాయి. ఇక మొత్తం 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ క్షీణ రేటు అంచనాకన్నా తక్కువగా మైనస్ 7.3 శాతానికి పరిమితమైంది. అయితే 2021-22 మొదటి త్రైమాసికం ప్రారంభంలోనే ఆర్థిక వ్యవస్థకు పెను సవాలు విసిరింది. సెకండ్ వేవ్ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలోనూ ఎకానమీ 12 శాతం క్షీణిస్తుందని బ్రోకరేజ్ సంస్థ-యూబీఎస్ అంచనాకూడా వేసింది. అయితే ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర భయాందోళనలకు గురిచేసిన మహమ్మారి కొత్త కేసులు స్థానికంగా రాష్ట్రాల్లో లాక్డౌన్ల వల్ల జూన్లో కొంత అదుపులోనికి వచ్చాయి. తిరిగి ఎకానమీ రికవరీపై ఆశలు ప్రారంభమయ్యాయి. జూన్లో ఆర్థిక పరిస్థితులు చూస్తే, మొత్తంగా ఆశ-నిరాశల మధ్య ఊగిసలాట ధోరణి కనిపిస్తోంది. ఆ వివరాలు చూస్తే.. నోమురా ఇండియా బిజినెస్ రిజమ్షన్ ఇండెక్స్: జూలై 4వ తేదీతో ముగిసిన వారంలో 91.3కు పెరిగింది. అంతక్రితం వారం జూన్ 27వ తేదీతో ముగిసిన వారంలో ఈ ఇండెక్స్ 86.3 వద్ద ఉంది. నిజానికి అంతక్రితం ఆరు వారాల నుంచీ ఈ ఇండెక్స్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. రవాణా, విద్యుత్ డిమాండ్, కార్మిక శక్తి భాగస్వామ్యం వంటివి సూచీ వెయిటేజ్లో ప్రధానమైనవి. ప్రస్తుతం సూచీ (91.3) మహమ్మారి ముందస్తు స్థాయికన్నా 8.7 శాతం తక్కువగా ఉంటే, సెకండ్వేవ్ ముందు స్థాయికన్నా 3.6 శాతం తక్కువగా ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్: జూన్ 28వ తేదీతో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో పోల్చిచూస్తే, 78.3 నుంచి 91.8కి ఎగసింది. వారంవారీ కూరగాయల సరఫరాలు, ప్రాంతాల వారీ రవాణా సంఘాల రెవెన్యూ వసూళ్లు పెరిగాయి. అయితే కార్మిక భాగస్వామ్యం రేటు ఇంకా తక్కువగానే ఉందని ఎస్బీఐ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్య క్రాంతి ఘోష్ తెలిపారు. విద్యుత్ డిమాండ్: సాయంత్రం కీలక రద్దీ సమయంలో విద్యుత్ డిమాండ్ విషయానికి వస్తే, 2021 మేలో 11.2 శాతం క్షీణత నమోదుచేసుకుంటే, జూన్లో 8.3 శాతం పురోగమించింది. ఎకానమీ తిరిగి క్రియాశీలం అవుతోందనడానికి ఇది సంకేతంగా కనబడుతోంది. సేవలు, తయారీ రంగాలు: అయితే సేవల రంగం మాత్రం ఇంకా తీవ్ర పేలవంగా ఉంది. జూన్లో ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ మరింత క్షీణించి 41.2కు పడిపోయింది. మేలో సూచీ 46.4 వద్ద ఉంది. కాగా సేవలు-తయారీ రంగాలు కలిపిన కాంపోజిట్ పీఎంఐ అవుట్పుట్ ఇండెక్స్ మేలో 48.1 వద్ద ఉంటే, జూన్లో 43.1 దగ్గరకు పడింది. ఒక్క తయారీ రంగ కార్యకలాపాలను సూచించే ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా తయారీ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) కూడా జూన్లో క్షీణతలోకి జారి 48.1 పాయింట్లకు పడిపోయింది. మేలో ఈ సూచీ 50.80 వద్ద ఉంది. వస్తు రవాణా: జూన్లో వస్తు రవాణా పెరిగిందని ఈ-వే బిల్లులు సూచిస్తున్నాయి. జూన్ 27తో అందిన గణాంకాలను చూస్తే, ఈ– వే బిల్లుల పరిమాణం 4.75 కోట్లు. అంతక్రితం ఇదే తేదీతో ముగిసిన నెల్లో ఈ మొత్తం రూ.4 కోట్లే. అయితే 2021 మార్చితో పోల్చితే మాత్రం ఇంకా ఈ పరిమాణం తక్కువగానే ఉంది. ప్రధాన రూట్లలో మేలో 6 నుంచి 8 శాతం పడిపోయిన ట్రక్ రెంటల్స్ తాజా సమీక్షా నెల్లో 13 నుంచి 15 శాతం పెరిగినట్లు ఇండియన్ ఫౌండేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ గణాంకాలు తెలిపాయి. అయితే అధిక ట్రక్ రెంటల్స్ పెరుగుదల్లో డీజిల్ ధర పెరుగుదల పాత్రా ఉందన్న విశ్లేషణ ఉంది. ఎగుమతులు: జూన్లో ఎగుమతుల విలువ 32.46 బిలియన్ డాలర్లు. మేలో 32.27 బిలియన్ డాలర్లు. ఇదే కాలంలో దిగుమతులు 38.55 బిలియన్ డాలర్ల నుంచి 41.86 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ఉపాధి: ప్రభుత్వ ప్రధాన ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద డిమాండ్ ఏడాది స్థాయికి ఎగసింది. సమీక్షా నెలల్లో పనుల్లో పాల్గొన్న వారి సంఖ్య 1.7 కోట్ల నుంచి 1.9 కోట్లకు పెరిగింది. సీఎంఐఈ అంచనాల ప్రకారం, నిరుద్యోగం రేటు 2021 మేలో 11.9 శాతం ఉంటే, జూన్లో ఈ రేటు 9.1 శాతానికి తగ్గింది. కాగా కార్మిక భాగస్వామ్యం రేటు జూన్లో సగటున 40 శాతంగా ఉంది. ఏప్రిల్, మేలకు ఇది దాదాపు సమానం. అయితే కోవిడ్ ముందస్తు కాలంలో ఈ సగటు 42.7 శాతంగా ఉండేది. స్టాక్ మార్కెట్: ఫైనాన్షియల్ వెల్త్ విషయానికి వస్తే, స్టాక్ మార్కెట్ బంపర్ ర్యాలీతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లోనే ఇన్వెస్టర్లు రూ.25.46 లక్షల కోట్ల సంపదను సొంతం చేసుకున్నారు. బీఎస్ఈ చరిత్రలో మే 24న మొదటిసారిగా లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 3 లక్షల కోట్ల డాలర్ల(రూ.218 లక్షల కోట్లు)కు చేరింది. అలాగే జూన్ 15న రూ.232 లక్షల కోట్లకు చేరుకుని మార్కెట్ క్యాప్ విషయంలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఇదే 3 నెలల్లో సెన్సెక్స్ సూచీ 2,973 పాయింట్లు(6%) లాభపడంది. ఈ జూన్ 28వ తేదిన 53,127 వద్ద జీవితకాల గరిష్టాన్ని, జూన్ 25 తేదీన 52,925 వద్ద ఆల్టైం హై ముగింపు స్థాయిని లిఖించింది. ఫారెక్స్: విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు జీవితకాల గరిష్టాలకు చేరాయి. జూన్ 25తో ముగిసిన వారంలో 608.999 బిలియన్ డాలర్లకు చేరినట్టు ఆబీఐ గణాంకాలు తెలియజేస్తున్నాయి. రూపాయిల్లో ఇది సుమారు రూ.45 లక్షల కోట్లకు పైనే. ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో రెండంకెల వృద్ధి వేగంగా విక్రయమయ్యే ఉత్పత్తుల (ఎఫ్ఎంసీజీ) కంపెనీలు లాక్డౌన్ల కాలంలోనూ మంచి వృద్ధిని చూపించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ మొదటి త్రైమాసికంలో రెండంకెల స్థాయిలో అధిక విక్రయాలను నమోదు చేశాయి. గోద్రేజ్ కన్జ్యూమర్, మారికో సంస్థలు మొదటి త్రైమాసికం పనితీరుకు సంబంధించి గణాంకాలను స్టాక్ ఎక్సేంజ్లకు తెలియజేశాయి. ‘‘2021–22 క్యూ1లో మా ఉత్పత్తులకు డిమాండ్ స్థిరంగానే ఉంది. రెండంకెల స్థాయిలో విక్రయాలు నమోదైనట్టు అంచనా వేస్తున్నాము’’అని గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ తెలిపింది. మారికో సైతం దేశీయ వ్యాపారం మొదటి త్రైమాసికంలో 30 శాతం వృద్ధి చెందినట్టు ఇప్పటికే ప్రకటించింది. క్యూ1లో అధిక వృద్ధిని అంచనా వేస్తున్నామని టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఎండీ, సీఈవో సునీల్ డిసౌజా సైతం ఇటీవలే ప్రకటించారు. ఏప్రిల్ నెలలో ఎఫ్ఎంసీజీ కంపెనీలు బలమైన విక్రయాలు నమోదు చేశాయని, అనంతరం కరోనా కేసులు గణనీయంగా పెరిగినప్పటికీ.. తిరిగి జూన్లో విక్రయాలు జోరుగా నమోదైనట్టు ఎడెల్వీజ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ ఆబ్నీష్రాయ్ పేర్కొన్నారు. -
ఐటీ జాబ్స్కు అదే జోష్!
సాక్షి, ముంబై: కోవిడ్-19 వైరస్తో దేశంలోని అన్ని పరిశ్రమలల్లో ఉద్యోగుల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంటే.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో మాత్రం జోష్ తగ్గలేదు. బెంగళూరు, పుణే వంటి నగరాల్లోని ఐటీ ఉద్యోగులకు ఆర్ధిక భరోసా అందిందని జాబ్ ఫ్లాట్ఫామ్ స్కైకీ మార్కెట్ నెట్వర్క్ తెలిపింది. నవంబర్ నెలలో ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్, సాఫ్ట్వేర్ డెవలపర్, టెస్టర్, కన్సల్టెంట్, డిజిటల్ మార్కెటింగ్ విభాగాల్లోని ఉద్యోగాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని పేర్కొంది. కరోనా వైరస్తో అన్ని వ్యాపారాలకు డిజిటల్లోకి మారుతుండటం, సాంకేతిక వినియోగం పెరగడం వంటివి ఐటీ రంగం, ఉద్యోగుల వృద్ధికి కారణమని తెలిపింది. 2020 నాటికి దేశీయ ఐటీ రంగంలో 43.6 లక్షల మంది ఉద్యోగులున్నారు. నవంబర్లో 50 శాతానికి పైగా కొత్త ఉద్యోగ నియామకాలు బెంగళూరు, పుణే, హైదరాబాద్, ఢిల్లీ నగరాల నుంచి వచ్చాయి. ఐటీ రంగంలో ఏటా రూ.25 లక్షల ఎక్కువ వేతనం పొందుతున్న నగరాల్లో బెంగళూరు, పుణేలున్నాయని స్కైకీ కో–ఫౌండర్ కరుంజిత్ కుమార్ ధీర్ తెలిపారు. -
గృహ అమ్మకాలపై కరోనా దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావం దేశీయ నివాస విభాగం మీద గట్టిగానే పడింది. ఈ ఏడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాలైన ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), పుణే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతాలో గృహాల అమ్మకాలు, ప్రారంభాలు రెండింట్లోనూ క్షీణత నమోదైంది. ఈ ఏడాది ఇళ్ల విక్రయాలు 47 శాతం క్షీణించి 1.38 లక్షలకు చేరాయి. అలాగే కొత్త గృహాల ప్రారంభాలు 46 శాతం క్షీణించి 1.28 లక్షలకు చేరాయి. 2019లో అమ్మకాలు 2.61 లక్షల యూనిట్లు కాగా.. ప్రారంభాలు 2.37 లక్షలుగా ఉన్నాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. 2019లో అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) 6,48,400 కాగా.. 2020 నాటికి 2 శాతం తగ్గి 6,38,020 యూనిట్లకు చేరాయి. కోవిడ్-19 వైరస్ ఊహిం చని విపత్కర సంవత్సరంగా నిలిచిందని అనరాక్ చైర్మన్ అనూజ్ పురీ చెప్పారు. డిస్కౌంట్లు, ఆఫర్లు, గృహరుణ వడ్డీ రేట్ల తగ్గింపు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో స్టాంప్ డ్యూటీ తగ్గింపు వంటివి గృహాల అమ్మకాల్లో కాసింత సానుకూలత నెలకొందని.. గత రెండు త్రైమాసికాల్లో పరిస్థితుల్లో కాసింత సానుకూల వాతావరణం కనిపిస్తుందని పేర్కొన్నారు. (జీఎంఆర్కు ‘ఫిలిప్పీన్స్’ షాక్!) హైదరాబాద్లో... హైదరాబాద్లో గతేడాది 16,590 గృహాలు అమ్ముడుపోగా.. ఈ ఏడాది 48 శాతం క్షీణించి 8,560 గృహాలకు పడిపోయాయి. దేశంలోని ఇతర మెట్రో నగరాలన్నీ కొత్త గృహాల ప్రారంభంలో క్షీణత నమోదైతే ఒక్క హైదరాబాద్లోనే వృద్ధి నమోదయింది. గతేడాది నగరంలో కొత్తగా 14,840 ఇళ్లు ప్రారంభం కాగా.. ఈ ఏడాది 42 శాతం వృద్ధితో 21,110 యూనిట్లకు పెరిగాయి. నగరాల వారీగా అమ్మకాలు... ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో అత్యధిక అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది ఇక్కడ 44,320 గృహాలు విక్రయమయ్యాయి. గతేడాది ఎంఎంఆర్లో 80,870 యూనిట్లు (45 శాతం క్షీణత) అమ్ముడుపోయాయి. బెంగళూరులో గతేడాది 50,450 గృహాలు కాగా.. ఇప్పుడవి 51 శాతం తగ్గి 24,910 యూనిట్లకు చేరాయి. పుణేలో 40,790 నుంచి 23,460 (51 శాతం), ఢిల్లీ–ఎన్సీఆర్లో 46,920 నుంచి 23,210 (42 శాతం), చెన్నైలో 11,820 నుంచి 6,740 (43 శాతం), కోల్కతాలో 13,930 నుంచి 7,150 (49 శాతం) తగ్గాయి. ఇతర నగరాల్లో లాంచింగ్స్.. గతేడాది ఢిల్లీ-ఎన్సీఆర్లో కొత్తగా 35,280 గృహాలు ప్రారంభం కాగా.. 2020 నాటికి 47 శాతం క్షీణించి 18,530లకు చేరాయి. ఎంఎంఆర్లో 77,990ల నుంచి 30,290లకు (61 శాతం), బెంగళూరులో 39,930 నుంచి 21,420లకు (46 శాతం), పుణేలో 46,110 నుంచి 23,920లకు (48 శాతం), చెన్నైలో 13,000 నుంచి 9,170లకు (29 శాతం), కోల్కతాలో 9,420 నుంచి 63 శాతం తగ్గి 3,530లకు తగ్గాయి. స్టాంప్ డ్యూటీ తగ్గిస్తేనే... న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావంతో దేశంలో తగ్గిన గృహాల అమ్మకాలు తిరిగి పుంజుకోవాలంటే స్టాంప్ డ్యూటీ తగ్గించడమే ప్రత్యామ్నాయమని నరెడ్కో ప్రెసిడెంట్ నిరంజన్ హిర్నందానీ సూచించారు. మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని తగ్గించడంతో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో కోవిడ్ సమయంలోనూ రికార్డ్ స్థాయిలో విక్రయాలు జరిగాయని ఉదహరించారు. ఇతర రాష్ట్రాలు కూడా స్టాంప్ డ్యూటీని తగ్గించాలని.. ఆయా రాష్ట్ర నరెడ్కో చాప్టర్లు ఈ అంశాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కేంద్రం అద్దె గృహాలను ప్రోత్సహించాలని, గృహ రుణ వడ్డీని తగ్గించడంతో పాటు ఇన్వెంటరీ గృహాల మీద పన్నును మినహాయించాలని కోరారు. అఫర్డబుల్ అండ్ మిడ్–సైజ్ హౌసింగ్ (ఎస్డబ్ల్యూఏఎంఐహెచ్) కోసం ప్రత్యేకంగా రూ.25 వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేయాలని పేర్కొ న్నారు. ఇలాంటి ఫండ్సే సుమారు నాలుగైదు కావాలని.. బ్యాంక్లు, ఆర్థిక సంస్థలతో కలిసి ప్రభుత్వం రూ.1,25,000 కోట్ల నిధిని ఏర్పాటు చేయాలని కోరారు. -
రజనీ పొలిటికల్ ఎంట్రీ: ఆ పార్టీల్లో ప్రకంపనలు
సాక్షి, చెన్నై: ఇదిగో అదుగో అంటూ వచ్చిన నటుడు రజనీకాంత్ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించడం రాష్ట్రంలోని అన్ని పార్టీల్లో ప్రకంపనలకు కారణమైంది. రజనీ పార్టీ వల్ల తమ పార్టీకి లాభనష్టాలను బేరీజు వేసుకోవడంలో ప్రధాన పార్టీలన్నీ తలమునకలై ఉన్నాయి. బీజేపీతో ఇప్పటికే కూటమి ఖరారు చేసుకున్న అన్నాడీఎంకే, కమలనాథుల ద్వారా రజనీతో సఖ్యత పెంచుకోవాలని ప్రయత్నించే అవకాశం ఉంది. ఇందుకు రజనీ అంగీకరిస్తారా అనేది సందేహమే. ఎడపాడి పళనిస్వామికి రాబోయే ఎన్నికల్లో రజనీ నుంచి సవాళ్లు ఎదురుకావచ్చు. విజయకాంత్ 2006లో పార్టీ పెట్టి ఒంటరిగా పోటీకి దిగినపుడు కేవలం ఒక్క సీటు (విజయకాంత్) మాత్రమే గెలుచుకున్నా 8.5 శాతం ఓట్లను చీల్చడం ద్వారా వంద నియోజకవర్గాల్లో అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపారు. వచ్చే ఎన్నికల్లో రజనీ వల్ల అదే పరిస్థితి ఎదురైతే అన్నాడీఎంకే, డీఎంకేల్లో ఎవరికి నష్టం అనే అంశంపై భిన్నాభిప్రాయలున్నాయి. రెండురోజుల క్రితం వరకు అధికారం ఖాయమని ధీమావ్యక్తం చేసిన డీఎంకే శ్రేణులు రజనీ ప్రకటన తరువాత డీలాపడిపోయారు. డీఎంకే రజనీని ఎదుర్కొనేందుకు సరికొత్త వ్యూహాలు రచించాల్సి ఉంది. రజనీ పార్టీ పెట్టడం సందేహమని ప్రచారం జరుగుతున్న తరుణంలో తమ పార్టీ గెలుపునకు ఆయన మద్దతు కోరుతానని కమల్ తెలిపారు. చదవండి: (రాజకీయాల్లోకి రజనీ) అయితే పార్టీ స్థాపిస్తున్నట్లు రజనీ ప్రకటించిన తరువాత కమల్ స్పందించలేదు. రజనీది ఒంటరి పోరా, కూటమా అనేది స్పష్టం అయ్యేందుకు మరికొంత సమయం పడుతుంది. ఒంటరిగా పోటీచేస్తే ఎన్నిసీట్లు దక్కుతాయనేది ప్రశ్నార్థకమని ఇటీవల రజనీ జరిపించిన సర్వేలో స్పష్టం కావడంతో కూటమికే ఆయన మొగ్గుచూపుతారని అంచనా వేస్తున్నారు. కమల్హాసన్ పార్టీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగితే కనీసం 20 శాతం ఓట్లు ఖచ్చితంగా చీలుస్తారని తెలుస్తోంది. ఈ పరిణామం అన్నాడీఎంకే, డీఎంకేలకు నష్టం. రజనీ పార్టీతో మక్కల్ నీది మయ్యం, డీఎండీకే కూటమిగా ఏర్పడవచ్చని కొందరు అంచనావేస్తున్నారు. రజనీ ప్రవేశం ఏపార్టీని ప్రధానంగా బాధిస్తుందో తెలియాలంటే ఫిబ్రవరి, మార్చి వరకు వేచిచూడాల్సిందే. చదవండి: (భయపెడుతున్న బురేవి) పార్టీ రిజిస్ట్రేషన్కు సన్నాహాలు కొత్తపార్టీ స్థాపనకు అవసరమైన సన్నాహాలు ప్రారంభించామని రజనీకాంత్ స్థాపించబోయే పార్టీకి ప్రధాన సమన్వయకర్తగా నియమితులైన అర్జున్మూర్తి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆధ్యాత్మిక భావాలతో కూడిన నిజాయితీ రాజకీయాలను నడుపుతారు. పార్టీ రిజిస్ట్రేషన్ పనులు 28 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. రజనీ చిత్రం పూర్తయిన తరువాతనే పార్టీని రిజిస్ట్రే్టషన్ చేస్తామన్నారు. బీజేపీకి గురువారం ఉదయమే ఆయన రాజీనామా చేశారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీకి జనాకర్షణ నేతలు లేరు. ఈ పరిస్థితుల్లో రజనీ మాత్రమే ప్రజల మన్ననలు పొందగలిగిన నేతగా తెరపైకి వచ్చారు. కరోనా ఆంక్షల కారణంగా అన్ని పార్టీలూ ఎన్నికల ప్రచారాలకు సామాజిక మాధ్యమాలపై ఆధారపడక తప్పదు. బూత్ కమిటీల వరకు రజనీ పార్టీ ఇప్పటికే బలమైన శక్తిగా నిలిచి ఉంది. పార్టీ ప్రకటనలో రజనీ ఆలస్యం చేశారనడం సరికాదు, సరైన సమయంలోనే నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. చదవండి: (విధ్వంసంతో రిజర్వేషన్లు సాధ్యమేనా?) -
60 దాటిన వారిలో ఆందోళన!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ ఉధృతి పెరుగుతున్న కొద్దీ 60 ఏళ్లు పైబడిన వారిలో భయాలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. రోజురోజుకూ పాజిటివ్ కేసుల వృద్ధితో తామెక్కడ ఆ వైరస్ బారిన పడతామోనన్న ఆదుర్దాతో మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న వారూ ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన నాటి నుంచి 60 ఏళ్లు పైబడిన వాళ్లు, పదేళ్ల లోపు పిల్లలు దీని బారిన ప్రమాదం ఎక్కువగా ఉన్నం దున, బయటకు రావొద్దంటూ ప్రభుత్వాలు, డాక్టర్ల నుంచి వెలువడిన హెచ్చరికలు కూడా వీరిలో భయాలు మరింత పెరిగాయి. మొదట సుదీర్ఘ లాక్డౌన్ విధింపు, ఆ తర్వాతా కోవిడ్ తీవ్రత పెరుగుతున్న సందర్భంలోనూ పెద్దలు, అందులోనూ బీపీ, షుగర్, ఇతర అనారోగ్య సమస్యలున్న వారు 4 నెలలకు పైగా ఇళ్లకే పరిమితం కావడంతో ఆందోళన మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇతర విషయాలపై సైకియాట్రిస్ట్లు ఎమ్మెస్రెడ్డి, నిశాంత్ వేమన, సైకాలజిస్ట్ సి.వీరేందర్ సాక్షి ఇంటర్వూ్యలో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యాం శాలు.. వారి మాటల్లోనే.. ఆందోళనలొద్దు.. ప్రశాంతంగా ఉండండి: సైకియాట్రిస్ట్ ఎమ్మెస్ రెడ్డి మరో 6 నెలలు పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇప్పుడున్నట్టుగానే పెద్ద వయసు వారంతా మరికొంత కాలం గడపాల్సి ఉంటుంది. ఒకవేళ భార్యాభర్తలిద్దరే ఉంటుంటే అన్యోన్యం గా, ఉల్లాసంగా కాలం గడపండి. జాయింట్ ఫ్యామిలీలో ఉంటే కొడుకులు, కోడళ్లతో సఖ్యతగా ఉంటూ మనవలు, మనవరాళ్లతో ఎక్కువ సమయం గడపండి. పెద్దవాళ్లంతా ఇళ్లలోనే ఉంటున్నా రు కాబట్టి వారికి కరోనా దాదాపు సోకదు. బాల్కనీలో లేదా ఇళ్లలోనే కనీసం అరగంట పాటు నడక తప్పని సరి. దీనివల్ల రక్తప్రసారం పెరిగి ఆరోగ్యానికి మంచి చేయడంతో పాటు, మనసును ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచుతుంది. ప్రాణాయామం, ఇతర బ్రీథింగ్ ఎక్సర్సైజులతో లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. షుగర్, బీపీ వంటి వాటిని కంట్రోల్లో ఉంచుకోండి. పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, ఆప్తులతో ఫోన్లో ముచ్చట్లు వంటి వాటితో గడపండి. టీవీల్లో కోవిడ్ సంబంధ వార్తలు ఎక్కువసేపు చూడొద్దు. యువతరం అవగాహన కల్పించాలి: సైకాలజిస్ట్ సి.వీరేందర్ ఆందోళన కలిగించే వార్తలు, బయటి పరిస్థితులు 60 ఏళ్లు పైబడిన వారిపై ప్రభావం చూపుతున్నాయి. కోవిడ్ గురించి అవగాహన ఉన్న కొంత వయసు పైబడిన వారి లో తమకు ఈ వ్యాధి సోకుతుందేమోనన్న భయాలు పెరుగుతున్నాయి. ఇక దీని గురిం చి తెలియని వారు, నిరక్షరాస్యులు తమకేమీ కాదని మా స్కులు, శానిటైజర్లు ఉపయోగించేందుకూ విముఖత చూపుతున్నారు. అందువల్ల ఇళ్లలోని యువతరం.. ఈ రెండు వర్గాల వారికి అవగాహన కల్పించాలి. ఇప్పుడు ఏర్పడిన క్లిష్ట పరిస్థితులను అంగీకరించి వాటిని ఎదుర్కొనేందుకు అంతా సిద్ధం కావాలి. శారీరకంగా, మానసికంగా శక్తి సామర్థ్యాలను పెంచుకోవడం, ఏదైనా వస్తే వైద్యపరంగా చికిత్స తీసుకోవడం, కుటుంబ, సామాజికపరంగా చేదోడువాదోడుగా నిలవడం వంటి చర్యల ద్వారా ప్రస్తుతం ఎదురయ్యే సమస్యలను సులభంగా అధిగమించొచ్చునని అందరూ గ్రహించాలి. పెద్దల్లో ఆ లక్షణాలుంటే లేట్ చేయొద్దు: సైకియాట్రిస్ట్ నిశాంత్ వేమన పెద్ద వయసు వారిలో ముఖ్యంగా వివిధ అనారోగ్య సమస్యలున్న వారు దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న లక్షణాలు స్వల్పంగా కనిపించినా ఆందోళన చెందుతున్నారు. ఈ ఆరోగ్య సమస్యలపై ఆసుపత్రులకు వెళ్లేందుకూ భయపడుతున్నారు. ఆస్పత్రికి వెళితే ఎక్కడ తమకు కరోనా వైరస్ అంటుకుంటుందో నని తమ డాక్టర్లను కూడా సంప్రదించేందుకు కొంద రు వెనుకాడుతున్నారు. అంతకుముందు జబ్బులు న్నా, పెద్ద వయసు వారైనా కోవిడ్ నుంచి అధిక శాతం కోలుకుంటున్నందున అనవసర ఆందోళనలకు గురికావొద్దు. ఆశావహ దృక్పథంతో ఉంటూ, బ్రీథింగ్, రెస్పిరేటరీ ఎక్సర్సైజులు చేస్తూ, ఆప్తులు, ఇష్టమైన వారితో తరచుగా ఫోన్లో మాట్లాడుతూ అహ్లాదంగా ఉంటే ఏ సమస్యలూ రావు. ఏమాత్రం లక్షణాలు బయటపడినా వెంటనే ఇంట్లో వాళ్లకు చెప్పాలి. తగిన చికిత్స తీసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేతప్ప కరోనా గురించి భయపడి, ఆలస్యం చేయొద్దు. -
కరోనా... గుండెపై ప్రభావం!
కరోనా వైరస్ ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుందని అందరికీ తెలిసిందే. ఇటీవల మనం చూస్తున్న కొత్త పరిణామం ఏమిటంటే... కరోనాతో బాధపడుతున్న కొందరు అకస్మాత్తుగా గుండెపోటు/గుండెజబ్బుతో కన్నుమూస్తున్నారు. ఇలాంటివారిలో కొంతమంది యువకులూ ఉన్నారు. ఇలా వారు మరణించడం ఎంతో విషాదకరం. ఇటువంటి వార్తలు అందరిలో ఆందోళననూ పెంచడం సహజం. ఈ నేపథ్యంలో కరోనా వైరస్తో వచ్చే కోవిడ్–19... కొందరు రోగుల్లో గుండెను ఎలా ప్రభావితం చేస్తోంది, ఎందుకలా జరుగుతోంది, దాన్ని నివారించడం ఎలా... లాంటి విషయాలపై అవగాహన కోసమే ఈ కథనం. గుండెను ఎలా ప్రభావితం చేస్తుందంటే... కరోనా వైరస్ దేహంలోకి ప్రవేశించడానికి కారణం మన శరీరంలో ఉండే ఏసీఈ–2 రిసెప్టార్స్. దేహంలో ఉన్నట్లే మన గుండెపై కూడా ఈ రిసెప్టార్స్ ఉంటాయి. దీని ద్వారానే కరోనా వైరస్ కొందరిలో గుండె కండరంలోకి ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించాక అది గుండె కండరాన్ని బలహీన పరిచి ఆ తర్వాత దెబ్బతీస్తుంది. ఇలా జరిగినప్పుడు... అదివరకే గుండెజబ్బులు ఉన్నవారు... లేదా గతంలో గుండెపోటు వచ్చి ఉన్నవారి పరిస్థితి మరింత విషమించేందుకు అవకాశాలు ఎక్కువ. ఈ విషమించడం అన్నది... హార్ట్ఎటాక్ రూపంలో కనిపించవచ్చు; హార్ట్ ఫెయిల్యూర్కూ దారితీయవచ్చు; లేదా మరికొందరిలో గుండె స్పందనల తాలూకు లయ (హార్ట్ రిథమ్) దెబ్బతినవచ్చు. అంటే గుండెస్పందనలు వేగవంతమైనా కావచ్చు. లేదా చాలా స్లో అయిపోవడం... కాసేపు వేగం, కాసేపు నెమ్మది... ఇలా ఒక నియతి లేకుండా (ఇర్రెగ్యులర్గా) కొట్టుకుంటుండవచ్చు. గుండెపోటును మిమిక్రీ చేసే కరోనా వైరస్... గుండెసమస్యలను తెలుసుకోడానికి చేసే తొలి పరీక్ష ఈసీజీ. కరోనా కారణంగా గుండె ప్రభావితమైన వారికి ‘ఈసీజీ’ తీస్తే... కొందరిలో ‘గుండెజబ్బు’ను సూచించేలా ఈసీజీలో కనిపించవచ్చు. ఇలా అది గుండెపోటును మిమిక్ చేస్తుందన్నమాట. అప్పుడు మనం ఆ తర్వాతి పరీక్ష అయిన ‘యాంజియోగ్రామ్’ నిర్వహించి చూస్తే... దాంట్లో మాత్రం గుండెపోటు వచ్చిన దాఖలాలేవీ కనిపించవు. అంతమాత్రాన సంతోషించలేము. ఎందుకంటే... కరోనా వైరస్ గుండెకు సోకి కోవిడ్–19 వచ్చిన వారిలో గుండె కండరానికి ఇన్ఫెక్షన్, కండరంలో వాపు, నొప్పి, మంట (ఇన్ఫ్లమేషన్) రావడం వల్ల అది హార్ట్ఫెయిల్యూర్కు దారితీయవచ్చు. కొంతమందిలో రక్తపోటు (బీపీ) బాగా తగ్గిపోయి, రోగి షాక్కు గురై చనిపోయే ప్రమాదమూ ఉంటుంది. ఒక్కోసారి కంప్లీట్ హార్ట్బ్లాక్ అని చెప్పే కండిషన్ కూడా కనిపించవచ్చు. అందుకే కోవిడ్–19 కొందరు ఆకస్మికంగా చనిపోవడానికి ఇక్కడ పేర్కొన్న అంశాలే కారణం. అప్పటికే గుండెజబ్బు ఉన్నవారు అకస్మాత్తుగా చనిపోవడానికి అవకాశాలు ఎలాగూ ఎక్కువే. దాంతోపాటు గుండెజబ్బులేమీ లేనివారిలో కూడా 20 శాతం మందిలో ఇవే పరిణామాల కారణంగా మరణాలు సంభవిస్తున్నాయి. కొన్నిసార్లు మందులూ మరణానికి కారణాలే... హైడ్రాక్సీక్లోరోక్విన్తో పాటు అజిథ్రోమైసిన్ లాంటి యాంటీబయాటిక్ కలిపి తీసుకోవడం నివారణకు (ప్రొఫిలాక్టిక్గా) తోడ్పడుతుందని గతంలో మనం చదివిన విషయమే. వాటిని వాడిన వారిలో గుండె ప్రభావితమవుతుంది. దాంతో గుండె స్పందనలను సూచించే ‘క్యూ‘.. ‘టీ’ అనే తరంగాల తాలూకు ప్రకంపనల మధ్య వ్యవధి పెరగడం (క్యూ – టీ ఇంటర్వెల్ ప్రొలాంగ్ కావడం) జరగవచ్చు. ఇది రోగి మరణానికి కారణం కావచ్చు. ఇక చికిత్సలో భాగంగా రోగుల ప్రాణరక్షణ కోసం వాడే లోపినావిర్, రెటినావిర్ వంటి హెచ్ఐవీకి వాడే కొన్ని మందులను కూడా కొందరు కోవిడ్–19 రోగులకు వాడుతున్నారు. చాలా అరుదుగానే అయినా ఈ మందులు కొందరు రోగుల్లో ఆకస్మిక మరణానికి దారితీసే అవకాశం ఉంది. సమస్య తీవ్రతను తెలియనివ్వని ‘హ్యాపీ హైపాక్సియా’! సాధారణంగా కరోనా వ్యాధి వల్ల ఊపిరితిత్తులలో నీరు చేరడం వల్ల కొద్దిగా నడిచినా తీవ్రమైన ఆయాసం రావడం సహజం. ఆక్సిజన్ అందకపోవడం వల్ల కనిపించే ఈ లక్షణాన్ని హైపాక్సియా అంటారు. కానీ కరోనా వచ్చిన కొందరిలో లంగ్స్ సమస్య ఉన్నప్పటికీ చివరివరకూ ఆయాసం రాకపోవడం, దాంతో హాస్పిటల్కు వెళ్లకపోవడంతో జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది. ఈ కండిషన్నే ‘హ్యాపీ హైపాక్సియా’ అంటారు. హ్యాపీ హైపాక్సియాలో గుండె కండరానికీ, గుండెకూ జరగాల్సిన చేటు జరుగుతున్నప్పటికీ అది బయటికి తెలియకుండానే రోగి అకస్మాత్తుగా చనిపోయే అవకాశముంది. గుండెకు చేకూరే మరికొన్ని రకాల చేటు... కొందరిలో జన్యుపరంగానే లాంగ్ క్యూటీ సిండ్రోమ్, బ్రుగాడా సిండ్రోమ్ వంటి గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇక కొందరు రోగుల్లోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశం ఎక్కువ. కాళ్ల రక్తనాళాల్లోగానీ లేదా మరెక్కడైనా గాని... ఇలా గడ్డకట్టిన రక్తపు క్లాట్స్... గుండెకు చేరి, అక్కడ ఊపిరితిత్తులకు జరిగే రక్తసరఫరాకు అడ్డుపడ్డా కూడా అకస్మాత్తుగా మరణం సంభవించే అవకాశాలూ ఎక్కువే. ఇక ఇప్పటికే గుండెజబ్బులు లేదా గుండెకు సంబంధించిన ఇతర వ్యాధులు ఉన్నవారు కరోనాకు భయపడి హాస్పిటల్స్కు వెళ్లడం లేదు. దాంతో ఫాలో అప్స్ జరగకపోవడం, పూర్తిగా వ్యా«ధి ముదిరాక మాత్రమే హాస్పిటల్స్కు రావడంతో... వాళ్లకు అందాల్సిన చికిత్స త్వరితంగానూ, వేగంగానూ అందక కొన్ని మరణాలు సంభవిస్తున్నాయి. కోవిడ్–19 రోగుల్లో గుండె సమస్యల నివారణ/మేనేజ్మెంట్ ► రోగికి కోవిడ్–19 వచ్చాక... అది గుండెజబ్బులు ఉన్నవారైతే మరింత ఎక్కువగా మెడికల్ కేర్, మెడికల్ అటెన్షన్లో ఉండాలి. ► ఇలాంటి రోగులు తమకంటూ ఓ ఆక్సీమీటర్ తీసుకొని పెట్టుకోవాలి. తరచూ ఆక్సీమీటర్లో తమ రక్తంలోని ఆక్సిజన్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది వేలికి పెట్టుకుని చూసుకునే ఓ చిన్న ఉపకరణం. రోగి విశ్రాంతిగా ఉన్న సమయంలో చెక్ చేసుకొని, తమ రక్తంలో తగినంత ఆక్సిజన్ పాళ్లు తగినంతగా ఉన్నాయా అన్నది రోజుకోసారి చెక్ చేసుకోవాలి. విశ్రాంతిగా ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఓ ఆరు నిమిషాల పాటు నడిచాక కూడా ఓ సారి చెక్ చేసుకోవాలి. ఈ రెండు సందర్భాల్లోనూ రక్తంలో తగినంత మోతాదులో ఆక్సిజన్ ఉంటే ఇక చాలావరకు బెంగపడాల్సిన అవసరమే ఉండదు. ‘హ్యాపీ హైపాక్సియా’ వచ్చే అవకాశాలు ఉన్నందున తప్పనిసరిగా ఇలా రోజూ చెక్ చేసుకోవడం మంచిది. ► ఒకసారి ఈసీజీ తీయించుకోవాలి. ఏదైనా తేడా ఉంటే వెంటనే గుండెనిపుణుడికి చూపించుకోవాలి. ఎలాంటి తేడాలేకపోతే నిశ్చింతగా ఉండవచ్చు. ► కొన్ని ప్రమాదకరమైన మందులు వాడేటప్పుడు వాటి ప్రభావం గుండె మీద పడుతుందా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ► గుండెజబ్బులు ఉన్నవారు తమకు అవసరమైన మందులను ముందే తెచ్చి పెట్టుకోవాలి. సరైన మోతాదులను తెలుసుకుని వాటిని క్రమం తప్పకుండా వాడాలి. ► కరోనాకు భయపడి హాస్పిటల్కు వెళ్లకుండా ఉండే బదులు గుండెజబ్బులు ఉన్నవారు తమ గుండెవైద్య నిపుణిడికి తరచూ చూపించుకుంటూ ఫాలోఅప్లో ఉండటం అవసరం. ► రక్తానికి సంబంధించి సీబీపీ, ఎల్డీహెచ్,డీడైమర్, ఫెరిటిన్ అనే కొన్ని పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షలను చేయించుకోవడం ద్వారా ఏవైనా సమస్యలు అకస్మాత్తుగా వచ్చే అవకాశాలున్నాయా అన్న విషయం ముందే తెలుస్తుంది. ఉదాహరణకు డీడైమర్ ఫలితాల్లో అది ఎక్కువగా ఉన్నట్లయితే రక్తం గడ్డకట్టే అవకాశాలు ఎక్కువ అన్న విషయం తెలుస్తుంది. ఇలాంటి వాళ్లు... ఆ ఫలితాన్ని బట్టి రక్తాన్ని పలచబార్చే మందులను వాడాల్సి ఉంటుంది. అలాగే అయా ఫలితాలను బట్టి కొన్ని మందులను డాక్టర్లు సూచిస్తారు. ► కొద్దిపాటి ఆయాసం వచ్చేవారు ఓసారి ఓసారి ఛాతీ సీటీస్కాన్ తీయించుకుని ఉంచుకోవడం మంచిది. దాన్నిబట్టి డాక్టర్లు ఆకస్మికంగా వచ్చే ప్రమాదాలను పసిగట్టి, వాటిని నివారించే మార్గాలను సూచిస్తారు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా అవసమైనది ప్రశాంతత. మానసికంగా ప్రశాంతంగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడీ ఉండదు. గుండెకూడా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అతి లోపించడం వల్ల పెరిగే ఒత్తిడి అటు గుండెపైనా... ఇటు రోగనిరోధక శక్తిపైనా ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రశాంతంగా, ఆహ్లాదంగా, ఆనందంగా ఉండటం వల్ల అటు కరోనానూ, ఇటు గుండెజబ్బులనూ నివారించవచ్చు. జీవితాన్ని సంతోషంగానూ గడపవచ్చు. -
పంపుసెట్లు లేక.. సేద్యమెట్లా!
సాక్షి, హైదరాబాద్: వివిధ రంగాలను అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం వ్యవసాయరంగంపై కూడా పడింది. బోరుబావులపై ఆధారపడి సేద్యం చేసే రైతులను ఈ వైరస్ పరోక్షంగా కష్టాల్లోకి నెట్టింది. వానాకాలం సీజన్కు సిద్ధమవుతున్న రైతులోకం.. పంటల సాగుకు బోర్ల తవ్వకం, పంపుసెట్లు, పొలాలకు నీరు తరలించేందుకు పైప్లైన్ల విస్తరణ పనులు మొదలుపెట్టింది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా వ్యవసాయ పంపుసెట్లు, పీవీసీ పైపులు, బోరు మోటార్ పైపులతో పాటు ఇతర సామగ్రికి తీవ్ర కొరత ఏర్పడింది. స్థానికంగా తయారు చేసే పీవీసీ, జీఐ పైపుల పరిశ్రమల్లో పనిచేసే కూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవడంతో అక్కడ తయారీ నిలిచిపోయింది. గుజరాత్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి పంపుసెట్లు, ఇతర సామగ్రి దిగుమతి లేక రాష్ట్రంలో వీటి లభ్యత అరకొరగానే ఉంది. దీంతో ఉన్న స్టాకుకు అడ్డగోలుగా ధరలు పెంచేశారు. దీంతో చిన్న, సన్నకారు రైతులపై ఆర్థికంగా భారం పడింది. రాష్ట్రవ్యాప్తంగా 24 లక్షల పైచిలుకు వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లున్నా యి. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో బోరుబావులను నమ్ముకొని సేద్యం చేస్తున్న రైతులు ఇప్పుడు పంపుసెట్లు, పీవీసీ, జీఐ పైపుల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సామగ్రి విక్రయాలకు కేంద్రంగా చెప్పుకునే రాజధానిలోని రాణిగంజ్ మార్కెట్పై లాక్డౌన్ ప్రభా వం తీవ్రంగా పడింది. ఇక్కడి నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వ్యవసాయ పరికరాల సరఫరా జరుగుతుంది. అక్కడి డీలర్ల దగ్గర సరైన స్టాక్ లేకపోవడంతో సబ్ డీలర్లకు సరఫరా నిలిచిపోయింది. దొరకని పీవీసీ పైపులు.. పంట పొలానికి నీళ్లందించేందుకు గాను బోరు మోటారు నుంచి పైపులైన్లు వేయడానికి పీవీసీ పైపులు వాడతారు. సీజన్కు ముందుగానే రైతులు కావాల్సిన పైపులు, ఇతర సామగ్రి కొనుగోలు చేసి భూమిలో లైను వేస్తారు. ఈ సారి కరోనా వైరస్తో పీవీసీ పైపుల కంపెనీల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. రాష్ట్ర రాజధానికి చుట్టుపక్కల జిల్లాల్లో ప్రముఖ కంపెనీలకు చెందిన ఫ్యాక్టరీలున్నాయి. కార్మికులు లేకపోవడంతో పైపుల తయారీ ఆగిపోయింది. దీంతో సరఫరా లేక, పైపులు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు. అక్కడక్కడా ఉన్నా వ్యాపారులు, డీలర్లు ధరలు పెంచి అమ్ముతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు అధిక ధరలకు కొనాల్సి వస్తోంది. పంపుసెట్లకూ కొరత.. వ్యవసాయ బోర్లకు చెందిన పంపుసెట్లకు తీవ్ర కొరత ఏర్పడింది. ఇవి చాలా వరకు గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడులోని కోయంబత్తూర్లో తయారవుతాయి. ప్రముఖ కంపెనీలు అక్కడి నుంచే దేశంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తారు. ఆయా ప్రాంతాల్లో కరోనా తీవ్రత ఉండటంతో వాటిని రెడ్జోన్గా ప్రకటించారు. ఆంక్షల సడలింపులలో వ్యవసాయ పరికరాల కంపెనీలకు మినహాయింపున్నా.. రెడ్జోన్ కారణంగా ఆయా ప్రాంతాల్లో కంపెనీల్లో తయారీ, సరఫరా ఆగిపోయింది. కాగా తాను 15 రోజులుగా ప్రయత్నిస్తున్నా పంపు మోటార్లు దొరకడం లేదని కామారెడ్డి జిల్లా తిప్పాపూర్నకు చెందిన గొల్ల సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. పొలంలో కాలువలు తవ్వించినా పైపులు లేక అవస్థలు పడుతున్నామని వెల్లడించారు. మోటార్ పైపులదీ అదే పరిస్థితి! బోరులో మోటార్కు బిగించే జీఐ పైపులు కూడా లభ్యం కావడం లేదు. సాధారణంగా సీజన్లో డీలర్లు, వ్యాపారుల దగ్గర స్టాక్ ఉంచుతారు. లాక్డౌన్తో దుకాణాలు మూసి ఉన్నాయి. ఇప్పుడిప్పుడే తెరిచినా పైపుల తయారీ, సరఫరా లేకపోవడంతో వాటికి కొరత ఏర్పడింది. కొద్దిపాటి స్టాక్ ఉన్న వ్యాపారులు, డీలర్లు అడ్డగోలు ధరలకు విక్రయిస్తున్నారు. ఇటు జీఐ పైపులతో పాటు కప్లింగులు, గేట్ వాల్, టీ–వంకబెండ్లు కూడా మార్కెట్లో దొరకట్లేదు.. సరఫరా నిలిచిపోయింది.. మోటార్లు, పంపులు రావడం లేదు. పైనుంచి రాకపోవడంతో రైతులకు వీటిని సరఫరా చేయలేకపోతున్నాం. మోటారు, పంపులు తయారు చేసే పరిశ్రమలు కరోనా హాట్స్పాట్ ప్రాంతాల్లో ఉండటంతో ఉత్పత్తి నిలిచిపోయింది. ఇటు ఇతర రాష్ట్రాల నుంచి వీటి దిగుమతి ఆగిపోయింది. వ్యవసాయ పనులు మొదలు కావడం.. రైతులు పంపులు, మోటార్ల కోసం తిరుగుతుండటంతో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. – సందీప్, పంపుసెట్ల విక్రేత, నిర్మల్ -
చైనా అలా.. ప్రపంచమంతా ఇలా..
-
కరోనా ఎఫెక్ట్ : స్టాక్ మార్కెట్ డీలా
ముంబై : స్టాక్ మార్కెట్ను కరోనా వైరస్ కుదిపివేస్తోంది. భారత్లో కరోనా కేసులు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ చేసిన వ్యాఖ్యలతో బుధవారం స్టాక్మార్కెట్లు కుదేలయ్యాయి. ప్రారంభంలో లాభాలతో ఉత్తేజంగా ఉన్న మార్కెట్ ఆపై కరోనా కేసులు పెరిగాయన్న వార్తలతో డీలా పడింది. సెషన్ చివరిలో పుంజుకున్నా చివరికి నష్టాలతో ముగిసింది. ఐటీ, ఫార్మా మినహా మిగిలిన రంగాల షేర్లు నష్టపోయాయి. మొత్తంమీద బీఎస్ఈ సెన్సెక్స్ 214 పాయింట్ల నష్టంతో 38,409 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక 52 పాయింట్లు కోల్పోయిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,251 పాయింట్ల వద్ద క్లోజయింది. చదవండి : ఎగిసి‘పడిన’ స్టాక్ మార్కెట్లు -
'సమ్మె ప్రభావం ప్రజలపై పడనీయొద్దు'
సాక్షి, మంచిర్యాల : ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రభావం ప్రజలపై పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. సోమవారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్టీసీ అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, రవాణ, పోలీసు శాఖ అధికారులతో సమ్మె ప్రభావంపై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమ్మె 10వ రోజుకు చేరుకుందని ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా అసవరమైన చర్యలు తీసుకుంటుందని ఇప్పటి వరకు 50 శాతం బస్సులు నడుస్తున్నాయని అన్నారు. సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి డిపోకు ఒక నోడల్ అధికారిని నియమించాలని, అద్దె బస్సులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని 100 శాతం బస్సులు నడిచేలా అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఇదే క్రమంలో అధిక చార్జీలు వసూలు చేయకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజలు ఇబ్బందులు పడకుండా సాధ్యమైనంత వరకు బస్సులు నడిపించడంతో పాటు అధిక చార్జీలు వసూలు చేయకుండా అధికారులతో కలిసి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేసి సంరక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కుమార్దీపక్, జిల్లా రవాణశాఖ అధికారులు కిష్టయ్య, వివేకానంద రెడ్డి, ఆర్టీసీ డీఎం మల్లేష్, రామగుండం అడిషనల్ డీసీపీ రవికుమార్, మంచిర్యాల డీసీపీ గౌస్బాబ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘ఆటో’లో మరిన్ని మూసి‘వెతలు’
న్యూఢిల్లీ: వాహన విక్రయాలు పడిపోయి, సంక్షోభ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తిని మరింతగా తగ్గించుకుంటున్నాయి. దీంతో పలు కంపెనీల ప్లాంట్ల మూసివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్, సుందరం–క్లేటన్ (ఎస్సీఎల్) సంస్థలు తాత్కాలికంగా ప్లాంట్లను మూసివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించాయి. హీరో మోటోకార్ప్ ఆగస్టు 15–18దాకా (నాలుగు రోజుల పాటు) ప్లాంట్లను మూసివేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా ఉత్పత్తిని సర్దుబాటు చేసుకునేందుకు, వార్షిక మెయింటెనెన్స్లో భాగంగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ‘స్వాతంత్య్ర దినోత్సవం, రక్షా బంధన్, వారాంత సెలవులు వంటి అంశాల కారణంగా ప్లాంట్ల మూసివేత నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుత మార్కెట్ డిమాండ్ పరిస్థితులు ఇందుకు కొంత కారణం‘ అని హీరో మోటోకార్ప్ ఈ సందర్భంగా వివరించింది. ఈ ఏడాది ఏప్రిల్–జూలై మధ్య కాలంలో హీరో మోటోకార్ప్ వాహనాల ఉత్పత్తిని 12 శాతం తగ్గించుకుని 24,66,802 యూనిట్లకు పరిమితం చేసుకుంది. మరోవైపు, దేశ, విదేశ ఆటోమోటివ్స్ తయారీ సంస్థలకు అల్యూమినియం ఉత్పత్తులు సరఫరాచేసే ఎస్సీఎల్ కూడా ’పాడి’లోని ప్లాంటులో ఆగస్టు 16,17న (2 రోజులు) కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు వివరించింది. ఇప్పటికే టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆటో పరికరాల తయారీ దిగ్గజం బాష్ తదితర సంస్థలు డిమాండ్కి అనుగుణంగా సర్దుబాటు చేసుకునేందుకు ఉత్పత్తిని తగ్గించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సిటీ యువకుడి వైద్యానికి అంతర్జాతీయ సాయం
సాక్షి, సిటీబ్యూరో: తీవ్ర అనారోగ్యానికి గురైన నగర యువకుడి చికిత్సకు అంతర్జాతీయ సాయం అందింది. ఈ వివరాలను ప్రముఖ క్రౌడ్ ఫండింగ్ సంస్థ ఇంపాక్ట్ గురు ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. నగరవాసి అయిన భానుప్రకాష్ (22) అనారోగ్య సమస్యలతో గత డిసెంబరులో అపోలో ఆసుపత్రిలో చేరారు. పరీక్షల అనంతరం అతనికి సోకింది తీవ్రమైన మైలాయిడ్ లుకేమియా వ్యాధిగా నిర్ధారించి, 4వారాల పాటు కీమో థెరపీ, బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమని ఆసుపత్రి వైద్యులు సూచించారు. చికిత్సకు రూ.15లక్షలు ఖర్చవగా మరో రూ.25లక్షలు వరకూ అవసరమైంది. అంత మొత్తాన్ని భరించలేని మధ్యతరగతికి చెందిన భాను ప్రకాష్ కుటుంబం క్రౌడ్ ఫండింగ్ సంస్థ ఇంపాక్ట్ గురును ఆశ్రయించింది. ఈ రోగి గురించిన సమాచారం ఇంపాక్ట్ ద్వారా తెలుసుకున్న 1234 మంది దాతలు కేవలం 2 వారాల్లోనే రూ.25.40లక్షలను విరాళంగా అందించారు. అయితే.. ట్రాన్స్ప్లాంటేషన్కు అవసరమైన బోన్మ్యారో దాత దే«శీయంగా అందుబాటులోకి లేకపోవడం, యూరప్ దేశాలకు నుంచి తీసుకోవాల్సిరావడంతో అదనంగా రూ.10లక్షలు వ్యయం చేయాల్సి వస్తోందని, మరో 2వారాల సమయం ఉన్న పరిస్థితుల్లో మరింత మంది దాతలు స్పందిస్తారని సంస్థ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. -
చేనేతకు పన్నుపోటు
-
ఈసారి ఆశించిన వర్షాలు పడవా ?
-
పీఏసీకి సమాధానమిచ్చిన ఉర్జిత్
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుతో దేశంలో ఏర్పడిన నగదు కొరత ప్రభావం త్వరలోనే సాధారణ పరిస్థితి వస్తుందని రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ భరోసా ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే పరిస్థితి అదుపులోకి వచ్చిందని ప్రజాపద్దుల కమిటీకి చెప్పారు. అనుమానిత డిపాజిట్లపై ఆదాయపు పన్ను శాఖ, ఫైనాన్సియల్ ఇంటిలిజెన్స్ యూనిట్ లాంటి ప్రత్యేక ఏజెన్సీలు దర్యాప్తు జరుపుతున్నాయని ఉర్జిత్ పేర్కొన్నారు. జీడీపీపై డీమానిటైజేషన్ ప్రభావం స్వల్పకాలమే ఉంటుందని, మధ్య, దీర్ఘకాలంలో నోట్ల రద్దు సానుకూల ప్రభావానే చూపుతుందని తెలిపారు. లావాదేవీలను ఛార్జీలను తగ్గించేందుకు బ్యాంకులు, సర్వీసు ప్రొవైడర్లతో ఆర్బీఐ చర్చలు జరుపుతుందని పీఏసీ సభ్యులకు ఉర్జిత్ సమాధానమిచ్చారు. పెద్ద నోట్ల రద్దు తదనాంతరం ఏర్పడిన పరిణామాలపై ప్రజాపద్దుల కమిటీకి వివరణ ఇవ్వడానికి ఉర్జిత్ పటేల్ శుక్రవారం ఆ కమిటీ ముందు హాజరయ్యారు. నోట్ల రద్దు నిర్ణయంలో ఆర్బీఐ పాత్రం, నల్లధనం వసూళ్లు, విత్ డ్రాయల్ పరిమితిపై ఆంక్షలు వంటి పలు ప్రశ్నలను ఉర్జిత్కు సంధిస్తూ ఆయనకు అంతకముందే పీఏసీ నోటీసులు జారీచేసింది. ఇదే విషయంలో బుధవారం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందు కూడా ఉర్జిత్ పటేల్, ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ మీటింగ్లో ఉర్జిత్ పలు కఠినమైన ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆర్బీఐ స్వతంత్రకు ముప్పు తెచ్చే పలు ప్రశ్నలను పార్లమెంటరీ కమిటీ సంధించింది. వీటికి సమాధానం చెప్పవద్దంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన సలహాతో కొన్నింటికి ఉర్జిత్ సమాధానం చెప్పలేదు. -
ఆ రెండింటి వల్ల చెన్నై చితికిపోయింది!
-
ఆ రెండింటి వల్ల చెన్నై చితికిపోయింది!
వర్దా తుఫాను సృష్టించిన బీభత్సానికి చెన్నపట్నం చెల్లాచెదురైంది. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఇంటర్నెట్ సర్వీసులు ఆగిపోయాయి. మొబైల్ సేవలు స్తంభించాయి. అసలకే కేంద్రం తీసుకున్న పాత నోట్ల రద్దు నిర్ణయానికి తీవ్ర కష్టాల్లో ఉన్న చెన్నపట్న వాసులకు ఈ సేవలు నిలిపివేత తీరని కష్టాల్లో పడేసింది. కనీసం తిండి దొరకని పరిస్థితిలోకి నెట్టేసింది. ప్రతిసారీ చెన్నై పట్నాన్ని ముంచెత్తి వరదలకు ప్రజల నుంచి కనీస మద్దతు వారికి అందేది. ప్రజలు తామున్నామంటూ డబ్బులు వసూలు చేసి మరీ చెన్నైను ఆదుకునే వారు. అక్కడి ప్రజలు కూడా ఒక్కరికొక్కరు చేదుడువాదుడుగా నిలిచేవారు. కానీ ఈసారి చెన్నై పరిస్థితి భిన్నంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. పాత నోట్లు రద్దయి ఉండటంతో వారికి కనీసం తిండి దొరకడానికి కూడా నగదు ఎక్కడి నుంచి పుట్టడం లేదని స్థానికులు వాపోతున్నారు. నగదు సాయానికి ఎవరూ ముందుకు రావడం లేదని పేర్కొంటున్నారు.. ఈ తుఫాను వల్ల తమకు జీవనాధారంగా ఉన్న బోట్లుకు ఎలాంటి హాని కలుగకూడదని వేడుకుంటున్నట్టు ఓ మత్స్యకారి చెప్పారు. ఒకవేళ అవి పాడైతే, వాటిని బాగుచేయించుకోవడానికి తమ దగ్గర నగదు కూడా లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. పాత నోట్లు రద్దయి ఉండటంతో ఈ సమయంలో సాయం దొరకడం కూడా కష్టమంటున్నాడు. తుఫానుతో విరిగిపడిన చెట్లకు తమిళనాడులో చాలా ప్రాంతాలు అంధకారంగా మారాయి. దీంతో నగరంలో ఏటీఎంలు సైతం పనిచేయడం లేదు. ఒకవేళ ఎక్కడో ఒక దగ్గర విద్యుత్ ఉండి నడిచే ఏటీఎంలలో కూడా నో క్యాష్ బోర్డులు వెక్కిరిస్తున్నాయరని స్థానికులు చెబుతున్నారు. నెట్వర్క్లు డౌనయ్యాయి. తమ కార్డులు కూడా నిరూపయోగంగా మారాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
టాటా బిర్లా పై నోట్ల రద్దు ఎఫెక్ట్
-
కార్తీక మాసంపై కరెన్సీ ఎఫెక్ట్
-
సెల్ టవర్ల రేడియేషన్పై సుప్రీం సీరియస్
న్యూఢిల్లీ : మొబైల్ టవర్ల రేడియేషన్ ప్రభావంపై సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది. దీనిపై ఒక నివేదిక సమర్పించాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. చీఫ్ జస్టిస్ టి ఎస్ ఠాకూర్, న్యాయమూర్తులు సి. నాగప్పన్, ఎం ఖాన్ విల్కార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వివరణలు కోరింది. నివాస ప్రాంతాల్లో మరియు పాఠశాలల సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా సెల్ టవర్ల నిర్మాణంపై నోయిడా నివాసి నరేస్ చంద్ర గుప్త దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీం విచారించింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 17కి వాయిదా వేసింది. సెల్ టవర్ల ద్వారా వెలుబడే రేడియేషన్ అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. మొబైల్ టవర్లనుంచి వెలువడే రేడియేషన్ విషతుల్య ప్రభావాలు, ఉద్గారాల ప్రమాణాల అమలుకు తీసుకుంటున్న చర్యలను సహా పలు అంశాలపై కేంద్రం నుండి ఒక నివేదిక కోరింది. మొబైల్ టవర్ల ప్రతికూల ప్రభావాలు ఏమిటి? వీటిని మానిటర్ చేయడానికి ఏదైనా ఏజెన్సీ ఉందా ? చట్టపరమైన నిబంధనలు, ఈ ప్రమాణాలను సుప్రీం ప్రశ్నించింది. సెల్ టవర్ల ఏర్పాటులో టెలికమ్యూనికేషన్ శాఖ ఏవైనా ఉల్లంఘనలను గుర్తించిందా, ఒకవేళ అలాంటి సంఘటనలు జరిగితే, దానిపై తీసుకున్న చర్యలపై సుప్రీం ఆరా తీసింది. నివాస ప్రాంతాల్లో సెల్ టవర్ల ఏర్పాటుపై ఉన్న కండీషన్స్ చెప్పాలని కోర్టు కోరింది. అలాగే ఇప్పటి వరకు దేశంలో ఉన్న సెల్ టవర్ల సంఖ్య, వాటిపై దాట్ తనిఖీలు తదితర అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికంను కోరింది. దేశంలోని సెల్ టవర్స్ రేడియేషన్ నియంత్రణలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నాయా? అని ధర్నాసనం ప్రశ్నించింది. నిబంధనలు, నిబంధనలు ఉల్లంఘన రిపోర్టులు, అలాంటి వారిపై ఇప్పటివరకు తీసుకున్న చర్యల గురించి డాట్ నుండి సమాచారాన్ని కోరింది. దీంతోపాటు ఫోన్ సర్వీసు ప్రొవైడర్స్ లకు టవర్ల నిర్మాణంలో పాటించాల్సిన రేడియేషన్ ప్రమాణాలు, నిబంధనల అమలుపై ఒక టైమ్ ఫ్రేమ్ విధించాలని ప్రభుత్వాన్ని కోరింది. అయితే దీనికి కొంత సమయం కావాలని డాట్ న్యాయవాది పత్వాలియా సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. -
అతి క్రమశిక్షణతో అనర్థమే!
టోక్యో: పిల్లలని పెంచే క్రమంలో కొంత మంది పేరెంట్స్ మరీ అతి చేస్తుంటారు. క్రమశిక్షణ పేరుతో వారిని అనుక్షణం అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ క్రమశిక్షణ పేరుతో తల్లిదండ్రులు చేసే పనులు పెద్దయ్యాక వారిపై తీవ్ర ప్రభావాలు చూపుతాయంటున్నారు పరిశోధకులు. పరిశోధనల్లో తేలిన విషయమేమిటంటే తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే మద్దతుతోపాటు, సానుకూల దృక్పథంలాంటి అంశాలు పెద్దయ్యాక వారి విజయాలపై ప్రభావం చూపుతాయని తేలింది. అంతేకాక అలాంటి పిల్లలు సంతోషంగా ఉంటారని కూడా రుజువైంది. మరోవైపు అధిక క్రమశిక్షణతో పెరిగే పిల్లలు చదువుల విషయంలో, వృత్తి పరంగా మంచి స్థానంలో ఉన్నపటికీ వారిలో ఒత్తిడి తీవ్రంగా ఉంటుందని, దీర్ఘకాలంలో పిల్లలపై దుష్ర్పభావాలకు క్రమశిక్షణ కారణమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. జపాన్లోని కోబో యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ నిశిముర కజ్వో ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. -
భారత్ పై ‘విదేశీ’ ప్రభావం తక్కువే..
♦ ఎస్ అండ్ పీ విశ్లేషణ ♦ దేశీయ డిమాండ్ కారణమని వెల్లడి ♦ ద్రవ్యలోటు, వృద్ధి రికవరీపై మరో ♦ ఆర్థిక సేవల దిగ్గజం డీబీఎస్ హెచ్చరిక న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల ప్రభావం భారత్పై తక్కువగానే ఉంటుందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం- స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్ అండ్ పీ) పేర్కొంది. దీనికి దేశీయంగా పటిష్టంగా ఉన్న ప్రజా వినియోగం, ప్రభుత్వ వ్యయాలు కారణమని ఎస్ అండ్ పీ ఇండియా సావరిన్ అనలిస్ట్ కిర్యాన్ క్యూరీ పేర్కొన్నారు. కాగా ద్రవ్యలోటు, ఆర్థికాభివృద్ధి రికవరీలో వేగం ప్రస్తుత సమస్యలని మరో ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ డన్ అండ్ బ్రాడ్స్ట్రీట్ (డీబీఎస్) అభిప్రాయపడింది. ఎస్ అండ్ పీ.. విశ్లేషణాంశాలు... భారత్ డిమాండ్ దేశీయంగా పటిష్టంగా ఉంది. దేశం నుంచి వేగంగా వెనక్కు వెళ్లిపోయే నిధులపై పూర్తిగా ఆధారపడి ఆర్థికవ్యవస్థ లేదు. విదేశీ మారకద్రవ్యం రాక, పోకల మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించి కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 1.4 శాతం వద్ద (స్థూల దేశీయోత్పత్తితో పోల్చితే) ఉండే అవకాశం ఉంది. 2018 వరకూ ఇదే పరిస్థితి కొనసాగే వీలుంది. ఎగుమతులు పెరక్కపోవడం కరెంట్ అకౌంట్ లోటు 1.4 శాతం స్థాయిలోనే కొనసాగడానికి కారణం. అయితే దేశంలోకి పసిడి దిగుమతులు పెరిగితే... కరెంట్ అకౌంట్ లోటు మరికొంత పెరిగే అవకాశం ఉంది. 2014-15లో క్యాడ్ 1.3 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16) ముగిసిన ఆరు నెలల కాలంలో ఈ లోటు 1.4 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో క్యాడ్ 1.8 శాతంగా నమోదైంది.అదే విధంగా తన వృద్ధి నిధికి విదేశీ పొదుపుపై ఆధారపడ్డం చాలా తక్కువ. బ్యాంకింగ్కు దేశీయ డిపాజిట్ బేసే ప్రధానంగా అధికంగా ఉంది. భారత్ క్యాపిటల్ మార్కెట్లు వివిధ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కంపెనీల నిధుల సమీకరణకు ఇది తగిన పరిస్థితి. రేటింగ్ అప్గ్రేడ్పై ద్రవ్యలోటు ప్రభావం: డీబీఎస్ ప్రభుత్వ రాబడి-వ్యయాల మధ్య వ్యత్యాసమైన ద్రవ్యలోటు తీవ్రత రేటింగ్ అప్గ్రేడ్కు ఇబ్బంది కలిగించే అంశమని మరో ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ- డన్ అండ్ బ్రాడ్స్ట్రీస్ (డీబీఎస్) తన తాజా నివేదికలో పేర్కొంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు ప్రభుత్వ లక్ష్యం స్థూల దేశీయోత్పత్తిలో 3.5 శాతం కాగా 3.7 శాతం కన్నా అధికంగా ఉండే వీలుందని విశ్లేషించింది. దీనివల్ల రేటింగ్ అప్గ్రేడ్ ఆలస్యం అయ్యే వీలుందని అభిప్రాయపడింది. అయితే కేవలం దీని ప్రాతిపదికన ఇన్వెస్టర్లు, రేటింగ్ ఏజెన్సీలు ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగే నిర్ణయాలు ఏవీ చేపట్టబోరని కూడా విశ్లేషించింది. విదేశీ చెల్లింపుల పరిస్థితి బాగుండడం, వృద్ధి అవకాశాలు, దిగువ స్థాయి ద్రవ్యోల్బణం వంటి అంశాలన్నింటినీ ఇన్వెస్టర్లు, రేటింగ్ ఏజెన్సీలు పరిగణనలోకి తీసుకుంటాయన్నది తమ అంచనా అని తెలిపింది. ప్రస్తుతం విదేశీ రేటింగ్ ఏజెన్సీలు భారత్లో పెట్టుబడులకు సంబంధించి స్టేబుల్ అవుట్లుక్తో బీబీబీ- గ్రేడ్ను ఇస్తున్నాయి. జంక్ స్టేటస్కు ఇది ఒక మెట్టు ఎక్కువ. ద్రవ్యలోటు తీవ్రతరమైతే... జంక్ స్టేటస్కు రేటింగ్ను దించుతామని ఇటీవల విదేశీ రేటింగ్ ఏజెన్సీలు హెచ్చరించాయి. ఫిబ్రవరి 29న ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టే 2016-17 బడ్జెట్పై ఈ సంస్థలు దృష్టి సారించాయి. ఆర్థిక వ్యవస్థ రికవరీ దిశలో సైతం భారత్ వేగంగా అడుగులు వేయడం లేదన్నది డీ అండ్ బీ అభిప్రాయం. -
ఫెడ్ వడ్డనతో కుదేలైన చమురు రంగం
హైదరాబాద్: అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్ల పెంపు ప్రభావం చమురు రంగంపై తీవ్ర ప్రభావాన్నే చూపింది. ఫెడ్ వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచినా, చమురు ధరలను బాగానే ప్రభావితం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తీవ్రంగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ పుంజుకోవడంతో.. చమురు ధరలు ఏడేళ్ళ కనిష్టానికి క్షీణించాయి. బ్యారెల్ ముడి చమురు ధర ప్రస్తుతం 35 డాలర్లకు చేరింది. ఫెడ్ రేట్లలో ఎంతో కొంత పెంపు తప్పనిసరిగా ఉంటుందని ప్రపంచ ఆర్థిక నిపుణులు ముందే అంచనాలు వేశారు. ప్రస్తుత ఫెడ్ నిర్ణయంతో ఇప్పటికే గాడితప్పిన చమురు రంగం మాత్రం ఒక్కసారిగా కుదేలైంది. ఓపెక్ దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకునే దేశాలకు ఫెడ్ నిర్ణయం సానుకూలమైనా, ధరల తగ్గుదల ఎగుమతి దేశాల మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రపంచ మార్కెట్లపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంది. కనిష్టంగా 0 శాతం గరిష్ఠంగా 0.25 శాతంగా ఉన్న వడ్డీ రేట్లను కనిష్ఠంగా 0.25, గరిష్టంగా 0.5 శాతానికి పెంచుతూ అమెరిడా ఫెడరల్ బ్యాంకు బుధవారం రాత్రి ప్రకటించింది. 2006 జూన్ తర్వాత ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం ఇదే ప్రథమం. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్ఠ స్థితిలోనే ఉందని భావించిన ఫెడ్.. వడ్డీ రేట్లను పెంచటం ద్వారా మరింత ఆర్థిక పుష్ఠికి బాటలు వేయాలని భావిస్తోంది. రానున్న కాలంలో మరిన్ని సార్లు వడ్డీ రేట్లను పెంచనున్నట్లు కూడా ఫెడరల్ బ్యాంక్ ప్రకటించింది. -
శోభానాగిరెడ్డి పేరును తొలగించండి: టీడీపీ
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి శోభానాగిరెడ్డి పేరును బ్యాలెట్ పేపర్ నుంచి తొలగించాలని టీడీపీ ఎంపీ రమేశ్రాథోడ్ కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి గురువారం ఓ వినతిపత్రం అందజేశారు. నిబంధనల ప్రకారం చనిపోయిన వ్యక్తిపేరు బ్యాలెట్ పేపర్లలో ఉండరాదని పేర్కొన్నారు. అదేవిధంగా చంద్రబాబు ఓటు చెల్లదంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ ప్రకటించడం బాధ్యతా రాహిత్యంగా ఉందని వ్యాఖ్యానించారు.