indian flag
-
Champions Trophy 2025: భారత అభిమానిని స్టేడియంలో నుంచి ఈడ్చుకెళ్లిన పాక్ సిబ్బంది
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కొత్త వివాదం తలెత్తింది. భారత జెండాను కలిగి ఉన్నాడన్న కారణంగా లాహోర్లోని గడాఫీ స్టేడియం నుండి ఓ వ్యక్తిని బయటకు ఈడ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోలో పాకిస్తాన్ భద్రతా సిబ్బంది భారత జెండాను లాక్కొని, జెండాను పట్టుకున్న వ్యక్తిని స్టేడియంలో నుండి బయటికి ఊడ్చుకెళ్లారు. ఫిబ్రవరి 22వ తేదీన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Laughter Colours | Memes Only (@laughtercolours)ఈ వీడియో సోషల్మీడియాలో పోస్ట్ అయిన సెకెన్లలో వైరలైంది. భారత జెండా కలిగి ఉన్న వ్యక్తి పాకిస్తాన్ పౌరుడే అయినప్పటికీ భారత అభిమాని అని తెలుస్తుంది. సదరు వ్యక్తిని పాక్ భద్రతా సిబ్బంది కొట్టి అరెస్ట్ చేశారని ప్రచారం జరుగుతుంది. ఈ వీడియోపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) నుంచి ఎలాంటి స్పందన లేదు. భారత జెండా పట్టుకున్న వ్యక్తి పేరు, వివరాలు కూడా తెలియరాలేదు. ఈ వీడియో నిజమైతే మరెన్ని వివాదాలకు దారి తీస్తుందో వేచి చూడాలి. భద్రతా సిబ్బంది నిజంగానే భారత అభిమానిపై దాడి చేసుంటే పాక్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారత అభిమానులు ఈ వీడియోపై తీవ్రంగా స్పందిస్తున్నారు. క్రికెట్ను క్రికెట్ లాగే చూడాలి. క్రికెట్ను ఇతరత్రా విషయాలతో ముడి పెట్టకూడదని అంటున్నారు.ఇదిలా ఉంటే, 29 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ ఈవెంట్కు (ఛాంపియన్స్ ట్రోఫీ) ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్.. పట్టుమని 10 రోజులు కూడా టోర్నీలో నిలువలేకపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమైన ఆరు రోజుల్లోనే పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. నిన్నటి మ్యాచ్లో బంగ్లాదేశ్పై న్యూజిలాండ్ విజయం సాధించడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ కథ ముగిసింది. ఈ టోర్నీలో పాక్ వరుసగా న్యూజిలాండ్, భారత్ చేతుల్లో ఘోర పరాజయాలు ఎదుర్కొంది. న్యూజిలాండ్ చేతిలో ఓటమితో పాక్తో పాటు బంగ్లాదేశ్ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆడిన రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించిన భారత్, న్యూజిలాండ్ జట్లు గ్రూప్-ఏ నుంచి సెమీస్కు అర్హత సాధించాయి. ఈ టోర్నీలో పాక్ తమ చివరి గ్రూప్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడుతుంది. గ్రూప్-ఏ నుంచి సెమీస్ బెర్తులు ఖరారు కావడంతో ఈ మ్యాచ్కు ప్రాధాన్యత లేదు. మరోవైపు ఈ టోర్నీలో భారత్, న్యూజిలాండ్ ప్రయాణం జోరుగా సాగుతుంది. ఇరు జట్లు పాకిస్తాన్, బంగ్లాదేశ్లను మట్టికరిపించాయి. ఈ రెండు జట్ల మధ్య నామమాత్రపు పోరు మార్చి 2న జరుగనుంది.గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్లో ఇవాళ (ఫిబ్రవరి 25) జరగాల్సిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఫలితంగా ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఇప్పటివరకు సౌతాఫ్రికా, ఆసీస్ తలో మ్యాచ్లో గెలిచి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆసీస్తో పోలిస్తే సౌతాఫ్రికా మెరుగైన రన్రేట్ కలిగి ఉంది. ఈ గ్రూప్లో ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ ఇంకా బోణీ కొట్టాల్సి ఉంది. ఈ రెండు జట్లు తమతమ తొలి మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతిలో ఓడాయి. సౌతాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ను.. ఆస్ట్రేలియా ఇంగ్లండ్ను మట్టికరిపించాయి. టోర్నీలో రేపు ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ తలపడనున్నాయి. -
Champions Trophy 2025: ఎట్టకేలకు పాక్లో భారత జెండా ఎగిరింది..!
ఛాంపియన్స్ ట్రోఫీలో మరో వివాదం ఎలాంటి అనర్థాలకు దారి తీయకుండా సమసిపోయింది. మెగా టోర్నీ ప్రారంభానికి ముందు పాక్లోని కరాచీలో స్టేడియంలో భారత జెండా పెట్టకుండా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓవరాక్షన్ చేసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం, ట్రోర్నీలో పాల్గొనే అన్ని జట్ల జాతీయ జెండాలను స్టేడియంలో ప్రదర్శించడం ఆనవాయతీ. అయితే, ఈ ఆనవాయితీని పాక్ క్రికెట్ బోర్డు తుంగలో తొక్కింది. భారత్ మినహా మిగతా దేశాల జాతీయ జెండాలన్నిటినీ కరాచీ స్టేడియం పైకప్పుపై ఎగరేసింది. ఈ విషయం పెద్దది కావడంతో ఐసీసీ జోక్యం చేసుకుంది. దీంతో పీసీబీ దిగొచ్చింది. టోర్నీ ప్రారంభానికి ఒక రోజు ముందు కరాచీలోని నేషనల్ స్టేడియంలో భారత జెండాను ప్రదర్శించింది. ఈ విషయం తెలిసి భారత అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ ప్రమేయం లేకపోతే పీసీబీ ఇష్టానుసారంగా వ్యవహరించేదని అంటున్నారు. The Indian flag is present at National Bank Stadium Karachi ahead of the ICC Champions Trophy 2025. Via - @imransiddique89 #ChampionsTrophy2025 pic.twitter.com/NUa8Gh837B— Ahmad Haseeb (@iamAhmadhaseeb) February 18, 2025కాగా, ఇదే ఐసీసీ నిబంధనలను సాకుగా చూపుతూ పాక్ క్రికెట్ బోర్డు టీమిండియా జెర్సీలపై వారి దేశం పేరును ముద్రించుకుంది. ఇదిలా ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఇవాల్టి నుంచి (ఫిబ్రవరి 19) ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లు మినహా మిగతా మ్యాచ్లకు పాక్ ఆతిథ్యం ఇస్తుంది. భద్రతా కారణాల రిత్యా భారత్ తమ మ్యాచ్లను దుబాయ్లో ఆడుతుంది. నేటి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్.. న్యూజిలాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్కు కరాచీలోని నేషనల్ స్టేడియం వేదిక కానుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది.రేపు (ఫిబ్రవరి 20) జరుగబోయే మ్యాచ్లో టీమిండియా.. బంగ్లాదేశ్తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. మార్చి 2న టీమిండియా న్యూజిలాండ్తో ఫైనల్ గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడుతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు..రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా -
ఇదీ ఫ్లాగ్ కోడ్.. అగౌరవపరిస్తే చట్ట ప్రకారం శిక్షార్హులు!!
సాక్షి, సిటీబ్యూరో: దేశ ప్రాథమిక, ప్రధాన చిహ్నం.. భారత గౌరవ ప్రతీక.. శాంతి, సౌభ్రాతృత్వం, సమానత్వాన్ని ప్రతిబింబించేది జాతీయ జెండా. ప్రతి ఏటా స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలతో పాటు పలు ప్రత్యేక రోజుల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తుంటాం. అంతేకాకుండా దేశభక్తిని, భారత ప్రతిష్టను ప్రదర్శించే వివిధ సందర్భాల్లోనూ జాతీయ పతాకాన్ని వినియోగిస్తాం. ఇటీవలి కాలంలో హర్ ఘర్ తిరంగా నినాదంతో ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడుతోంది. అయితే జాతీయ జెండా ఎగరవేయడానికి, ప్రదర్శించడానికి ప్రత్యేక నిబంధనలున్నాయి. ఈ నియమావళికి ఏ మాత్రం అవాంతరం ఎదురైనా దేశ ప్రతిష్టకే అవమానం. ఈ నేపథ్యంలో రాజ్యాంగం సూచించిన ఫ్లాగ్ కోడ్ను తప్పనిసరిగా పాటించాలి. ఆ వివరాలు తెలుసుకుందాం..జాతీయ జెండా కేవలం ప్రభుత్వ భవంతుల మీద, ప్రభుత్వాధికారులకు మాత్రమే ఎగరవేసే ఆధికారముండేది. 2001లో నవీన్ జిందాల్ సుప్రీం కోర్టు కేసులో భాగంగా ప్రతి పౌరుడూ జెండాను ఎగరేయొచ్చని సవరించింది. జాతీయ జెండా పరిరక్షణకు సంబంధించి 1950, 1971 చట్టాలతో పాటు 2002, 2005లో సవరించిన అంశాలతో నూతన జాతీయపతాక నియమావళిని రూపొందించింది. ఈ నియమావళిలో భాగంగా పతాకం నేలనుగానీ, నీటినిగానీ తాకరాదు. టేబుల్ క్లాత్గా, వేదికకు ముందు భాగంలో వాడకూడదు.ఉద్దేశపూర్వకంగా జెండాను తలకిందులు చేయకూడదు, విగ్రహాలమీద, ఇతర వస్తువులకు కప్పకూడదు. నడుం కింది భాగంలో, లోదుస్తులమీద జెండాను వాడకూడదు. ఆవిష్కరణకు ముందు పువ్వులు తప్ప ఇతర వస్తువులను జెండాలో ఉంచడం, జెండా మీద ఏదైనా రాయడం నిషిద్ధం. సాధారణంగా సూర్యోదయంలో జెండాను ఎగరవేసి, సూర్యాస్తమయంలో దించివేయాలి. కాషాయరంగు పైన ఉండేటట్లు, నిలువుగా వేలాడదీసినట్లైతే కాషాయరంగు చూసేవారికి ఎడమచేతివైపున ఉండాలి. మురికిగా ఉన్న జెండాను ప్రదర్శించకూడదు. రెండు జాతీయపతాకాలను ఎక్స్ ఆకారంలో కర్రలకు తగిలించినట్లైతే రెండు జెండాలూ వ్యతిరేకదిశల్లో తగిలించాలి. పోడియంలు, బిల్డింగుల మీద కప్పడానికి గానీ, రెయిలింగుల మీద అలంకరణ కోసంగానీ వాడకూడదు.వీరి ఆదేశాల మేరకు..రాష్ట్రపతి ఆదేశాల ప్రకారం మాత్రమే సంతాపసూచకంగా పతాకాన్ని అవనతం (జెండా కర్రకు సగం ఎత్తులో ఎగరెయ్యడం) చెయ్యాలి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రుల్లో ఎవరు మరణించినా దేశవ్యాప్తంగా అవనతం చేస్తారు. అధికార, సైనిక, పారామిలిటరీ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపేటప్పుడు శవపేటిక మీద తలవైపు కాషాయరంగు వచ్చేటట్లు కప్పాలి. ఐతే దానిని ఖననం చేసే ముందు తీసేయాలి. శవంతో పాటు సమాధిలోకి దించడం, కాల్చడం చెయ్యరాదు.ఇవి తప్పనిసరి..ఇతర దేశాల జాతీయపతాకాలతో కలిపి ఎగరేసే సమయంలో వరుసలో మొదటి స్థానంలో కుడివైపు (చూసేవారి ఎడమచేతివైపు) ఉండాలి. మిగతా పతాకాలు ఇంగ్లి‹Ùలో ఆయాదేశాల పేర్లను బట్టి అక్షరక్రమంలో అమర్చాలి. అన్ని పతాకాలూ దాదాపు ఒకే పరిమాణంలో ఉండాలి. అన్ని పతాకాలూ విడివిడిగా వేర్వేరు జెండాకర్రలమీద ఎగరెయ్యాలి. వృత్తాకారంలో ఎగరేసినప్పుడు భారత పతాకం దగ్గరే వృత్తం మొదలై, సవ్యదిశలో తిరిగిరావాలి. మన పతాకాన్ని ముందు ఎగరేసి అన్నిటికంటే చివర అవనతం చెయ్యాలి. పతాకాన్ని సమావేశాల్లో వేదికల మీద ప్రదర్శించేటప్పుడు కుడివైపునే (చూసేవారికి ఎడమవైపున) ఉండాలి. వక్తలు ఉపన్యసించేచోట ఉన్నట్లైతే వారికి కుడిచేతి వైపునే ఉండాలి. ఇతర జెండాలతో కలిపి ఊరేగింపులో తీసుకెళ్ళే సమయంలో మొదట్లో ఉండాలి. జెండాలన్నిటినీ ఒకే వరసలో తీసుకెళ్లేటప్పుడు కుడివైపున మొదటిదిగా లేదా మధ్యలో అన్నిటికంటే ముందు ఉండాలి. దేనికీ/ఎవరికీ గౌరవసూచకంగా జాతీయ జెండాను కిందికి దించరాదు.వాహనాలపై..జాతీయపతాకాన్ని వాహనాల మీద ఎగరేసే అధికారం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు, పార్లమెంటు, శాసనసభల సభ్యులు, లోక్సభ, శాసనసభల స్పీకర్లు, రాజ్యసభ, రాష్ట్రాల శాసనమండళ్ల అధ్యక్షులు, సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, సైనిక, నావికాదళ, వాయుసేనల్లోని ఉన్నతాధికారులకు మాత్రమే ఉంది. ఇతర దేశాల నాయకులు భారత ప్రభుత్వ వాహనంలో తిరుగుతున్నప్పుడు భారత జాతీయపతాకం కుడి వైపు చివరన, వారి జాతీయపతాకం ఎడమవైపు చివరన ఉండాలి. -
నేలపై జెండా.. ప్రధాని మోదీ ఏం చేశారంటే..
జోహన్నెస్బర్గ్లో ఇవాళ జరిగిన బ్రిక్స్ సమావేశం సందర్భంగా ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ తన దేశభక్తిని చాటుకున్నారు. కింద ఉంచిన జాతీయ జెండాను గమనించి అప్రమత్తయ్యారు ఆయన. బ్రిక్స్ సమావేశాల సందర్భంగా.. ఇవాళ హాజరైన నేతలతో ఓ ఫొటోషూట్ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా వేదిక ఎక్కబోయారు. తమకు కేటాయించిన స్థానాల్లో నిల్చుని ఫొటోలు దిగాల్సి ఉంది. అయితే.. అక్కడ నేతలు ఎవరెక్కడ నిల్చోవాలనే గుర్తు కోసం ఆయా నేతలకు సంబంధించిన దేశాల జెండాల పేపర్ పీస్లను ఉంచారు. PM Narendra #Modi notices the Indian Tricolour on the ground (to denote standing position) during the group photo at #BRICS, makes sure to not step on it, picks it up, and keeps it with him. South African President Cyril Ramaphosa follows suit.#ModiInBRICS pic.twitter.com/pXCypilo4H — அகத்தியன் (@riverinerabbit) August 23, 2023 ఈ క్రమంలో వేదిక ఎక్కబోతూ.. అక్కడ జెండాను గమనించిన మోదీ.. దానిని తీసుకుని తన జాకెట్ జేబులో పెట్టుకున్నారు. మరోవైపు అప్పటికే తమ దేశపు జెండాపై అడుగేసిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు.. మోదీ చర్యను గమనించి అక్కడే ఉన్న సిబ్బందికి ఆ జెండాను అందించారు. -
ఖలీస్తానీ మద్ధతుదారుల దుశ్చర్య.. భారత్ కౌంటర్
లండన్లోని భారత హైకమిషనర్ వద్ద ఆదివారం జరిగిన పరిణామాలకు భారత్ తక్షణ కౌంటర్ ఇచ్చింది. పంజాబ్లో ఖలీస్తానీ సానుభూతిపరుడు అమృత్పాల్ సింగ్ అరెస్ట్కు నిరసనగా.. లండన్ హైకమిషనర్ ఆవరణలో భారత జాతీయ జెండాను ఖలీస్తానీ మద్దతుదారులు నిరసనలకు దిగారు. ఈ క్రమంలో భారత త్రివర్ణ పతాకాన్ని కిందకు లాగేయాలని యత్నించడం.. ఆ వెంటనే అధికారులు స్పందించడం, తదనంతరం భారీ జాతీయ జెండాను ఎగరేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లండన్ అల్డివిచ్ ఇండియా హౌజ్ బయట ఈ భారీ భారతీయ జాతీయ జెండాను ఎగరేయగా.. పలువురు ప్రశంసలు గుప్పిస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రతినిధి జైవీర్ షెర్గిల్ ఈ పరిణామంపై ఝండా ఊంచా రహే హమారా అంటూ ట్విటర్లో పోస్ట్ ఉంచారు. భారత జెండాను అవమానించేలా వ్యవహరించిన వాళ్లపై యూకే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జాతి సంరక్షణకు, పలు రకాల సేవలు అందించిన ఖ్యాతి పంజాబ్కు, పంజాబీలకు ఉందని పేర్కొన్నారు ఆయన. “Jhanda Ooncha Rahe Hamara”- UK Govt must act against those miscreants who attempted to disrespect Indian Flag at High Commission,London.Punjab & Punjabis have a glorious track record of serving/protecting the Nation.Handful of jumping jacks sitting in UK do not represent Punjab. pic.twitter.com/TJrNAZcdmf — Jaiveer Shergill (@JaiveerShergill) March 20, 2023 ఇదిలా ఉంటే.. జాతీయ జెండాను కిందకు లాగేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదే సమయంలో భారత హైకమిషనర్ అధికారులు తక్షణం స్పందించారు. కౌంటర్గా ఖలీస్తానీ జెండాను విసిరేయడంపై.. పలువురు నెటిజన్స్ ప్రశసంలు గుప్పిస్తున్నారు. ఇక ఈ పరిణామంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆదివారం అర్ధరాత్రి భారత్లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ క్రిస్టియానా స్కాట్కు ఈ ఘటనపై వివరణ కోరుతూ సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. మరోవైపు యూకే మంత్రి తారీఖ్ అహ్మద్ ఈ ఘటనను ఖండిస్తూ ఓ ట్వీట్ చేశారు. Salute to the Brave Indian High Commission Official 🙏🇮🇳 He not only took back the Indian flag but stopped the extremist from installing the K-Flag.#UK #London pic.twitter.com/4X0DJQo9hV — Megh Updates 🚨™ (@MeghUpdates) March 19, 2023 ఇదీ చదవండి: ఒకేసారి.. 36 మంది భక్తుల గోల్డ్ చైన్లు మాయం -
‘ప్రధాని మోదీ వల్లే అది సాధ్యమైంది’
న్యూఢిల్లీ: ఆదివారం జమ్ము కశ్మీర్లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో భాగంగా శ్రీనగర్ లాల్ చౌక్లో జాతీయ జెండా ఎగరేశారు ఆ పార్టీ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ. అయితే.. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వల్లే రాహుల్ గాంధీ అలా జెండా ఎగరేయడం సాధ్యమైందని బీజేపీ ఎంపీ రవిశంకర్ప్రసాద్ తెలిపారు. ‘అసలు రాహుల్ గాంధీ అంత ప్రశాంతంగా లాల్ చౌక్లో జెండా ఎలా ఎగరేయగలిగారు? ఆ పరిస్థితులకు కారణం ఆర్టికల్ 370 రద్దు కావడం. అది చేసింది ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం. కాంగ్రెస్ హయాంలో కశ్మీర్ గడ్డపై ఉగ్రవాదం, ప్రజల భయాందోళనలు మాత్రమే కనిపించేవి. కానీ, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అక్కడ శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. అధిక సంఖ్యలో పర్యాటకులు క్యూ కడుతున్నారు అని రవిశంకర్ వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీ రాజ్యవర్థన్ రాథోడ్ సైతం ఇవే వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్ లాల్ చౌక్లో రాహుల్ గాంధీ గర్వంగా జాతీయ జెండాను ఎగరేశారు. అలాంటి పరిస్థితులు అక్కడ నెలకొనడానికి కారణం ప్రధాని మోదీ అని ఉద్ఘాటించారు. జమ్ము కశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా మాత్రం ఆ క్రెడిట్ను ప్రధాని మోదీతో పాటు హోం మంత్రి అమిత్ షాకు సైతం దక్కుతుందని పేర్కొన్నారు. ఏడు వసంతాల తర్వాత నెహ్రూ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి శ్రీనగర్ లాల్ చౌక్లో జెండా ఎగరేశాడు. ఈ ప్రాంతంలో ప్రశాంతత, సోదర భావం పెంపొందడానికి మోదీ, షాలే ముఖ్యకారకులు అని రైనా పేర్కొన్నారు. ఇదీ చదవండి: నేటితో భారత్ జోడో యాత్రకు ముగింపు -
భారత జెండాతో ఆఫ్రిది కూతురు.. నిజమేనన్న పాక్ మాజీ ఆల్రౌండర్
ఆసియా కప్-2022లో భాగంగా భారత్-పాక్ల మధ్య జరిగిన సూపర్-4 దశ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది చిన్ని కూతురు భారత జెండా ఊపుతూ కనిపించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. ఈ విషయమై ఓ టీవీ ఇంటర్వ్యూ సందర్భంగా అఫ్రిదిని ప్రశ్నించగా అతను చెప్పిన సమాధానం విని అందరూ షాకయ్యారు. ఈ విషయంపై లైవ్లో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అఫ్రిది పెద్దగా నవ్వుతూ సమాధానం చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అవును నా కూతురు భారత జెండా పట్టుకుంది.. ఆ వీడియోలు నా దగ్గర కూడా ఉన్నాయి. పాపతో ఉన్న నా భార్య కూడా ఈ విషయాన్ని చెప్పింది. ఆ రోజు (భారత్-పాక్ మ్యాచ్ జరిగిన రోజు) స్టేడియంలో 90 శాతం మంది భారత అభిమానులు, కేవలం 10 శాతం మంది పాక్ ఫ్యాన్స్ ఉన్నారు. స్టేడియం వద్ద పాక్ జాతీయ జెండాలు దొరక్కపోవడంతో మా పాప భారత జెండాను పట్టుకుంది. ఫైనల్లో పాక్పై శ్రీలంక గెలిచిన అనంతరం గంభీర్ కూడా శ్రీలంక జెండా ఊపాడు. అలా చేసినంత మాత్రనా అతను శ్రీలంకన్ అయిపోయాడా.. లేక అతన్ని శ్రీలంక అభిమాని అని అనాలా..? అంటూ ఈ విషయాన్ని రచ్చ చేయవద్దని జర్నలిస్ట్ను కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా, ఆసియా కప్లో భారత్, పాక్లు రెండు సందర్భాల్లో ఎదురెదురు పడగా.. గ్రూప్ దశలో టీమిండియా, సూపర్-4 దశలో పాక్లు గెలుపొందాయి. సూపర్-4 దశలో భారత్.. పాక్, శ్రీలంక చేతుల్లో వరుస పరాజయాలు ఎదుర్కోవడంతో ఫైనల్కు చేరకుండానే నిష్క్రమించింది. ఫైనల్లో శ్రీలంక, పాక్లు తలపడగా.. లంకేయులు పాక్ను మట్టికరిపించి ఆరో సారి ఆసియా ఛాంపియన్లుగా నిలిచారు. -
జాతీయ జెండాను ముట్టుకోని జై షా.. కారణం ఇదేనా..!
ఆసియా కప్ 2022లో భాగంగా నిన్న (ఆగస్ట్ 28) దాయాది పాక్తో జరిగిన హైఓల్టేజీ పోరులో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో రోహిత్ సేన.. పాక్ను మట్టికరిపించిన అనంతరం స్టేడియంలో తారసపడిన ఓ ఆసక్తికర పరిణామం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. Why son of India's Home Minister not accepting the National flag? pic.twitter.com/ZSB0P56iLV — Maharashtra Congress (@INCMaharashtra) August 28, 2022 మ్యాచ్ చూసేందుకు వచ్చిన బీసీసీఐ కార్యదర్శి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షా వ్యవహరించిన తీరు అతని తండ్రి ప్రత్యర్ధులకు ఆయుధంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. చిరకాల ప్రత్యర్ధితో నిన్న జరిగిన రసవత్తర పోరులో టీమిండియా విజయానంతరం సంబురాలు అంబరాన్నంటాయి. స్టేడియంలోని ప్రేక్షకులు జాతీయ జెండాలు చేతబూని, సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపిస్తూ భారత దేశ ఖ్యాతి విశ్వమంతా తెలిసేలా ఎలుగెత్తి చాటారు. India Vs Pakistan Match highlights !! 🔥 Amith shah son Jay Shah just rejected India flag… 🔥Why Amit Shah's son Jay Shah doesn't want to celebrate India's win with the tricolour. Is he allergic towards Indian Flag?#IndiaVsPakistan #jayshah pic.twitter.com/I5ZrWGgtqp — Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) August 28, 2022 ఈ క్రమంలో స్టేడియంలోనే ఉన్న జై షాకు ఓ అభిమాని త్రివర్ణ పతాకాన్ని అందించే ప్రయత్నం చేశాడు. ఇందుకు జై షా నిరాకరిస్తూనే.. చప్పట్లు కొడుతూ విజయాన్ని ఆస్వాదించాడు. జై షా ఇలా ప్రవర్తించడం ప్రతి భారత అభిమానికి అగ్రహం తెప్పించింది. జై షా వ్యవహరించిన తీరును అతని తండ్రి ప్రత్యర్ధులు ఏకి పారేస్తున్నారు. కేంద్ర హోం మంత్రి తనయుడి దేశ భక్తి ఇదేనా అంటూ మాటల తూటాలు సంధిస్తున్నారు. ఈ పార్టీ, ఆ పార్టీ అన్న తేడా లేకుండా అందరూ బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. Because he is president of Asian Cricket Council. And as per code of conduct, he has to show neutrality against all stake holders. https://t.co/3SuIl2lj4i — Facts (@BefittingFacts) August 29, 2022 అసలు కారణం ఇది! అయితే జై షా విమర్శించడాన్ని ఆయన ఆప్తులు మాత్రం తప్పుపడుతున్నారు. విషయం తెలుసుకోకుండా విమర్శలు చేయడం సరికాదని మండిపడుతున్నారు. జై షా కేవలం బీసీసీఐ సెక్రటరీ మాత్రమే కాదని.. ఆయన ఆసియా క్రికెట్ కౌన్సిల్కు అధ్యక్షుడు అన్న విషయం తెలుసుకుని మాట్లాడాలని.. కోడ్ ఆఫ్ కండక్ట్లో భాగంగానే అలా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. అయితే ఈ వివరణతో సంతృప్తి చెందని కొందరు మాత్రం జై షాను, ఆయన తండ్రిని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. చదవండి: గంభీర్ను ఎవరూ ఇష్టపడే వారు కాదన్న అఫ్రిది.. భజ్జీ రియాక్షన్పై ఫ్యాన్స్ ఫైర్ -
భారత్కు అంతరిక్ష కేంద్రం నుంచి వెల్లువెత్తిన శుభాకాంక్షలు
India celebrates its Independence Day not world But Space Well: భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేవలం ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా అంతరిక్షం నుంచి కూడా భారత్కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు భారతీయ అమెరికన్ వ్యోమోగామి రాజా చారి ట్విట్టర్లో విదేశాల్లో నివశిస్తున్న భారతీయులకు శుభాకాంక్షల సందేశాలతోపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో భారతీయ జెండా ఫోటోను కూడా పోస్ట్ చేశారు. రాజా చారి ఇటీవల ఐఎస్ఎస్లో ఆరునెలల మిషన్ తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. మే నెలలో గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో సురక్షితంగా ల్యాండ్ చేసిన స్పేఎక్స్ అంతరిక్ష నౌకలో నలుగురు వ్యోమోగాములలో అతను కూడా ఉన్నారు. ఈ మేరకు చారి ట్విట్టర్లో.... " భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నా పూర్వీకుల మూలాలను గుర్తుతెచ్చుకుంటునమ్నాను. వలస వచ్చిన తన తండ్రి స్వస్థలం హైదరాబాద్ ఈ రోజు మెరిసిపోతుంది. యూఎస్లో ఉండే ప్రతి భారతీయ అమెరికన్కి ప్రతిరోజు ఒక వైవిధ్యంగా ఉంటుంది. తాను యూఎస్లోని ఇండియన్ ఎంబసీ వేడుకల కోసం ఎదురుచూస్తున్నాను. అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులందరికి స్వాతంత్య్ర శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు. చారి తాతగారిది తెలంగాణలోని మహబూబ్ నగర్. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో గణిత శాస్త్ర ప్రోఫెసర్గా పనిచేశారు. చారి తండ్రి శ్రీనివాస్ అదే యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివి ఆ తర్వాత అమెరికా వెళ్లారు. ఆ తర్వాత చారీ అక్కడే యూఎస్లోని విస్కాన్సిన్లోని మిల్వాకీలో జన్మించాడు. అయోవాలోని వాటర్లూలో కొలంబస్ హై స్కూల్ నుంచి ప్రాధమిక విద్యను, కొలరాడోలోని యూఎస్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుంచి ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశడు. ఆ తర్వాత అతను కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్స్, ఆస్ట్రోనాటిక్స్లో మాస్టర్స్ డిగ్రీని అందుకున్నాడు. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా కోసం పనిచేస్తున్న రాజా చారి 2017లో వ్యోమోగామిగా ఎంపికయ్యాడు. On Indian Independence eve I’m reminded of Indian diaspora that I could see from @Space_Station where my immigrant father’s home town of Hyderabad shines bright. @nasa is just 1 place Indian Americans make a difference every day. Looking forward to @IndianEmbassyUS celebration pic.twitter.com/4eXWHd49q6 — Raja Chari (@Astro_Raja) August 14, 2022 (చదవండి: భారత్తో పాటు ఇతర దేశాలకు హృదయ పూర్వక కృతజ్ఞతలు) -
Video Viral: జెండా కొంటేనే రేషన్.. తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ: దేశ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జాతీయజెండాను రేషన్కార్డు పేద లబ్ధిదారులతో బలవంతంగా కొనుగోలుచేయిస్తున్న వీడియోపై విమర్శలు వెల్లువెత్తాయి. ‘రూ.20 పెట్టి జెండా కొనాల్సిందే. ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. ఆహారధాన్యాలు కావాలంటే జెండా కొనండి. లేదంటే వెళ్లండి’ అంటూ హరియాణాలోని కర్నాల్లో ఒక రేషన్ షాప్ డీలర్ కరాఖండీగా చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘జాతీయతను బీజేపీ అమ్మకానికి పెట్టింది. పేదల ఆత్మాభిమాన్ని గాయపరిచింది’ అని బీజేపీ సర్కార్ను విమర్శిస్తూ రాహుల్ ఫేస్బుక్లో పోస్ట్పెట్టారు. Forced To Buy Flag To Get Ration, Allege Haryana Villagers https://t.co/QMuJIrA4I9 pic.twitter.com/M50XBXhQnX — NDTV (@ndtv) August 10, 2022 వరుణ్ గాంధీ ఆగ్రహం ‘75వ స్వాతంత్య్రదినోత్సవాల వేళ ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటు. చౌక సరకుల కోసం రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడే పేద ప్రజల కష్టార్జితాన్ని ఇలా చిల్లరగా వసూలుచేయడం దారుణం. త్రివర్ణ పతాకానికి వెల కట్టడం శోచనీయం’ అని వరుణ్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో జాతీయ పండుగ పేదలకు భారంగా మారిందన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలంతా తమ తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని ప్రధాని మోదీ పిలుపునివ్వడం తెల్సిందే. దీని అవకాశంగా తీసుకుని రేషన్ షాపుల వద్ద జెండాల వ్యాపారం చేయిస్తున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. చదవండి: (ఇప్పటికిప్పుడు లోక్సభకు ఎన్నికలొస్తే.. బిహార్లో వారిదే హవా) -
పింగళి 146వ జయంతి ఉత్సవాల్లో సీఎం జగన్ (ఫోటోలు)
-
‘హర్ ఘర్ తిరంగ’పై జవాన్ల సందేశం..12వేల అడుగుల ఎత్తుకు వెళ్లి మరీ..
లద్దాఖ్: భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’లో భాగంగా ‘హర్ ఘర్ తిరంగ’కు పిలుపునిచ్చింది కేంద్రం. ఈ కార్యక్రమంలో దేశ ప్రజలు పాల్గొనాలని కోరారు ఐటీబీపీ జవాన్లు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దేశ సరిహద్దుల్లో 12వేల అడుగుల ఎత్తున త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు పలువురు జవాన్లు. ఆ వీడియోను సరిహద్దు గస్తి దళం ట్విట్టర్లో షేర్ చేసింది. ఆ వీడియోలో.. లద్దాఖ్లోని లేహ్లో భూమి నుంచి 12వేల అడుగుల ఎత్తున ఉన్న కొండ చివరి భాగంలో పలువురు జవాన్లు కూర్చుని ఉన్నారు. జాతీయ పతాకాన్ని చేతబూని రెపరెపలాడిస్తూ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం వైరల్గా మారాయి. ‘భారత్ మాతాకి జై. లద్దాఖ్లో 12వేల అడుగుల ఎత్తున ఐటీబీపీ దళాలు త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాయి. 2022, ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటిలో జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కోరుతున్నాం.’ అని ట్విట్టర్లో రాసుకొచ్చింది ఐటీబీపీ. भारत माता की जय ! ITBP troops with Tricolour at 12 K feet in Ladakh with the message of 'Har Ghar Tiranga' to urge the citizens to hoist the Tricolour or display it in the homes between 13 to 15 August, 2022.#HarGharTiranga #AzadiKaAmrtiMohotsav pic.twitter.com/NpvS5coZY7 — ITBP (@ITBP_official) July 27, 2022 భారత్కు స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్న క్రమంలో హర్ ఘర్ తిరంగా చేపట్టాలని ప్రభుత్వం ప్రజలను కోరింది. దానికి తగినట్లుగా ఫ్లాగ్ కోడ్కు సవరణలు చేసింది. వారంలో రోజంతా జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు వీలు కల్పించింది. అలాగే.. జెండా తయారీకి ఉపయోగించే సామగ్రి, సైజ్లపై ఉన్న నియంత్రణలను సైతం ఎత్తివేసింది. ఆగస్టు 13 నుంచి 15 వరకు నిర్వహిస్తోన్న హర్ ఘర్ తిరంగలో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 20 కోట్ల జెండాలు ఎగురవేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఈడీ పోలీస్ విభాగం కాదు.. అయినా అరెస్టులు సరైనవే: సుప్రీం కోర్టు -
భారత జెండాను టచ్ చేయని రష్యా.. కారణం ఇదే!
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం భీకరంగా సాగుతోంది. యుద్ధ ప్రభావం ఉక్రెయిన్పై తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే అమెరికా,బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఉక్రెయిన్ బాసటగా నిలవడంతో పాటు రష్యాపై ఆంక్షల విధిస్తున్నాయి. అయితే.. భారత్ మాత్రం ఈ విషయంలో తటస్థంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే భారత అనుసరిస్తున్న తీరపై రష్యా కూడా సానుకూలంగా స్పందించింది. తాజాగా రష్యాతో భారత్కి ఉన్న స్నేహబంధం ఎలాంటిదో నిరూపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉక్రెయిన్ విషయంలో రష్యా తీరు మారలేదని కొన్ని దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇందుకు బదులుగా రష్యా తాను చేపడుతున్న ఉపగ్రహ ప్రయోగాలకూ పలు దేశాలను సహాయం అందించకూడదనే ఆలోచనలో ఉంది. అంతేకాదు వన్వెబ్ రాకెట్పై నుంచి అమెరికా, బ్రిటన్, జపాన్ జాతీయ జెండాలను రష్యా తొలగించింది. బైకనోర్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించాల్సిన స్పేస్ రాకెట్ ద్వారా వివిధ దేశాల భాగస్వామ్యంతో 36 వన్ వెబ్ శాటిలైట్లను ప్రయోగించనున్నారు. అయితే, ఈ రాకెట్ పై ఉన్న అమెరికా, బ్రిటన్, జపాన్ జెండాలను తొలగించిన రష్యా.. భారత్ జెండాను మాత్రం అలాగే, ఉంచింది. అంతేకాకుండా రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్ డిమిత్రి రోగోజిన్ ఈ విషయంపై స్పందిస్తూ.. “కొన్ని దేశాల జెండాలు లేకుండా, మా రాకెట్ మందుకంటే అందంగా ఉందని తెలుపుతున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం అంతరిక్షంపైనా ప్రభావం చూపిస్తోందని టెక్నాలజీ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉండబోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Стартовики на Байконуре решили, что без флагов некоторых стран наша ракета будет краше выглядеть. pic.twitter.com/jG1ohimNuX — РОГОЗИН (@Rogozin) March 2, 2022 -
ఉక్రెయిన్లో పాకిస్తాన్ విద్యార్థులను కాపాడిన భారత జెండా!
భారత జాతీయ పతాకం పాకిస్థాన్ పౌరులకు అండగా నిలిచింది. కల్లోలిత ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా బయటపడేందుకు బాసట అయ్యింది. కొందరు టర్కీ విద్యార్థులు కూడా త్రివర్ణ పతాకం సాయంతోనే ఉక్రెయిన్ సరిహద్దులు దాటగలిగారు. ఆపరేషన్ గంగలో భాగంగా భారత్ చేరుకున్న విద్యార్థులు ఈ విషయాన్ని వెల్లడించారు. రష్యా దాడులతో కల్లోలంగా మారిన ఉక్రెయిన్ నుంచి బయటపడేందుకు వేలమంది ప్రయత్నిస్తున్నారు. భారత్ మినహా మరే దేశమూ తమ పౌరులను స్వదేశానికి తరలించేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ఇతర దేశస్థులు కూడా మన జెండానే నమ్ముకుంటున్నారు. పాకిస్థాన్, టర్కీకి చెందిన కొందరు విద్యార్థులు భారత్ జెండాను ప్రదర్శించడం ద్వారా.. ఉక్రెయిన్ సరిహద్దులను సురక్షితంగా దాటగలిగారు. ఉక్రెయిన్లోని భారతీయులను తరలించేందుకు ఆపరేషన్ గంగ పేరుతో కేంద్రం ప్రత్యేక విమానాలు నడుపుతోంది. వాయుసేన రవాణా విమానాలతోపాటు ఎయిరిండియా, స్పైస్జెట్, ఇండిగో సంస్థలు విమానాలు నడుపుతున్నాయి. ఇందులో భాగంగా ప్రత్యేక విమానం అందుకునేందుకు రొమేనియాలోని బుచారెస్ట్కు కొందరు భారత విద్యార్థులు చేరుకున్నారు. భారత జెండాలను పట్టుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనను వారు పాటించారు. మన జెండాను చూపించి ఉక్రెయిన్ సరిహద్దును దాటడం తమకు సులువైందని విద్యార్థులు పేర్కొన్నారు. అయితే, తమను చూసిన కొందరు పాకిస్థాన్, టర్కీ విద్యార్థులు కూడా భారత జాతీయ జెండాను చేతబూని సరిహద్దులను దాటారని వివరించాడు. ఆపరేషన్ గంగలో భాగంగా బుధవారం 4 ఎయిర్ఫోర్స్ విమానాల్లో మొత్తం 798మంది విద్యార్థులు భారత్ చేరుకున్నారు. గురువారం బుకారెస్ట్ నుంచి 8, బుడపెస్ట్ నుంచి 5, జెస్జోవ్ నుంచి 3, సుసీవా నుంచి 2, కోసిస్ నుంచి ఒక విమానం ఢిల్లీకి చేరుకున్నాయి. వీటిలో మొత్తం 3726మంది భారతీయ విద్యార్థులు. పౌరులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. #WATCH | "We were easily given clearance due to the Indian flag; made the flag using a curtain & colour spray...Both Indian flag & Indians were of great help to the Pakistani, Turkish students," said Indians students after their arrival in Bucharest, Romania#UkraineCrisis pic.twitter.com/vag59CcPVf — ANI (@ANI) March 2, 2022 -
Apple: ఏంది యాపిల్ ఇది.. భారత్ అంటే లెక్కేలేదా?
Anupam Kher On Apple: యాపిల్ ఉత్పత్తుల పట్ల భారతీయులకు యమ క్రేజు ఉంటుంది. పైగా ఆ ప్రొడక్టుల కొనుగోళ్లలో భారత్ అతిపెద్ద మార్కెట్ అని తెలిసిన విషయమే కదా. అందుకే తాజాగా జరిగిన అతిపెద్ద ఈవెంట్ను భారత్ నుంచే ఎక్కువ మంది లైవ్లో వీక్షించారు. అయితే యాపిల్ మాత్రం భారత్ విషయంలో లెక్కలేని తనం ప్రదర్శిస్తోందా? అని ప్రశ్నిస్తున్నారు సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్. నటుడు అనుపమ్ ఖేర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. న్యూయార్క్ ఫిఫ్త్ ఎవెన్యూలోని యాపిల్ స్టోర్ను మొన్న మంగళవారం ఆయన సందర్శించారట. అక్కడ ఒలింపిక్స్ కలెక్షన్ పేరుతో కొన్ని వాచీలను డిస్ప్లే ఉంచారు. ఆ వాచీలపై దాదాపు అన్ని జెండాలు ఆయనకు కనిపించాయి. అయితే భారత్ జెండా కనిపించకపోయే సరికి ఆయన చిన్నబుచ్చుకున్నారు. ట్విటర్లో ఓ వీడియో పోస్ట్ పెట్టారు. స్మార్ట్ వాచీ కలెక్షన్ బాగుంది. కెనెడా, ఆసీస్, ఫ్రాన్స్.. జమైకా లాంటి చిన్న దేశాల జెండాలతో కలెక్షన్స్ ఉంచారు. కానీ, అందులో భారత్ జెండా మాత్రం లేదు. ఈ విషయంలో నిరాశ చెందాను.. కారణం ఏమై ఉంటుంది? యాపిల్ ఉత్పత్తులను ఉపయోగించేవాళ్లు భారత్లోనే ఎక్కువగా ఉన్నారు కదా! మరి మా జెండా కనిపించలేదా? అని అసంతృప్తి వ్యక్తం చేశారాయన. ఇదిలా ఉంటే యాపిల్ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో చూడాలి మరి! Dear @Apple! Visited your store on 5th ave in NY! Impressive! There were watches of International Olympic collection representing flags of various countries! Was disappointed not to see INDIA’s watch there? I wonder why? We are one of the largest consumers of #Apple products!😳🇮🇳 pic.twitter.com/IVvB8TmkGU — Anupam Kher (@AnupamPKher) September 14, 2021 చదవండి: ఐఫోన్ 13 లాంఛ్.. ఊహించని ట్విస్ట్ -
జాతీయ జెండా విలువేంటో తెలుసా?
జాతీయ జెండా అంటే.. ప్రతీ దేశానికి ఒక గుర్తింపు. మన మువ్వెన్నెల జెండా.. జాతి ఔనత్యానికి ప్రతీక. స్వాతంత్య్ర పోరాటంలో అసువులు బాసిన వీరుల త్యాగానికి ప్రతీకల్లో ఒకటి. అందుకే జాతీయ పతాకాన్ని గౌరవించుకోవడం మన అందరి బాధ్యత కూడా. పంద్రాగష్టు, గణతంత్ర దినోత్సవాలప్పుడు ఉప్పొంగే దేశభక్తి.. జెండాను గుండెలపైకి చేరుస్తుంది. కానీ, ఈరోజుల్లో అయినా జాతీయ జెండాకు నిజమైన గౌరవం అందుతోందా? అని వజ్రోత్సవాల వేడుకల(75వ) సందర్భంగా సోషల్మీడియా #RespectNationalFlag హ్యాష్ట్యాగ్తో ప్రశ్నిస్తోంది. ఎవరైనా, ఎప్పుడైనా గౌరవానికి భంగం కలగని రీతిలో జాతీయ జెండా(National flag)ను ఎగరేయవచ్చు. 2002 కంటే ముందు భారతీయ పౌరులు స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో జెండా ఎగరేయడానికి వీలుండేది కాదు. కానీ, 2002లో సుప్రీం కోర్టు ఫ్లాగ్ కోడ్ను మార్చింది. మిగిలిన రోజుల్లోనూ జెండాను అవమానం కలగకుండా.. పగటి పూట ఎగరేయవచ్చని స్పష్టం చేసింది. Vande Mataram 🇮🇳 pic.twitter.com/xGsfMMKat3 — Flt Lt Anoop Verma (Retd.) 🇮🇳 (@FltLtAnoopVerma) August 14, 2021 దేశ పండుగల నాడు జెండాను గౌరవించుకోవాలనుకోవడం మంచిదే!. కానీ, ఆ వంకతో రంగుల్ని ప్రదర్శించడం ఎంత వరకు సమంజసం. జెండా అంటే పిల్లలు ఆడుకునే బొమ్మ కాదు. డ్రస్సుల్లో, ముఖానికి రంగులుగా పులుముకోవడం, వాట్సాప్, ఫేస్బుక్కుల్లో ప్రచారం కోసం జెండాపై రాతలు, ఫొటోలతో నింపడం అపవిత్రం చేసినట్లే అవుతుంది. జాతీయ జెండాను అగౌరవపరిచారంటూ ఈ-కామర్స్ సైట్లపై అగ్గిమీద గుగ్గిలం అయ్యేవాళ్లకు.. జాతీయ జెండాను అవమానించడమూ నాన్-బెయిలబుల్ నేరం అని తెలుసో లేదో. జెండాను తిరగేసి ఎగరేయడం, కింద పడుకోబెట్టడం లాంటివి చేస్తే చట్టం సహించదు కూడా. #RespectNationalFlag pic.twitter.com/dq5Ry8gu3O — Brahmaiah (@Brahmai45382593) August 15, 2021 “Our flag does not fly because the wind moves it, it flies with the last breath of each soldier who died protecting it.” Happy Independence day to everyone...#IndiaAt75 #IndependenceDay #15August #स्वतंत्रतादिवस #RespectNationalFlag #AmritMahotsav pic.twitter.com/J6s5nozDsq — Faizal Peraje 🇮🇳 (@Faizal_Peraje) August 15, 2021 జెండా ఎగరేసే ఆత్రుతలో, నిర్లక్క్ష్యంతో ఉల్టా-పల్టా ఎగరేసి అవమానించేవాళ్లు ఎలాగూ ఉంటారు. అది వాళ్ల విచక్షణకే వదిలేద్దాం. కానీ, కమర్షియల్ మార్కెటింగ్, ప్రచారాల కోసం జెండాను ఉపయోగించుకునేవాళ్లు, జెండాలను రోడ్డున పడేసే వాళ్ల సంగతి ఏంటి?. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఎవరూ అతీతులు కాదు.. అంతా జాతీయ పతాకాన్ని-గేయాన్ని గౌరవించి తీరాల్సిందే. పిల్లలకే కాదు.. పెద్దలకూ ఈ విషయంలో పాఠాలు చెబితే బాగుండు. జై హింద్. -ట్విటర్లో ఉవ్వెత్తున ఎగసిన #RespectNationalFlag -
ఔరా అనిపిస్తున్న గుండు సూదిపై రాకెట్..
యలమంచిలి రూరల్: ఏటికొప్పాక హస్తకళలో రాష్ట్రపతి అవార్డు పొందిన శ్రీశైలపు చిన్నయాచారి గుండు సూదిపై జీఎస్ఎల్వీ–ఎఫ్10 రాకెట్ నమూనాను అమర్చి ఔరా అనిపించారు. శ్రీహరికోటలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రయోగించిన జీఎస్ఎల్వీ–ఎఫ్10 రాకెట్ను స్ఫూర్తిగా తీసుకొని మైక్రో ఆర్టుతో అద్భుత కళాఖండాన్ని తయారు చేశారు. గుండు సూది పైభాగంలో బంగారంతో 5 మిల్లీమీటర్ల ఎత్తు, 1.5 మిల్లీమీటర్ల వెడల్పుతో రూపొందించారు. రాకెట్ చివరి భాగంలో భారతదేశం జెండా ఏర్పాటు చేశారు. రాకెట్ను తయారుచేయడానికి రెండు రోజుల సమయం పట్టిందన్నారు. అప్డేట్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్ఎల్వీ)-ఎఫ్10 వాహకనౌక ప్రయోగం విఫలమైంది. -
యూఎస్: వివాదంగా మారిన త్రివర్ణ పతాకం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనాన్ని ముట్టడించిన సమయంలో ప్రవాస భారతీయుడు త్రివర్ణ పతాకాన్ని చేత పట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతున్నాయి. కేరళ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ విన్సెంట్ జావియర్ పాలతింగాల్ (54) ట్రంప్ మద్దతుదారులతో కలిసి మన జాతీయ జెండాని ప్రదర్శించాల్సిన అవసరమేమొచ్చిందని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కానీ విన్సెంట్ మాత్రం తన చర్యని పూర్తిగా సమర్థించుకుంటున్నారు. పలు మీడియా సంస్థలు ఫోన్ ద్వారా ఆయనని ఇంటర్వ్యూ చేసిన సమయంలో అడిగిన ప్రశ్నలకు అత్యంత నిర్లక్ష్యంగా సమాధానాలిచ్చారు. (యూఎస్లో హింసాత్మకం: ట్రంప్ తీరుపై ఆగ్రహం) అందరూ భావిస్తున్న ట్టుగా ట్రంప్ మద్దతుదారులందరూ మూర్ఖులు కాదని నిరూపిం చడానికే తాను జెండా పట్టుకొని వెళ్లానని అంటున్నారు. ‘సాధారణంగా ఎవరైనా నిరసన ప్రదర్శనలకి వెళితే తమ జాతీయ జెండానే మోసుకెళ్తారు. ట్రంప్కి ఇప్పటికీ అంతర్జాతీయంగా మద్దతు ఉంది. ఎందరో భారతీయులు ఆయన అభిమానులుగా ఉన్నారు’’ అని విన్సెంట్ చెప్పారు. ట్రంప్ మద్దతుదారులు అందరూ శాంతియుతంగానే నిరసన ప్రదర్శన నిర్వహించారని, కానీ ఆయన ప్రతిష్టని దిగజార్చడానికి 50 మంది వరకు లెఫ్టిస్టులు నిరసన కారుల్లో కలిసిపోయి బీభత్స కాండ సృష్టించారని ఆరోపించారని విన్సెంట్ అడ్డగోలు వాదనలు చేశారు. వామపక్షాలంటే ద్వేషం : విన్సెంట్ స్నేహితులు విన్సెంట్ జేవియర్ భారత్లో ఉండగా కొన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నారని ఆయన స్పేహితులు చెప్పారు. లెఫ్ట్ పార్టీల పట్ల తీవ్ర ద్వేషభావం ఉండేది. రాజకీయ కారణాలతోనే ఆయన దేశం విడిచి అమెరికా వెళ్లిపోయారని, సాఫ్ట్వేర్ సంస్థని నెలకొల్పి ఆ దేశంలోనే స్థిరపడిపోయారని విన్సెంట్ స్నేహితులు వివరించారు. అమెరికా వెళ్లాక కూడా ఆయన కొన్ని మళయాళీ సంస్థల్లో చురుగ్గా ఉంటూ ట్రంప్ మద్దతుదారుడిగా ఉన్నారు. మువ్వన్నెల జెండా పట్టుకొని నిరసనకు వెళ్లడంతో భారతీయుల ఆగ్రహం చవిచూడాల్సి వచ్చింది. దీంతో ఆయన తన ఫేస్బుక్ ఖాతాలో జెండా పట్టుకొని ఉన్న ఫోటోలను తొలగించారు. -
క్యాపిటల్ హిల్ ఘటన: ‘అక్కడ మన జెండా ఎందుకుంది?’
వాషింగ్టన్: అమెరికాలోని క్యాపిటల్ హిల్ బిల్డింగ్పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. ఇక దీని పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అయ్యింది. పలువురు దేశాధినేతలు ఈ ఘటనను ఖండించారు. ఇక నిరసనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఎందుకంటే ఆ వీడియోలో ఓ వ్యక్తి భారత త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని కనిపించడం గమనార్హం. అయితే ఆ వ్యక్తి ఎవరు? అతడు ఏ పార్టీకి చెందినవాడన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. కానీ అమెరికా ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న నిరసన కార్యక్రమంలో త్రివర్ణపతాకం కనిపించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.(చదవండి: బైడెన్ గెలుపును ధ్రువీకరించిన కాంగ్రెస్) ‘ఇలాంటి ఉద్రిక్త వాతావరణంలో మన జెండా ఎందుకుంది... ఇలాంటి చోట మన మద్దతు అనవసరం అంటున్నారు’ నెటిజనులు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కూడా దీని మీద స్పందించారు. ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేస్తూ.. అక్కడ మన జెండా ఎందుకు ఉందంటూ ప్రశ్నించారు. ఈ పోరాటంలో మనం పాలుపంచుకోవాల్సిన అవసరం అసలే లేదంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే ఈ వీడియో ఈ రోజు జరగిన నిరసనకు సంబంధించిందా.. లేక పాత వీడియోని ఇప్పుడు మళ్లీ పోస్ట్ చేశారా అనేది ప్రస్తుతానికి తెలియలేదు. ఇక అమెరికా కాంగ్రెస్ బైడెన్ని అధ్యక్షుడిగా ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. -
కరీంనగర్ కీర్తి ‘పతాకం’
సాక్షి, కరీంనగర్ : జాతీయ పతాక రెపరెపలు చూస్తుంటే ప్రతి భారతీయుడి మది పులకిస్తుంది. పంద్రాగస్టు, చబ్బీస్ జనవరి రోజు వాడవాడలా జాతీయ జెండా ఎగురవేసి సెల్యూట్ చేస్తే గర్వం గా ఉంటుంది. నిత్యం 150 ఫీట్ల ఎత్తులో జాతీయ జెండాలోని మువ్వన్నెలు కళ్లముందు రెపరెపలాడుతుంటే మేరా భారత్ మహాన్ అంటూ చె య్యేత్తి జైకొట్టాలనిపిస్తుంది. రాష్ట్రంలోనే రెండవ, దేశంలో మూడవ అతిపెద్ద జాతీయ జెండా కరీంనగర్ నడిబొడ్డున ఆవిస్కృతమైతే సంతోషం కట్టలు తెంచుకుంటుంది. ఇంతటి మహాత్తర కార్యక్రమానికి మల్టీపర్పస్ స్కూల్ మైదానం వేదికైంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు జాతీయ జెండా రెపరెపలాడనుంది. కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 150 ఫీట్ల మహా జాతీయజెండాను శుక్రవారం ఆవిష్కరించనున్నారు. స్మార్ట్సిటీగా అవతరించిన కరీంనగర్పై నగర ప్రజలు ఎన్నో ఆశలు పెంచుకున్నా రు. సుందరమైన రోడ్లు, ఇబ్బందిలేని మురుగునీటి వ్యవస్థ, ప్రజలకు సరిపడా తాగునీటి వ్యవస్థలాంటి మౌలిక సదుపాయాలతో పాటు నగరానికి ప్రత్యేకతగా నిలిచే కార్యక్రమాలపై బల్దియా దృష్టిపెట్టింది. ఈక్రమంలో కర్ణాటక, హైదరాబాద్ తర్వాత అత్యంత ఎత్తైన జాతీయజెండాను ఏర్పాటుచేసి కరీంనగర్కు ఐకాన్గా మార్చేందుకు మేయర్ రవీందర్సింగ్ జెండా ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకుని సిద్ధం చేశారు. ‘స్మార్ట్’ పనులు ప్రారంభం.. స్మార్ట్సిటీ ప్రాజెక్టు కింద చేపట్టనున్న మల్టీపర్పస్స్కూల్, సర్కస్గ్రౌండ్ మైదానాల్లో పార్కుల ఏర్పాటుకు అంకురార్పణ జరగనుంది. దేశంలోనే అత్యంత సుందరమైన పార్కుగా మల్టీపర్పస్ గ్రౌండ్ను తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం రూ. 7.20 కోట్ల నిధులు కేటాయించారు. అదే విధంగా సర్కస్గ్రౌండ్లో పార్కు నిర్మాణానికి రూ.3.80 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులకు టెక్నికల్ కమిటీ ఆమోదం తెలుపడంతో శుక్రవారం పనులు ప్రారంభించనున్నారు. జెండావిష్కరణకు ఏర్పాట్లు పూర్తి : మేయర్ ప్రజలు కొంతకాలంగా ఎదురుచూస్తున్న అతిపెద్ద జాతీయజెండా శుక్రవారం రెపరెపలాడనుందని నగర మేయర్ రవీందర్సింగ్ తెలిపారు. అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వెల్లడించారు. జెండాను ఎంపీ వినోద్కుమార్ ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, జెడ్పీచైర్ పర్సన్ తుల ఉమ, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులతో పాటు కలెక్టర్ సర్ఫరాజ్అహ్మద్, సీపీ కమలాసన్రెడ్డి, జేసీ శ్యాంప్రసాద్లాల్, మున్సిపల్ కమిషనర్ స త్యనారాయణ హాజరవుతారని పేర్కొన్నారు. నగరంలోని అన్ని విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాసంఘాలు, నగర ప్రజలు వేడుకలకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. -
హాకీ ప్రపంచకప్ నిర్వాహాకులపై ఫ్యాన్స్ ఫైర్
లండన్ : మహిళల హాకీ ప్రపంచకప్ టోర్నీ నిర్వాహకులపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లండన్ వేదికగా శనివారం నుంచి ఆగస్టు 5 వరకు కొనసాగే ఈ టోర్నీలో రాణి రాంపాల్ నేతృత్వంలోని భారత్ జట్టు పాల్గొంటుంది. అయితే ఈ టోర్నీకి ముందు నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో నిర్వాహకులు ఘోర తప్పిదం చేశారు. భారత జాతీయ పతాకంలో అశోక చక్రాన్ని మరిచారు. దీంతో అభిమానులు టోర్నీ నిర్వహకులపై మండిపడుతున్నారు. టోర్నీ ప్రచారంలో భాగంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఫొటోషూట్లో 16 దేశాలకు చెందిన కెప్టెన్లు పాల్గొన్నారు. మిగతా సారథులతో కలిసి భారత కెప్టెన్ రాణి సైతం ఫొటోషూట్కు హాజరయ్యారు. ఇందులో భాగంగా ఆయా కెప్టెన్లు తమ దేశానికి సంబంధించిన జాతీయ పతాకాల పక్కన నిల్చొని ఫొటోలకు ఫోజులిచ్చారు. అయితే, నిర్వాహకులు భారత జాతీయ పతాకంలో అశోకచక్రాన్ని ఉంచడం మరిచారు. మన జాతీయ పతాకం పక్కన రాణి రాంపాల్ నిల్చున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీంతో భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ప్రతిష్టాత్మక ప్రపంచకప్ టోర్నీలో ఇలాంటి తప్పులు చేయడం ఏమిటని మండిపడుతున్నారు. ఇక పూల్-బిలో చోటు దక్కించుకున్న భారత్ శనివారం తొలి మ్యాచ్ను ఇంగ్లండ్తో తలపడనుంది. Ashok Chakra missing from the Indian flag. Is it a mistake or done intentionally? — Nilesh Tandon (@nileshtandon) July 19, 2018 -
మోదీకి నిరసన సెగ.. జాతీయ జెండాకు అవమానం
లండన్ : ప్రధాని నరేంద్ర మోదీ యూకే పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. భారత జాతీయ జెండాకు ఘోర అవమానం జరిగింది. పాకిస్థాన్ అనుకూల ఖలిస్థాన్ ఆందోళనకారులు భారత జాతీయ జెండాను అవనతం చేసి.. చించి ఆపై తగలబెట్టారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. లండన్లోని వెస్ట్ మినిస్టర్ హాల్లో కామన్వెల్త్ దేశాల అధినేతల శిఖరాగ్ర సదస్సు (చోగమ్) జరిగింది. ఈ సందర్భంగా పార్లమెంటు స్క్వేర్ వద్ద మొత్తం 53 కామన్వెల్త్ దేశాల జెండాలను అధికారులు ఎగుర వేశారు. అయితే మోదీ రాకను వ్యతిరేకిస్తూ పాక్ చెందిన మత గురువు అహ్మద్ నేతృత్వంలో యూకే సిక్కు ఫెడరేషన్కు చెందిన ఖలిస్థాన్ అనుకూల ఆందోళనకారులు, మోదీ వ్యతిరేక మైనారిటీల గ్రూప్కు చెందిన 500 మంది అక్కడికి ర్యాలీగా చేరుకున్నారు. తొలుత వీరంతా అక్కడి మహాత్మగాంధీ విగ్రహం వద్ద జెండాలు, బ్యానర్లు ప్రదర్శించారు. ఆపై జెండా కర్ర నుంచి భారతీయ పతాకాన్ని అవనతం చేసి చించేశారు. ఆపై దాన్ని కాల్చేసి.. అక్కడ పాక్ ఆక్రమిత కశ్మీర్, ఖలిస్థాన్ జెండాలను ఎగురవేశారు. ఇదంతా సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న సమయంలో చోటు చేసుకుంది. లండన్ పోలీసుల తీరుపై విమర్శలు... ఈ ఘటన జరుగుతున్నప్పుడు లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు చూస్తూ ఉండిపోయారే తప్ప.. నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం ఏ మాత్రం చేయలేదు. ఈ ఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న ఓ భారతీయ సీనియర్ జర్నలిస్ట్ చిత్రీకరించగా.. అతనిపై కూడా దాడి చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో అలసత్వం ప్రదర్శించిన లండన్ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. భారతీయ జెండాను తొలగించిన దిమ్మె ఇదే భారత్ స్పందన... జాతీయ జెండాకు జరిగిన అవమానంపై భారత విదేశాంగ అధికార ప్రతినిధి ఒకరు స్పందించారు. ‘జెండాను అవనతం చేసి చించేయడంపై బ్రిటిష్ అధికారులకు మా నిరసన తెలియజేశాం. ఆ ఘటనకు వారు క్షమాపణలు చెప్పారు. ఇటువంటి శక్తులు సమస్యలు సృష్టించవచ్చని ముందు నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నాం. చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఇది చోటు చేసుకోవటం దురదృష్టకరం. ఆ స్థానంలో జాతీయ జెండాను కొత్తది ఏర్పాటు చేశారు’’ అని ప్రధానితోపాటు పర్యటిస్తున్న బృందంలోని అధికారి ఒకరు తెలిపారు. -
ధోని హెల్మెట్పై జెండా ఎందుకు ఉండదంటే..
సాక్షి స్పోర్ట్స్: భారత క్రికెట్ ఆటగాళ్లు ధరించే హెల్మెట్లు ఎప్పుడైనా పరీక్షగా చూశారా? చూసుంటే ఏమైనా కనిపెట్టారా? సచిన్, గంగూలీ, కోహ్లీ, ఇతర ప్రముఖ ఆటగాళ్లు అర్ధ సెంచరీ, సెంచరీలు చేసిన తర్వాత హెల్మెట్ను ముద్దాడం చూశారా? ధోని వారిలాగే ఎప్పుడైనా చేశాడా లేదా? వారందరూ ఎందుకు అలా చేస్తారో తెలుసా? తెలియక పోతే తెలుసుకోండి. వీటన్నింటికి సమాధానం ఒక్కటే.. అదే భారత జెండా. భారత క్రికెట్ ఆటగాళ్ల హెల్మెట్లపై బీసీసీఐ లోగోతో పాటు భారతీయ జెండా ఉంటుంది. దేశం మొత్తం గర్వంగా భావించే జాతీయ జెండాను ధరించడం ఎవరైనా గొప్ప గౌరవంగా భావిస్తారు. అందుచేతనే సచిన్, సెహ్వాగ్లతో పాటు ఇతర ప్రముఖ ఆటగాళ్లు అందరూ సెంచరీ పూర్తి చేయగానే హెల్మెట్ను ముద్దాడతారు. కానీ ధోని మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటాడు. అలా అని ధోనికి దేశభక్తి లేదని కాదు. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. భారత కెప్టెన్గా అలా చేయకపోవడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. భారతీయ ప్రతీకలను అవమానించే నిరోధక చట్టం 1971 కింద ధోని క్రికెట్ ఆడుతున్నప్పుడు భారత జెండాను తలపై ధరించకూడదు. ఎందుకుంటే భారతీయ జెండాను భూమిపై పడేయడం, కాళ్ల కింద ఉంచడం వంటివి చేయడం మాతృభూమి భారతదేశాన్ని అవమానించినట్లే. దేశం మొత్తం తలెత్తి సెల్యూట్ చేయాల్సిన జెండాను నేలపై ఉంచితే, భారతదేశాన్ని అవమానపరిచినట్లే. కీపింగ్ చేస్తున్నప్పుడు ధోని కొన్ని సార్లు హెల్మెట్ను నేలపై ఉంచుతాడు. ఆ సమయంలో హెల్మెట్పై జెండా ఉంటే ధోని భారత దేశాన్ని అవమాన పరిచినట్లు అవుతుంది. ఈకారణంగానే ధోని హెల్మెట్పై భారత జెండా ఉండదు. 2011 వరకూ హెల్మెట్పై భారత జెండాను ధరించిన ధోని, ఆర్మీ లెఫ్టినెంట్గా గౌరవించబడినప్పటి నుంచి ధరించడంలేదు. ఇది దేశంపై ధోనికి ఉన్న గౌరవానికి చిన్న ఉదాహరణ మాత్రమే. -
భారతీయుల హృదయాలను గెలిచాడు
స్విట్జర్లాండ్ : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది భారతీయుల మనసు గెలిచారు. సెయింట్ మోరిట్జ్ ఐస్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా పాలెస్ డైమండ్స్, రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్లు జరిగాయి. ఈ సందర్భంగా రాయల్స్కు కెప్టెన్గా అఫ్రిది వ్యవహరించారు. రెండు మ్యాచ్లు ముగిసిన తర్వాత ఫ్యాన్స్తో ఫొటోలు దిగుతూ, ఆటోగ్రాఫ్లు ఇస్తూ కనిపించారు అఫ్రిది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తనకు ఓ ఫొటో ఇవ్వాలని అఫ్రిదిని భారతీయ ఫ్యాన్ కోరగా.. అందుకు స్పందించిన అఫ్రిది భారత జాతీయ పతాకాన్ని కూడా సరిగా పట్టుకోవాలని ఆమెను కోరారు. మ్యాచ్ సందర్భంగా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. భారత జెండా పట్ల అఫ్రిది చూపిన గౌరవానికి క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. -
గార్లలో దశమి రోజు జాతీయ జెండా
గార్ల(డోర్నకల్): మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో విజయదశమి రోజు శనివారం జాతీయ జెండాను ఆవిష్కరించను న్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గార్ల మండల కేంద్రంలో నిజాం నవాబు కాలం నుంచి జెండా ఆవిష్కరణ ఆనవాయితీగా వస్తోంది. అప్పట్లో స్థానిక మసీదు సెంటర్లో నిజాం అధికారిక జెండాను ఆవిష్కరించేవారు. నిజాం పాలన ముగిసిన తర్వాత 1952లో సదరు గద్దెపై కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కమ్యూనిస్టులు కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో కోర్టు సదరు గద్దెపై దేశభక్తికి చిహ్నంగా జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించింది. దీంతో 1958లో తొలిసారి అప్పటి మున్సిపల్ చైర్మన్ మాటేడి కిషన్రావు జాతీయ జెండాను ఎగుర వేశారు. నాటి నుంచి నేటి వరకు గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, మొదటి పౌరుడు అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. -
జాతీయ జెండాను అవమానించిన చైనా
అల్మోరా: భారత్, చైనాల సంబంధాలపై డోక్లాం వివాదం ఇప్పటికే తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనా మరో క్షమించరాని తప్పు చేసింది. సగటు భారతీయుడు గౌరవంగా చూసుకునే జాతీయ జెండాను బూట్ల డబ్బాలపై ముద్రించింది. ఈ దురదృష్టకర ఘటన ఉత్తరాఖండ్ అల్మోరాలో చోటు చేసుకుంది. చైనా నుంచి వచ్చిన బూట్ల డబ్బాలపై మన జాతీయ పతాకంలో ఉండే మూడు రంగులతో బొమ్మలు ఉన్నాయని స్థానిక దుకాణదారుడు పోలీసులను ఫిర్యాదు చేశారు. బూట్లను పంపిన పెట్టెల పైభాగంలో మూడు రంగుల జెండా, అడుగున మాండరిన్ భాషలో పదాలు రాసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డోక్లామ్ వివాదం నేపథ్యంలో భారతీయుల మనోభావాలను దెబ్బతీసేలా చైనా మరో కుట్ర పన్నినట్లు భావిస్తున్నారు. కిరాణా దుకాణదారుడు చేసిన ఫిర్యాదు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు అల్మోరా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) రేణుకా దేవి తెలిపారు. బూట్లను దుకాణదారుడికి సరఫరా చేసిన రుద్రపూర్లోని తమ్మన ట్రేడర్స్ యాజమాన్యాన్ని ప్రశ్నించినట్లు ఉద్దమ్ సింగ్నగర్ ఎస్ఎస్పీ సదానంద్ దతే చెప్పారు. న్యూఢిల్లీలోని సరఫరాదారు నుంచి తెప్పించామని, ఎక్కడ ఉంటారనే విషయం తమకు తెలియదని ట్రేడర్స్ యాజమాన్యం చెప్పినట్లు ఎస్ఎస్పీ వివరించారు. త్వరలోనే న్యూఢిల్లీ సరఫరాదారును గుర్తించి ప్రశ్నిస్తామని వెల్లడించారు. -
భారత పతాకం రెపరెపలాడాలి
అనంతపురం సప్తగిరి సర్కిల్: అంతర్జాతీయస్థాయి క్రీడా పోటీల్లో భారత పతాకాన్ని రెపరెపలాడించాలని ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ నిర్మల్కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం అనంత క్రీడా గ్రామంలోని విన్సెంట్ క్రీడా మైదానంలో జిల్లా నుంచి భారత సాఫ్ట్బాల్ జట్టుకు ఎంపికైన క్రీడాకారులకు, సీనియర్ బాల, బాలికల జట్లకు క్రీడా దుస్తుల పంపిణీ జరిగింది. ముఖ్య అతిథి ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ మాట్లాడుతూ జిల్లా నుంచి ఈ నెల 9 నుంచి 11 వరకు సింగపూర్లో జరిగే ఏషియా ఫసిపిక్ టోర్నీలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించడం చాలా హర్షించదగ్గ విషయమన్నారు. ఈ నెల 8 నుంచి 10 వరకు పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో జరిగే సీనియర్ సాఫ్ట్బాల్ టోర్నీలో పాల్గొనే జట్టుకు ఆయన అభినందనలు తెలిపారు. విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు, ప్రభాకర్, కేశవమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
పాక్ సరిహద్దుల్లో.. అత్యంత ఎత్తయిన పతాకం
దేశంలోనే అత్యంత ఎత్తయిన జాతీయ పతాకం ఎక్కడుంది అంటే.. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో అని చెప్పబోతున్నారా? ఒక్క క్షణం ఆగండి. ఎందుకంటే భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లోని అటారీ సమీపంలో మన దేశంలోనే ఇంతవరకు అత్యంత ఎత్తయిన జాతీయపతాకాన్ని సోమవారం ఉదయం ఆవిష్కరించారు. దీని ఎత్తు 360 అడుగులు. జెండా పొడవేప 12 అడుగులు ఉంటుందని చెబుతున్నారు. ఇంతకుముందు జార్ఖండ్ రాజధాని రాంచీలో 293 అడుగుల ఎత్తులో జాతీయ పతాకం ఉంది. అంతకంటే ఎత్తయిన పోల్, పెద్ద జెండా తెలంగాణలో ఎగురవేయాలన్న సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు నెక్లెస్రోడ్డులో 300 అడుగుల ఎత్తున ఓ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కోల్కతాకు చెందిన స్కిప్పర్ కంపెనీ దీన్ని ఏర్పాటుచేసింది. ఇప్పుడు దానికంటే మరో 60 అడుగులు ఎక్కువ ఎత్తులో అమృతసర్ వద్ద ఈ కొత్త జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. -
గణతంత్ర దినోత్సవాన చంద్రుడిపై త్రివర్ణ పతాకం
గూగుల్ లూనార్ ఎక్స్ప్రైజ్ కోసం టీం ఇండస్ పోటీ రాకెట్ కోసం ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ న్యూఢిల్లీ: చంద్రుడిపై 2018 భారత గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను నిలిపేందుకు ‘టీం ఇండస్’ అనే అంతరిక్ష ప్రయోగాల స్టార్టప్ కంపెనీ ప్రయత్నిస్తోంది. ‘గూగుల్ లూనార్ ఎక్స్ప్రైజ్’ పోటీలో గెలవడంలో భాగంగా టీం ఇండస్ ఈ ప్రయోగం చేపడుతోంది. ఏవైనా ప్రైవేటు సంస్థలు సొంతంగా డబ్బు సమకూర్చుకుని అంతరిక్ష వాహక నౌకను చంద్రుడిపైకి పంపి, 500 మీటర్లు దానిని చంద్రుడిపై ప్రయాణింపజేసి, అది తీసిన అధిక నాణ్యత కలిగిన వీడియో, ఫొటోలను భూమికి చేరవేయగలిగితే గూగుల్ పోటీని గెలవొచ్చు. 25 మిలియన్ డాలర్లు బహుమతిగా లభిస్తాయి. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకోకూడదు. ప్రపంచవ్యాప్తంగా 30 కంపెనీలు గూగుల్ లూనార్ ఎక్స్ప్రైజ్ కోసం పోటీ పడుతుండగా భారత్ నుంచి టీం ఇండస్ మాత్రమే పోటీలో ఉంది. తమ అంతరిక్ష వాహక నౌకను 2017 చివర్లో పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా చంద్రుడిపైకి పంపేందుకు టీం ఇండస్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)తో ఇటీవలే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో పోటీలో ఉన్న 30 కంపెనీల్లో ప్రయోగానికి రాకెట్ను సమకూర్చకున్న తొలి సంస్థగా టీం ఇండస్ నిలిచింది. ఈ ప్రాజెక్టుకు 60 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతాయనీ, ఇప్పటికి 15 మిలియన్ డాలర్లు సమకూరగా, వచ్చే ఏడాది అక్టోబరుకల్లా మరో 45 మిలియన్ డాలర్లను సేకరించాల్సి ఉందని టీం ఇండస్ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ జూలియస్ అమృత్ చెప్పారు. -
139 అడుగుల జాతీయ పతాకం
పాతపోస్టాఫీస్: భారత జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య 139వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. పాతనగరం వాడవీధికి చెందిన స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగ్గా.. డాక్టర్ జహీర్ అహ్మద్, యువభారత్ ఫోర్స్ అధ్యక్షుడు మహ్మద్ సాదిక్ పాల్గొని పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం 139 అడుగుల జాతీయ పతాకంతో పాతనగరం వాడవీధి, లక్ష్మి టాకీస్ కూడలి, టౌన్ కొత్తరోడ్డు, కురుపాం మార్కెట్ మీదుగా సీమరాణి బొమ్మ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాదచారులు, మహిళలు, యువత స్వచ్ఛందంగా పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు. -
హిందూ సన్యాసులందరూ జాతి వ్యతిరేకులే
పట్నా: విదాస్పద బిహార్ నేత, మధేపురా ఎంపీ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి రాజకీయ నాయకులు, అధికారులను ఎవరైనా కొట్టి చంపితే వారికి రూ. 10 లక్షలు నజరానా ఇస్తానని ప్రకటించిన ఆయన ఈ సారి తన మాటల యుద్ధాన్ని హిందు సాధువులు, సన్యాసులపై ఎక్కుపెట్టారు. హిందూ సన్యాసులందరూ జాతి వ్యతిరేకులే అంటూ వివాదాన్ని రగిలించారు. దీంతోపాటుగా జాతి వ్యతిరేక నినాదాలు చేయడం, జమ్ము కశ్మీర్ లో జాతీయ పతాకాన్ని తగుల బెట్టడం తప్పుకాదని వ్యాఖ్యానించి రాజేశ్ రంజన్ మరో వివాదానికి తెరలేపారు. బిహార్ లో సోమవారం మీడియాతో మాట్లాడిన పప్పూ హిందూ సన్యాసులు, సాధువులపై ధ్వజమెత్తారు. హిందూ సాధువులందరూ జాతి వ్యతిరేకులనీ, అందుకే పేదలు దేవాలయాలకు వెళ్లడం మానుకోవాలని పిలుపునిచ్చారు. వారి దోపిడీ దౌర్జన్యాల నుంచి కాపాడుకునేందుకు పేదలు గుళ్లకు వెళ్లకుండా వుండాలన్నారు. కాగా అయిదుసార్లు ఎంపీగా గెలిచిన పప్పూ యాదవ్ పై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. అటు సౌపాల్ నియోజకవర్గం నుంచి ఆయన భార్య రంజీత్ రంజన్ కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందారు. లాలూతో విభేదించిన రాజేశ్ రంజన్ ఆర్జేడీ నుంచి బయటకొచ్చి 2015 అసెంబ్లీ ఎన్నికల్లో మధేపురా ఎంపీగా ఎన్నికయ్యారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన పప్పూ యాదవ్ జన అధికార పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. -
ఎఫ్బీ అకౌంట్ హ్యాక్ చేసి.. మార్ఫింగ్ ఫొటో పెట్టారు!
న్యూఢిల్లీ: దేశద్రోహం ఆరోపణలపై జైలుపాలైన జెఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్యకుమార్ ఫేస్బుక్ ఖాతాను హ్యాక్ చేసినట్టు తెలుస్తోంది. ఆయన ప్రొఫైల్ పిక్చర్ను మార్చి.. దానిస్థానంలో సైనికులు జాతీయ జెండాను ఎగురవేస్తున్న ఫొటోను పెట్టారు. కన్హయ్యకుమార్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉండగా.. ఆయన ప్రొఫైల్ పిక్చర్ను శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో అప్డేట్ చేసినట్టు చూపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆయన ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ చేశారని భావిస్తున్న ఆయన మద్దతుదారులు ఈ వ్యవహారంపై ఢిల్లీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. జెఎన్యూ వివాదంలో 'దేశద్రోహం' ఆరోపణలపై అరెస్టయిన కన్హయ్యకుమార్ ఫేస్బుక్ ఖాతాలో జాతీయవాది ముద్రను కలిగించేందుకు దానిని హ్యాక్ చేసి మార్చినట్టు తెలుస్తున్నది. నిజానికి కన్హయ్య అకౌంట్లో సీపీఎం లోగో ముందు ఆయన నిలబడి ఉన్న ఫొటో ప్రొఫైల్ పిక్చర్గా ఉండేది. దీని స్థానంలో పెట్టిన భారత జాతీయ జెండా ఫొటో కూడా ఫొటోషాప్ చేసి మార్పులు చేసినది కావడం గమనార్హం. అమెరికా సైనికులు తమ దేశ జెండాను నిలబెడుతున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటోను మార్ఫింగ్ చేసి.. కలర్ లో ఉన్న భారత జాతీయ జెండాను అమెరికా జెండా స్థానంలో ఉంచారు. కన్హయ్యకుమార్ అకౌంట్ హ్యాక్ చేసి.. ఈ ఫొటో పెట్టడంపై ఆయనకు మద్దతుదారులైన విద్యార్థులు మండిపడుతున్నారు. కన్హయ్యకుమార్ విడుదల చేయాలని ఆందోళన కొనసాగిస్తున్న వారు.. ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. -
మోదీ భేటీలో త్రివర్ణ పతాకం తిరగబడింది!
-
మోదీ భేటీలో త్రివర్ణ పతాకం తిరగబడింది!
కౌలాలంపూర్: కౌలాలంపూర్లో జరుగుతున్న ఆసియన్ సదస్సులో భారత్కు ఇబ్బందికర పరిణామం ఎదురైంది. భారత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, జపాన్ ప్రధాని షిన్జో అబె ఇరుదేశాల ద్వైపాక్షిక చర్చలకు ముందు ఫొటోల కోసం మీడియాకు ఇచ్చిన సమావేశంలో భారత జాతీయ పతాకం తిరగేసి ఎగురవేయడం కనిపించింది. చర్చలకు ముందు లాంఛనంగా మోదీ-అబె కరచాలనం చేస్తుండగా.. వారి వెనుక రెండు దేశాలు జెండాలు ఎగరేసి ఉన్నాయి. భారత జాతీయ త్రివర్ణ పతాకంలో మొదట కాషాయ వర్ణం, మధ్యలో తెలుపు రంగు, చివరన ఆకుపచ్చ వర్ణం ఉంటాయి. తిరగేసి ఎగురవేయడంతో మొదట ఆకుపచ్చ రంగుతో జాతీయ జెండా కనబడింది. అధికార వర్గాలు ఆదరాబాదరాగా ఏర్పాట్లు చేయడంతో ఏమారపాటు వల్లో, ఆ జాగ్రత్త వల్లో ఇలా జరిగిందని, ఇది దురదృష్టకరమని ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. కౌలాలంపూర్లో జరుగుతున్న 13వ ఆసియన్-భారత్ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ- జపాన్ ప్రధాని అబెతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. -
వేడుక చేసుకుందాం!
-
Who is the next President of Indonesia?
1. Which country will host the IBSA Summit in 2015? 1) India 2) Brazil 3) South Africa 4) Singapore 5) Australia 2. Who won the German Grand Prix car racing on July 20, 2014? 1) Lewis Hamilton 2) Nico Rosberg 3) Sebastian Vettel 4) Fernando Alonso 5) Daniel Ricciardo 3. The five BRICS countries agreed to set up the New Development Bank (NDB) with a capitalization of $100 billion. The headquarters of the Bank will be in? 1) Beijing 2) Hong Kong 3) Shanghai 4) New Delhi 5) Fortaleza 4. Who was declared the winner of Indonesia's Presidential election on July 22, 2014? (He will take office on October 20, 2014) 1) Prabowo Subianto 2) Jusuf Kalla 3) Fauzi Bowo 4) Joko Widodo 5) None of these 5. The first President of the New Development Bank (NDB) shall be from? 1) Brazil 2) Russia 3) China 4) South Africa 5) India 6. Who was appointed the Brand Ambassador of Telangana State in July 2014? 1) Saina Nehwal 2) V.V.S. Laxman 3) Sania Mirza 4) Gagan Narang 5) None of these 7. Who won his first British Open Golf title of his career on July 20, 2014? 1) RoryMcIlroy 2) Rickie Fowler 3) Sergio Garcia 4) Adam Scott 5) Marc Leishman 8. Who is the Indian flag bearer at the opening ceremony of the 20th Commonwealth Games in Glasgow on July 23, 2014? 1) Abhinav Bindra 2) Yogeshwar Dutt 3) Dipika Pallikal 4) Vijay Kumar 5) Saurav Ghosal 9. Environmentalist and social activist Chandi Prasad Bhatt is associated with which of the following movements? 1) Save Silent Valley 2) Narmada Bachao Andolan 3) Save Kudremukh 4) Chipko movement 5) Sarvodaya movement 10. The President Pranab Mukherjee awarded the International Gandhi Award for the year 2013 on February 15, 2014 to? 1) Vijaykumar Vinayak Dongre 2) Guocheng Zhang 3) Ela Gandhi 4) Both 1 and 2 5) All 1, 2 and 3 11. Eminent Hindi writer Vishwan- ath Tripathi has been selected for the Vyas Samman for 2013 for his book? 1) Dhool Paudho Par 2) Abhi Bilkul Abhi 3) Vyomkesh Darvesh 4) Yahan Se Dekho 5) None of these 12. Renaud Lavillenie established a new pole vault indoor world record by clearing 6.16 meters on February 15, 2014. He is a Olympic champion from? 1) Russia 2) France 3) Spain 4) Ukraine 5) Germany 13. Chandi Prasad Bhatt is the founder of which of the following organizations? 1) Barefoot College 2) Krishak Mukti Sangram Samiti 3) Mazdoor Kisan Shakti Sangathan 4) Dasholi Gram Swarajya Sangh 5) None of these 14. Who became only the second cricketer to hit a triple century and a century in the same Test match on February 7, 2014? 1) Joe Root 2) Alastair Cook 3) Mahela Jayawardane 4) Kumar Sangakkara 5) Michael Clarke 15. Who became the first captain to have participated in four one day international tied matches in January 2014? 1) George Bailey 2) Alastair Cook 3) Mahendra Singh Dhoni 4) Graeme Smith 5) AB de Villiers 16. Amar Kant, Jnanpith Award winner in 2009, passed away on February 17, 2014. He was a writer in which of the following languages? 1) Urdu 2) Hindi 3) Sanskrit 4) Odia 5) Kannada 17. Sudhir Mahato died on January 22, 2014. He was the former deputy Chief Minister of? 1) Jharkhand 2) Bihar 3) Chhattisgarh 4) Madhya Pradesh 5) Haryana 18. Telugu film actor Akkineni Nageswara Rao passed away on January 22, 2014. He won the Dada Saheb Phalke award in? 1) 1986 2) 1987 3) 1988 4) 2009 5) 1990 19. Euthanasia or mercy killing is legal in which of the following countries? 1) Netherlands 2) Belgium 3) Luxembourg 4) Both 1 and 2 5) All 1, 2 and 3 20. Who was appointed as the Chairperson of the Board of Governors of the Indian Institute of Management-Bangalore (IIM-B) in February 2014? (She replaced Mukesh Ambani) 1) Chanda Kochhar 2) Nainalal Kidwai 3) Mallika Srinivasan 4) Kiran Mazumdar-Shaw 5) Vineeta Bali 21. Yale University released the 2014Environmental Performance Index (EPI), ranking 178 countries. Which country topped the list? 1) Switzerland 2) Luxembourg 3) Australia 4) Singapore 5) Czech Republic 22. What is India's rank at the 2014 Environmental Performance Index? 1) 77 2) 155 3) 118 4) 73 5) 148 23. Which country finished at the bottom of the 2014 Environ- mental Performance Index with 178th rank? 1) Afghanistan 2) Lesotho 3) Haiti 4) Mali 5) Somalia 24. South Sudan's government and rebels signed a ceasefire agreement on January 23, 2014 in Addis Ababa, the capital city of? 1) Somalia 2) South Sudan 3) Sudan 4) Angola 5) Ethiopia 25. Hamad bin Isa Al Khalifa visited India in February 2014. He is the King of which of the following countries? 1) Kuwait 2) Saudi Arabia 3) United Arab Emirates 4) Oman 5) Bahrain 26. The University of Cumbria is the first public university in the world to accept the digital currency bitcoin for tuition fees. This university is in? 1) UK 2) USA 3) Australia 4) Mexico 5) Canada 27. Erlan Abdyldaev visited India in February 2014. He is the Foreign Minister of? 1) Turkmenistan 2) Kyrgyzstan 3) Kazakhstan 4) Uzbekistan 5) Ukraine 28. The Union Government has set up an expert committee to study and examine the demand of a separate Bodoland State to be carved out of? 1) Uttar Pradesh 2) West Bengal 3) Nagaland 4) Assam 5) Arunachal Pradesh 29. To study the demand of a separate Bodoland State, the government has set up a one-man expert committee of former Union Home Secretary? 1) V.K. Duggal 2) R.K. Singh 3) Naresh Chandra 4) G.K. Pillai 5) Madhukar Gupta 30. The Andhra Pradesh Reorgani- zation Bill, 2014 was passed by the Lok Sabha on? 1) February 13 2) February 16 3) February 15 4) February 17 5) February 18 31. The Andhra Pradesh Reorgani zation Bill, 2014 was passed by the Rajya Sabha on? 1) February 18 2) February 19 3) February 20 4) February 21 5) February 22 32. Which of the following committees had recommended setting up of the Equal Opportunities Com- mission (EOC) for minorities? 1) Justice Sachar Committee 2) Justice Ranganath Mishra Committee 3) Justice Sri Krishna Committee 4) Justice J.S. Verma Committee 5) None of these 33. The Green India Mission aims to improve and increase India's diminishing forest cover. What is the total expenditure envisaged for this scheme in the 12th five-year plan period? 1) Rs 21,000 crore 2) Rs 15,000 crore 3) Rs 13,000 crore 4) Rs 46,000 crore 5) Rs 27,000 crore 34. The Union Government will provide what percent of the funds for implementing the Green India Mission scheme in the north eastern states? 1) 50 percent 2) 75 percent 3) 100 percent 4) 90 percent 5) 60 percent 35. Who is the author of the book "Maverick Unchanged, Unrepen- tant"? 1) Soli Sorabjee 2) Prashant Bhushan 3) Ram Jethmalani 4) Shanti Bhushan 5) A.G.Noorani 36. The National Waqf Development Corporation Limited (NAWADCO) is a new central public sector enterprise under the Ministry of? 1) Home Affairs 2) Overseas Indian Affairs 3) Corporate Affairs 4) Law and Justice 5) None of these 37. World Autism Awareness Day is observed every year on? 1) June 2 2) July 2 3) August 2 4) April 2 5) May 2 38. In the event of a bank failure, the Deposit Insurance and Credit Guarantee Corporation (DICGC) protects bank deposits that are payable in India. Which of the following types of deposits are insured by the DICGC? 1) Deposits of foreign governments 2) Deposits of central/state governments 3) Inter bank deposits 4) All 1, 2 and 3 5) None of the above 39. What is the currency of Colombia? 1) Colon 2) Sucre 3) Euro 4) Peso 5) Franc 40. QIP is a capital raising tool. QIP stands for? 1) Qualified Initial Proposal 2) Qualified Institutional Propo sal 3) Qualified Initial Placement 4) Qualified Institutional Place- ment 5) None of these KEY 1) 1; 2) 2; 3) 3; 4) 4; 5) 5; 6) 3; 7) 1; 8) 4; 9) 4; 10) 4; 11) 3; 12) 2; 13) 4; 14) 4; 15) 3; 16) 2; 17) 1; 18) 5; 19) 5; 20) 4; 21) 1; 22) 2; 23) 5; 24) 5; 25) 5; 26) 1; 27) 2; 28) 4; 29) 4; 30) 5; 31) 3; 32) 1; 33) 3; 34) 4; 35) 3; 36) 5; 37) 4; 38) 5; 39) 4; 40) 4.