Indian wrestler
-
తొలిసారి అసెంబ్లీకి.. హర్యానా ఎన్నికల్లో వినేశ్ ఫోగట్ విజయం
హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. క్షణక్షణం.. రౌండ్ రౌండ్ అధిక్యాలు తారుమారు అవుతుండటంతో తుది గెలుపు ఎవరిదో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల బీజేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ కొనసాగుతోంది.తాజాగా భారత రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన వినేశ్ ఫొగట్ హర్యానా ఎన్నికల్లో విజయం సాధించారు. జులానా నియోజవర్గంలో తమ ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్పై 5763 ఓట్ల తేడాతో వినేశ్ పైచేయి సాధించారు. తొలి నుంచి లీడ్లో కొనసాగిన రెజ్లర్ వినేష్ ఫోగట్.. మధ్యలో వెనుకంజలోకి వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ పుంజుకొని విజయాన్ని ఆమె ఖాతాలో వేసుకున్నారు. #WATCH | #HaryanaElections | Jind: After winning from Julana, Congress candidate Vinesh Phogat says, "This is the fight of every girl, every woman who chooses the path to fight. This is the victory of every struggle, of truth. I will maintain the love and trust that this country… pic.twitter.com/glAaySd6Ta— ANI (@ANI) October 8, 2024 దీంతో తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వినేశ్.. హర్యానా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. వినేశ్ విజయంపై రెజ్లర్ బజరంగ్ పునియా అభినందనలు తెలిపారు. కాగా ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో వినేశ్ ఫొగాట్ అనర్హతకు గురైన సంగతి తెలిసిందే. 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఆమె ఒట్టి చేతులతో స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ తరువాత కొన్ని రోజులకే ఆమె కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. జులానా నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు.ఇదిలా ఉండగా హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 46 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ఇప్పటికే మేజిక్ ఫిగర్ను దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది..మూడో సారి అధికారం చేపట్టే దిశగా కమలం పార్టీ అడుగులు వేస్తోంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ 50, కాంగ్రెస్ 34, ఇతరులు 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. చదవండి: హర్యానా కౌంటింగ్ అప్డేట్లో జాప్యం.. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు -
Court of Arbitration for Sport: ఒక్క గ్రాము ఎక్కువున్నా అనర్హతే
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే క్రీడాకారులు నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్) సూచించింది. పారిస్ ఒలింపిక్స్లో 100 గ్రాముల అధిక బరువు ఉందనే కారణంగా భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్పై అనర్హత వేటు వేయగా... కేవలం వంద గ్రాములే కదా దీన్ని మినహాయించండి అని భారత అథ్లెట్ సీఏఎస్ను ఆశ్రయించింది. వాదనలు విన్న అనంతరం తీర్పును పలుమార్లు వాయిదా వేసిన సీఏఎస్ ఈనెల 14న వినేశ్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు ఏకవాక్యంలో తీర్పు ఇచి్చంది. ఇప్పుడు తాజాగా దీనిపై వివరణ ఇచి్చంది. ‘క్రీడాకారులకు నిబంధనలపై పూర్తి అవగాహన ఉండాలి. బరిలోకి దిగే బరువు కేటగిరీ కంటే ఎక్కువ ఉంటే అనుమతించరు. అది అందరికీ వర్తిస్తుంది. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు. నిరీ్ణత బరువు కంటే ఒక్క గ్రాము ఎక్కువ ఉన్న అనర్హత వేటు ఎదుర్కోవాల్సిందే. అందుకే పోటీపడే కేటగిరీ కంటే కాస్త తక్కువే ఉండాలి తప్ప ఎక్కువ ఉండకూడదు. దరఖాస్తు చేసుకున్న అథ్లెట్ (వినేశ్ ఫొగాట్ను ఉద్దేశించి) తాను అధిక బరువు ఉన్నానని స్పష్టంగా పేర్కొంది. ఇందులో ఎలాంటి వివాదం లేదు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా పొందుపరిచింది. దరఖాస్తుదారు అనుభవమున్న రెజ్లర్. గతంలో ఇలాంటి నిబంధనల నడుమ పోటీపడింది. రూల్స్ అర్థం చేసుకోలేకపోయిందనే సమస్యే తలెత్తదు. అయితే ఆమె అభ్యర్థన ఏంటంటే.. 100 గ్రాములు బరువు ఎక్కువ కాదని.. రుతుస్రావానికి ముందు దశలో అధికంగా నీరు తాగడం వల్లే ఇలా జరిగిందని.. తగిన సమయం లేనందు వల్లే బరువు తగ్గించలేకపోయానని.. మినహాయింపు ఇవ్వాలని కోరింది’ అని సీఏఎస్ సోమవారం వివరణ ఇచి్చంది. కాగా మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో వరుస విజయాలతో ఫైనల్ చేరిన వినేశ్.. తుది పోరుకు ముందు 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురై ఒలింపిక్ పతకానికి దూరమైంది. తొలి రోజు పోటీల్లో నిరీ్ణత బరువుతోనే పోటీపడి విజయాలు సాధించినందుకుగానూ... క్యూబా రెజ్లర్ గుజ్మన్ లోపెజ్తో కలిపి తనకూ రజతం ఇవ్వాలని వినేశ్ న్యాయపోరాటం చేసింది. పలు అంతర్జాతీయ టోర్నీల్లో రెండు కేజీల అధిక బరువు ఉన్నా యూడబ్ల్యూడబ్ల్యూ వారిని అనుమతిస్తోందని.. దీంతో వంద గ్రాములే కాబట్టి మినహాయించాలని సీఏఎస్లో అప్పీలు చేసింది. దీనికి భారత ఒలింపిక్ కమిటీ మద్దతిచ్చి నిష్ణాతులైన న్యాయ నిపుణులను నియమించింది. అయినా నిబంధనలు అందరికీ ఒక్కటే అని స్పష్టం చేసిన సీఏఎస్.. వినేశ్ అప్పీల్ను కొట్టేసింది. దీంతో దిగ్గజ రెజ్లర్ యూ సుసూకీపై విజయంతో సంచలనం సృష్టించడంతో పాటు.. ఒలింపిక్స్ ఫైనల్కు చేరిన తొలి మహిళా రెజ్లర్గా రికార్డుల్లోకెక్కిన వినేశ్కు నిరాశే ఎదురైంది. -
రెజ్లర్ వినేష్ ఫోగట్ అప్పీల్ పై తీర్పు వాయిదా
-
ఒలింపిక్స్లో 57 కిలోల రెజ్లింగ్ విభాగంలో కాంస్య పతకం గెలిచిన భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో కాంస్యం
-
రాజ్యసభలో తీవ్ర రగడ
న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్పై అనర్హత వేటు అంశం పట్ల రాజ్యసభలో అలజడి రేగింది. ప్రతిపక్ష సభ్యులు, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. వినేశ్ ఫోగాట్ అంశంపై సభలో చర్చించేందుకు చైర్మన్ అనుమతి ఇవ్వకపోవడంపై విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ జగదీప్ ధన్ఖడ్ సభ నుంచి వెళ్లిపోయారు. ఎగువ సభ గురువారం ఉదయం ప్రారంభం కాగానే ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. వినేశ్ ఫోగాట్పై అనర్హత అంశంపై తక్షణమే చర్చించాలని పట్టుబట్టారు. అందుకు ధన్ఖడ్ అంగీకరించకపోవడంతో తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ ఆయనతో వాగ్వాదానికి దిగారు. డెరెక్ ఓబ్రెయిన్తోపాటు విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండడంతో సభలో గందరగోళం నెలకొంది. ఫోగాట్పై చర్చించేందుకు ధన్ఖడ్ అనుమతి ఇవ్వకపోవడంతో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. విపక్ష ఎంపీల తీరు పట్ల ధన్ఖడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ఉండలేనని చెప్పారు. భారమైన హృదయంతో సభ నుంచి నిష్కృమిస్తున్నానని తెలిపారు. -
భారత మహిళా రెజ్లర్ అంతిమ్ పంఘాల్పై మూడేళ్ల నిషేధం
-
మనసు గెలిచింది- ఆ వంద గ్రాములు లెక్కే అంటారా?
నవ్వుతూ మాట్లాడకూడదు. నచ్చిన డ్రెస్ అసలే వేసుకోకూడదు. హవ్వ.. అబ్బాయిల్లా ఆ ఆటలు ఏంటి? ఏమ్మా నువ్వైనా నీ బిడ్డకు చెప్పవచ్చు కదా! అసలే తండ్రి లేని పిల్ల... ఇలాంటివి మీకు అవసరమా? సూదుల్లా గుచ్చే ఇరుగు పొరుగు మాటలు లెక్కచేయలేదు– ఆ తల్లీ.. కూతురు తల్లి ఎంతటి ధైర్యశాలో కూతురికి తెలుసు. 32వ ఏటనే భర్తను కోల్పోయినా ఇద్దరు కూతుళ్లను గొప్పగా పెంచింది. ఆడపిల్లలు బలహీనులని భావించక మగాళ్ల గోదాలో రెజ్లర్లుగా దించింది. క్యాన్సర్ బారిన పడ్డా కూతుళ్ల కోసం యముడితో పోరాడి బయటపడింది. అవును... ఆ తల్లిని చూసి పోరాడటం నేర్చుకుంది ఆ కూతురు... వినేశ్ ఫొగట్ డాటరాఫ్ సరళాదేవి.‘పట్టు’ పడితే పతకం మెడలో వాలాల్సిందే. అన్యాయం చేసిన వాళ్ల తాట తీయాల్సిందే. న్యాయపోరాటంలో మొండిగా ముందుకు దూకాల్సిందే. నాన్న లేడని అమ్మను వంకర చూపులు చూసే వాళ్ల తోడేలుతనం ఆమె దృష్టిని దాటి పోలేదు. ఆడవాళ్లకు అదెంత వేదనో స్వయంగా చూసింది. అందుకే తోటి మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులకు గురయ్యామని చెబితే వారికి మద్దతుగా నిలిచింది. కెరీర్ను పణంగా పెట్టి రాజధానిలో ఉద్యమానికి ఊపిరిగా మారింది.పాలకుల ఒంటెత్తు పోకడలను నిరసిస్తూ జీవితకాల శ్రమతో సంపాదించుకున్న ఖేల్ రత్న అవార్డును కూడా తృణ్రపాయంగా విడిచిపెట్టింది. ఇంత బరితెగింపా అంటూ అజ్ఞానంతో అనరాని మాటలు అనే వాళ్లను చిరునవ్వుతో మరింత చికాకు పెట్టింది. మద్దతుగా నిలిచిన వారికి కన్నీళ్లతోనే కృతజ్ఞతలు చెప్పింది. ఖేల్ ఖతమే అన్న వాళ్ల చెంప చెళ్లుమనిపించేలా అన్ని సవాళ్లను దాటుకుని మూడోసారి ఒలింపిక్స్ బరిలో నిలిచింది. అంతేనా.. ఇప్పటి వరకు భారత మహిళా రెజ్లర్లు ఎవరికీ సాధ్యం కాని ఘనత సాధించింది. స్వర్ణ పతకపోరుకు అర్హత సాధించింది. ఊహించని విధంగా వందగ్రాములు.. కేవలం వందగ్రాముల అదనపు బరువు కారణంగా పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. పతకం సాధించకపోతేనేమి.. అందరి హృదయాలలో అభిమానాన్ని సంపాదించింది. వీటన్నిటి ముందు ‘ఆ వంద గ్రాములు‘ లెక్కే అంటారా? (ప్యారిస్ ఒలింపిక్స్-2024లో 50 కిలోల విభాగంలో ఫైనల్ చేరిన వినేశ్ ఫొగట్.. 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్న కారణంగా ఆమెపై అనర్హత వేటు పడింది)-సుష్మారెడ్డి యాళ్లచదవండి: వినేశ్ ఊహించలేదా!.. జుట్టు కత్తిరించి, రక్తం తీసినా.. తప్పెవరిది? -
హృదయం ముక్కలైంది: మరేం పర్లేదు.. ఇప్పటికే గెలిచేశావ్! (ఫొటోలు)
-
వినేశ్ ఫొగాట్కు స్వర్ణం
భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పారిస్ ఒలింపిక్స్కు ముందు కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. మాడ్రిడ్లో జరిగిన స్పెయిన్ గ్రాండ్ ప్రిలో వినేశ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. 50 కేజీల కేటగిరీ ఫైనల్లో వినేశ్ 10–5 స్కోరుతో మారియా తియుమెరికొవాపై విజయం సాధించింది. రష్యాకు చెందిన మారియా తటస్థ అథ్లెట్గా బరిలోకి దిగింది. ఫైనల్కు ముందు వినేశ్ సంపూర్ణ ఆధిపత్యంతో వరుసగా మూడు బౌట్లలో గెలుపొందింది. యుజ్నీలిస్ గజ్మన్ (క్యూబా)పై 12–4తో, ఆ తర్వాత మాడిసన్ పార్క్స్ (కెనడా)పై ‘విన్ బై ఫాల్’తో, సెమీ ఫైనల్లో కేటీ డచక్ (కెనడా)పై 9–4తో వినేశ్ గెలిచింది. -
రెజ్లర్ అమన్కు రజతం
పొల్యాక్ ఇమ్రి–వర్గా జోనస్ స్మారక ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్నీలో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ రజత పతకం సాధించాడు. హంగేరి రాజధాని బుడాపెస్ట్లో జరుగుతున్న ఈ టోర్నీలో అమన్ పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో రన్నరప్గా నిలిచాడు. రె హిగుచి (జపాన్)తో జరిగిన ఫైనల్లో అమన్ 1–11 పాయింట్లతో ఓడిపోయాడు. నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడిన అమన్ 11–1తో రొబెర్టి డింగా‹Ùవిలి (జార్జియా)పై, సెమీఫైనల్లో 14–4తో టిసిటర్న్ (బెలారస్)పై గెలుపొందాడు. -
భారత టాప్ రెజ్లర్పై సస్పెన్షన్ వేటు
భారత టాప్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత భజరంగ్ పూనియాపై అంతర్జాతీయ రెజ్లింగ్ సంస్థ (United World Wrestling) సస్పెన్షన్ వేటు వేసింది. డోప్ పరీక్షకు నిరాకరించినందుకు NADAచే తాత్కాలికంగా సస్పెండ్ చేయబడిన తర్వాత పునియాను UWW సస్పెండ్ చేసింది. పూనియాపై ఈ ఏడాది చివరి వరకు (డిసెంబర్ 31) సస్పెన్షన్ కొనసాగనుంది.డోప్ టెస్ట్కు నిరాకరించాడన్న కారణంగా 20 ఏళ్ల పూనియాను ఏప్రిల్ 23న NADA సస్పెండ్ చేసింది. సస్పెన్షన్పై పూనియా అప్పుడే స్పందించాడు. తాను శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించలేదని వివరణ ఇచ్చాడు. శాంపిల్ తీసుకునేందుకు నాడా అధికారులు గడువు ముగిసిన కిట్ను ఉపయోగిస్తుండటంతో అందుకు వివరణ మాత్రమే కోరానని తెలిపాడు.UWW సస్పెన్షన్ గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని పూనియా తాజాగా వివరణ ఇచ్చాడు. పూనియా స్టేట్మెంట్పై UWW సైతం స్పందించింది. పూనియాను సస్పెండ్ చేస్తున్న విషయాన్ని కారణాలతో సహా అతని ప్రొఫైల్లో స్పష్టంగా పేర్కొన్నామని తెలిపింది. ఒకవేళ పూనియాపై సస్పెన్షన్ వేటు నిజమే అయితే ఈ ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్లో భారత పతక అవకాశాలకు గండి పడినట్లే. -
ఈ రెజ్లర్ ఎవరో గుర్తుపట్టగలరా? ఇప్పుడు పోలీస్ ఆఫీసర్గానూ..
-
‘టైమ్’ టాప్–100 జాబితాలో రెజ్లర్ సాక్షి
న్యూఢిల్లీ: ప్రఖ్యాత ‘టైమ్’ మేగజీన్ ప్రకటించిన అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత మహిళా రెజ్లర్ సాక్షి మలిక్కు చోటు దక్కింది. 2024 సంవత్సరానికి ‘టైమ్’ ఈ జాబితాను ప్రకటించింది. లైంగిక వేధింపులకు సంబంధించిన వివాదంలో మహిళా రెజ్లర్ల పక్షాన బలంగా నిలబడి ఆమె చేసిన పోరాటానికి ఈ గుర్తింపు లభించింది. ఈ అంశంలో భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్కు ఎదురొడ్డి సాక్షి మలిక్ గట్టిగా తన వాణిని వినిపిస్తూ నిరసనల్లో పాల్గొంది. వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియాలతో కలిసి ఆమె చేసిన ఈ పోరాటం దేశవిదేశాల్లో వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో బ్రిజ్భూషణ్ తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. -
ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నికి వినేశ్
పాటియాలా: వచ్చే నెలలో కిర్గిస్తాన్లో జరిగే పారిస్ ఒలింపిక్స్ ఆసియా క్వాలిఫయింగ్ టోర్నిలో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ బరిలోకి దిగనుంది. ఈ టోర్నిలో పాల్గొనే భారత మహిళల జట్టును ఎంపిక చేసేందుకు సోమవారం నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్లో వినేశ్ 50 కేజీల విభాగంలో విజేతగా నిలిచింది. వినేశ్ రెగ్యులర్ వెయిట్ కేటగిరీ 53 కేజీలు కాగా... ఇప్పటికే ఈ కేటగిరీలో అంతిమ్ పంఘాల్ ఒలింపిక్ బెర్త్ దక్కించుకుంది. దాంతో వినేశ్ సెలెక్షన్ ట్రయల్స్ టోర్నిలో 50 కేజీలతోపాటు 53 కేజీల విభాగంలోనూ పోటీపడింది. ఒక రెజ్లర్ ఒకే రోజు ఒకే వెయిట్ కేటగిరీలో పోటీపడాలన్న నిబంధన ఉన్నా అడ్హక్ కమిటీ వినేశ్ను రెండు కేటగిరీల్లో పోటీ పడేందుకు అనుమతి ఇవ్వడం వివాదాస్పదమైంది. అయితే వినేశ్ 53 కేజీల విభాగం సెమీఫైనల్లో ఓడిపోయింది. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నిలో పాల్గొనే భారత జట్టులో అన్షు మలిక్ (57 కేజీలు), మాన్సి అహ్లావత్ (62 కేజీలు), నిషా దహియా (68 కేజీలు), రితిక (76 కేజీలు) కూడా ఎంపికయ్యారు. -
Zagreb Open Wrestling: అమన్ ‘పసిడి పట్టు’
జాగ్రెబ్ (క్రొయేషియా): కొత్త ఏడాదిని భారత రైజింగ్ స్టార్ రెజ్లర్ అమన్ సెహ్రావత్ స్వర్ణ పతకంతో ప్రారంభించాడు. జాగ్రెబ్ ఓపెన్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నీలో అమన్ 57 కేజీల విభాగంలో చాంపియన్గా అవతరించాడు. ఫైనల్లో అమన్ 4 నిమిషాల 21 సెకన్లలో 10–0తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో చైనా రెజ్లర్ జౌ వాన్హావోపై గెలుపొందాడు. ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం వచ్చిన వెంటనే రిఫరీ బౌట్ను నిలిపివేసి ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో విజేతగా ప్రకటిస్తారు. అమన్ తాను పోటీపడిన నాలుగు బౌట్లలోనూ ప్రత్యర్థులను ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలోనే ఓడించడం విశేషం. తొలి రౌండ్లో అమన్ 15–4తో కరావుస్ (తుర్కియే)పై, క్వార్టర్ ఫైనల్లో 11–0తో రిచర్డ్స్ రోడ్స్ (అమెరికా)పై, సెమీఫైనల్లో 11–0తో రొబెర్టి డాంగాషి్వలి (జార్జియా)పై విజయం సాధించాడు. -
అంతిమ్ అదరహో
బెల్గ్రేడ్: భారత మహిళా టీనేజ్ రెజ్లర్ అంతిమ్ పంఘాల్ అద్భుతం చేసింది. హరియాణాకు చెందిన 19 ఏళ్ల అంతిమ్ ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో కాంస్య పతకం సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మహిళల 53 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో అండర్–20 ‘డబుల్ ప్రపంచ చాంపియన్’ అంతిమ్ 16–6 పాయింట్ల తేడాతో ప్రపంచ మూడో ర్యాంకర్, యూరోపియన్ చాంపియన్ ఎమ్మా జోనా డెనిస్ మాల్్మగ్రెన్ (స్వీడన్)పై విజయం సాధించింది. ఈ గెలుపుతో అంతిమ్ వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్కు కూడా అర్హత సాధించింది. భారత రెజ్లింగ్ సమాఖ్యపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మెగా టోర్నీలో భారత రెజ్లర్లు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ పతాకంపై పోటీపడుతున్నారు. అంతిమ్ 2022, 2023 ప్రపంచ అండర్–20 చాంపియన్íÙప్లో 53 కేజీల విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించడంతోపాటు 2023 ఆసియా సీనియర్ చాంపియన్షిప్లో రజత పతకం గెలిచింది. 8 ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో పతకం గెలిచిన ఎనిమిదో భారతీయ రెజ్లర్గా అంతిమ్ పంఘాల్ గుర్తింపు పొందింది. గతంలో అల్కా తోమర్ (2006; కాంస్యం), బబిత ఫొగాట్ (2012; కాంస్యం), గీతా ఫొగాట్ (2012; కాంస్యం), వినేశ్ ఫొగాట్ (2019, 2022; కాంస్యాలు), పూజా ధాండ (2018; కాంస్యం), అన్షు మలిక్ (2021; రజతం), సరితా మోర్ (2021; కాంస్యం) ఈ ఘనత సాధించారు. -
Zagreb Open 2023 wrestling: అశు ‘కంచు పట్టు’
జాగ్రెబ్ (క్రొయేషియా): యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ఆధ్వర్యంలో నిర్వహించిన జాగ్రెబ్ ఓపెన్ వరల్డ్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్లో పురుషుల గ్రీకో రోమన్ 67 కేజీల విభాగంలో భారత రెజ్లర్ అశు కాంస్య పతకాన్ని సాధించాడు. కాంస్య పతక పోరులో 23 ఏళ్ల అశు 5–0తో అడోమస్ గ్రిగాలియునస్ (లిథువేనియా)పై నెగ్గాడు. అశుకు 500 స్విస్ ఫ్రాంక్లు (రూ. 44 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్లో అశు 0–9తో రెజా అబ్బాసి (ఇరాన్) చేతిలో ఓడిపోయాడు. అయితే రెజా ఫైనల్ చేరుకోవడంతో... రెజా చేతిలో ఓడిపోయిన వారి మధ్య ‘రెపిచాజ్’ పద్ధతిలో అశుకు కాంస్య పతకం కోసం పోటీ పడే అవకాశం లభించింది. ‘రెపిచాజ్’ తొలి బౌట్లో అశు 8–0తో పోహిలెక్ (హంగేరి)పై... రెండో బౌట్లో 9–0తో హావర్డ్ (నార్వే)పై గెలుపొంది కాంస్య పతక బౌట్కు అర్హత సాధించాడు. -
సుశీల్కు మధ్యంతర బెయిల్
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి రెజ్లర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత సుశీల్ కుమార్ దాదాపు ఏడాదిన్నర తర్వాత జైలునుంచి బయటకు రానున్నాడు. కుటుంబపరమైన సమస్యను ఎదుర్కొంటున్న కారణంగా మానవతా దృక్పథంతో ఈ నెల 12 వరకు అతనికి ఢిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్ జారీ చేసింది. సుశీల్ భార్య తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతుండటంతో శస్త్రచికిత్సకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆమె బాగోగులు చూసుకునేందుకు 3 వారాల బెయిల్ ఇవ్వాల్సిందిగా సుశీల్ న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. అయితే చివరకు కోర్టు వారం రోజుల బెయిల్ కోసం ఆదేశాలు ఇచ్చింది. యువ రెజ్లర్ సాగర్ రాణా హత్యకేసులో నిందితుడిగా ఉన్న సుశీల్ 2021 జూన్ 2నుంచి జైల్లో ఉన్నాడు. -
World Wrestling Championships 2022: భళా బజరంగ్...
బెల్గ్రేడ్ (సెర్బియా): అందివచ్చిన పతకావకాశాన్ని సద్వినియోగం చేసుకున్న భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా అద్భుత ప్రదర్శనతో అందరి మనసులు గెలుచుకున్నాడు. ఆదివారం ముగిసిన ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో బజరంగ్ పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో కాంస్య పతకంతో మెరిశాడు. కాంస్య పతకం సాధించాలంటే తప్పనిసరిగా రెండు వరుస బౌట్లలో గెలవాల్సిన బజరంగ్ తన సత్తా చాటుకున్నాడు. బజరంగ్ను క్వార్టర్ ఫైనల్లో ఓడించిన అమెరికా రెజ్లర్ జాన్ మైకేల్ ఫైనల్ చేరడంతో బజరంగ్కు కాంస్య పతకం కోసం పోటీ పడే అవకాశం లభించింది. ఆదివారం జరిగిన ‘రెపిచాజ్’ తొలి బౌట్లో 28 ఏళ్ల బజరంగ్ 7–6తో వాజ్జెన్ తెవాన్యన్ (అర్మేనియా)పై నెగ్గి కాంస్య పతక పోరుకు అర్హత సాధించా డు. వాజ్జెన్తో జరిగిన మ్యాచ్లో ఒకదశలో బజరంగ్ 1–4తో వెనుకబడి పుంజుకోవడం విశేషం. అనంతరం జరిగిన కాంస్య పతక మ్యాచ్లో బజరంగ్ 11–9తో సెబాస్టియన్ రివెరా (ప్యూర్టోరికో)పై విజయం సాధించాడు. రివెరాతో జరిగిన మ్యాచ్లో ఆరంభంలోనే బజరంగ్ 0–6తో వెనుకబడ్డాడు. అయితే వెంటనే తేరుకున్న ఈ హరియాణా రెజ్లర్ ఆరు పాయింట్లు గెలిచి తొలి భాగం ముగిసేసరికి 6–6తో సమంగా నిలిచాడు. రెండో భాగం ఆరంభంలో బజరంగ్ మళ్లీ మూడు పాయింట్లు కోల్పోయి 6–9తో మళ్లీ వెనుకబడ్డాడు. అయినా ఆందోళన చెందని బజరంగ్ ఉడుంపట్టుతో మెరిసి 2, 2 పాయింట్లు సాధించి 10–9తో ఆధిక్యంలోకి వచ్చాడు. చివరి సెకన్లలో ప్యూర్టోరికో రెజ్లర్ రివ్యూకు వెళ్లడం, దానిని అతను కోల్పోవడంతో భారత రెజ్లర్కు అదనంగా మరో పాయింట్ లభించింది. ఈ టోర్నీ తొలి రౌండ్లో క్యూబా రెజ్లర్ అలెజాంద్రో వాల్డెస్తో పోటీపడుతున్న సమయంలో బజరంగ్ తలకు గాయమైంది. అయినా కట్టు కట్టుకొని ఆడిన బజరంగ్ తొలి రౌండ్లో 5–4తో వాల్డెస్ను ఓడించాడు. ఆ తర్వాత తలకు గాయంతోనే ఈ టోర్నీలో మిగతా మ్యాచ్లలో పోటీపడి చివరకు కాంస్య పతకం సాధించాడు. ఏడోసారి ప్రపంచ చాంపియన్షిప్లో పోటీపడ్డ బజరంగ్ ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్లో నాలుగు పతకాలు సాధించి అత్యంత విజయవంతమైన భారత రెజ్లర్గా గుర్తింపు పొందాడు. 2013లో 60 కేజీల విభాగంలో బజరంగ్ కాంస్యం నెగ్గగా... 2018లో 65 కేజీల విభాగంలో రజతం, 2019లో కాంస్యం సాధించాడు. -
భారత స్టార్ రెజ్లర్ భర్త అనుమానాస్పద మృతి
Commonwealth Games 2022 Bronze Medallist Pooja Sihags Husband Dies: బర్మింగ్హామ్ వేదికగా ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన భారత మహిళా రెజర్ల్ పూజా సిహాగ్ ఇంట్లో విషాదం నెలకొంది. నిన్న (ఆగస్ట్ 27) రాత్రి సిహాగ్ భర్త అజయ్ నందల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హర్యానాలోని రోహ్తక్ నగర పరిసర ప్రాంతంలో నందల్ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించినట్లు తెలిపారు. నందల్ మృతదేహం లభించిన ప్రాంతంలో అతని స్నేహితుడు రవి, మరో వ్యక్తిని అచేతనావస్థ స్థితిలో గుర్తించినట్లు పేర్కొన్నారు. కాగా, అజయ్ నందల్ ఆకస్మిక మరణంపై అతని తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. అజయ్కు అతని స్నేహితుడు రవి డ్రగ్స్ అలవాటు చేశాడని, డ్రగ్స్ ఓవర్ డోస్ వల్లే అజయ్ మృతి చెంది ఉంటాడని ఆరోపించాడు. అజయ్ తండ్రి ఆరోపణలు పరిగణలోకి తీసుకున్న పోలీసులు.. పోస్ట్మార్టం నివేదిక వచ్చే వరకు ఎలాంటి నిర్ధారణకు రాలేమని వెల్లడించారు. స్వతహాగా రెజ్లర్ అయిన అజయ్ నందల్.. క్రీడల కోటాలో ఇటీవలే ఆర్మీ ఆఫీసర్గా ఎంపికైనట్లు తెలుస్తోంది. అజయ్ నందల్ భార్య, భారత స్టార్ మహిళా రెజ్లర్ పూజా సిహాగ్.. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో 76 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. చదవండి: డోపింగ్లో దొరికిన భారత డిస్కస్ త్రోయర్ నవ్జీత్ కౌర్ -
భారత రెజ్లర్ సరిత స్వర్ణ సంబరం...
భారత మహిళా స్టార్ రెజ్లర్ సరితా మోర్ ఈ ఏడాది తన ఖాతాలో తొలి స్వర్ణ పతకాన్ని జమ చేసుకుంది. కజకిస్తాన్లో జరుగుతున్న యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్ సిరీస్ టోర్నీ బొలాత్ టర్లీఖనోవ్ కప్లో సరితా 59 కేజీల విభాగంలో విజేతగా నిలిచింది. సరిత గెలిచిన మూడు బౌట్లూ టెక్నికల్ సుపీరియారిటీ (ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం రాగానే విజేతగా ప్రకటిస్తారు) పద్ధతిలోనే రావడం విశేషం. ఫైనల్లో సరిత 10–0తో జాలా అలియెవ్ (అజర్బైజాన్)పై, సెమీఫైనల్లో 12–2తో ఐజాన్ ఇస్మగులోవా (కజకిస్తాన్)పై, రెండో రౌండ్లో 11–0తో డయానా (కజకిస్తాన్)పై గెలిచింది. ఇదే టోర్నీలో భారత రెజ్లర్లు మనీషా (65 కేజీలు) స్వర్ణం... బిపాసా (72 కేజీలు) రజతం, సుష్మా (55 కేజీలు) కాంస్యం సాధించారు. -
Sakshi Malik: ఐదేళ్ల తర్వాత మరోసారి పసిడి పతకం!
అల్మాటీ (కజకిస్తాన్): భారత స్టార్ మహిళా రెజ్లర్ సాక్షి మలిక్ ఐదేళ్ల తర్వాత అంతర్జాతీయ టోర్నీలో బంగారంతో మురిసింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్ సిరీస్ ఈవెంట్లో ఆమె 62 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. ఇదే టోర్నీలో భారత రెజ్లర్లు మాన్సి అహ్లావత్ (57 కేజీలు), దివ్య కక్రాన్ (68 కేజీలు) కూడా పసిడి పతకాలు సాధించారు. శుక్రవారం జరిగిన ఫైనల్లో సాక్షి 7–4తో ఇరినా కుజ్నెత్సొవ (కజకిస్తాన్)ను ఓడించింది. చివరిసారిగా సాక్షి 2017 కామన్వెల్త్ చాంపియన్షిప్లో బంగారం గెలిచింది. తర్వాత రెండు ఆసియా చాంపియన్ షిప్ (2020, 2022)లలో కాంస్యాలతోనే సరిపెట్టుకుంది. 57 కేజీల ఫైనల్లో మాన్సి 3–0తో ఎమ్మా టిసినా (కజకిస్తాన్)పై గెలుపొందింది. నలుగురు రెజ్లర్లు మాత్రమే తలపడిన 68 కేజీల కేటగిరీలో దివ్య రెండు బౌట్లలో అలవోక విజయాలు సాధించింది. కానీ ఆఖరి బౌట్లో 10–14తో బొలొర్తుంగలగ్ జోరిట్ (మంగోలియా) చేతిలో ఓడింది. అయితే జోరిట్ కూడా రెండు బౌట్లలో గెలుపొందడంతో ఆమె, దివ్య సమఉజ్జీలుగా నిలిచారు. ఓవరాల్గా ఎక్కువ పాయింట్లు గెలిచిన దివ్యనే విజేతగా ప్రకటించారు. చదవండి: మన అమ్మాయిలు భేష్: నందినికి స్వర్ణం.. దీప్తికి రజతం.. రజితకు కాంస్యం -
ఓటమి ఎరుగని వీరుడు.. గామా ది గ్రేట్!
ఆదివారం (నిన్న) గూగుల్ డూడుల్ చూశారా? ఆయనెవరో గుర్తుపట్టారా? తన జీవితంలో ఒక్కసారి కూడా ఓటమి ఎరుగని రెజ్లింగ్ చాంపియన్ ‘గామా పహిల్వాన్’.. ఇంకా చెప్పాలంటే ‘గామా ది గ్రేట్’. మనోడే.. ఆయనను చూస్తేనే ప్రపంచంలోని ప్రఖ్యాత రెజ్లర్లు గడగడా వణికిపోయేవారంటే.. గామా పహిల్వాన్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం ఆయన 144వ జయంతి సందర్భంగా గూగుల్ ప్రత్యేకమైన ‘డూడుల్’తో నివాళి అర్పించింది. సోమవారం (మే 23) ఆయన 62వ వర్ధంతి కూడా.. ఈ నేపథ్యంలో ఆ మహాబలుడి గురించి తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ గామా పహిల్వాన్ అసలు పేరు గులామ్ మహమ్మద్ భక్ష్ భట్. పంజాబ్లోని జబ్బోవల్ గ్రామంలో 1878 మే 22న జన్మించాడు. చిన్నవయసు నుంచే వ్యాయామాలు అలవాటు చేసుకున్న ఆయన.. 1888లో జరిగిన స్క్వాట్స్ పోటీలో పాల్గొన్నాడు. దేశవ్యాప్తంగా 400 మందికిపైగా రెజ్లర్లు పాల్గొన్న ఆ పోటీలో గెలవడం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించాడు. 15 ఏళ్లకే రెజ్లింగ్ మొదలుపెట్టాడు. 1910లో 22 ఏళ్ల వయసులోనే భారత ప్రపంచ హెవీ వెయిట్ రెజ్లింగ్ చాంపియన్షిప్ గెలుచుకున్నాడు. 1927లో ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్ సాధించాడు. ఓటమి మాటే తెలియకుండా.. సాధారణంగా బాక్సర్లకు తమ ఎత్తు బాగా కలిసొస్తుంది. మరి గామా పహిల్వాన్ ఎత్తు 5.7 అడుగులే. 120 కిలోల బరువు ఉండేవాడు. రోజుకు 5 వేల స్క్వాట్స్ (గుంజిళ్ల వంటివి), మరో మూడు వేల పుషప్స్ చేసేవాడు. రాళ్లతో తయారుచేసిన 96 కిలోల బరువున్న చక్రాన్ని ఎత్తుకుని స్క్వాట్స్ చేసేవాడు. మరెన్నో ప్రత్యేక వ్యాయామాలనూ రూపొందించాడు. తాను 22 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే.. 1,200 కిలోల గుండ్రాయిని ఎత్తి రికార్డు సృష్టించాడు. అది ఇప్పటికీ బరోడా మ్యూజియంలో ఉంది. ♦ పోటీ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా సరే.. గామా పహిల్వాన్ కొద్ది నిమిషాల్లోనే ముగించేవాడు. 1927 ప్రపంచ చాంపియన్షిప్ పోటీల్లో, ఆ తర్వాత జరిగిన విదేశీ టోర్నీల్లో.. అప్పటి ప్రపంచ ప్రఖ్యాత యూరప్, అమెరికన్ రెజ్లర్లు ఫ్రాంక్ గోట్చ్, బెంజమిన్ రోలర్, మౌరిస్ డెరిజ్, జోహన్ లెమ్, జెస్సీ పీటర్సన్ వంటివారిని వరుసగా ఓడించాడు. ♦ తర్వాత కూడా తనతో పోటీకి రావాలని అమెరికా, యూరప్ రెజ్లర్లతోపాటు జపాన్కు చెందిన టారో మియాకె, రష్యాకు చెందిన జార్జ్ హకెన్షిమిట్ వంటివారికీ గామా పహిల్వాన్ సవాల్ చేశాడు. కానీ ఎవరూ ముందుకురాలేదు. చివరికి ఒకరి తర్వాత ఒకరుగా 20 మంది రెజ్లర్లు వచ్చినా అందరితో పోరాడుతానని.. తాను ఓడిపోతే ప్రపంచ చాంపియన్షిప్ ప్రైజ్మనీని కూడా తిరిగిచ్చేస్తానని సవాల్ చేశాడు. అయినా గామాతో పోటీ పడేందుకు ఎవరూ ధైర్యం చేయకపోవడం గమనార్హం. నిజాం యోధులనూ ఓడించి 1940లో నిజాం రాజు గామా పహిల్వాన్ను హైదరాబాద్కు పిలిపించి పోటీలు నిర్వహించాడు. నిజాం జనానాలోని మల్లయోధులందరినీ గామా పహిల్వాన్ ఓడించాడు. దీనితో నిజాం అతడిని సన్మానించి పంపాడు. గామాకు బ్రూస్లీ ఫ్యాన్.. గామా పహిల్వాన్కు ప్రపంచ ప్రఖ్యాత మార్షల్ ఆర్టిస్ట్ బ్రూస్లీ పెద్ద ఫ్యాన్. గామా నుంచి స్ఫూర్తి పొంది కొన్ని వ్యాయామాలను తాను అనుసరించినట్టు బ్రూస్లీ చాలాసార్లు చెప్పడం గమనార్హం. ♦ గామా పహిల్వాన్ శకం నడిచినప్పుడు భారత్ బ్రిటీషు పాలనలో ఉంది. బ్రిటిష్ రాచ కుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆఫ్ వేల్స్ గామాను సన్మానించి.. ఒక వెండి గదను బహూకరించాడు. హిందువులను కాపాడి.. దేశ విభజన సమయంలో గామా పహిల్వాన్ పాకిస్తాన్కు వెళ్లిపోయాడు. ఆ సమయంలో అక్కడి హిందువులు ఎంతో మందిని ఆయన కాపాడారని చెప్తారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య కుల్సుమ్ గామా పహిల్వాన్ మనవరాలే. 50 ఏళ్లకుపైగా రెజ్లింగ్లో ఎదురులేని వీరుడిగా నిలిచి.. 74 ఏళ్ల వయసులో 1952లో రిటైరయ్యాడు. తర్వాత ఎనిమిదేళ్లకు 1960 మే 23న లాహోర్లో కన్నుమూశాడు. పారిపోయిన ప్రపంచ చాంపియన్ 1910 లండన్ ప్రపంచ చాంపియన్షిప్ పోటీల్లో అప్పటివరకు ప్రపంచ చాంపియన్గా ఉన్న బ్రిటిష్ స్టానిస్లస్ జిబిజ్కో.. గామా పహిల్వాన్ ధాటిని తట్టుకోలేకపోయాడు. ఓటమిని అంగీకరించకుండా.. తరచూ బోర్లా పడుతూ మ్యాట్ను పట్టుకుని ఉండిపోతూ వచ్చాడు. ఇలా రెండున్నర గంటలకుపైగా సాగిన మ్యాచ్ను డ్రాగా ప్రకటించారు. తర్వాత వారం రోజులకే వారిద్దరి మధ్య మళ్లీ పోటీ పెట్టారు. జిబిజ్కో భయంతో మ్యాచ్కు రాకపోవడంతో.. గామా పహిల్వాన్ను విజేతగా ప్రకటించారు. తర్వాత 1928లో మన దేశంలోని పటియాలాలో జరిగిన చాంపియన్షిప్లో జిబిజ్కో–గామా పహిల్వాన్ మధ్య పోటీ పడింది. జిబిజ్కోను గామా కేవలం రెండు నిమిషాల్లో మట్టికరిపించాడు. అప్పుడే ‘గామా పహిల్వాన్ పులి’ అంటూ జిబిజ్కో ప్రకటించాడు. (క్లిక్: చరిత్ర సృష్టించిన ఐపీఎల్ 2022..) -
బ్రూస్ లీ ఆరాధించిన భారత్ ఫహిల్వాన్ ఎవరో తెలుసా?
మార్షల్ ఆర్ట్స్ దిగ్గజం.. దివంగత హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రూస్ లీ.. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు.చరిత్ర పుటల్లోకి వెళ్లి మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ గురించి మాట్లాడుకుంటే మొదటిగా బ్రూస్ లీ పేరు గుర్తుకువస్తుంది. కెమెరా కూడా అతని వేగాన్ని అందుకోలేదు. చిన్న వయసులోనే మార్షల్ ఆర్ట్స్పై పట్టు సాధించి గొప్ప పేరు సంపాదించాడు. 32 ఏళ్ల వయసులోనే కన్నుమూసిన బ్రూస్ లీ 'ఎంటర్ ది డ్రాగన్' సినిమాతో విశ్వవ్యాప్తంగా ఎనలేని క్రేజ్ సాధించాడు. మరి బ్రూస్ లీ ఆరాధించే వ్యక్తి ఎవరో తెలుసా.. భారత్కు చెందిన మహ్మద్ భక్ష్ భట్.. అలియాస్ గ్రేట్ గామా ఫహిల్వాన్. గామా ఫహిల్వాన్ ఫిజిక్కు ముచ్చటపడిన బ్రూస్ లీ అతనిలా కండలు పెంచాలని అనుకున్నాడు. అందుకోసం మహ్మద్ ఎక్సర్సైజ్ ఫుటేజీలు, రెజ్లింగ్ టెక్నిక్స్ను కేవలం ఫోటోల ద్వారా నేర్చుకున్నాడు. గామా ఫహిల్వాన్ పేరు మీద వచ్చిన ఆర్టికల్స్ను తప్పకుండా చదివేవాడు. ఒక రకంగా తాను మార్షల్ ఆర్ట్స్లో నైపుణ్యం సాధించడానికి గామా ఫహిల్వాన్ దారి చూపాడని బ్రూస్ లీ పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. కాగా గామా ఫహిల్వాన్ ఇవాళ(మే 22) ఆయన జయంతి. ఈ సందర్భంగా గూగుల్ అతని ఫోటోను డూడుల్గా ఉపయోగించింది. వ్రిందా జవేరీ అనే ఆర్టిస్ట్ గూగూల్కు గామా ఫహిల్వాన్ కార్టూన్ను గీసిచ్చాడు. భారత రెజ్లర్గా ఎనలేని గుర్తింపు సాధించిన మహ్మద్ భక్ష్ భట్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. రింగ్లో ఓటమి ఎరుగని రెజ్లర్గా పేరు పొందిన ఆయన దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచాడు. భారతీయ సంస్కృతికి గౌరవ ప్రతీకగా ఉన్నాడు. గామా ఫహిల్వాన్ను స్మరించుకోవడం మన అదృష్టం అని గూగుల్ రాసుకొచ్చింది. మహ్మద్ భక్ష్ భట్ తన అంతర్జాతీయ రెజ్లింగ్ కెరీర్లో 1910లో వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్షిప్, 1927లో వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్షిప్ గెలిచాడు. వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్షిప్ గెలిచిన తర్వాత టైగర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్నాడు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నుంచి రజత తామరపత్రం అందుకున్నాడు. Gama Pehelwan's 124th Birthday pic.twitter.com/8j5kQrDXbV — Akash Kharade (@cricaakash) May 22, 2022 -
రవి దహియా కొత్త చరిత్ర
ఉలాన్బాటర్ (మంగోలియా): భారత రెజ్లర్ రవి కుమార్ దహియా కొత్త చరిత్ర లిఖించాడు. ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో మూడు స్వర్ణ పతకాలు గెలిచిన తొలి భారతీయ రెజ్లర్గా రికార్డు నెలకొల్పాడు. శనివారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ విభాగం పోటీల్లో 24 ఏళ్ల రవి దహియా 57 కేజీల విభాగంలో చాంపియన్గా నిలిచాడు. తద్వారా వరుసగా మూడో ఏడాదీ విజేతగా నిలిచి ఈ మెగా ఈవెంట్లో ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన తొలి భారతీయ రెజ్లర్గానూ ఘనత వహించాడు. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో రవి ‘టెక్నికల్ సుపీరియారిటీ’ (ప్రత్యర్థిపై 10 పాయింట్ల ఆధిక్యం సాధించగానే విజేతగా ప్రకటిస్తారు) పద్ధతిలో 12–2తో రఖత్ కల్జాన్ (కజకిస్తాన్)పై గెలుపొందాడు. రవి 2020, 2021 ఆసియా చాంపియన్షిప్లలో 57 కేజీల విభాగంలోనే పసిడి పతకాలు సాధించాడు. శనివారం ఆసియా చాంపియన్షిప్లో భారత్కు ఓవరాల్గా ఐదు పతకాలు (ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు) లభించాయి. భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా (65 కేజీలు), గౌరవ్ బలియాన్ (79 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. 97 కేజీల విభాగంలో సత్యవర్త్ కడియాన్, 70 కేజీల విభాగంలో నవీన్ కాంస్య పతకాలు గెలిచారు. -
Anshu Malik: తొలి భారతీయ మహిళా రెజ్లర్గా అన్షు కొత్త రికార్డు!
ఓస్లో (నార్వే): టోక్యో ఒలింపిక్స్లో నిరాశ పరిచినా... ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత యువ రెజ్లర్ అన్షు మలిక్ అదరగొట్టింది. గతంలో ఏ భారతీయ మహిళా రెజ్లర్కు సాధ్యంకాని ఘనతను 20 ఏళ్ల అన్షు సాధించింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో ఫైనల్కు చేరిన తొలి భారతీయ మహిళా రెజ్లర్గా అన్షు రికార్డు నెలకొల్పింది. 57 కేజీల విభాగంలో అన్షు స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో అన్షు 11–0 పాయింట్లతో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో సొలోమియా వినిక్ (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. 3 నిమిషాల 53 సెకన్లలో అన్షు విజయం ఖాయమైంది. ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతి అంటే ప్రత్యర్థిపై కనీసం 10 పాయింట్ల ఆధిక్యం సంపాదించిన వెంటనే బౌట్ను ముగించి ఈ ఆధిక్యం సాధించిన రెజ్లర్ను విజేతగా ప్రకటిస్తారు. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో అన్షు 5–1తో దావాచిమెగ్ ఎర్కెమ్బాయర్ (మంగోలియా)పై, తొలి రౌండ్లో 4 నిమిషాల 5 సెకన్లలో 15–5 పాయింట్లతో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో నీలూఫర్ రైమోవా (కజకిస్తాన్)పై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో 2016 రియో ఒలింపిక్స్ చాంపియన్, 2020 టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత హెలెన్ లూయిస్ మరూలిస్ (అమెరికా)తో అన్షు తలపడుతుంది. ప్రపంచ చాంపియన్ను ఓడించి... మరోవైపు 59 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సరితా మోర్ కాంస్య పతకం కోసం పోటీపడనుంది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో సరితా మోర్ 0–3 పాయింట్ల తేడాతో యూరోపియన్ చాంపియన్ నిలిచిన బిల్యానా జికోవా డుడోవా (బల్గేరియా) చేతిలో ఓడిపోయింది. అంతకుముందు ప్రిక్వార్టర్ ఫైనల్లో సరితా 8–4తో ప్రపంచ చాంపియన్ లిండా మొరైస్ (కెనడా)పై సంచలన విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో సరితా 3–1తో సాండ్రా (జర్మనీ)పై గెలిచింది. ఇనెటా (లిథువేనియా), సారా జోనా లిండ్బోర్గ్ (స్వీడన్) మధ్య బౌట్ విజేతతో నేడు జరిగే కాంస్య పతక పోరులో సరితా మోర్ తలపడుతుంది. 72 కేజీల విభాగంలో దివ్యా కక్రాన్ కాంస్య పతకం రేసులో నిలిచింది. దివ్య క్వార్టర్ ఫైనల్లో 0–10తో మసాకో ఫురూచి (జపాన్) చేతిలో ఓడిపోయింది. అయితే మసాకో ఫైనల్ చేరడంతో దివ్యా ‘రెపిచాజ్’ రౌండ్లో నేడు దావానసన్ (మంగోలియా)తో ఆడుతుంది. ఈ బౌట్లో దివ్య గెలిస్తే కాంస్య పతకం కోసం అనా కార్మెన్ షెల్ (జర్మనీ)తో పోటీపడుతుంది. ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్ చరిత్రలో పతకం ఖాయం చేసుకున్న ఆరో భారతీయ మహిళా రెజ్లర్ అన్షు మలిక్. గతంలో అల్కా తోమర్ (2006లో; 59 కేజీలు), బబితా ఫొగాట్ (2012లో; 51 కేజీలు), గీతా ఫొగాట్ (2012లో; 55 కేజీలు), పూజా ధాండా (2018లో; 57 కేజీలు), వినేశ్ ఫొగాట్ (2019లో; 53 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. కిరణ్కు నిరాశ మహిళల 76 కేజీల విభాగంలో భారత్కు త్రుటిలో కాంస్య పతకం చేజారింది. కాంస్య పతక బౌట్లో భారత రెజ్లర్ కిరణ్ 1–2తో సమర్ హంజా (ఈజిప్్ట) చేతిలో ఓడిపోయింది. ఈ టోరీ్నలో భారత్కు నాలుగోసారి కాంస్య పతకం చేజారింది. పురుషుల ఫ్రీస్టయిల్లో రవీందర్ (61 కేజీలు), రోహిత్ (65 కేజీలు), మహిళల విభాగంలో పింకీ (55 కేజీలు) కూడా కాంస్య పతక బౌట్లలో ఓడిపోయారు. -
జై బజరంగ్ భళి...
శీతాకాలం... తెల్లవారుజాము 2 గంటలకు ఎముకలు కొరికే చలిలో... ఓ 11 ఏళ్ల బాలుడు ఇంట్లో దిండ్లను వరుస పెట్టి దుప్పటి కప్పి తాను పడుకున్నట్లు చేసి అఖాడాకు వెళ్లేవాడు. ఉదయం అమ్మ అడిగితే 4 గంటల తర్వాతే వెళ్లానని చెప్పేవాడు. తనయుడు ఎప్పుడు వెళ్లాడో తల్లికి తెలుసు! అయినా కొడుకు ఆసక్తికి అడ్డుచెప్పకూడదని ఆ మాతృమూర్తి నిర్ణయించుకుంది. అక్కడ సీన్ కట్ చేసి టోక్యోలో చూస్తే ఆ బాలుడు బజరంగ్ పూనియా అయ్యాడు. రెజ్లింగ్ బరిలో కాంస్యం గెలిచాడు. టోక్యో: ‘పసిడి’ పతకానికి దూరమైనా... తన కెరీర్లో లోటుగా ఉన్న ఒలింపిక్ పతకాన్ని భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా సాధించాడు. శనివారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగం కాంస్య పతక పోరులో బజరంగ్ 8–0తో దౌలత్ నియాజ్బెకోవ్ (కజకిస్తాన్)పై గెలిచాడు. తద్వారా 2019 ప్రపంచ చాంపియన్షిప్ సెమీఫైనల్లో నియాజ్బెకోవ్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు. హాజీ అలియెవ్ (అజర్బైజాన్)తో జరిగిన సెమీఫైనల్లో లెగ్ డిఫెన్స్ బలహీనత, కౌంటర్ ఎటాక్లో తడబడి పాయింట్లు చేజార్చుకున్న బజరంగ్ ఈ బౌట్లో మాత్రం అద్భుత ప్రదర్శన చేశాడు. నియాజ్బెకోవ్కు ఏదశలోనూ పైచేయి సాధించే అవకాశం ఇవ్వలేదు. దాంతో నియాజ్బెకోవ్ చివరకు ఒక్క పాయింట్ కూడా సాధించకుండానే ఓటమి చవిచూశాడు. హరియాణకు చెందిన 27 ఏళ్ల బజరంగ్ తన కెరీర్లో ప్రపంచ చాంపియన్షిప్లో మూడు పతకాలు (రజతం, 2 కాంస్యాలు), ఆసియా చాంపియన్షిప్లో ఏడు పతకాలు (2 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలు), ఆసియా క్రీడల్లో రెండు పతకాలు (స్వర్ణం, రజతం), కామన్వెల్త్ గేమ్స్లో రెండు పతకాలు (స్వర్ణం, రజతం) సాధించాడు. బజరంగ్ బాహువుల్లోనో లేదంటే పిడికిలిలోనో రెజ్లింగ్ లేదు. అతని రక్తంలోనే మల్లయుద్ధం వుంది. ఎందుకంటే తన తండ్రి, సోదరుడు కూడా దంగల్ వీరులే! ఈ కుస్తీపట్లే నరనరాన జీర్ణించుకున్న బజరంగ్ తాజాగా ఒలింపిక్ పతకం పట్టాడు. అన్నట్లు ఇతనికి ఒలింపిక్ పతకం కొత్తేమో కానీ ఈ నంబర్వన్ (65 కేజీల కేటగిరీ) రెజ్లర్ ఖాతాలో ప్రపంచ, ఆసియా చాంపియన్ షిప్, ఆసియా గేమ్స్ స్వర్ణాలు చాలానే ఉన్నాయి. అందుకే అసలు సిసలు సత్తాచాటాల్సిన చోట స్వర్ణ, రజతాలు చేజార్చుకున్నాడేమో కానీ పతకం లేకుండా ఉత్తచేతులతో రాలేదు. కాంస్యం పోరు లో విజేయుడిగా నిలిచాడు. 34 కేజీల బరువుతో 60 కేజీల విభాగంలో... మచ్రోలి గ్రామంలో 2008లో జరిగిన పోటీల్లో పాల్గొనేందుకు బజరంగ్ వెళ్లాడు. కానీ 34 కిలోల బరువున్న అతన్ని 60 కేజీల కేటగిరీలో పాల్గొనేందుకు నిర్వాహకులు నిరాకరించారు. ఎలాగోలా అతని అన్న హరిందర్ నచ్చచెప్పడంతో ఆర్గనైజర్లు అంగీకరించారు. అపుడు దంగల్లో దిగిన బజరంగ్ తనకంటే ఎక్కువ బరువున్న రెజ్లర్ ఓడించడం అక్కడున్న వారందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ కుర్రాడి బాహువు బలం తెలిసిన కోచ్ ఆర్య వీరేందర్ మల్లయుద్ధంలో బజరంగ్ పూనియాను తీర్చిదిద్దాడు. అదే ఏడాది తండ్రి బల్వాన్ సింగ్ తనయుడిని ఢిల్లీలోని ఛత్రశాల్ స్టేడియంలో చేర్పించాడు. అక్కడ అందరు మేటి రెజ్లర్లే ఉండటంతో వారితో తలపడిన బజరంగ్ రెండేళ్లకే ఆసియా క్యాడెట్ చాంపియన్ అయ్యాడు. మరుసటి ఏడాది (2011) దాన్ని నిలబెట్టుకున్నాడు. అక్కడ్నుంచి ఇక వెనుదిరిగి చూడకుండా ఇంటాబయటా పతకాల పట్టు పట్టేవాడు. 2018లో ప్రపంచ చాంపియన్షిప్లో అతను సాధించిన రజతం బజరంగ్ను ఒలింపిక్ మెడలిస్ట్ల జాబితాలో చేర్చింది. యోగేశ్వర్ దత్ కిటుకులు... ఛత్రశాల్ స్టేడియం చేసిన మేలు, మెరుగైన తీరు అంతా ఇంతా కాదు. అక్కడ ప్రముఖ రెజ్లర్ యోగేశ్వర్ దత్ సాహచర్యం... బజరంగ్ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం... అంతర్జాతీయ పోటీల్లో అసాధారణ రెజ్లర్గా, పతకాల విజేతగా నిలబెట్టాయి. యోగేశ్వర్ రాజకీయాల్లోకి వెళ్లాక భారత రెజ్లింగ్ సమాఖ్య బజరంగ్కు వ్యక్తిగత కోచ్గా జార్జియాకు చెందిన షాకో బెంటినిడిస్ను నియమించింది. ఇతని వల్ల విదేశీ రెజ్లర్లతో చేసిన ప్రాక్టీస్ బజరంగ్ను మరోస్థాయికి తీసుకెళ్లింది. టోక్యో ఒలింపిక్స్ పతక విజేతగా మార్చింది. తల్లి ప్రోత్సాహం... బజరంగ్ తల్లి ఓంప్యారీకి 11 ఏళ్ల తనయుడి అడుగులు ఎటువైపో తెలుసు. అందుకే తెల్లారుజామునే వెళ్తున్నా... ఉదయం లేచాక అబద్ధం చెబుతున్నా... మిన్నకుండిపోయింది. అయితే ఒక విషయం మాత్రం మాతృమూర్తి గట్టిగా చెప్పేది. ‘ఓడినంత మాత్రాన ఏడవొద్దు. ప్రత్యర్థుల ముందు పలుచనవ్వొద్దు. ఓటములను గెలిచేందుకు మెట్లుగా మలచుకోవాలి’ అని! ఈ మాట బాగా వంటబట్టించుకున్న బజరంగ్ చదువులో వెనుకబడినా... దంగల్లో మట్టికరిచినా... ఎప్పుడు కన్నీరు కార్చలేదు. అమ్మ అన్నట్లే ప్రతి ఓటమిని గెలుపు మలుపుగా చేసుకున్నాడు. ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్షిప్లో సింహాబలుళ్లను ఓడించే శక్తి తన తల్లి మాటల ద్వారానే సంపాదించుకున్నాడు. -
Tokyo Olympics: టోక్యో ఫ్లైట్ మిస్ అయిన రెజ్లర్ వినేష్ ఫోగట్
టోక్యో: ఇండియన్ స్టార్ మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ టోక్యో విమానం మిస్ అయింది. ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్షిప్లలో ఎన్నో పతకాలు గెలిచిన వినేష్పై టోక్యో ఒలింపిక్స్లో ఈసారి మంచి అంచనాలు ఉన్నాయి. కాగా 53 కేజీల ఉమెన్ ఫ్రీస్టైల్ కేటగిరీలో పోటీ పడుతున్న వినేష్ ఒలింపిక్స్లో కచ్చితంగా గోల్డ్ మెడల్ సాధించగలదనే నమ్మకం ఉంది. అయితే ఒలింపిక్స్లో పాల్గొనడానికి ముందు ఆమె తన కోచ్ వోలెట్ అకోస్తో కలిసి మెరుగైన శిక్షణ కోసం హంగేరీ వెళ్లింది. యురోపియన్ యూనియన్ వీసాపై ఒకరోజు ఎక్కువగా ఉంది. కాగా మంగళవారం రాత్రి టోక్యో విమానం ఎక్కడానికి వచ్చిన ఆమెను అధికారులు అడ్డుకున్నారు. తాను ఎక్కాల్సిన విమానం వెళ్లిపోవడంతో వినేష్ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) రంగంలోకి సమస్యను పరిష్కరించింది. పరిష్కారమైనట్లు చెప్పింది. వినేష్ బుధవారం టోక్యో వెళ్తుందని ఐవోఐ స్పష్టం చేసింది. ''వినేష్ ఫోగట్ వీసా గడువు సరిగా చూడలేదు. ఇది కావాలని చేసింది కాదు. ఆమె 90 రోజుల పాటు అక్కడ ఉండాల్సి ఉండగా.. ఆమె ఫ్రాంక్ఫర్ట్ చేసే సరికి 91వ రోజు అయింది'' అని వెల్లడించింది. ఈ విషయాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్లగా వాళ్లు వెంటనే జర్మనీలోని ఇండియన్ కాన్సులేట్కు సమాచారాన్ని చేరవేశారు. కాగా మంగళవారం రాత్రి ఫ్రాంక్ఫర్ట్లోనే ఉన్న వినేష్కు మరోసారి ఆర్టీపీసీఆర్ టెస్ట్లు చేశారు. -
నిషేధ కాలం తగ్గించండి: భారత రెజ్లర్ సుమిత్ అప్పీల్
డోపింగ్లో పట్టుబడటంతో రెండేళ్ల నిషేధానికి గురైన భారత రెజ్లర్ సుమిత్ మలిక్... నిషేధ కాలాన్ని తగ్గించాలంటూ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ)కు అప్పీల్ చేయనున్నాడు. తను తీసుకున్న ఔషధాల్లో నిషేధిత ఉత్ప్రేరకం కలిసి వుండవచ్చని అంగీకరించిన రెజ్లర్ విధించిన నిషేధాన్ని ఏడాదికి తగ్గిస్తే వచ్చే ఏడాది కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాడు. 125 కేజీల కేటగిరీలో టోక్యో ఒలింపిక్స్కు అర్హత సంపాదించిన ఈ ఫ్రీస్టయిల్ రెజ్లర్ సస్పెన్షన్ వేటుతో విశ్వ క్రీడలకు దూరమయ్యాడు. -
రెజ్లర్ సుమిత్పై నిషేధం
న్యూఢిల్లీ: డోపింగ్లో పట్టుబడిన కామన్వెల్త్గేమ్స్ చాంపియన్, భారత రెజ్లర్ సుమిత్ మాలిక్పై నిషేధం విధించారు. దీంతో 28 ఏళ్ల హరియాణా రెజ్లర్ ఒలింపిక్స్ ఆశలకు దాదాపు తెరపడినట్లే. అతను అప్పీల్ చేసుకునేందుకు ఒక వారం గడువిచ్చినప్పటికీ ఒలింపిక్స్ సమయానికల్లా ఈ విచారణ ముగిసే అవకాశాల్లేవు. గత నెల సోఫియాలో నిర్వహించిన ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయర్స్లో 125 కేజీల ఫ్రీస్టయిల్ కేటగిరీలో పోటీపడిన భారత రెజ్లర్ మెగా ఈవెంట్కు అర్హత సంపాదించాడు. కానీ ఆ పోటీ సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో అతను నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో సస్పెన్షన్ వేటు వేశారు. తాజాగా ‘బి’ శాంపిల్ను కూడా పరీక్షించగా ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. దీంతో ప్రపంచ రెజ్లింగ్ యూనియన్ (యూడబ్ల్యూడబ్ల్యూ) శుక్రవారం అతనిపై రెండేళ్ల నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 2018 గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో చాంపియన్గా నిలిచిన సుమిత్ మాలిక్ అదే ఏడాది భారత ప్రభుత్వం నుంచి క్రీడాపురస్కారం ‘అర్జున’ అవార్డు అందుకున్నాడు. 2017లో న్యూఢిల్లీ ఆతిథ్యమిచ్చిన ఆసియా చాంపియన్షిప్, జోహన్నెస్బర్గ్లో జరిగిన కామన్వెల్త్ చాంపి యన్షిప్లలో అతను రన్నరప్గా నిలిచి రజత పతకాలు సాధించాడు. -
భారత స్టార్ రెజ్లర్ బజరంగ్కు గాయం
మాస్కో: టోక్యో ఒలింపిక్స్లో కచ్చితంగా పతకం గెలిచే భారత క్రీడాకారుల్లో ఒకరిగా భావిస్తున్న స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా గాయపడ్డాడు. రష్యాలో జరుగుతున్న అలీ అలియెవ్ టోరీ్నలో భాగంగా అబ్దుల్ మజీద్ కుదేవ్ (రష్యా)తో జరిగిన 65 కేజీల విభాగం సెమీఫైనల్లో బజరంగ్ కుడి మోకాలి నొప్పితో బౌట్ మధ్యలోనే వైదొలిగాడు. మ్యాట్పైనే కుప్పకూలిన బజరంగ్కు ప్రథమ చికిత్స చేశారు. ఆ తర్వాత బజరంగ్ నిలబడినా నడవడానికి ఇబ్బంది పడ్డాడు. బజరంగ్ గాయం తీవ్రతపై ఒకట్రెండు రోజుల్లో వివరాలు చెబుతామని అతని కోచ్ షాకో తెలిపారు. -
Wrestler Sushil Kumar: సుశీల్ చిక్కాడు...
న్యూఢిల్లీ: పోలీసులు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసినా... కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించినా... యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో 19 రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఆదివారం ఉదయం ఢిల్లీ శివారులోని ముండ్కా ప్రాంతంలో సుశీల్ కుమార్, అతడి అనుచరుడు అజయ్ కుమార్ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సుశీల్, అజయ్లను కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు లోపల సుశీల్ను 30 నిమిషాలపాటు ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు మరిన్ని వివరాల రాబట్టేందుకు 12 రోజులపాటు తమ కస్డడీకి అప్పగించాలని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దివ్యా మల్హోత్రాను కోరగా.... ఆరు రోజులపాటు సుశీల్, అజయ్లను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చారు. ఏం జరిగిందంటే... ఈ నెల నాలుగో తేదీన అర్ధరాత్రి ఛత్రశాల్ స్టేడియంలో జాతీయ గ్రీకో రోమన్ రెజ్లింగ్ చాంపియన్ సాగర్ రాణా, అతని మిత్రులు సోనూ, అమిత్ కుమార్లతో సుశీల్ కుమార్, అతని అనుచరులు గొడవ పడ్డారు. ఈ గొడవలో సాగర్, సోనూ, అమిత్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 23 ఏళ్ల సాగర్ రాణా మృతి చెందాడు. తమపై సుశీల్, అతని అనుచరులు దాడి చేశారని ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో సోనూ, అమిత్ పేర్కొన్నారు. దాంతో సుశీల్, అతని అనుచరులపై ఢిల్లీ పోలీసులు ఐపీసీ సెక్షన్ 302 (హత్య)తోపాటు మరో 10 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఈ సంఘటన జరిగిన తర్వాతి రోజు (మే 5) నుంచి సుశీల్ పరారీలో ఉన్నాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సుశీల్ హరియాణా, చండీగఢ్, పంజాబ్, గయా, గురుగ్రామ్ ఇలా ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో గడిపినట్లు సమాచారం. ఫోన్ ద్వారా తన ఆచూకీ దొరకకూడదనే ఉద్దేశంతో సుశీల్ 14 వేర్వేరు సిమ్ కార్డులు వాడినట్లు తెలిసింది. సుశీల్ ఆచూకీ తెలిపితే రూ. లక్ష రివార్డు కూడా ఇస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఆఖరికి ఆదివారం ఉదయం ఢిల్లీ శివారులో తన అనుచరుడు అజయ్తో కలిసి స్కూటర్పై వెళ్తుండగా ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు సుశీల్ చిక్కాడు. ఖేల్ ఖతమ్! అంతర్జాతీయస్థాయిలో ఎన్నో గొప్ప విజయాలు సాధించిన 37 ఏళ్ల సుశీల్ కుమార్ పరువు, ప్రతిష్ట తాజా ఉదంతంతో మసకబారిపోయింది. ఈ హత్యతో తనకు సంబంధంలేదని సుశీల్ వివరణ ఇస్తున్నాడు. అయితే అతనికి వ్యతిరేకంగా పోలీసుల వద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నట్లు సమాచారం. నార్నర్త్ రైల్వేలో సీనియర్ కమర్షియల్ మేనేజర్ అయిన సుశీల్ ఐదేళ్లుగా ఛత్రశాల్ స్టేడియంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా కొనసాగుతున్నాడు. అయితే సుశీల్ సమక్షంలోనే గొడవ జరగడం... సాక్ష్యాలూ ధ్వంసం కావడం... ఎఫ్ఐఆర్లో అతని పేరు ఉండటం.. తాజాగా అరెస్టు కూడా కావడంతో సుశీల్ ఉద్యోగం ఊడే అవకాశముంది. ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ తరఫున రెండు వ్యక్తిగత పతకాలు నెగ్గిన ఏకైక క్రీడాకారుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కిన సుశీల్... తాజా సంఘటనతో భవిష్యత్లో భారత్కు ప్రాతినిధ్యం వహించే అవకాశాలకు తెరపడిందనే చెప్పాలి. 2019 ప్రపంచ చాంపియన్షిప్ లో చివరిసారి భారత్కు ప్రాతినిధ్యం వహించిన సుశీల్ 20వ స్థానంలో నిలిచాడు. సుశీల్ ఘనతలు 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్లో రజతం. 2010 ప్రపంచ సీనియర్ చాంపియన్షిప్లో పసిడి పతకం. 2010 ఢిల్లీ, 2014 గ్లాస్గో, 2018 గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పతకాలు 2006 దోహా ఆసియా క్రీడల్లో కాంస్యం. ఆసియా చాంపియన్షిప్లో స్వర్ణం (2010), రజతం (2007), రెండు కాంస్యాలు (2003, 2008). కామన్వెల్త్ చాంపియన్షిప్లో (2003, 2005, 2007, 2009, 2017) ఐదు స్వర్ణాలు, ఒక కాంస్యం (2005). 1998, 1999 ప్రపంచ క్యాడెట్ చాంపియన్షిప్లో స్వర్ణ పతకాలు. అవార్డులు అర్జున అవార్డు: 2005; రాజీవ్గాంధీ ఖేల్రత్న: 2009; పద్మశ్రీ: 2011 -
సుశీల్ కుమార్ ఎక్కడ?
న్యూఢిల్లీ: రెజ్లింగ్ స్టార్, ఒలింపిక్స్లో రెండు పతకాలు గెలిచిన ఏకైక భారతీయుడైన సుశీల్ కుమార్ పరారీ వ్యవహారం సీరియస్గా మారింది. యువ రెజ్లర్ సాగర్ రాణా హత్యోదంతానికి సంబంధించి సుశీల్పై ఢిల్లీ పోలీసులు ‘లుక్ అవుట్’ నోటీసులు జారీ చేశారు. గత మంగళవారం ఘటన జరిగిన తర్వాత ఎవరికీ అందుబాటులో లేని సుశీల్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఆదివారం సాయంత్రం ‘లుక్ అవుట్’ నోటీసు ఇచ్చినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు స్పష్టం చేశారు. పోలీసు ఎఫ్ఐఆర్లో సుశీల్ పేరు ఉండటంతో అతడిని పట్టుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించి విఫలమయ్యామని వారు చెప్పారు. ఢిల్లీ–ఎన్సీఆర్తో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా సుశీల్ కోసం వెతికామని వెల్లడించారు. ఈ ఘటనలో బాధితుల స్టేట్మెంట్ను పోలీసులు ఇప్పటికే రికార్డు చేశారు. ఛత్రశాల్ స్టేడియం పార్కింగ్ వద్ద ఇరు వర్గాలు కొట్టుకున్న ఘటనలో 23 ఏళ్ల జాతీయ మాజీ జూనియర్ చాంపియన్ సాగర్ రాణా తీవ్రంగా గాయపడి ఆపై మృతి చెందాడు. ఆ సమయంలో సుశీల్ అక్కడే ఉన్నాడని సాక్షులు చెప్పారు. తన గురించి బహిరంగంగా చెడుగా మాట్లాడుతున్న రాణాకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో అతని ఇంటినుంచి లాక్కొని వచ్చి మరీ సుశీల్, అతని అనుచరులు కొట్టారని కూడా మరికొందరు సాక్ష్యమిచ్చారు. రెజ్లింగ్ పరువు పోయింది: డబ్ల్యూఎఫ్ఐ రెండు ఒలింపిక్ పతకాలతో పాటు ప్రపంచ చాంపియన్గా నిలిచిన ఏకైక భారతీయుడైన సుశీల్ కుమార్ ఇప్పుడు హత్య కేసులో పరారీలో ఉండటం దురదృష్టకరమని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ అన్నారు. ఒకప్పుడు ఒంటి చేత్తో భారత రెజ్లింగ్ స్థాయిని పెంచి ఎందరితో ఆదర్శంగా నిలిచిన సుశీల్ ఇలా కావడం బాధగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తాజా ఘటన సుశీల్కు వ్యక్తిగతంగానే కాకుండా భారత రెజ్లింగ్ మొత్తానికి చెడ్డ పేరు తెచ్చిందని తోమర్ అభిప్రాయ పడ్డారు. రెజ్లర్లు అంటే గూండాలనే భావన మళ్లీ నెలకొంటుందని తోమర్ ఆందోళన వ్యక్తం చేశారు. -
Wrestler Gurpreet Singh: గుర్ప్రీత్కు కాంస్యం
సోఫియా (బల్గేరియా): వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ రెజ్లింగ్ టోర్నమెంట్ను భారత్ కాంస్య పతకంతో ముగించింది. టోర్నీ చివరి రోజు ఆదివారం పురుషుల గ్రీకో రోమన్ 77 కేజీల విభాగంలో గుర్ప్రీత్ సింగ్ భారత్కు కాంస్య పతకాన్ని అందించాడు. కాంస్య పతక బౌట్లో గుర్ప్రీత్ 4–2 పాయింట్ల తేడాతో విక్టర్ నెమిస్ (సెర్బియా)పై విజయం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్కు ఇదే చివరి అర్హత టోర్నీకాగా... ఈ టోర్నీ ద్వారా భారత్ రెండు ఒలింపిక్ బెర్త్లను ఖరారు చేసుకుంది. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో సుమిత్ మలిక్ (125 కేజీలు) రజతం నెగ్గి, మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో సీమా బిస్లా (50 కేజీలు) స్వర్ణ పతకం సాధించి టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించారు. కేవలం ఫైనల్కు చేరిన రెజ్లర్లే ఒలింపిక్ బెర్త్లు దక్కించుకున్నారు. గ్రీకో రోమన్ విభాగం 77 కేజీల విభాగంలో గుర్ప్రీత్ సింగ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోయాడు. అయితే గుర్ప్రీత్ సింగ్ను ఓడించిన రఫీగ్ హుసెనోవ్ (అజర్బైజాన్) ఫైనల్కు చేరుకోవడంతో గుర్ప్రీత్ సింగ్కు ‘రెపిచాజ్’ పద్ధతిలో కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం దక్కింది. -
సుశీల్కు బిగుసుకుంటున్న ఉచ్చు
న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా మృతి వ్యవహారంపై పోలీసుల విచారణ కీలక మలుపు తీసుకుంది. గ్రీకో రోమన్ 97 కేజీల విభాగంలో జాతీయ జూనియర్ మాజీ చాంపియన్ అయిన 23 ఏళ్ల సాగర్ రాణాను కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా కొట్టడంతో అతను చనిపోయాడు. భారత రెజ్లర్లకు అడ్డాలాంటి ఛత్రశాల్ స్టేడియం బయట జరిగిన ఈ ఘటనలో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, భారత మేటి రెజ్లర్ సుశీల్ కుమార్ హస్తం ఉందని వినిపిస్తోంది. అయితే అతను ఇప్పటికీ పోలీసులకు చిక్కలేదు. ఈ నేపథ్యంలో సుశీల్ మామ, సీనియర్ కోచ్ సత్పాల్ సింగ్ను పోలీసులు విచారించారు. ‘సుశీల్ మామ సత్పాల్ సింగ్, అతని బావమరిదిలను సుమారు రెండు గంటల పాటు విచారించాం. మంగళవారం స్టేడియం పార్కింగ్ ఏరియా వద్ద జరిగిన గొడవలో సుశీల్, అజయ్, ప్రిన్స్ దలాల్, సోనూ మహల్, సాగర్ అమిత్ భాగంగా ఉన్నారని మా విచారణలో తేలింది. సుశీల్, అతని సహచరులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో వెతుకుతున్నాం’ అని అడిషనల్ డీసీపీ గురిక్బాల్ సింగ్ వెల్లడించారు. మరోవైపు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జితేంద్ర సింగ్ రాసిన ఎఫ్ఐఆర్ కాపీలో ‘సుశీల్ పహిల్వాన్, అతని సహచరులు ఈ నేరం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది’ అని రాసి ఉంది. 1982 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన సత్పాల్ సింగ్కు కేంద్ర ప్రభుత్వం నుంచి అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు కూడా లభించాయి. కెరీర్ తొలినాళ్ల నుంచి సత్పాల్ సింగ్ వద్ద శిక్షణ తీసుకున్న సుశీల్ 2010లో సత్పాల్ సింగ్ కూతురు సావీని పెళ్లి చేసుకున్నాడు. -
టోక్యో ఒలింపిక్స్కు సుమిత్ అర్హత
సోఫియా (బల్గేరియా): భారత రెజ్లర్ సుమిత్ మలిక్ టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ రెజ్లింగ్ టోర్నీలో సుమిత్ 125 కేజీల విభాగంలో ఫైనల్కు చేరుకొని ‘టోక్యో’ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. గురువారం జరిగిన సెమీఫైనల్లో సుమిత్ 5–0తో జోస్ డానియల్ డియాజ్ రొబెర్టి (వెనిజులా)పై విజయం సాధించాడు. క్వార్టర్ ఫైనల్లో సుమిత్ 10–5తో రుస్తుమ్ ఇస్కందర్ (తజికిస్తాన్)ను ఓడించాడు. మరోవైపు అమిత్ ధన్కర్ (74 కేజీలు), సత్యవర్త్ కడియాన్ (97 కేజీలు) టోక్యో ఒలింపిక్స్కు అర్హత పొందలేకపోయారు. అమిత్ తొలి రౌండ్లో 6–9తో మిహైల్ సావా (మాల్డోవా) చేతిలో ఓడిపోగా... సత్యవర్త్ క్వార్టర్ ఫైనల్లో బల్గేరియా రెజ్లర్ బతయెవ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. ఫైనల్ చేరిన వారికి మాత్రమే టోక్యో ఒలింపిక్స్ బెర్త్లు ఖరారవుతాయి. -
రెజ్లర్ అన్షుకు రజతం
బెల్గ్రేడ్ (సెర్బియా): ప్రపంచకప్ రెజ్లింగ్ టోర్నమెంట్లో మహిళల 57 కేజీల విభాగంలో భారత రెజ్లర్ అన్షు మలిక్ రజత పతకం సాధించింది. బుధవారం జరిగిన ఫైనల్లో అన్షు 1–5 పాయింట్ల తేడాతో యూరోపియన్ చాంపియన్ అనస్తాసియా నిచితా (మాల్డోవా) చేతిలో ఓడిపోయింది. 55 కేజీల కాంస్య పతక పోరులో భారత రెజ్లర్ పింకీ 0–10తో ఓల్గా ఖొరోషత్సోవా (రష్యా) చేతిలో ఓటమి పాలైంది. ఇదే టోర్నీ పురుషుల విభాగంలో భారత రెజ్లర్లు రవి దహియా (57 కేజీలు), నర్సింగ్ యాదవ్ (74 కేజీలు), సుమీత్ (125 కేజీలు), నవీన్ (70 కేజీలు) నిరాశపరిచారు. -
రెండో ర్యాంక్లో రెజ్లర్ బజరంగ్
న్యూఢిల్లీ: యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్స్లో భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా రెండో ర్యాంక్లో నిలిచాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో బజరంగ్ 59 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. 60 పాయింట్లతో ఒలింపిక్ చాంపియన్ రషిదోవ్ (రష్యా) టాప్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. దౌలత్ నియాజ్బెకోవ్ (కజకిస్తాన్–56 పాయింట్లు), ఇస్మాయిల్ ముస్జుకజెవ్ (హంగేరి–41 పాయింట్లు) వరుసగా మూడు, నాలుగు ర్యాంక్ల్లో ఉన్నారు. తాజా ర్యాంకింగ్ ప్రకారం ఈ నలుగురికి వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్లో టాప్–4లో సీడింగ్ లభించడం ఖాయమైంది. పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో భారత్కే చెందిన రవి దహియా 45 పాయింట్లతో నాలుగో ర్యాంక్లో ఉన్నాడు. 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా 54 పాయింట్లతో రెండో ర్యాంక్లో నిలిచాడు. -
భయపడిందే జరిగింది!
న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో టోక్యో ఒలింపిక్స్ వాయిదాపై క్రీడాకారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) వాయిదా నిర్ణయంపై నిరాశ వ్యక్తం చేసింది. తాము భయపడిందే చివరికి జరిగిందని వినేశ్ పేర్కొంది. ‘ఐఓసీ తాజా నిర్ణయంతో చాలా నిరాశ చెందాను. ఒలింపిక్స్ వాయిదా వేస్తారేమో అని అందరం భయపడ్డాం. చివరకు అదే జరిగింది. ఒలింపిక్స్ వేదికపై రాణించడం ఒక అథ్లెట్కు చాలా కష్టం. కానీ ఇప్పుడు ఈ గేమ్స్ కోసం వేచి చూడటం, మళ్లీ సన్నాహకాలు కొనసాగించడం దానికన్నా పెద్ద కష్టం. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కానీ ఎన్నో భావోద్వేగాలు నన్ను చుట్టుముడుతున్నాయి’ అని 25 ఏళ్ల వినేశ్ తెలిపింది. గతేడాది ప్రపంచ చాంపియన్షిప్లో సత్తా చాటిన వినేశ్ టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. -
వినేశ్ ఓడింది కానీ..!
నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): ప్రపంచ రెజ్లింగ్చాంపియన్షిప్లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పరాజయం చవిచూసింది. అయితే ఇక్కడ ఆమె పసిడి ‘పట్టు’ ముగిసినా... టోక్యో దారి మిగిలే ఉంది. మహిళల 53 కేజీల కేటగిరీలో ఆమెకు ‘రెపిచేజ్’తో కాంస్యం గెలిచే అవకాశాలున్నాయి. మరో మహిళా రెజ్లర్ సీమా బిస్లా (50 కేజీలు) కూడా ఓడినప్పటికీ, వినేశ్ లాగే ఒలింపిక్స్ బెర్తు, కాంస్యం చేజిక్కించుకునే అవకాశాలు మిగిలే ఉన్నాయి. మంగళవారం జరిగిన 53 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ మయు ముకయిద (జపాన్) 7–0తో వినేశ్ను ఓడించింది. అనంతరం ఈ జపాన్ రెజ్లర్ తన జైత్రయాత్ర కొనసాగించి గెలిచి ఫైనల్ చేరింది. దీంతో వినేశ్కు నేడు జరిగే ‘రెపిచేజ్’లో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ క్రమంలో ఆమె కాంస్యం గెలవాలంటే ముగ్గురిని ఓడించాలి. లేదంటే కనీసం ఇద్దరిపై గెలిచినా టోక్యో ఒలింపిక్స్కు అర్హత సంపాదిస్తుంది. యులియా (ఉక్రెయిన్), ప్రపంచ నంబర్వన్ సారా అన్ (అమెరికా), ప్రివొలరకి (గ్రీస్)లతో వినేశ్ తలపడనుంది. ఇప్పటివరకు కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన వినేశ్... ప్రపంచ రెజ్లింగ్లో మాత్రం నెగ్గలేకపోయింది. 50 కేజీల ప్రిక్వార్టర్స్లో సీమా 2–9తో మరియా స్టాండిక్ (అజర్బైజాన్) చేతిలో పరాజయం చవిచూసింది. మూడు ఒలింపిక్ పతకాల విజేత అయిన మరియా ఫైనల్ చేరడంతో సీమా కూడా ‘రెపిచేజ్’ అవకాశం దక్కించుకుంది. ఒలింపిక్స్ అర్హత సాధించాలంటే ఆమె... మెర్సి(నైజీరియా), పొలెస్చుక్ (రష్యా)లను ఓడించాలి. కాంస్యం నెగ్గాలంటే వారిద్దరితో పాటు చైనా రెజ్లర్ యనన్ సన్పై గెలవాలి. భారత్కే చెందిన కోమల్ (72 కేజీలు), లలిత (55 కేజీలు) తొలి రౌండ్లోనే ఓడిపోయారు. వారిని ఓడించిన రెజ్లర్లు ఫైనల్కు చేరకపోవడంతో మరో అవకాశం లేకుండా పోయింది. -
ఖేల్రత్న బజరంగ్
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి రెజ్లర్ బజరంగ్ పూనియా అత్యున్నత క్రీడాపురస్కారమైన ‘రాజీవ్ ఖేల్రత్న’ అవార్డుకు ఎంపికయ్యాడు. 2018 ఆసియా గేమ్స్ (జకార్తా), కామన్వెల్త్ గేమ్స్ (గోల్డ్కోస్ట్) చాంపియన్ అయిన పూనియాను 12 మంది సభ్యులు గల అవార్డుల కమిటీ ఏకగ్రీవంగా నామినేట్ చేసింది. రిటైర్డ్ జస్టిస్ ముకుందకం శర్మ నేతృత్వంలోని ఈ కమిటీలో భారత క్రీడా దిగ్గజాలు బైచుంగ్ భూటియా, మేరీకోమ్ తదితరులున్నారు. ఈ కమిటీ రెండు రోజుల సమావేశం శుక్రవారం మొదలైంది. తొలిరోజే చాంపియన్ రెజ్లర్ను నామినేట్ చేయగా, శనివారం మరొకరిని ఈ ‘ఖేల్రత్న’కు జతచేసే అవకాశాల్ని కమిటీ పరిశీలిస్తుంది. గతేడాది అత్యున్నత క్రీడాపురస్కారానికి తనను గుర్తించకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన పూనియా కోర్టును కూడా ఆశ్రయించాడు. చివరకు మెగా ఈవెంట్లలో అతని బంగారు ప్రదర్శనను గుర్తించిన కమిటీ ఖేల్రత్నకు ఎంపిక చేయడం విశేషం. ఎట్టకేలకు తన ఘనతలకు గుర్తింపు దక్కినందుకు స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా హర్షం వ్యక్తం చేశాడు. వచ్చే నెలలో కజకిస్తాన్లో జరిగే ప్రపంచ చాంపియన్షిప్కు ముందు అవార్డుకు ఎంపిక కావడంకంటే కూడా తన శక్తి, సామర్థ్యాలే తనకు స్ఫూర్తి, ప్రేరణ అని చెప్పుకొచ్చాడు. మొత్తం మీద అవార్డుల కమిటీ... అర్జున, ద్రోణాచార్య అవార్డులకు ఎంపికైన అథ్లెట్లు, కోచ్లను నేడు ఖరారు చేసి భారత ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. అనంతరం క్రీడాశాఖ అధికారికంగా జాబితాను విడుదల చేస్తుంది. దివంగత హాకీ దిగ్గజం ధ్యాన్చంద్ జయంతి, జాతీయ క్రీడా దినోత్సవమైన ఆగస్టు 29న అవార్డుల్ని అందజేస్తారు. -
బజరంగ్ కోసం బై...బై
అంతర్జాతీయస్థాయిలో భారత రెజ్లింగ్ ముఖచిత్రాన్ని మార్చిన రెజ్లర్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్లాంటి మెగా ఈవెంట్స్లో పతకాలు గెలిచిన వీరిద్దరిలో సుశీల్ ఇంకా ‘కుస్తీ’ పడుతుండగా... యోగేశ్వర్ దత్ మాత్రం రెండేళ్లుగా ‘మ్యాట్’కు దూరంగా ఉన్నాడు. అయితే శుక్రవారం తన 35వ పుట్టిన రోజు సందర్భంగా రెజ్లింగ్ కెరీర్కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు యోగేశ్వర్ దత్ తెలిపాడు. సోనెపట్ (హరియాణా): ప్రపంచ చాంపియన్షిప్లో పతకం సాధించడం కలగానే మిగిలి పోయినప్పటికీ... ఇక రెజ్లింగ్ మ్యాట్పై బరిలోకి దిగే ఆలోచన లేదని భారత స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ తెలిపాడు. హరియాణాకు చెందిన 35 ఏళ్ల యోగేశ్వర్ 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్యం... 2014 కామన్వెల్త్ గేమ్స్... 2014 ఏషియన్ గేమ్స్లలో భారత్కు స్వర్ణ పతకాలు అందించాడు. 2016 రియో ఒలింపిక్స్లో ఫేవరెట్గా పోటీపడినా తొలి రౌండ్లోనే నిష్క్రమించిన అతను ఆ తర్వాత మళ్లీ మ్యాట్పైకి అడుగు పెట్టలేదు. 2017లో వివాహం చేసుకొని, అదే ఏడాది తన సొంత రాష్ట్రం హరియాణాలో అకాడమీని నెలకొల్పిన యోగేశ్వర్ 10 నుంచి 17 ఏళ్లలోపు ఉన్న 80 మంది కుర్రాళ్లకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. అతని ప్రియమైన శిష్యుడు బజరంగ్ పూనియా ఇటీవలే ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో 65 కేజీల విభాగంలో రజత పతకం గెలిచాడు. అంతేకాకుండా ప్రపంచ చాంపియన్షిప్లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ రెజ్లర్గా కొత్త చరిత్ర సృష్టించాడు. శుక్రవారం తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన యోగేశ్వర్ అధికారికంగా రెజ్లింగ్కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో పలు అంశాలపై యోగేశ్వర్ అభిప్రాయాలు అతని మాటల్లోనే... సరైన నిర్ణయమే... నేను 2020 టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం లేదు కాబట్టి బజరంగ్కు అవసరమైన ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇప్పటివరకు ఒలింపిక్స్లో భారత రెజ్లర్ స్వర్ణ పతకం సాధించలేదు. ఇప్పటి నుంచే బజరంగ్కు సరైన దిశానిర్దేశం చేస్తే టోక్యో ఒలింపిక్స్లో అతను తప్పకుండా పసిడి పతకం గెలుస్తాడన్న నమ్మకం ఉంది. వ్యక్తిగతంగా నా కెరీర్ అద్భుతంగా సాగింది. వరుసగా నాలుగు ఒలింపిక్స్లలో పాల్గొన్నాను. ఆ పతకం లేకపోయినా... దాదాపు అన్ని మెగా ఈవెంట్స్లో నేను పతకం సాధించినా ప్రపంచ చాంపియన్షిప్ పతకం మాత్రం మిగిలిపోయింది. ఈ ఏడాది బుడాపెస్ట్లో పోటీపడాలని భావించాను. అయితే అద్భుతమైన ఫామ్లో ఉన్న బజరంగ్ బరిలోకి దిగితేనే బాగుంటుందని నా ఆలోచనను విరమించుకున్నాను. చిన్నప్పటి నుంచి బజరంగ్ను చూస్తున్నాను. ఈస్థాయికి రావడానికి అతను ఎన్నో త్యాగాలు చేశాడు. ప్రపంచ చాంపియన్షిప్లో అతని ప్రదర్శన ఆకట్టుకుంది. అయితే అతని ఆటలో కొన్ని బలహీనతలు ఉన్నా యి. అయితే ప్రాక్టీస్ ద్వారా వాటిని అధిగమిస్తాడన్న నమ్మకం ఉంది. అకాడమీ నిర్వహణలో ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం లేకున్నా జేఎస్డబ్ల్యూ 15 మంది రెజ్లర్లకు స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. బజరంగ్ను ఒలింపిక్ చాంపియన్గా చూడాలన్నదే నా స్వప్నం. అంతే కాకుండా నా అకాడమీ నుంచి ప్రపంచ చాంపియన్లను తయారు చేయాలన్నదే నా సుదీర్ఘ లక్ష్యం. -
పూజ ధండాకు కాంస్య పతకం
బుడాపెస్ట్ (హంగేరీ): ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత క్రీడాకారిణి పూజ ధండా కాంస్య పతకంతో సత్తా చాటింది. 57 కేజీల ఫ్రీ స్టయిల్ విభాగంలో పూజ మూడో స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్ మ్యాచ్లో ఆమె 10–7 తేడాతో గ్రేస్ జాకబ్ బులెన్ (నార్వే)ను ఓడించింది. ఈ మెగా ఈవెంట్లో భజరంగ్ పూనియా రజతం తర్వాత భారత్కు లభించిన రెండో పతకం ఇదే కావడం విశేషం. అల్కా తోమర్ (2006 – 59 కేజీ), బబితా ఫొగాట్ (2012 – 51 కేజీలు), గీత ఫొగాట్ (2012 – 55 కేజీలు) తర్వాత వరల్డ్ చాంపియన్షిప్లో కాంస్యం నెగ్గిన నాలుగో రెజ్లర్గా పూజ ధండా గుర్తింపు పొందింది. కాంస్యం కోసం జరిగిన మరో బౌట్లో రితూ ఫొగాట్ (50 కేజీలు) 5–10 తేడాతో ఒక్సానా లివాక్ (ఉక్రెయిన్) చేతిలో ఓడి పతకం కోల్పోయింది. -
బజరంగ్ కొత్త చరిత్ర
బుడాపెస్ట్ (హంగేరి): ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు గెలిచిన భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా ప్రపంచ చాంపియన్షిప్లోనూ మెరిశాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో ఈ హరియాణా రెజ్లర్ స్వర్ణ–రజత పతక పోరుకు అర్హత సాధించి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. తద్వారా ఈ మెగా ఈవెంట్లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ రెజ్లర్గా కొత్త చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు 2013 ప్రపంచ చాంపియన్షిప్లో బజరంగ్ 60 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్లో ఉన్న బజరంగ్ ప్రపంచ చాంపియన్షిప్లో టైటిల్ ఫేవరెట్స్లో ఒకరిగా బరిలోకి దిగాడు. తనపై పెట్టుకున్న అంచనాలకు అనుగుణంగా రాణించి ఒక్కో ప్రత్యర్థిని ఓడిస్తూ అంతిమ సమరానికి అర్హత పొందాడు. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో బజరంగ్ 4–3తో అలెజాండ్రో ఎన్రిక్ వాల్డెస్ (క్యూబా)ను ఓడించాడు. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో బజరంగ్ 5–3తో తుల్గా తుముర్ (మంగోలియా)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 4–0 తో సెయుంగ్చుల్ లీ (దక్షిణ కొరియా)పై, తొలి రౌండ్లో 9–4తో రోమన్ అశారిన్ (హంగేరి)పై నెగ్గాడు. ఆదివారమే జరిగిన ఇతర విభాగాల్లో భారత రెజ్లర్లు నిరాశ పరిచారు. సందీప్ తోమర్ (57 కేజీలు), దీపక్ (92 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో... సచిన్ రాఠి (79 కేజీలు) తొలి రౌండ్లో ఓడిపోయారు. నేడు జరిగే ఫైనల్లో టకుటో ఒటోగురో (జపాన్)తో బజరంగ్ తలపడతాడు. ఒకవేళ బజరంగ్ గెలిస్తే భారత్ తరఫున ప్రపంచ చాంపియన్ అయిన రెండో రెజ్లర్గా గుర్తింపు పొందుతాడు. ఇప్పటివరకు భారత్ తరఫున సుశీల్ కుమార్ (66 కేజీలు; 2010లో) ఒక్కడే విశ్వవిజేతగా నిలిచాడు. గతంలో భారత్ తరఫున అమిత్ (55 కేజీలు; 2013లో), బిషంబర్ (57 కేజీలు; 1967లో) రజతాలు... రమేశ్ (74 కేజీలు; 2009లో), నర్సింగ్ యాదవ్ (74 కేజీలు; 2015లో), సందీప్ (66 కేజీలు, 2013లో) కాంస్య పతకాలు సాధించారు. -
కాంస్య పతకం రేసులో రెజ్లర్ సుమీత్
ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్ సుమీత్ ఫ్రీస్టయిల్ 125 కేజీల విభాగంలో కాంస్య పతకం కోసం తలపడనున్నాడు. కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం నెగ్గిన సుమీత్ సెమీఫైనల్లో 0–5తో చైనా రెజ్లర్ జెవె డింగ్ చేతిలో ఓడిపోయాడు. అమర్వీర్ (కెనడా)–నికోలస్ ఎడ్వర్డ్ (అమెరికా) మధ్య మ్యాచ్ విజేతతో నేడు కాంస్యం కోసం జరిగే పోరులో సుమీత్ ఆడతాడు. భారత్కే చెందిన జితేందర్ (74 కేజీలు), పవన్ కుమార్ (86 కేజీలు) తొలి రౌండ్లోనే నిష్క్రమించగా... సోన్బా తనాజీ (61 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. -
భారత హాకీ జట్టుకు రజతం
బ్యూనస్ ఎయిర్స్: నాలుగేళ్ల క్రితం కేవలం రెండు పతకాలతో సరిపెట్టుకున్న భారత బృందం ఈసారి యూత్ ఒలింపిక్స్లో అదరగొడుతోంది. ఫైవ్–ఎ–సైడ్ హాకీ పురుషుల విభాగంలో భారత జట్టు రజతం సొంతం చేసుకుంది. మలేసియాతో జరిగిన ఫైనల్లో భారత్ 2–4తో ఓడింది. స్వర్ణం–రజతం కోసం అర్జెంటీనాతో భారత మహిళల జట్టు కూడా తలపడనుంది. మహిళల రెజ్లింగ్ 43 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సిమ్రన్ రజత పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో సిమ్రన్ 6–11తో ఎమిలీ (అమెరికా) చేతిలో ఓడింది. నాలుగు రోజులు మిగిలి ఉన్న ఈ క్రీడల్లో ఇప్పటికే భారత్ 10 పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఇప్పటివరకు మను భాకర్, సౌరభ్ (షూటింగ్), లాల్రినుంగా (వెయిట్లిఫ్టింగ్) స్వర్ణాలు సాధించగా... తబాబి దేవి (జూడో), తుషార్ (షూటింగ్), మెహులీ (షూటింగ్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్), సిమ్రన్ (రెజ్లింగ్) రజతాలు గెలిచారు. 2010 యూత్ ఒలింపిక్స్లో భారత్ రెండు రజతాలు, ఆరు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు సాధించింది. -
ఫైనల్లో దీపక్
న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్ దీపక్ పూనియా పసిడి పతక పోరుకు అర్హత సాధించాడు. స్లొవేకియాలో జరుగుతున్న ఈ పోటీల్లో దీపక్ ఫ్రీస్టయిల్ 86 కేజీల విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో దీపక్ 6–2తో ఇవాన్ నెడాల్కో (మాల్డోవా)పై గెలుపొందాడు. అంతకుముందు బౌట్లలో దీపక్ 7–0తో ప్యాట్రిక్ జురోవ్స్కీ (హంగేరి)పై, 11–0తో జాయోంగ్ జిన్ (దక్షిణ కొరియా)పై విజయం సాధించాడు. నేడు జరిగే ఫైనల్లో ఆరిఫ్ ఓజెన్ (టర్కీ)తో దీపక్ తలపడతాడు. మరోవైపు 57 కేజీల విభాగంలో భారత్కే చెందిన నవీన్ సిహాగ్ రజతంతో సంతృప్తి పడ్డాడు. ఫైనల్లో నవీన్ 1–12తో అఖ్మెద్ ఇద్రిసోవ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. -
నంబర్వన్ ర్యాంక్కు అడుగు దూరంలో...
భారత మహిళా రెజ్లర్ నవ్జ్యోత్ కౌర్ నంబర్వన్ ర్యాంక్కు కేవలం అడుగు దూరంలో నిలిచింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో నవ్జ్యోత్ కౌర్ 65 కేజీల విభాగంలో రెండో స్థానంలో నిలిచింది. ఇటీవల ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో స్వర్ణం నెగ్గిన తొలి భారత మహిళా రెజ్లర్గా ఘనత సాధించిన నవ్జ్యోత్ కెరీర్లో ఇదే అత్యుత్తమ ర్యాంక్. 50 కేజీల విభాగంలో వినేశ్ ఫొగాట్ కూడా రెండో స్థానంలో ఉండటం విశేషం. -
సుశీల్ పసిడి ‘పట్టు’
న్యూఢిల్లీ: మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ టోర్నీలో బరిలోకి దిగిన భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో స్వర్ణం సాధించాడు. 74 కేజీల విభాగం ఫైనల్లో ఆకాశ్ ఖుల్లర్ (న్యూజిలాండ్)ను సుశీల్ చిత్తుగా ఓడించాడు. మహిళల విభాగంలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ 62 కేజీల విభాగం ఫైనల్లో 13–2తో తైలా తుహినే (న్యూజిలాండ్)ను ఓడించి స్వర్ణం దక్కించుకుంది. -
యోగేశ్వర్ దత్ ఎంతో హుందాగా ప్రవర్తించాడు!
భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ ఎంతో హుందాతనంతో ప్రవర్తించాడు. మంచి ఆటగాడిగానే కాదు మంచి మనసున్న వ్యక్తిగానూ ఈ రెజ్లర్ నిరూపించుకున్నాడు. డోపింగ్ ఫలితాలలో పాజిటీవ్ అని తేలిన రెజ్లర్ ప్రస్తుతం మన మధ్య లేనందున.. ఇప్పటికే బాధపడుతున్న ఆ కుటుంబానికి సాంత్వన చేకూర్చేలా ప్రవర్శించాడు రెజ్లర్ యోగేశ్వర్. 2012 లండన్ ఒలింపిక్స్లో తను సాధించిన కాంస్యం.. నాలుగేళ్ల తర్వాత రజతంగా మారిన విషయం తెలిసిందే. ఆ గేమ్స్లో రజతం సాధించిన రష్యా రెజ్లర్ బేసిక్ కుదుఖోవ్ డోపింగ్ పరీక్షలో పాజిటివ్ ఫలితం రావడంతో ఆ పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో యోగేశ్వర్కు రజతం దక్కింది. ఈ విషయంపై యోగేశ్వర్ దత్ తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు. రష్యా రెజ్లర్ బేసిక్ కుదుఖోవ్ మంచి వస్తాదు అని కితాబిచ్చాడు. 'ఇప్పటికే ఆ రెజ్లర్ను కోల్పోయి కుదుఖోవ్ కుటుంబం ఎంతో బాధలో ఉండి ఉంటుంది. అందుకే ఆ రెజ్లర్ సాధించిన పతకాన్ని అతడి గౌరవార్థం ఆ కుటుంబం వద్దనే ఉండాలి. అయితే చనిపోయిన తర్వాత డోపింగ్ టెస్టులో విఫలమవడం దురదృష్టకరం. ఈ సమయంలో మనం మానవతాదృక్పథంతో నడుచుకోవాలి'అని తన ట్వీట్లలో వెల్లడించాడు. Besik Kudukhov शानदार पहलवान थे। उनका मृत्यु के पश्चात dope test में fail हो जाना दुखद हैं। मैं खिलाड़ी के रूप में उनका सम्मान करता हूँ। — Yogeshwar Dutt (@DuttYogi) 31 August 2016 अगर हो सके तो ये मेडल उन्ही के पास रहने दिया जाए। उनके परिवार के लिए भी सम्मानपूर्ण होगा। मेरे लिए मानवीय संवेदना सर्वोपरि है। — Yogeshwar Dutt (@DuttYogi) 31 August 2016 -
నర్సింగ్ ‘కంచు’పట్టు
లాస్ వెగాస్ (అమెరికా) : భారత రెజ్లర్ నర్సింగ్ పంచమ్ యాదవ్ ప్రపంచ చాంపియన్షిప్లో అదరగొట్టాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 74 కేజీల విభాగంలో భారత్కు కాంస్య పతకాన్ని అందించాడు. ఆదివారం జరిగిన కాంస్య పతక పోరులో నర్సింగ్ ‘బై ఫాల్’ పద్ధతిలో జెలిమ్ఖాన్ ఖాదియెవ్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. నర్సింగ్ కాంస్య పతక ప్రదర్శనతో భారత్కు వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్కు ఒక బెర్త్ ఖాయమైంది. హోరాహోరీగా జరిగిన ఈ బౌట్లో మహారాష్ట్రకు చెందిన నర్సింగ్ యాదవ్ ఒకదశలో 4-12 పాయింట్లతో వెనుకబడ్డాడు. అయితే చివరి నిమిషంలో నర్సింగ్ తన ప్రత్యర్థిని ఎత్తిపడేసి ఉడుంపట్టు పట్టాడు. దీంతో రిఫరీ బైఫాల్ పద్ధతిలో నర్సింగ్ను విజేతగా ప్రకటించారు. అంతకుముందు జరిగిన రౌండ్లలో నర్సింగ్ 14-2తో హనోక్ రచమిన్ (ఇజ్రాయెల్)పై; 4-3తో సోనెర్ దిమిత్రాస్ (టర్కీ)పై; 16-5తో లివాన్ లోపెజ్ (క్యూబా)పై నెగ్గి సెమీస్కు అర్హత సాధించాడు. అయితే సెమీస్లో పురెవ్జావ్ (మంగోలియా) చేతిలో నర్సింగ్ ఓడిపోయాడు. మరోవైపు భారత్కే చెందిన అరుణ్ కుమార్ (70 కేజీలు) క్వార్టర్ఫైనల్లో 0-10తో జేమ్స్ మాల్కమ్ గ్రీన్ (అమెరికా) చేతిలో ఓడగా, అమిత్ కుమార్ (57 కేజీలు), సుమిత్ (125 కేజీ)లు ప్రిక్వార్టర్స్లోనే వెనుదిరిగారు. -
ఒలింపిక్స్ కు అర్హత సాధించిన యాదవ్
లాస్ వెగాస్(అమెరికా): ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో భారత్ రెజ్లర్ నర్సింగ్ పంచమ్ యాదవ్ కాంస్య పతకం సాధించాడు. 74 కేజీల ప్రిస్టయిల్ విభాగంలో మూడో స్థానంలో నిలిచి ఇండియాకు పతకం తెచ్చిపెట్టాడు. ఈ మెగా టోర్నిలో పతకం సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు 2016లో రియోలో జరగనున్న ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు. ప్రతి విభాగంలో మొదటి ఆరు స్థానాల్లో నిలిచిన వారికి ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో పతకం సాధించడం ద్వారా భార త రెజ్లర్ ఒలింపిక్స్ కు అర్హత సాధించడం ఇదే మొదటిసారి. -
బజరంగ్కు స్వర్ణం
న్యూఢిల్లీ: డేవ్ షుల్జ్ స్మారక అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత రెజ్లర్ బజరంగ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. అమెరికాలోని కొలరాడో స్ప్రింగ్స్లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల ఫ్రీస్టయిల్ 61 కేజీల విభాగం ఫైనల్లో బజరంగ్ 12-3 పాయింట్ల తేడాతో వ్లాదిమిర్ ఫ్లెగోన్తోవ్ (రష్యా)పై గెలిచాడు. భారత్కే చెందిన రాహుల్ అవారె (57 కేజీలు), ప్రవీణ్ రాణా (70 కేజీలు), నర్సింగ్ యాదవ్ (74 కేజీలు) పతకాలు నెగ్గడంలో విఫలమయ్యారు. స్టార్ రెజ్లర్లు యోగేశ్వర్ దత్, సుశీల్ కుమార్ ఈ టోర్నీలో బరిలోకి దిగలేదు.