Indraja
-
నన్ను, నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు:‘రజాకార్’ నిర్మాత
‘సినిమాలను డబ్బు కోసం, ఎంటర్ టైన్ మెంట్ కోసం చేస్తుంటారు. కానీ మేము రజాకార్ సినిమాను ఒక బాధ్యతతో చేశాం. నిజాం పాలనలో రజాకార్లు సాగించిన అకృత్యాలను కళ్లకు కట్టినట్లు చూపించాలనే ప్రయత్నం చేశాం’ అన్నారు నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి. బాబీ సింహ, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా రజాకార్(Razakar Movie). ఈ చిత్రాన్ని సమర్వీర్ క్రియేషన్స్ ఎల్ఎల్పి బ్యానర్పై గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. యాటా సత్యనారాయణ దరకత్వం వహించారు. గతేడాది థియేటర్స్ లో రిలీజై మంచి విజయాన్ని అందుకున్న రజాకార్ సినిమా ఈ నెల 24వ తేదీ నుంచి ఆహా(AHA) ఓటీటీలో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి(Guduru Narayana Reddy) మాట్లాడుతూ .. ఈ సినిమా నిర్మించే క్రమంలో నాకు ఎన్నో బెదిరింపులు వచ్చాయి. నన్ను నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు. కానీ నేను భయపడలేదు. సినిమాను నిర్మించాను. ఐఎండీబీలో 9.5 రేటింగ్ వచ్చింది. గోవా ఫిలిం ఫెస్టివల్ లో సన్మానం చేశారు. మా టీమ్, మా డైరెక్టర్ యాాటా సత్యనారాయణ సపోర్ట్ తో సినిమా సక్సెస్ పుల్ గా ప్రేక్షకులకు రీచ్ చేయగలిగాం. సొసైటీకి ఇది నేను ఇచ్చిన కాంట్రిబ్యూషన్ అనుకుంటా. ప్రజల నుంచి వచ్చిన స్పందన నాకు ఎంతో సంతృప్తిని మిగిల్చింది. ఈ సినిమాను మరో ప్రొడ్యూసర్ చేయలేడని చెప్పగలను. ఇప్పుడు మన తెలుగు వారి ఓటీటీకే మూవీ ఇవ్వాలని ఆహాలోకి తీసుకొస్తున్నాం. ఈ నెల 24వ తేదీ నుంచి ఆహాలో మా సినిమా ప్రీమియర్ కు వస్తోంది. మీరంతా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.నటి ఇంద్రజ మాట్లాడుతూ - రజాకార్ సినిమాను ప్రొడ్యూసర్ గూడూరు సత్యనారాయణ రెడ్డి గారు ఎన్నో కష్టాలకు తట్టుకుని నిర్మించారు. దర్శకుడు యాటా సత్యనారాయణ గారు పదేళ్లు ఈ మూవీ కోసం కష్టపడ్డారు. రజాకార్ల అకృత్యాలకు ఈ సినిమా గొప్ప డాక్యుమెంటరీ. మన నేల చరిత్ర గురించి తెలుసుకోవడం ఇక్కడ బతికే ప్రతి ఒక్కరి బాధ్యత. మతాలకు అతీతంగా ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆహాలో చూడాలి. ఎందుకంటే ఇది హిందూ, ముస్లిం మతాల మధ్య విభేదాలు సృష్టించే మూవీ కాదు. చరిత్రలో జరిగింది జరిగినట్లు తెరకెక్కించారు. ముస్లిం జర్నలిస్ట్ క్యారెక్టర్ మా సినిమాలో గొప్పగా ఉంటుంది. అలాగే ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేసిన ఆరో నిజాం ఘనతను కూడా చెప్పాం. నేను ఈ సినిమాలో వీరనారి చాకలి ఐలమ్మ క్యారెక్టర్ లో నటించాను. ఇలాంటి గొప్ప క్యారెక్టర్ లో నటించే అవకాశం కల్పించిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. చాకలి ఐల్మమ చేస్తున్నాని తెలిసినప్పుడు ఆమె చరిత్ర చదివి తెలుసుకున్నాను. ఆమె ఒక నిప్పురవ్వలా అప్పటి అకృత్యాలపై ఎదురుతిరిగారు. అన్నారు.నటుడు నాగమహేశ్ మాట్లాడుతూ - రజాకార్ చిత్రంలో నేను రాపాక రామచంద్రారెడ్డి అనే దేశ్ ముఖ్ క్యారెక్టర్ లో నటించాను. చాలా క్రూరమైన పాత్ర ఇది. సినిమాలో కీలకమైన ఇలాంటి పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు యాటా సత్యనారాయణ గారికి థ్యాంక్స్. ఆయన ఎంతో రీసెర్చ్ చేసి ఈ సినిమాను రూపొందించారు. అలాగే ఒక మంచి లక్ష్యంతో నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి గారు నిర్మించారు. ఆహా ఓటీటీలో రజాకార్ మూవీని చూసి సపోర్ట్ చేయండి. అన్నారు.డైరెక్టర్ యాటా సత్యనారాయణ మాట్లాడుతూ - మా రజాకార్ మూవీకి తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, ఇతర భాషల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. 18 ఫిలిం ఫెస్టివల్స్ కు అప్లై చేస్తే 15 ఫిలిం ఫెస్టివల్స్ కు సెలెక్ట్ అయ్యింది. గోవాలో జరిగిన ఇఫ్పీలో బెస్ట్ ఇండియా డెబ్యూగా నమోదైంది, బెస్ట్ డైరెక్టర్ గా నామినేట్ అయ్యాను. గోవాలో 75 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు రాజాకార్ సినిమా చూసి అప్రిషియేట్ చేశారు. జైపూర్ ఫిలిం ఫెస్టివల్ లో 72 దేశాల ప్రతినిధులు వచ్చి మా మూవీ చూశారు. ఇంత గొప్ప స్వాతంత్య్రపోరాటం జరిగిందా అని వారంతా ఆశ్చర్యపోయారు. ఎన్నో అవార్డ్ లు దక్కించుకుంది మా మూవీ. థియేట్రికల్ రిలీజ్ టైమ్ లో మంచి సమ్మర్, విద్యార్థులకు పరీక్షలు జరిగే టైమ్ కాబట్టి ఎక్కువమంది మా సినిమాను చూడలేకపోయారు. ఓటీటీలోకి మూవీని ఎప్పుడు తీసుకొస్తారు అని వందల ఫోన్ కాల్స్ వచ్చాయి. మాకు మూడు ఓటీటీల నుంచి ఆఫర్స్ వచ్చాయి. అయితే ఆహాలో మాత్రమే 25 నుంచి 30 లక్షల మంది తెలుగు ప్రేక్షకులు సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. మన చరిత్రను తెలుగు ప్రేక్షకులు తెలుసుకోవాలంటే ఆహా కరెక్ట్ ప్లాట్ ఫామ్ అని భావించి ఈ నెల 24న ప్రీమియర్ కు తీసుకొస్తున్నాం. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా మా మూవీ ఉంటుంది. తప్పకుండా మీరంతా ఆహాలో రజాకార్ సినిమా చూడాలని కోరుకుంటున్నా’ అన్నారు. -
బిడ్డకు జన్మనిచ్చిన 'బిగిల్' సినిమా నటి
కోలీవుడ్ ప్రముఖ లేడీ కమెడియన్ ఇంద్రజకు (Indraja) కుమారుడు జన్మించాడు. గతేడాదిలో తన స్నేహితుడు డైరెక్టర్ కార్తీక్తో ఆమె ఏడడుగులు వేసింది. ఇంద్రజ తండ్రి రోబో శంకర్(Robo Shankar) తమిళ్ చిత్ర సీమలో కమెడియన్గా రాణించారు. రోబో డ్యాన్స్తో ఫేమస్ అయినందున శంకర్ కాస్తా రోబో శంకర్ అయ్యాడు. కోలీవుడ్లో దాదాపు అందరు హీరోలతోనూ నటించాడు.నటి ఇంద్రజ తమిళ్తో పాటు తెలుగులో కూడా పలు చిత్రాలలో నటించింది. దళపతి విజయ్ 'బిగిల్' (తెలుగులో 'విజిల్') సినిమాతో నటిగా మారిన ఈమె.. బాగానే గుర్తింపు తెచ్చుకుంది. దీని తర్వాత విశ్వక్ సేన్ 'పాగల్', కార్తీ 'విరుమాన్' చిత్రంలోనూ హీరోయిన్ అదితి శంకర్ స్నేహితురాలి పాత్రలో యాక్ట్ చేసింది. ప్రస్తుతం టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంది. (ఇదీ చదవండి: దయచేసి ఇలాంటివి ఆపండి.. కరీనా కపూర్ ఆవేదన)తమిళ్లో ప్రసారం అవుతున్న`మిస్టర్ అండ్ మిస్సిస్` షో చేస్తున్నప్పుడు ఇంద్రజ గర్భవతి అయింది. ఈ విషయం ఆమె చెబుతూ ఆ షో నుంచి మధ్యలోనే తప్పుకుంది. ఇప్పుడు ఆమెకు పండంటి మగబిడ్డ జన్మించడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని బంధువులు తెలుపుతున్నారు. మనవడు పుట్టడంతో రోబో శంకర్ కుటుంబం ఆనందంలో మునిగిపోయినట్లు తెలుస్తోంది.కార్తీక్ను దత్తత తీసుకున్న రోబో శంకర్,ప్రియాంక దంపతులుఇంద్రజ పెళ్లి తర్వాత అందరూ తన మేనమామనే ఆమె పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, అందులో నిజం లేదని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంద్రజ తల్లి ప్రియాంకకు కార్తీక్ సొంత సోదరుడు అని చాలామంది అనుకున్నారు. ఇంద్రజకు కార్తీక్ మేనమామ అవుతాడని అనుకున్నారు. ఈ క్రమంలో కార్తీక్ మాట్లాడుతూ.. తాను ఇంద్రజకు మేనమామను కాదని గతంలో ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. తనను సోదరుడిగా ప్రియాంక దత్తత తీసుకున్నారని కార్తీక్ వెల్లడించారు. తాను ఇంద్రజ అమ్మ ప్రియాంకకు సొంత తమ్ముడిని కాదు. రోబో శంకర్, ప్రియాంక ఇద్దరూ చాలారోజులుగా తెలుసు. ప్రియాంకకు సోదరులు లేకపోవడంతో ఆమె తనను దత్తత తీసుకున్నారని ఆయన తెలిపారు. -
డైరెక్ట్గా ఓటీటీలో రిలీజవుతోన్న టాలీవుడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇంద్రజ, కృతికరాయ్, వెంకటేశ్ కాకుమాను, కృష్ణప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథా కమావీషు. ఈ చిత్రానికి గౌతమ్-కార్తీక్ ద్వయం దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు గౌతమ్ కథను అందించారు. అయితే ఈ సినిమాను డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ను రివీల్ చేశారు. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్తో పాటు ట్రైలర్ను కూడా విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతంలోని ప్రేమ, కుటుంబం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఐ డ్రీమ్ మీడియా, త్రి విజిల్స్ టాకీస్ బ్యానర్లపై చిన వాసుదేవ రెడ్డి నిర్మించారు. ఈ మూవీకి ఆర్ఆర్ ధృవన్సంగీతమందించారు. -
ప్రముఖ లేడీ కమెడియన్ బేబీ షవర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
‘సీఎం పెళ్లాం’.. మంచి సందేశం ఇచ్చే చిత్రం
జయసుధ, సుమన్, ఇంద్రజ, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీఎం పెళ్లాం’. గడ్డం వెంకట రమణారెడ్డి దర్శకత్వంలో బొల్లా రామకృష్ణ నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో సుమన్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో పోలీసాఫీసర్గా నటించాను’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో సీఎం భార్యగా నటించాను. సందేశాన్నిచ్చే చిత్రం ఇది’’ అని తెలిపారు ఇంద్రజ. (చదవండి: వాడు హగ్ చేసుకుంటే కంఫర్టబుల్గా లేదు.. ఫైర్ అయిన యష్మి)‘సీఎం పెళ్లాం సినిమాలో నేను లీడ్ రోల్ చేశాను. ఇది మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. పాలిటిక్స్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే సమాజానికి మంచి జరుగుతుంది అని చెప్పే చిత్రమిది’ అని అన్నారు నటుడు అజయ్. ‘‘రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సందేశాత్మక చిత్రం ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూనే ఆలోచింపజేస్తుంది. ఓ సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేసేందుకు ముందుకొస్తే ఎలా ఉంటుందనేది చూపించే ప్రయత్నం చేశాం’’ అని వెల్లడించారు గడ్డం వెంకట రమణారెడ్డి. ‘‘ఈ చిత్రంలో మహిళా సాధికారకత అంశాలు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు బొల్లా రామకృష్ణ. -
‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ (ఫొటోలు)
-
నాకు ఇష్టమైతేనే వస్తా: అల్లు అర్జున్
‘‘పుష్ప 2: ది రూల్’ క్లైమాక్స్ షూటింగ్లో ఉన్నా. నా జీవితంలో ఎంతో క్లిష్టమైన క్లైమాక్స్ షూటింగ్ . సుకుమార్గారి భార్య తబితగారు వచ్చి ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ సినిమాని నేను సమర్పిస్తున్నాను.. ప్రీ రిలీజ్ వేడుకకి రావాలని అడగ్గానే వస్తానని చెప్పాను. ఎందుకంటే మనకి ఇష్టమైన వాళ్లకి మనం సపోర్ట్గా నిలబడగలగాలి. అది మన ఫ్రెండ్ అయినా, కావాల్సిన వాళ్లు అయినా. నాకు ఇష్టమైతేనే నేను వస్తా.. నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరికీ తెలిసిందే’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. తబితా సుకుమార్ సమర్పణలో బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించిన ఈ మూవీ ఈ నెల 23న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ మాట్లాడుతూ–‘‘సుకుమార్గారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఉన్నారు. అయినా తబితగారు స్వతహాగా ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. రావు రమేష్గారి లాంటి నటుడు ఉండటం మన తెలుగు ఇండస్ట్రీ అదృష్టం. ఈ మధ్య చిన్న చిత్రాలకు జనాలు థియేటర్స్కి వస్తుండటం మంచి ట్రెండ్. అదే ట్రెండ్ ఈ శుక్రవారం కూడా కొనసాగాలి. ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ ని కూడా మీరు సపోర్ట్ చేయాలి. గత ఏడాది నాకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు ఈ ఏడాది ‘కాంతార’ కి వస్తే బాగుండు అనుకున్నా. రిషబ్ శెట్టిగారికి వచ్చినందుకు అభినందనలు. నిత్యామీనన్ మంచి నటి. నాకు మంచి ఫ్రెండ్. తనకు జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉంది. అలాగే ‘కార్తికేయ 2’ మూవీ యూనిట్కి, జానీ మాస్టర్కి కూడా అభినందనలు. డిసెంబరు 6న అస్సలు తగ్గేదే లే.. ఇది మాత్రం ఫిక్స్. నా సినిమా ఎలా ఉన్నా మీకు(ఫ్యాన్స్) నచ్చుతుంది కాబట్టి ‘పుష్ప 2: ది రూల్’ని మీకు అంకితం ఇస్తున్నా’’ అని తెలిపారు. డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి బన్నీ రావడం వల్ల ఈ చిన్న సినిమా కాస్త పెద్దది అయిపోయింది. బన్నీ ఎప్పుడూ కూడా తాను స్టార్ అనుకోడు.. నేను బాగా నటించాలన్నదే తన లక్ష్యం. ఓ స్టార్ హీరో నటించడమే గొప్ప విషయం అనుకుంటే గనక.. గొప్పగా నటించే రావు రమేశ్కూడా బిగ్గెస్ట్ స్టార్. ఈ సినిమా హిట్ కావాలి’’ అన్నారు. ‘‘ఇన్నేళ్లలో నాకు సరైన స్క్రిప్ట్ దొరికిందని నమ్మి, ఈ సినిమాలో లీడ్ రోల్ చేశాను’’ అని రావు రమేష్ చెప్పారు. ‘‘ఇటీవల ‘కమిటీ కుర్రోళ్ళు, ఆయ్’ వంటి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఆ కోవలో మంచి కథతో వస్తున్న మా ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ ని కూడా ఆదరించాలి’’ అన్నారు తబితా సుకుమార్. ఈ వేడుకలో నిర్మాతలు మోహన్ కార్య, బుజ్జి రాయుడు పెంట్యాల, ఇంద్రజ తదితరులు పాల్గొన్నారు. -
తప్పు తెలుసుకోవడానికి ఆర్నెల్లు పట్టింది: డైరెక్టర్ లక్ష్మణ్ కార్య
'హ్యాపీ వెడ్డింగ్'లో ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవడానికి ఆర్నెల్లు పట్టింది. ఈ సారి అలాంటి తప్పు జగరకూడదని, ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే కసితో ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’’ కథ రాసుకున్నాను. ఆ తర్వాత ఈ కథకు హీరో ఎవరైతే బాగుంటుందని ఆలోచించగా రావు రమేశ్ గుర్తుకు వచ్చారు. ఆయన సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమా చేయరేమో అని చాలా మంది చెప్పారు. అయితే ఒక్కసారి కథ చెప్పి చూద్దాం అని ఆయనను సంప్రదించాను. ఫస్ట్ డైలాగ్ చెప్పిన వెంటనే నవ్వేశాఉ. 15,20 నిమిషాల్లో కథ వివరించా. వెంటనే రావు రమేశ్ ఓకే చేశారు’ అని అన్నారు దర్శకుడు లక్ష్మణ్ కార్య. ఆయన దర్శకత్వంతో రావు రమేశ్, అంకిత్ కొయ్య, ఇంద్రజ, రమ్య పసుపులేటి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మారుతి నగర్ సూర్య’. హర్ష వర్దన్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం ఆగస్ట్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ లక్ష్మణ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ 'ఎందుకిలా' వెబ్ సిరీస్తో నేను దర్శకుడిని అయ్యా. అందులో సుమంత్ అశ్విన్ గారు హీరో. ఆ సిరీస్ అయ్యాక ఆయన, నిహారిక జంటగా 'హ్యాపీ వెడ్డింగ్' చేశా. దర్శకుడిగా 'మారుతి నగర్ సుబ్రమణ్యం' నా రెండో సినిమా.→ ఈ సినిమాలో రావు రమేష్ , అంకిత్ కొయ్య తండ్రి కుమారులుగా నటించారు. అంకిత్ కొయ్యకు తానొక గొప్ప ఇంటి బిడ్డను అని, 'అల వైకుంఠపురములో' కాన్సెప్ట్ టైపులో తనను చిన్నప్పుడు మార్చేశారని అనుకుంటాడు. అల్లు అరవింద్ కొడుకు అని అతడి ఫీలింగ్. అల్లు అర్జున్ తన అన్నయ్య అనుకుంటాడు. ప్రేమించిన అమ్మాయిని చూసినప్పుడు అల్లు అర్జున్ సినిమాల్లో జరిగినట్టు ఊహించుకున్నాడు. ఇటీవల కాలంలో వచ్చిన సినిమాల్లో బెస్ట్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్ 'మారుతి నగర్ సుబ్రమణ్యం'లో చూస్తారు.→ ఇంద్రజ గారి క్యారెక్టర్ గురించి ఎక్కువ రివీల్ చేయడం లేదు. రావు రమేష్ గారి భార్యగా, కళామణి పాత్రలో అద్భుతంగా నటించారు. సినిమాలో ఇంపార్టెంట్ సీన్ ఒకటి ఉంది. ప్రతి రోజూ ఆవిడకు ఆ సీన్ గురించి చెబుతూ వస్తున్నా. షూటింగ్ చేయడానికి కొన్ని నిమిషాల ముందు ఆవిడకు చెబితే క్యాజువల్ గా అటు ఇటు చూశారు. యాక్షన్ చెప్పిన తర్వాత సింగిల్ షాట్లో చేసేశారు. ఆవిడ ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ చేశారు.→ డైరెక్టర్ సుకుమార్ భార్య తబితకు ఈ సినిమా ప్రివ్యూ వేశాం. ఒకవేళ ఆవిడకు సినిమా నచ్చకపోతే నాకు సుకుమార్ రైటింగ్స్ సంస్థల్లోకి ఎప్పటికీ ఎంట్రీ ఉండదు. అందుకని భయపడ్డా. భయపడుతూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఫస్ట్ కాపీ రెడీ చేసి చూపించా. ప్రివ్యూ స్టార్ట్ అయ్యే ముందు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వమని మా టీంలో ఒకరిని లోపల పెట్టాను. నాకే బయటకు నవ్వులు వినిపించాయి. అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యా. తబిత గారు సినిమా బావుందని మెచ్చుకున్నారు.→ సుకుమార్ సినిమా చూసి నాకు ఫోన్ చేశాడు. రావు రమేష్ గారు అద్భుతంగా చేశారని, సినిమా బాగా తీశావని చెప్పారు. మొదట ఐదు నిమిషాలు తప్ప ఆ తర్వాత ఏం చెప్పారో నాకు గుర్తు లేదు. నేను ఆనందంలో తేలిపోయా. ఆయన మాటలు నాకు మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. ఆగస్టు 23న ప్రేక్షకులు కూడా సినిమా చూసినప్పుడు అంతే ఆనందంగా నవ్వుతారని ఆశిస్తున్నాను -
తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన లేడీ కమెడియన్
ప్రముఖ లేడీ కమెడియన్ శుభవార్త చెప్పేసింది. తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో విషయాన్ని ఇన్ స్టా వేదికగా బయటపెట్టింది. ఈ క్రమంలోనే పలువురు నటీనటులు, ఫాలోవర్స్ ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: పెళ్లి బంధానికి పూర్తి న్యాయం చేశా.. కానీ: సమంత)ప్రముఖ తమిళ నటుడు రోబో శంకర్ కూతురే ఇంద్రజ శంకర్. దళపతి విజయ్ 'బిగిల్' (తెలుగులో 'విజిల్') సినిమాతో నటిగా మారిన ఈమె.. బాగానే గుర్తింపు తెచ్చుకుంది. దీని తర్వాత విశ్వక్ సేన్ 'పాగల్', కార్తీ 'విరుమాన్' చిత్రాల్లోనూ ఇంద్రజ సహాయ పాత్రలు చేసింది. ప్రస్తుతం టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంది.ఈ ఏడాది మార్చిలో కార్తీక్ అనే దర్శకుడిని పెళ్లి చేసుకున్న ఇంద్రజ.. ప్రస్తుతం తాను గర్భవతి అయినట్లు ప్రకటించింది. ఈ విషయం తెలియగానే ఎమోషనల్ అయిపోయానని, మాటలు రావట్లేదని ఇన్ స్టాలో రాసుకొచ్చింది. లవ్ మామ అని భర్తని ఉద్దేశించి తెగ ప్రేమ కురిపించింది.(ఇదీ చదవండి: నిన్న ఎంగేజ్మెంట్.. ఇప్పుడు పెళ్లిలో కనిపించిన నాగచైతన్య) View this post on Instagram A post shared by INDRAJA SANKAR (@indraja_sankar17) -
ఇండియా ఫైల్స్లాంటి సినిమా అవసరం
‘‘ప్రస్తుత సమాజానికి ‘ఇండియా ఫైల్స్’ లాంటి సినిమా చాలా అవసరం. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలే మూలాలుగా తెరకెక్కిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అద్దంకి దయాకర్ లీడ్ రోల్లో ఇంద్రజ, సుమన్, ‘శుభలేఖ’ సుధాకర్ ఇతర ΄ాత్రల్లో నటించిన చిత్రం ‘ఇండియా ఫైల్స్’. బొమ్మకు హిమమాల సమర్పణలో డా. బొమ్మకు మురళి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుకను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ– ‘‘అద్దంకి దయాకర్ నటన చూడలేదు. కానీ ఆయనకు ప్రతి సబ్జెక్ట్, సమస్యల పట్ల ఉన్న అవగాహన నాకు తెలుసు. దయాకర్ ఎప్పటికైనా పెద్ద నాయకుడు కావాలి’’ అన్నారు. ‘‘గద్దర్గారు ΄ాడి, నటించిన ΄ాటకి నేను సంగీతం అందించడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఎంఎం కీరవాణి. డా. అద్దంకి దయాకర్ మాట్లాడుతూ– ‘‘నటనంటే తెలియని నాకు 40 రోజులు శిక్షణ ఇచ్చి, మంచి కంటెంట్ ఉన్న సినిమాలో నటించే చాన్స్ కల్పించిన మురళిగారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ఈ సినిమా సమాజం గురించి చాలా విషయాలు నేర్పిస్తుంది... ఆలోచింపజేస్తుంది’’ అన్నారు బొమ్మకు మురళి. గీత రచయిత మౌనశ్రీ మల్లిక్, దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల, కొరియోగ్రాఫర్ సుచిత్రా చంద్రబోస్ మాట్లాడారు. -
Indraja Sankar: కమెడియన్ రోబో శంకర్ కూతురు ఇంద్రజ పెళ్లి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
కమెడియన్ ఇంట వేడుకలు.. బెస్ట్ఫ్రెండ్ను పెళ్లాడిన నటి
కమెడియన్ రోబో శంకర్ ఇంట పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. అతడి కూతురు, నటి ఇంద్రజ పెళ్లిపీటలెక్కింది. 20 ఏళ్ల వయసులో తన క్లోజ్ఫ్రెండ్, డైరెక్టర్ కార్తీక్తో ఏడడుగులు వేసింది. ఫిబ్రవరి 2న ఎంగేజ్మెంట్ జరగ్గా ఆదివారం (మార్చి 24న) వీరి వివాహం కన్నులపండగ్గా జరిగింది. చెన్నైలో జరిగిన ఈ శుభకార్యానికి ఇరు కుటుంబసభ్యులతో పాటు బంధుమిత్రులు, సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. గోరుముద్దలు.. 'దేవుడి ఆశీస్సులతో పెద్దల సమక్షంలో మనం ఒక్కటయ్యాం' అంటూ పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఇంద్రజ శంకర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే పెళ్లి తర్వాత గోరుముద్దలు తినిపించుకున్న వీడియో సైతం పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. కాగా ఇంద్రజ.. తమిళ రియాలిటీ షో 'సర్వైవర్'తో గుర్తింపు పొందింది. తర్వాత బిగిల్(విజిల్) సినిమాలో నటించింది. తెలుగులో విశ్వక్ సేన్ 'పాగల్' మూవీలో 'ఈ సింగిల్ చిన్నోడే..' పాటలో కనిపించింది. కార్తీ 'విరుమాన్' చిత్రంలోనూ హీరోయిన్ అదితి శంకర్ స్నేహితురాలి పాత్రలో యాక్ట్ చేసింది. స్టార్ హీరోలతో నటించిన కమెడియన్ ఆమె తండ్రి విషయానికి వస్తే.. రోబో డ్యాన్స్తో ఫేమస్ అయినందున శంకర్ కాస్తా రోబో శంకర్ అయ్యాడు. మిమిక్రీతో కెరీర్ ఆరంభించిన అతడు ఎప్పుడోగానీ సినిమాల్లో కనిపించేవాడు కాదు. 'ఇదర్కుతనే ఆశైపట్టై బాలకుమార' సినిమాతో అందరి కంట్లో పడ్డాడు. ఈ మూవీ ద్వారా వచ్చిన క్రేజ్తో ఏడాదికి పది సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు. కోలీవుడ్లో దాదాపు అందరు హీరోలతోనూ నటించాడు. View this post on Instagram A post shared by sai sreedevi (@sai.sree.devi) View this post on Instagram A post shared by Behindwoods (@behindwoodsofficial) View this post on Instagram A post shared by Behindwoods (@behindwoodsofficial) చదవండి: బాలీవుడ్ స్టార్స్.. తెలుగు సినిమాలకు ఎంత తీసుకుంటున్నారో తెలుసా? -
'రజాకార్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
రావు రమేష్, ఇంద్రజల 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం' సరికొత్తగా పోస్టర్ లాంచ్
రావు రమేష్ కథానాయకుడిగా... పీబీఆర్ సినిమాస్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం'. ఈ చిత్రంలో నటి ఇంద్రజ ఆయన సరసన నటించడం విశేషం. లక్ష్మణ్ కార్య దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ పోస్టర్ను తాజాగా విడుదల చేశారు. 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం' ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా రావు రమేష్ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో చివర్లో ఆ క్యూఆర్ ఇచ్చారు. అది స్కాన్ చేస్తే ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లోని విజయవాడ మావయ్య, పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'కెజియఫ్'లో రాఘవన్ క్యారెక్టర్లు ఎంత పాపులర్ అనేది ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఇద్దరూ రావు రమేష్ ముందు ప్రత్యక్షం అయ్యారు. 'ఎప్పుడూ సగం సగం ఎంటర్టైన్ చేయడమేనా? ఫుల్లుగా మమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ఉందా? లేదా? అని! క్యారెక్టర్లు, సినిమా చేస్తున్నాం అంటే సరిపోయిందా? ప్రేక్షకులకు చక్కగా ఫుల్ మీల్స్ పెట్టినట్లు ఫుల్లుగా ఎంటర్టైన్ చేసి ఒక్కసారైనా పంపాలి కదా!' అని విజయవాడ మావయ్య అడిగితే... 'ఎస్! హి ఈజ్ రైట్. ఇది హాట్ ఇష్యూ, స్వీట్ ఇష్యూ, స్టేట్ ఇష్యూ! నువ్వు తప్పకుండా సమాధానం చెప్పాలి' అని గట్టిగా అడిగారు. అప్పుడు రావు రమేష్ ''ఆన్సర్ చాలా సింపుల్. దేనికైనా అవకాశం రావాలి. ఇప్పుడు అవకాశం వచ్చింది. చేశాను. రిలీజ్ అవుతుంది' అని చెప్పారు. సినిమా పేరేంటో? అని విజయవాడ మావయ్య అడిగితే... 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం' అని చెప్పారు. పేరు బావుందని విజయవాడ మావయ్య చెబితే... సినిమా ఇంకా బావుంటుందని రావు రమేష్ తెలిపారు. సినిమా గురించి రావు రమేష్ మాట్లాడుతూ ''మారుతి నగర్ సుబ్రహ్మణ్యం... ఈ సినిమా భలే గమ్మత్తుగా ఉంటుంది. అయితే, ఈ సినిమా పోస్టర్ ఎవరు ఆవిష్కరిస్తే బావుంటుందని అనుకున్నా. నటుడిగా నాకు ఈ స్థాయిని, ఈ స్థానాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులే ఆవిష్కరిస్తే బావుంటుందని మేమంతా మనస్ఫూర్తిగా నమ్మాం. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే... వీడియో చివర్లో వచ్చే క్యూఆర్ కోడ్ ని మీ చేతులతో స్కాన్ చేయండి. నా పోస్టర్ ఆవిష్కరించండి, ప్రోత్సహించండి'' అని విజ్ఞప్తి చేశారు. రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఆయనతో పాటుగా భాస్కరభట్ల, కళ్యాణ్ చక్రవర్తి కూడా ఉన్నారు.ఆర్ట్ డైరెక్షన్: సురేష్ భీమంగని, ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి, పీఆర్వో: పులగం చిన్నారాయణ, సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: శ్రీహరి ఉదయగిరి, సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల, నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: మోహన్ కార్య. -
కమెడియన్ కూతురి నిశ్చితార్థం.. నెల రోజుల్లో పెళ్లి!
తమిళ కమెడియన్ రోబో శంకర్ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. అతడి కూతురు ఇంద్రజకు డైరెక్టర్ కార్తీక్తో నిశ్చితార్థం జరిగింది. ఫిబ్రవరి 2న చెన్నైలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ శుభకార్యానికి ఇరు కుటుంబాలు సహా అతి దగ్గరి బంధుమిత్రులు హాజరయ్యారు. తన ఎంగేజ్మెంట్ ఫోటోలను ఇంద్రజ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్గా మారాయి. పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నెల రోజుల్లోనే వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. విజిల్, పాగల్ సినిమాల్లో.. ఇందుకోసం రోబో శంకర్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చెన్నైలో జరగబోయే ఈ వేడుకకుగానూ సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇంద్రజ.. విజయ్ హీరోగా నటించిన బిగిల్(తెలుగులో విజిల్ పేరిట రిలీజైంది) మూవీలో ఓ ముఖ్య పాత్ర పోషించింది. తెలుగులో పాగల్ అనే సినిమా చేసింది. ఇందులో .ఈ సింగిల్ చిన్నోడే..' అనే పాటలో మాత్రమే కనిపిస్తుంది. కార్తీ 'విరుమాన్' మూవీలో హీరోయిన్ అదితి శంకర్ స్నేహితురాలిగా నటించింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేసే ఆలోచనలో ఉంది ఇంద్రజ. ఎవరీ రోబో శంకర్.. ఆమె తండ్రి రోబో శంకర్ విషయానికి వస్తే.. ఇతడు రోబో డ్యాన్స్తో ఫేమస్ అయ్యాడు. అందుకే ఆయనకు ఆ పేరు వచ్చింది. తనకు వచ్చిన మిమిక్రీతో సినిమాల్లో అడుగుపెట్టాడు. నెమ్మదిగా ఒక్కో సినిమా చేసుకుంటూ పోయాడు. కెరీర్ ప్రారంభించిన పదేళ్ల తర్వాతే అతడికి మంచి బ్రేక్ వచ్చింది. 'ఇదర్కుతనే ఆశైపట్టై బాలకుమార' అనే చిత్రంతో అందరి కళ్లలో పడ్డాడు. అప్పటివరకు ఏడాదికి ఒకటీరెండు సినిమాలు చేసే ఇతడు ఈ చిత్రం సక్సెస్ తర్వాత ఏకంగా 10 సినిమాలు చేసే స్థాయికి ఎదిగిపోయాడు. దాదాపు తమిళ స్టార్ హీరోలందరితోనూ కలిసి పని చేశాడు. View this post on Instagram A post shared by SmartDecors (EVENT PLANNERS) (@smart_decors.in) View this post on Instagram A post shared by @clicks_by_vishnu_kumar_ చదవండి: భర్తతో కలిసి ఉదకశాంతి పూజ చేసిన గీతా మాధురి.. ఆమిర్తో, అతడి మాజీ భార్యతో.. నా రిలేషన్ ఎలా ఉందంటే? -
మారుతినగర్లో నవ్వులు
రావు రమేష్, ఇంద్రజ జంటగా నటించిన చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహిస్తున్నారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ‘‘ఈ చిత్రంలో మంచి వినోదాత్మక పాత్రలో నటించారు రావు రమేష్గారు. ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు లక్ష్మణ్ కార్య. ‘‘అజీజ్ నగర్, బీహెచ్ఈఎల్, కనకమామిడి, వనస్థలిపురం... ఇలా హైదరాబాద్ పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ చేశాం. రావు రమేష్గారు ఈ సినిమాలో చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను నవ్వించడం పక్కా’’ అన్నారు నిర్మాతలు. ఈ సినిమాకు సంగీతం: కల్యాణ్ నాయక్. -
ఇంద్రజ హీరోయిన్గా కొత్త సినిమా.. ఆసక్తిగా టైటిల్!
అజయ్, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం సీఎం పెళ్లాం(కామన్ మ్యాన్ పెళ్లాం). వాకాడ అప్పారావు సమర్పణలో ఆర్కే సినిమాస్ బ్యానర్పై బొల్లా రామకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రమణారెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ నెలాఖరు వరకు ఈ సినిమా మొదటి షెడ్యూల్ జరగనుందని మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రంలో సీనియర్ హీరో సుమన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నగేష్, కోటేశ్వర రావు, సురేశ్ కొండేటి, భరత్, ప్రీతి నిగం, రూపాలక్ష్మి, ప్రజ్ఞ, శాంతి, దాసరి చలపతి రావు, బేబీ హర్షిత, సత్యనారాయణ మూర్తి కీలక పాత్రలు పోషిస్తున్నారు. డైరెక్టర్ రమణారెడ్డి మాట్లాడుతూ..'ఇది వెరైటీ సినిమా అని కానీ చూశాక ప్రేక్షకులే చెబుతారు. డిఫరెంట్ యాంగిల్తో పాటు పొలిటికల్ పాయింట్స్ నేపథ్యంలో ఉంటుంది. నిజంగా పదేళ్ల తర్వాత రాజకీయాలు ఎలా ఉంటాయి? ఎలా ఉండబోతున్నాయి? అనే భిన్నమైన కోణంలో ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నాం.'అని అన్నారు. -
యువతకు సందేశం
‘‘నేటి యువతకు సందేశం ఇవ్వడానికే ‘రజాకార్’ సినిమా తీశారు. ఇలాంటి చిత్రం తీసే ధైర్యం చేసిన మా డైరెక్టర్ సత్యనారాయణకి థ్యాంక్స్’’ అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. బాబీ సింహా, వేదిక, అనుశ్రేయ త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రల్లో యాటా సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రజాకార్’. సమర్ వీర్ క్రియేషన్స్పై గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా టీజర్ను రాజాసింగ్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఈ సినిమా టీజర్ చూస్తేనే ఎంతో కోపం వస్తోంది.. ఇక సినిమా చూస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి’’ అన్నారు. ‘‘తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకు స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబర్ 17 మా సినిమాకి కథా వస్తువుగా మారింది. ఆ రోజు జరిగిన విముక్తి పోరాటంతో ఈ సినిమా తీశాను’’ అన్నారు యాటా సత్యనారాయణ. ‘‘ఈ చిత్రం మన చరిత్ర గురించి అందరికీ తెలియజేస్తుందనుకుంటున్నాను’’ అన్నారు గూడూరు నారాయణ రెడ్డి. -
యాంకర్ రష్మీపై వల్గర్ కామెంట్ చేసిన కమెడియన్
బుల్లితెరపై యాంకర్ రష్మీ గౌతమ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందచందాలతో పాటు తనదైన మాటతీరుతో ప్రస్తుతం టాప్ యాకర్స్లో ఒకరుగా కొనసాగుతుంది. బుల్లితెరపైనే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తూ అలరిస్తుంది. హీరోయిన్గా స్థిరపడాలనే ఆశతో వచ్చిన రష్మీకి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం బుల్లితెర యాంకర్గా స్థిరపడిపోయిందనే చెప్పవచ్చు. అక్కడ తను స్టార్ పొజీషన్లోనే ఉన్నారు కూడా. తను సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండటంతో ఫ్యాన్స్లో కూడా విపరీతమైన క్రేజ్ తనకు ఉంది. (ఇదీ చదవండి: అరియానా లుక్పై ట్రోల్స్.. ఈ కార్యక్రమం ఏమైనా ప్లాన్ చేశావా అంటూ..?) తాజాగా తను హోస్ట్ చేస్తున్న ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్లో రష్మిని అవమానించినట్లేనని చెప్పవచ్చు . ఇదే షోలో ఇప్పటి వరకు డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతున్న హైపర్ ఆదికి తోడుగా తాజాగా ఆటో రాంప్రసాద్ కూడా వచ్చి చేరాడు. తన స్కిట్లో భాగంగా రష్మిని ఏకంగా 'రాత్రికి వస్తావా' అంటూ డబల్ మీనింగ్ అర్థం వచ్చేలా చిల్లర డైలాగ్ వేశాడు. దీంతో రష్మీ కూడా నన్ను ఎందుకు రమ్మంటున్నావు అంటూ సమాధానం ఇస్తుంది. రాత్రికి ఎందుకు రమంటారో తెలియదా..? అంటూ ఆటో రాంప్రసాద్ తిరిగి అంటాడు. అప్పుడు రష్మితో సహా సెట్లోని అందరు కూడా షాక్ అయ్యారు. దీంతో అక్కడే ఉన్న ఇంద్రజ కలుగజేసుకుని ఏయ్... అనేసరికి వెంటనే తేరుకున్న ఆటో రాంప్రసాద్ 'ఊరిలో జాతర ఉంది అందుకే పిలిచానంటూ' మరో డైలాగ్తో కవర్ చేస్తాడు. ఇలాంటి కవరింగ్లు ఆ ప్రోగ్రామ్లలో సర్వసాధారణమైనా మరీ ఇంతలా దిగజారిన చిల్లర డైలాగ్లు ఉంటే ఎలా అని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ సినిమా బడ్జెట్నే రూ. 200 కోట్లు.. నెట్ఫ్లిక్స్ ఎన్ని కోట్లకు కొన్నదో తెలిస్తే) గతంలో ఇలాంటి ప్రోగ్రామ్లలోనే విష్ణుప్రియ ముక్కు మీద వేసిన పంచులు, తనను బాడీ షేమింగ్ చేస్తూ వేసిన జోకులు ఎన్నో అని చెప్పవచ్చు. నిజానికి ఆమె ముక్కు మీద ఓ వేయిసార్లు జోకులు వేసి ఉంటారేమో. ఆమెపైనే కాదు.. ఇమ్మూ కలర్ మీద, రష్మి మేకప్ మీద కూడా స్కిట్ల పేరుతో బోలెడు కామెంట్లు చేసేవారు. వాటిని సోషల్మీడియాలో నెటిజన్లు కూడా చాలాసార్లు తప్పుబట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎదో రకంగా వచ్చిన అవకాశాలను పోగొట్టుకోకూడదని ఈ ప్రోగ్రామ్స్లోని నటులు కూడా వాటిని భరిస్తూనే ఉంటారని చెప్పవచ్చు. -
కాబోయే భర్తను పరిచయం చేసిన 'విజిల్' నటి
తమిళ నటుడు రోబో శంకర్ ఇంట పెళ్లిబాజాలు మోగనున్నాయి. అతడి కూతురు ఇంద్రజ త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. తనకు కాబోయే భర్తను సోషల్ మీడియాలో అభిమానులకు పరిచయం చేసింది. డైరెక్టర్ శంకర్తో తరచూ రీల్స్ చేస్తున్న ఇంద్రజ అతడితోనే ఏడడుగులు వేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు గుడిలో ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు మీరు పెళ్లి చేసుకున్నారా? అని అడిగారు. దీనికి ఇంద్రజ స్పందిస్తూ.. పెళ్లికి ఇంకా ముహూర్తం పెట్టలేదని, ఆ పని పూర్తవగానే త్వరలోనే వెడ్డింగ్ డేట్ చెప్తానంది. కాగా ఇంద్రజ బిగిల్(తెలుగులో విజిల్) సినిమాలో ఫుట్బాలర్ పాండియమ్మగా నటించింది. ఇందులో ఆమె నటించిన కామెడీ, సెంటిమెంట్ సీన్లకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఆమె సర్వైవర్ అనే షోలోనూ పాల్గొంది. ప్రస్తుతం ఆమె కార్తీ విరుమాన్ సహా పలు సినిమాలతో బిజీగా ఉంది ఇంద్రజ. ఆమె తండ్రి రోబో శంకర్ కళక్క పోవదు యారు, అడు ఏడు ఈడు వంటి కామెడీ షోలలో మెరిశాడు. ఇదర్కు తానే ఆశైపట్టై బాలకుమార, వేలైను వందుత వేళ్లైకారన్, ఇరుంబు తిరై, విశ్వాసం, అన్నాత్తే చిత్రాలతో వెండితెరపైనా మెరిశాడు. View this post on Instagram A post shared by தொடர்வோம் கார்த்திக் (@dr.thodarvom_karthick) View this post on Instagram A post shared by Ani Anish (@anianishh) View this post on Instagram A post shared by INDRAJA SANKAR (@indraja_sankar17) చదవండి: పంజాబ్ను ఓ ఊపు ఊపిన సింగర్, ఇప్పటికీ వీడని హత్య మిస్టరీ -
హీరోగా మారిన రావు రమేశ్.. క్షణం క్షణం ట్విస్టులే
విలక్షణ నటుడు రావు రమేష్ హీరోగా మారాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’. పీబీఆర్ సినిమాస్ సంస్థ ప్రొడక్షన్ నంబర్ 2గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో నటి ఇంద్రజ కీలక పాత్ర పోషిస్తున్నారు. 'హ్యాపీ వెడ్డింగ్' ఫేమ్ లక్షణ్ కార్య ఈ చిత్రానికి దర్శకుడు. ఈ రోజు(ఫిబ్రవరి 24) సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్బంగా దర్శకుడు లక్ష్మణ్ కార్య మాట్లాడుతూ..వినోదాత్మక కుటుంబ కథా చిత్రమిది. రావు రమేష్ లీడ్ రోల్ చేయడానికి అంగీకరించడం మా ఫస్ట్ సక్సెస్. కథ నచ్చి ఆయన ఓకే చేశారు. నడి వయసులో ఉన్న ఒక మధ్య తరగతి నిరుద్యోగి జీవితంలో క్షణ క్షణం జరిగే ట్విస్టులతో రెండు గంటల పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం' అని చెప్పారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. -
Indraja: ఇది కదా స్పందన అంటే.. హామీ ఇచ్చిన క్షణం నుంచే...
సాక్షి, శ్రీకాకుళం: వినతిపత్రాలు తీసుకోవడం.. చూద్దాం, చేద్దాం.. అని దాటవేసే నేతల తీరుకు అలవాటు పడిన రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్ స్పందిస్తున్న తీరు అద్భుతంగా కనిపిస్తూ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. ఆరోగ్య సమస్యలతో చేయూత కోసం తన వద్దకు ఎవరు.. ఏ సమయంలో వచ్చినా ఆయన అక్కున చేర్చుకుని తక్షణ వైద్య సహాయం అందేలా అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఎన్ని లక్షలు ఖర్చు అయినా ప్రభుత్వం నుంచి భరించేందుకు సై అంటున్నారు. దానికి తాజా ఉదాహరణ ఉమ్మడి జిల్లాకు చెందిన చిన్నారి ఇంద్రజ. తల అసాధారణంగా పెరిగిపోయే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఈ పాపను తల్లిదండ్రులు ఈ నెల 23న నరసన్నపేట వచ్చిన సీఎం వద్దకు తీసుకెళ్లి తమ గోడు విన్నవించుకోవడమే ఆలస్యం.. సీఎంవో నుంచి కలెక్టర్ వర కు ముఖ్యమంత్రి అందరినీ ఉరుకులెత్తించారు. దాంతో అదే రోజు రాత్రి నుంచి జెమ్స్లో బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. శస్త్ర చికిత్సకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖర్చులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.లక్ష చెక్కును కూడా బాలిక తల్లిదండ్రు లకు ఇచ్చారు. ఇవన్నీ చూసి బాలిక తల్లిదండ్రులతో పాటు వారి గ్రామ ప్రజలు అబ్బుర పడుతున్నారు. మేనమామలా ఆదుకుంటానని ఇచ్చిన హామీని వైఎస్ జగన్ అక్షరాలా అమలు చేస్తూ ఆ కుటుంబంలో వెలుగులు నింపుతూ దేవుడు మామయ్యనని అనిపించుకున్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు. నవంబర్ 23 ఇంద్రజ తల్లితో చర్చిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ హామీ ఇచ్చిన క్షణం నుంచే... ► ఈ నెల 23న నరసన్నపేటలో తమ కుమార్తె ఇంద్రజను ఆదుకోవాలంటూ సీఎం జగన్ను బాధితురాలి తల్లిదండ్రులు కోరారు. ► పది నిమిషాలకే సీఎం జగన్ నేరుగా వారితోనే మాట్లాడి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడికైనా తీసుకెళ్లి నయం చేస్తామని భరోసా అందించారు. ► అదే రోజు సాయంత్రం 7 గంటలకు కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ బాధితురాలి తల్లిదండ్రులతో మాట్లాడి.. డీఎంహెచ్వో మీనాక్షి పర్యవేక్షణలో ఇంద్రజను జెమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ►అదే రోజు రాత్రి 10 గంటల నుంచే జెమ్స్లో ఇంద్రజకు ప్రాథమిక వైద్య పరీక్షలు ప్రారంభించారు. న్యూరో సర్జన్ వైద్య బృందాల సమీక్షించాయి. ►ఈ నెల 24న జెమ్స్ ఆసుపత్రిలో ఇంద్రజకు ఉన్న వ్యాధి హైడ్రోసిఫలిస్ అని నిర్ధారించారు. ►ఈ నెల 25న జెమ్స్ చైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు నేరుగా వైద్య పరీక్షలు చేసి అవసరమైతే హైదరాబాద్లో ఆపరేషన్ చేస్తామని ప్రకటించారు. తల్లిదండ్రుల నిర్ణయం మేరకు దేశంలో ఎక్కడైనా ఆపరేషన్ చేయించాలంటూ సీఎం కార్యాలయం నుంచి తమకు ఆదేశాలు వచ్చినట్టుగా స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే చిన్నారికి వైద్యం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, విశాఖలో చేయాలా, విజయవాడలోనా.. హైదరాబాద్లోనా అన్నది మీరే నిర్ణయించుకోవాలని కలెక్టర్ ఆ చిన్నారి తల్లిదండ్రులకు ఆప్షన్ ఇచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.లక్ష చెక్ అందజేశారు. మా కుటుంబానికి దేవుడు... మా కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవుడు. 11 ఏళ్లుగా ఇంద్రజ చికిత్స కోసం అప్పులు చేసి ఆసుపత్రుల చుట్టూ తిప్పాను. ప్రయోజనం లేదు. దిక్కు తోచని స్థితి. వావిలవలసకు చెందిన పాలూరి సిద్ధార్థ నరసన్నపేటకు ముఖ్యమంత్రి వస్తున్నారని చెప్పి మమ్మల్ని తీసుకెళ్లారు. పాపతో కలిసి అక్కడ నిలబడి ఉండగా ముఖ్యమంత్రి జగనన్న చూసి పరుగున వచ్చి మా పాప పడుతున్న బాధను పరిశీలించారు. మా కుమార్తె ఆపరేషన్కు భరోసా ఇచ్చారు. నా భర్త అప్పలనాయుడు కిడ్నీరోగి. రాజమండ్రిలో ఉంటున్నారు. మాకు ముగ్గురు కుమార్తెలు. ఇంటి వద్దనే పెద్ద పాప ఆలనా, పాలనా చూసుకొని ఉంటున్నాను. ఓ వైపు బతకడం కష్టంగా ఉంది. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి మమ్మల్ని ఆదుకున్నారు. ఆయన చల్లగా ఉండాలి. –మీసాల కృష్ణవేణి, ఇంద్రజ తల్లి, చిన్నశిర్లాం, రేగిడి మండలం -
చిన్నారి ఇంద్రజకు హైడ్రోసిఫలిస్
శ్రీకాకుళం రూరల్: విజయనగరం జిల్లా శిర్ల గ్రామానికి చెందిన మీసాల కృష్ణవేణి, అప్పలనాయుడు దంపతుల కుమార్తె ఇంద్రజకు శ్రీకాకుళం మండలం రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో గురువారం చికిత్స మొదలైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ వెంటనే డీఎంహెచ్వో డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షితో మాట్లాడి జెమ్స్ ఆస్పత్రికి రిఫర్ చేయించారు. న్యూరోసర్జన్ డాక్టర్ కృష్ణచైతన్య ఆ చిన్నారిని పరీక్షించి హైడ్రోసిఫలిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. పుట్టినప్పటి నుంచి ఇంద్రజ బ్రెయిన్లో నీరు చేరడంతో తల పెరిగిందని, శారీరక ఎదుగుదల నిలిచిపోయిందని చెప్పారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి బాగున్నా, రక్త పరీక్షలు, బ్రెయిన్ స్కానింగ్ చేయాల్సి ఉందన్నారు. ఈ వ్యాధికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని, అవసరమైతే బీవీ సెంటింగ్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని వివరించారు. డాక్టర్ కృష్ణచైతన్యతోపాటు డాక్టర్ సుధీర్ కూడా ఉన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన సీఎం వైఎస్ జగన్ స్పందించి చిన్నారి ఇంద్రజకు మెరుగైన వైద్యం అందిస్తామని భరోసా కల్పించిన విషయం విదితమే. -
ఇంద్రజను ఆదుకుంటానని పేరెంట్స్ కు మాటిచ్చిన సీఎం జగన్
-
అలనాటి హీరోయిన్ ఇంద్రజ పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా?
టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా వెలుగొందింది ఇంద్రజ. పలు సినిమాల్లో కథానాయికగా నటించి ప్రేక్షకులకు చేరువైన ఆమె తెలుగులో కన్నా బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా సినిమాలు చేసింది. తాజాగా ఓ షోలో ఇంద్రజ తన వ్యక్తిగత విషయాల గురించి ఓపెన్ అయింది. తనది ప్రేమ వివాహమని వెల్లడించింది. తన పెళ్లికి కేవలం 13 మంది అతిథులు మాత్రమే వచ్చారంది. అంతేకాదు, ఈ పెళ్లికి అయిన ఖర్చు అక్షరాలా రూ.7500 మాత్రమేనని చెప్పుకొచ్చింది. కాగా మలయాళంలో హీరోయిన్గా బిజీగా ఉన్నప్పుడే ఇంద్రజ ప్రేమ వివాహం చేసుకుంది. 2006లో నటుడు, బిజినెస్మెన్ మహమ్మద్ అబ్సర్ను పెళ్లాడింది. వీరికి కుమార్తె సారా ఉంది. పెళ్లి తర్వాత వెండితెరకు దూరమైన ఆమె ఇటీవలే ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. స్టాండప్ రాహుల్ సినిమాలో హీరో తల్లిగా నటించి అలరించిన ఆమె ప్రస్తుతం బుల్లితెర షోలలో సందడి చేస్తోంది. చదవండి: ‘ఆకలి రాజ్యం’ నటుడు ప్రతాప్ పోతెన్ మృతి అతడిని రిజెక్ట్ చేసింది, పైలట్తో ప్రేమలో మునిగి తేలుతోంది! -
‘పుష్ప’ పార్ట్ 2లో అలనాటి హీరోయిన్కు కీ రోల్!
అలనాటి తారలు వరసగా రీఎంట్రీ ఇస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ వెండితెర ఏలిన స్టార్ హీరోయిన్లు తల్లి పాత్రలతో అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే రాధిక, ఖుష్భు, ఆమని వంటి నటీమణులు రీఎంట్రీ ఇవ్వగా.. ఇటీవల రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా మూవీతో బాలీవుడ్ నటి భాగ్యశ్రీ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో స్టార్ హీరో ప్రాజెక్ట్స్ సీనియర్ నటీమణులు ఎంట్రీ ఇవ్వడం ట్రెండ్గా మారింది. తాజాగా 90ల్లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నటి ఇంద్రజ కూడా వెండితెర ఎంట్రీకి రెడీ అయ్యింది. చదవండి: స్పెషల్ సాంగ్కు రష్మిక షాకింగ్ రెమ్యునరేషన్, నిర్మాతలకు చుక్కలు ఇప్పటికే బుల్లితెరపై అలరిస్తున్న ఆమె ‘స్టాండప్ రాహుల్’ మూవీతో బిగ్స్క్రీన్పై సందడి చేయబోతోంది. ఈ మూవీలో రాజ్ తరుణ్కు ఇంద్రజ తల్లి పాత్రలో నటించనుంది. ఇదిలా ఉంటే ఇప్పడు ఆమెకు పాన్ ఇండియా ఆఫర్ వచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న ‘పుష్ప: ది రైజ్’.. ప్రస్తుతం పార్ట్ 2ను రూపొందుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో అ్లలు అర్జున్, రష్మిక మందన్నా లీడ్ రోల్లు పోషిస్తున్నారు. చదవండి: స్పెయిన్లో పెళ్లి సందడి హీరోయిన్తో రవితేజ రొమాన్స్.. ప్రస్తుతం పుష్ప పార్ట్2 రూపొందించే బిజీలో అల్లు అర్జున్, సుక్కు ఉన్నారు. ఇందులో ఓ కీలక పాత్ర కోసం సుక్కు ఇంద్రజ స్పందించారట. ‘పుష్ప’ సినిమాలో ఉన్న నటీనటులే పుష్ప 2 లో ఉంటారని గతంలో సుకుమార్ క్లారిటీ ఇవ్వగా.. ఇప్పుడు కథలో కొన్ని మార్పులు చేసి, అందుకు తగ్గట్టే పాత్రలను ఎంచుకుంటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో ఓ కీ రోల్ కోసం ఇంద్రజ సుక్కు చర్చలు జరిపాడట, దీనికి ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు ప్రస్తుతం ఫిలిం దూనియాలో ఈ వార్త గుప్పుమంటోంది. ఇక ఇదే కనుక నిజమైతే ఇంద్రజ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. -
వన్నెతరగని అందంతో .. సీనియర్ హీరోయిన్ ఇంద్రజ (ఫోటోలు)
-
సంతానం లేనివారు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగిచుకోవాలి
-
అప్పటివరకు సినిమాల్లో నటించకూడదనుకున్నా: ఇంద్రజ
‘‘భార్యాభర్తల మధ్య బంధం ఎలా ఉండాలి? ఇప్పటి పిల్లలకు, తల్లిదండ్రులకు కమ్యూనికేషన్ గ్యాప్ ఎలా ఉంది? వంటి అంశాలతో ఈ తరం వారికి అర్థమయ్యేలా ‘స్టాండప్ రాహుల్’ సినిమా కథను శాంటో పాజిటివ్గా చూపించారు’’ అని ఇంద్రజ అన్నారు. రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా శాంటో మోహన్ వీరంకి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్టాండప్ రాహుల్’. నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ చిత్రంలో నటించిన ఇంద్రజ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో రాజ్ తరుణ్కి తల్లి పాత్ర చేశాను. ఓ కుటుంబంలో తల్లి ప్రాధాన్యత ఎంత ఉంటుందో చక్కగా చూపించారు శాంటో. మురళీ శర్మగారు నా భర్తగా నటించారు. కానీ ఇంటి బాధ్యత నేనే తీసుకుంటాను. భర్తలో లేని క్వాలిటీని కొడుకు దగ్గర చూడాలని చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా పెంచుతుంది తల్లి. అయినా కొడుకు కూడా తండ్రిలానే ఉన్నాడని తెలిసి బాధపడుతుంది. చివరికి ఆ కుమారుడు తల్లిని ఏ విధంగా అర్థం చేసుకున్నాడనేది చాలా ఆసక్తిగా ఉంటుంది. నేటి యువత పని, ప్యాషన్ అనే వాటిల్లో ఏదో ఒక దానికోసం కష్టపడుతుంటారు.. తమకు ఇష్టమైన పనిని చేస్తూనే ఎలా బతకవచ్చో ఈ సినిమాలో చక్కగా చూపించారు దర్శకుడు. ఈ సినిమా కాకుండా నేను నటించిన మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న సినిమాతో పాటు నితిన్తో ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలో నటిస్తున్నాను’’ అన్నారు. అందుకే గ్యాప్ తీసుకున్నా ‘‘తెలుగులో నాకు సక్సెస్ రేటు ఎక్కువ. అయితే మలయాళంలో హీరోయిన్గా బిజీగా ఉన్నప్పుడే 2006లో పెళ్లి చేసుకున్నాను. మా పాపకి ఎనిమిదేళ్లు వచ్చేవరకు సినిమాల్లో నటించకూడదనుకుని, గ్యాప్ తీసుకున్నాను. ఇప్పుడు తనకి 13 ఏళ్లు. ఇప్పుడు కూడా నెలలో సగం రోజులు కుటుంబంతో, సగం రోజులు షూటింగ్లో ఉంటున్నాను’’ అన్నారు ఇంద్రజ. సహాయ పాత్రలు మగవారికి బాగానే వస్తున్నాయి.. కానీ మహిళలకు సరైన పాత్రలు రావడం లేదు. అందుకే నాకు సినిమాల్లో చాలా గ్యాప్ వచ్చింది. రొటీన్ పాత్రలే రావడంతో కొన్ని వదులుకున్నాను. నటిగా సంతృప్తి అనేది ఎవరికీ ఉండదు. నటిగా నేను చేసింది గోరంత.. చేయాల్సింది కొండంత. -
వినోదాత్మకంగా రాజ్ తరుణ్ 'స్టాండప్ రాహుల్' ట్రైలర్..
Raj Tarun Starrer Stand Up Rahul Movie Trailer Out: 'ఉయ్యాల జంపాల' చిత్రంతో హీరోగా పరిచయమై మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు రాజ్ తరుణ్. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే 'అనుభవించు రాజా' సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా శాంటో మోహన్ వీరంకి దర్శకత్వంలో 'స్టాండప్ రాహుల్' సినిమాలో నటిస్తున్నాడు. వర్ష బొల్లమ్మ హీరోయిన్గా చేస్తున్న ఈ సినిమాకు కూర్చుంది చాలు అనేది క్యాప్షన్. శుక్రవారం మార్చి 4న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. 'మా బాస్ ఏ పనైనా రెండే నిమిషాల్లో చేస్తాడట' అనే డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఈ డైలాగ్ను స్టాండప్ కమెడియన్గా రాజ్ తరుణ్ పలకడం వినోదాత్మకంగా ఉంది. ఆద్యంతం కామెడీ, భావోద్వేగాలతో ఈ సినిమా రూపొందినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. పలు సంభాషణలు బాగా అకట్టుకుంటున్నాయి. ఇందులో రాజ్ తరుణ్ తల్లిగా ప్రముఖ సీనియర్ హీరోయిన్ ఇంద్రజ నటిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ట్రైలర్లో ప్రకటించారు. -
‘బిగ్బాస్’ ఆఫర్ రిజెక్ట్ చేశా, డబ్బు కోసం కాదు కానీ.., : ఇంద్రజ
బుల్లితెరపై బిగ్బాస్ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తెలుగులో అయితే ఈ బిగ్ రియాల్టీ షోకి విపరీతమైన ఆదరణ ఉంది. ఈ షోలో పాల్గొనే అవకాశం వస్తే వదులుకోలేరు. దానికి కారణం ‘బిగ్బాస్’ నుంచి బయటకు వస్తే.. డబ్బుతో పాటు సీనీ అవకాశాలు రావడమే. అందుకే చాలా మంది సెలబ్రిటీలు ఈ షోలోకి వెళ్తుంటారు. కొంత మంది సెలెబ్రిటీలు మాత్రం అవకాశం వచ్చినా వెళ్లడానికి మొగ్గు చూపపడం లేదు. ఆ లిస్టులో హీరోయిన్ ఇంద్రజ కూడా ఉన్నారు. బిగ్బాస్ నాల్గొ సీజన్లో ఇంద్రజకు అవకాశం వస్తే వెళ్లలేదట.ఒకప్పుడు హీరోయిన్గా వెలుగు వెలిగిన ఇంద్రజ.. గతకొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇటీవల బుల్లితెరపై ప్రసారమయ్యే ఓ కామెడీ షోకి జడ్జీగా వ్యవహరిస్తోంది. అయితే తాజాగా ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్బాస్ షోపై తన మనసులోని మాటను బయటకు పెట్టింది. ‘బిగ్బాస్’ నాల్గో సీజన్లో ఆఫర్ వచ్చింది. కానీ నేను రాలేనని చెప్పాను. ఫ్యామిలీని చెన్నైలో వదిలి.. నేను ఇక్కడ ఉండలేను. అందుకే బిగ్బాస్లోకి వెళ్లలేదు. భవిష్యత్తులోనే అవకాశం వచ్చినా వెళ్లలేదు. అయితే గెస్ట్గా అవకాశం వస్తే మాత్రం వెళ్తాను. అది కూడా డబ్బులు కోసం కాదు. హోస్ట్గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జునని చూడడానికే వెళ్తా. ఆయనతో కాసేపు హ్యాపీగా మాట్లాడి బయటకు వస్తా. నాగ్ హోస్టింగ్ చాలా బాగుంటుంది. ఇప్పటికీ స్టైలీష్గా, అందంగా ఉన్నారు’ అంటూ కింగ్ నాగార్జునపై ప్రశంసలు కురిపించారు ఇంద్రజ. అలాగే నాగార్జునతో కలిసి హలో బ్రదర్ సినిమాలో ‘కన్నెపిట్టరో’ పాటకు నటించాని, ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ మర్చిపోలేనని’ ఆ మధుర జ్ఞాపకాలను ఇంద్రజ గుర్తుచేసుకుంది. చదవండి: అలా పెళ్లి చేసుకోలేదు.. తన లవ్స్టోరీ చెప్పిన ఇంద్రజ నవ్వులు పూయిస్తున్న డాక్టర్ ‘రౌడీ బేబీ’ పేరడీ సాంగ్ -
అలా పెళ్లి చేసుకోలేదు.. తన లవ్స్టోరీ చెప్పిన ఇంద్రజ
‘నీ జీను ప్యాంటూ చూసి బుల్లెమ్మో...’అనే పాట వినగానే అందరికి టక్కున గుర్తుకువచ్చేంది ఇంద్రజ. చేసింది కొన్ని సినిమాలే అయినా టాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఒకప్పుడు హీరోయిన్గా వెలుగు వెలిగిన ఈ ‘బుల్లెమ్మ’ తెలుగు తెలుగమ్మాయే అన్న విషయం చాలామందికి తెలీదు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఇంద్రజ.. ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తుంది. ప్రస్తుతం ఆమె ఓ కామెడీ షోకి జడ్జీగా వ్యవహరిస్తోంది. దీనితో పాటు సినిమాల్లోకి కూడా రీఎంట్రీ ఇవ్వనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ న్యూస్ చానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ, పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లండించింది ఇంద్రజ. తను అచ్చ తెలుగు బ్రాహ్మిణ అమ్మాయినని, తన భర్త మాత్రం ముస్లిం అని చెప్పింది. ఇప్పటికి కూడా తాను బ్రాహ్మిణ అమ్మాయిగానే ఉంటానని చెప్పుకొచ్చింది. ‘ఒకరిని ఒకరు ఇష్టపడ్డాం. మతం చూసి, కులం చూసి ఇష్టపడం కదా.. నేను చెప్తే సినిమా డైలాగ్లా ఉంటుంది కానీ.. ఇది మాత్రం సినిమా డైలాగ్ కాదు. ఇది నా రియల్ లైఫ్. మా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్స్ ఉండేవారు. మేం ఇద్దరం ఫ్రెండ్స్గా ఆరేళ్లు ఉన్నాం.. పరిచయం అయిన వెంటనే పెళ్లి చేసుకోలేదు. ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవడం.. అర్థం చేసుకోవడం జరిగాయి. అతను నాకు పూర్తిగా సపోర్ట్ ఉంటాడనే నమ్మకం కలిగింది. అదే నమ్మకం ఆయనకి కూడా కలిగి ఉండొచ్చు. అందుకే పెళ్లి చేసుకున్నాం. ఆయనకు ఇండస్ట్రీలో సంబంధాలు ఉన్నాయి. ఆయన రచయిత. కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు. అంతేకాదు. ఆయన యాడ్ ఫిల్మ్ మేకర్. ఇద్దరం కలిసి సినిమాల గురించి మాట్లాడుకుంటాం. ఆయన రాసిన కథని మలయాళంలో దర్శకుడు శ్రీనివాస్ గారు తీసుకున్నారు. అలాగే నా సినిమాల్లో ఆయన ఇన్వాల్వ్ అవుతుంటారు. కానీ నాకు లిమిట్స్ ఏం పెట్టారు’అంటూ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. -
అపరిచితుల ప్రయాణం
నలుగురు అపరిచితులు.. 3,450 కిలోమీటర్లు రోడ్డుపై ప్రయాణం.. వాళ్ల ప్రయాణం దేనికోసం? ఆ సమయంలో వాళ్లు ఎదుర్కొన్న అనుభవాలేంటి? అనే కథాంశంతో ఓ సినిమా మొదలైంది. సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, ఇంద్రజ, ప్రియ వడ్లమాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకులు రామ్గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్, నగేష్ కుకునూర్ వద్ద పని చేసిన గురుపవన్ ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. గురప్ప పరమేశ్వర ప్రొడక్ష¯Œ ్స పతాకంపై జి. మహేష్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కెమెరామేన్ సి. రాంప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, ఎన్.బి. బాలసుబ్రహ్మణ్యం క్లాప్ ఇచ్చారు. గురుపవన్ మాట్లాడుతూ –‘‘భిన్న నేపథ్యాలు కలిగిన నలుగురు అపరిచితులు హైదరాబాద్ నుంచి బైకులపై చేసే ప్రయాణమే ఈ సినిమా. మార్చి 2న తొలి షెడ్యూల్ మొదలుపెడతాం’’ అన్నారు. ‘‘శ్రీకాంత్, ఇంద్రజ వంటి మంచి నటులతో పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు సుమంత్ అశ్విన్. ‘‘శ్రీకాంత్, నేను ‘జంతర్ మంతర్’ సినిమాతో హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యాం. ఇన్నాళ్లకు ఆయనతో మళ్లీ సినిమా చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఇంద్రజ. ‘‘గురు పవన్ చెప్పిన కథ నచ్చడంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నా’’ అన్నారు మహేష్. ప్రియ వడ్లమాని, సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చిరంజీవి ఎల్. మాట్లాడారు. అమ్ము అభిరామి, నాజర్, పృథ్వీ, ఈశ్వరీ రావు, సప్తగిరి తదితరులు ఇతర పాత్రల్లో నటించనున్నారు. -
‘నలుగురు అపరిచితులు.. గమ్యం ఒకటే’
సినిమా సినిమాకు డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు సుమంత్ అశ్విన్. ఫలితాలతో సంబంధం లేకుండా హార్రర్, కామెడీ, ఫ్యామిలీ, రొమాంటిక్ వంటి డిఫరెంట్ జానర్లలో సినిమాలు చేస్తూ నటుడిగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. హ్యాపీ వెడ్డింగ్, ప్రేమకథా చిత్రం-2 తర్వాత ఈ హీరో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం గురు పవన్ అనే దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. సుమంత్ అశ్విన్ సరసన ప్రియా వడ్లమాని కథానాయికగా నటిస్తున్న ఈచిత్రంలో శ్రీకాంత్, ఇంద్రజ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై జి.మహేశ్ నిర్మిస్తున్నారు . తాజాగా ఈ చిత్ర షూటింగ్ స్థానిక రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. త్వరలోనే చిత్ర రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రం సుమంత్ అశ్విన్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘నలుగురు అపరిచితులు.. 3450 కిలోమీటర్ల ప్రయాణం.. గమ్యం ఒకటే.. చివరికి ఏమైంది.. ఎందుకు ప్రయాణించారు’.. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈ సినిమా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతమందిస్తున్నాడు. చదవండి: 50 శాతం పూర్తి.. వీసా కోసం వెయిటింగ్ 'ముద్దు సన్నివేశం నాకు తెలియకుండానే తీశారు' -
హైదరాబాద్లో యువతి అదృశ్యం
సుల్తాన్బజార్: నగరంలో చదువుకుంటున్న ఓ విద్యార్థిని అదృశ్యం కేసులో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. సుల్తాన్బజార్ ఎస్ఐ వై.లింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఎన్.బుచ్చన్న కుమార్తె ఎన్.ఇంద్రజ (19) నగరంలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. కోఠిలోని గోకుల్చాట్ పక్కన ఉన్న ఆర్పీఎస్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటోంది. ఈ నెల 1న ధర్మపురిలోని ఇంటికి వెళ్తున్నానంటూ కోఠిలోని హాస్టల్ నుంచి బయలుదేరింది. మూడు రోజులవుతున్నా ఆమె ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు కోఠిలోని హాస్టల్లో వాకబు చేశారు. ఈ నెల 1వ తేదీనే ఇంద్రజ బయల్దేరిందని హాస్టల్ నిర్వాహకులు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ధర్మపురి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అక్కడి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్గా కేసును నమోదు చేసుకుని ఆన్లైన్లో సుల్తాన్బజార్ పోలీసులకు బదిలీ చేశారు. యువతి అదృశ్యం కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మళ్లీ మలయాళంలో..
12 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ మలయాళ సినిమాలో కనిపించబోతున్నారు ఇంద్రజ. ‘యమలీల, అమ్మ దొంగ, చిలక్కొట్టుడు, పెద్దన్నయ్య’ సినిమాలతో ఇంద్రజ హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మనకు తెలిసినంతగా మలయాళ ప్రేక్షకులకు కూడా ఆమె పరిచయమే. 1999లో ‘ది గాడ్మేన్’ అనే సినిమా ద్వారా మలయాళంలో ఎంట్రీ ఇచ్చారు ఇంద్రజ. మోహన్లాల్తో ‘ఉస్తాద్’, సురేశ్ గోపీతో ఓ సినిమాలో నటించారామె. ‘నందలాలా, ఇండిపెండెన్స్ డే’ సినిమాలు నటిగా ఆమెకు మలయాళంలో మంచి పాపులారిటీ సంపాదించి పెట్టాయి. 2007లో చేసిన ‘ఇంద్రజిత్’ తర్వాత మళ్లీ మలయాళ స్క్రీన్పై కనిపించలేదు ఇంద్రజ. 12 ఏళ్ల విరామం తర్వాత తాజాగా ‘12 సి’ అనే సినిమాలో నటించనున్నారామె. ఈ చిత్రానికి ఉన్ని కృష్ణన్ దర్శకుడు. -
ఏంటా ప్రమాదం?
లైట్ హౌస్ సినీ మ్యూజిక్ పతాకంపై కె.శివశంకర రావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. రామ్ కార్తీక్, శివ హరీశ్, రసజ్ఞ దీపిక, అలేఖ్య హీరో హీరోయిన్లు. శ్రీపాద విశ్వక్ దర్శకత్వం వహించారు. శివ కంఠంనేని, ‘అల్లరి’ రవిబాబు, వినోద్ కుమార్, ఇంద్రజ ముఖ్య పాత్రలు చేశారు. రావుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ–‘‘డ్రంకన్ డ్రైవ్ వల్ల కలిగే అనర్థాలను సందేశాత్మకంగా ఇందులో చూపించాం. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు, వరంగల్ దగ్గరలోని లక్నవరం ఫారెస్ట్లో చిత్రీకరించాం’’ అన్నారు. ‘‘అనుకోని ఆపదలో చిక్కుకున్న ప్రేమ జంటకు స్నేహితుల సహాయం అందే సమయంలో మరో ప్రమాదం ఎదురవుతుంది. ఆ ప్రమాదం నుంచి ఈ జంట ఎలా బయటపడ్డారన్నదే కథాంశం’’ అన్నారు శ్రీపాద విశ్వక్ . -
ఆవేశంలో కొట్టిన తండ్రి.. విగతజీవిగా కుమార్తె
వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన యువతీ యువకుడు ప్రేమించుకున్నారు.ఈ వ్యవహారం నచ్చని యువతి తల్లిదండ్రులు తమ కుమార్తెకు మరో వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇది తెలిసిన ఆమె ప్రేమించిన యువకుడితో ఇంటి నుంచి వెళ్లిపోయింది. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో వారిద్దనీ పట్టుకొచ్చిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఇంటికి తిరిగి వచ్చాక కూడా ప్రేమించినవాడినే పెళ్లి చేసుకుంటానని మంకు పట్టుపట్టి తిండి మానేయడంతో ఆగ్రహించిన తండ్రి కుమార్తెపై చేయి చేసుకున్నాడు. ఆ రాత్రి ఏం జరిగిదో.. తెల్లవారేసరికి ఆ యువతి చనిపోయిందంటూ హడావుడిగా మృతదేహాన్ని దహనం చేశారు. కొమరోలు మండలం నాగిరెడ్డిపల్లె గ్రామంలో సోమవారం వెలుగు చూసినఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. తన కుమార్తె ఉరివేసుకుని చనిపోయిందని మృతురాలి తల్లి చెబుతున్నప్పటికీ ఈ ఘటనపై భిన్న వాదనలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇష్టంలేని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతోపాటు, తనపై చేయిచేసుకున్నాడని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందా..? లేక తల్లిదండ్రులే పరువు హత్య చేశారా.. అనే అనుమానాలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రకాశం, కొమరోలు(గిద్దలూరు): మండలంలోని నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన పందనబోయిన ఆవులయ్య, అంజనమ్మ దంపతుల కుమార్తె ఇంద్రజ (20) ఇంద్రజ ఇంటర్ వరకు చదువుకుని ఖాళీగా ఉంటోంది. గ్రామానికి చెందిన దళిత యువకుడు చైతన్య డిగ్రీ చదువుతూ మధ్యలో చదువు ఆపేసి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. వీరిద్దరి మధ్య మూడేళ్ల కిందట ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇంద్రజ తండ్రి సీఆర్పీఎఫ్ జవానుగా పదవీ విరమణ చేసి హైదరాబాద్లోని ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇంద్రజ హైదరాబాద్లోనే ఉంటోంది. గతేడాది ఇంద్రజను సమీప బంధువుకు ఇచ్చి వివాహం చేసేందుకు తల్లిదండ్రులు నిశ్చితార్థం చేసుకున్నారు. ఇది తెలిసిన చైతన్య హైదరాబాద్ వెళ్లి ఇంద్రజను ఇంటి నుంచి తనతో తీసుకెళ్లాడు. ఆమె కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదుతో రాజేంద్రనగర్ పోలీసులు ఇద్దరినీ గుర్తించి తీసుకొచ్చారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. తాను చైతన్యనే వివాహం చేసుకుంటానని ఇంద్రజ అన్నం కూడా తినకుండా ఉందని గ్రహించిన ఆవులయ్య 10 రోజుల క్రితం ఆమెను స్వగ్రామం నాగిరెడ్డిపల్లెకు తీసుకొచ్చాడు. చైతన్యపై గిద్దలూరులోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో అతడు తాను ఇంద్రజను పెళ్లిచేసుకోనని, ఆమె జోలికి రానని చెబుతూ పెద్దల సమక్షంలో అంగీకరించాడు. స్థానికుల సమాచారంతో వెలుగులోకి.. పోలీసులు, పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగిన తర్వాత కూడా ఇంద్రజ తన పట్టు వీడకుండా కడుపు మాడ్చుకుని ఉండటంతో ఆగ్రహించిన తండ్రి ఆదివారం రాత్రి ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో సోమవారం ఉదయం యువతి మృతి చెందిందంటూ తండ్రి ఆవులయ్య దగ్గర్లోని శ్మశానంలో హడావుడిగా దహనం చేస్తుండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న గిద్దలూరు ఎస్సై కె.మల్లికార్జున మృతురాలి ఇంటిని, దహన సంస్కారాలు చేసిన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. వీఆర్వో ఖాదర్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని కాల్చివేయడంతో ఎలాంటి ఆధారాలు లభ్యం కావడం లేదు. ఘటనపై అనుమానాలెన్నో.. ఇంద్రజ మృతి సంఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. ఇతర సామాజిక వర్గానికి చెందిన యువకున్ని ప్రేమించడం వలన కొట్టడంతో చనిపోయిందా, మనస్థాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందా అనేది గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. తమ కుమార్తె వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందని పరువు కోసం కొట్టి హత్య చేశారన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆమె ప్రేమ వ్యవహారంలో గత 15 రోజులుగా జరుగుతున్న సంఘటనల వలన ఆదివారం రాత్రి ఇంద్రజకు, ఆమె తండ్రికి మధ్య మరోసారి గొడవ జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమెను తన తండ్రి కొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెంది ఉండొచ్చని కొందరు, ప్రేమికునితో కాకుండా తన బంధువుతో వివాహం చేస్తారేమోనన్న ఆవేదనతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తన కుమార్తె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని, కేసు అవుతుందని భయంతోనే కాల్చేశారని మృతురాలి తల్లి అంజనమ్మ చెబుతోంది. దీనిపై ఎస్సై మల్లిఖార్జున వివరణ ఇస్తూ ప్రేమ వ్యవహారం వాస్తవమేనన్నారు. ఇంద్రజకు ఆమె బావతో నిశ్చితార్థం అయిందని, అతనినే వివాహం చేసుకోవాలని తండ్రి ఒత్తిడి తేవడం వలన ఆత్మహత్య చేసుకుందా, లేక కొట్టడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందా అనేది విచారిస్తున్నామన్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. -
ఎలా బయటపడ్డారు
శివ కంఠంనేని, రవిబాబు, వినోద్కుమార్, ఇంద్రజ, రామ్ కార్తీక్, శివ హరీశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. శ్రీపాద విశ్వక్ దర్శకత్వంలో కె. శివశంకర రావు, రావుల వెంకటేశ్వర రావు నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రావుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ – ‘‘కాన్సెప్ట్ బేస్డ్ చిత్రమిది. సస్పెన్స్ థ్రిల్లర్గా సాగే ఈ చిత్రకథ బాగా నచ్చి నిర్మించా’’ అన్నారు. ‘‘నటనకు అవకాశం ఉన్న పాత్ర చేసినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు శివ కంఠమనేని. శ్రీపాద విశ్వప్రసాద్ మాట్లాడుతూ – ‘‘అనుకోని ఆపదలో చిక్కుకున్న ఓ ప్రేమ జంట స్నేహితుల సహాయం పొందే సమయంలో మరో అపాయం ఎదురవుతుంది. వాటి నుంచి ప్రేమ జంట, ఫ్రెండ్స్ ఎలా బయటపడ్డారు? అన్నదే కథ. యాక్షన్, సస్పెన్స్ ఉన్న చిత్రం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: జి. రాంబాబు యాదవ్, ఎన్.వి. గోపాల్రావు, కె.శ్రీధర్ రెడ్డి, సంగీతం: సార్క్స్. -
పోలిస్డ్రెస్లో కనిపించబోతున్న భామలు
-
అందుకే మంచి ఫలితం వచ్చింది!
‘‘తెల్లాపూర్ గ్రామంలో మా స్నేహితుడి అన్నయ్య కొడుకు విచిత్రంగా ప్రవర్తించేవాడు. ఆ పాయింట్ని తీసుకుని, ఈ చిత్రం చేశాను. కథ వినగానే నిర్మాతలు సారికా శ్రీనివాస్, భాస్కర్ మరో ఆలోచనకు తావు ఇవ్వకుండా నిర్మించడానికి అంగీకరించారు. నటీనటులు అందరూ కూడా ఈ కథతో బాగా కనెక్ట్ అయ్యారు కాబట్టే, మంచి అవుట్పుట్ వచ్చింది. అందుకే మంచి ఫలితం కూడా వచ్చింది’’ అని దర్శకుడు చల్లా మన్మోహన్ అన్నారు. మంచు లక్ష్మీ, శ్రీధర్, ఇంద్రజ, మాస్టర్ ప్రేమ్బాబు, డాలీ ముఖ్య తారలుగా సుధీర్ సమర్పణలో భాస్కర్, సారికా శ్రీనివాస్ నిర్మించిన ‘బుడుగు’ ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో మన్మోహన్ పత్రికలవారితో మాట్లాడుతూ -‘‘మొదటి మూడురోజుల్లోనే సినిమా ఎత్తేస్తున్న ఈ రోజుల్లో మా సినిమా ఐదో రోజుకి కూడా 37 థియేటర్లు పెంచాం. మొత్తం 130 థియేటర్లలో మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా హిందీ హక్కులను సన్నీ ఎంట ర్టైన్మెంట్స్ పొందింది’’ అని చెప్పారు. -
విచిత్ర సంఘటనలు ఎదురైతే..?
ప్రస్తుత కాలంలో పెద్దల మీద కన్నా, పిల్లలపైనే ఒత్తిడి ఎక్కువ ఉంటోంది. ఈ ఒత్తిడి ఫలితంగా చాలా అయోమయానికి గురవుతున్నారు వాళ్లు. అలాంటి అయోమయంలో ఉన్న ఎనిమిదేళ్ల పిల్లాడికి కొన్ని విచిత్ర సంఘటనలు ఎదురైతే, ఆ పిల్లాడు ఏం చేస్తాడు? ఆ పిల్లాడి కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? ఈ నేపథ్యంలో ‘బుడుగు’ చిత్రం రూపొందుతోంది. మంచు లక్ష్మీ, శ్రీధర్రావ్, మాస్టర్ ప్రేమ్బాబు, ఇందు ఆనంద్, సన ఇందులో ముఖ్యతారలు. ఇంద్రజ ప్రత్యేక పాత్రలో నటించారు. మన్మోహన్ దర్శకత్వంలో భాస్కర్, సారిక శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘యధార్థ సంఘటనలతో రూపొందిస్తున్న సైక లాజికల్ థ్రిల్లర్ ఇది. సైకాలజిస్ట్ల సలహాలు తీసుకుని స్క్రిప్ట్ తయారు చేశాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: సురేష్ రగుతు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వంశీ పూలూరి. -
నాది రహస్యవివాహం కాదు!
నీ జీను ఫ్యాంటూ చూసి బుల్లెమ్మో... ఈ పాటా గుర్తుంది...! ఆ బుల్లెమ్మా గుర్తుంది! ఎస్.. ఆమె ఇంద్రజ. చేసినవి తక్కువ సినిమాలే అయినా సెల్యులాయిడ్పై ఆమె సొగసు చూడతరమా! మోడ్రన్గా కనిపించే ఇంద్రజ పక్కా ట్రెడిషనల్... కంప్లీట్ ఫ్యామిలీ విమెన్! హీరోయిన్గా రాజభోగం చూసినా ఇంట్లో వంట తనే చేస్తుంది.. అవసరమైతే అంట్లు తోముతుంది.. బట్టలు కూడా ఉతుకుతుంది.. ఇంటి పనిలో... ఇంతికి దొరికే హాయే వేరంటుంది ఆమె. 14 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తెరపై తళుక్కుమనబోతోన్న ఇంద్రజ తెలుగమ్మాయే అన్న విషయం చాలామందికి తెలీదు. ఇంకా ఇలాంటి చాలా విషయాలు ఇంద్రజను అడిగి తెలుసుకుందాం... ఎన్నాళ్లయ్యిందండీ మిమ్మల్ని చూసి..? ఇంద్రజ: ఎన్నాళ్లు కాదండీ.. ఎన్నేళ్లూ అనండి. తెలుగు సినిమాలు చేసి పద్నాలుగేళ్లవుతోంది. మరి... ఈ గ్యాప్లో ఇతర భాషల్లో కూడా చేయలేదా? 1999లో తెలుగులో చివరి సినిమా చేశా. కానీ, 2004 వరకు మలయాళం, తమిళ చిత్రాలు చేశాను. 2005లో ఓ షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ తర్వాత మళ్లీ సినిమాలు చేయడం ఇదే. ముఖ్యంగా నా మాతృభాష తెలుగు ద్వారా మళ్లీ సినిమాలు మొదలుపెట్టడం ఆనందంగా ఉంది. మరి... మళ్లీ సినిమాల్లోకి రావాలని ఎప్పుడనుకున్నారు... అనుకున్న తర్వాత అవకాశాల కోసం తెలుగు పరిశ్రమవారిని సంప్రదించారా? మళ్లీ సినిమాల్లోకి రావాలా? వద్దా అనే విషయం గురించి ఆలోచించలేదు. మూడేళ్ల క్రితం నేను, మావారూ, పాప ఏదో ఊరెళుతున్నాం. అప్పుడు ఎయిర్పోర్ట్లో నటీనటుల డేట్లు చూసే చలపతి పరిచయమయ్యారు. ‘ఎందుకు సినిమాలు మానేశారు. పెళ్లికి ముందెలా ఉన్నారో, ఇప్పుడూ అలానే ఉన్నారు కదా.. మీరు తప్పకుండా సినిమాలు చేయాలి’ అన్నారాయన. ఆ తర్వాత తర్వాత నాక్కూడా మళ్లీ సినిమాలు చేస్తే బాగుంటుందనిపించింది. అలాంటి సమయంలోనే ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రంలో అవకాశం రావడంతో అంగీకరించాను. ఈ సినిమాలో ఏ ప్రత్యేకత నచ్చి ఒప్పుకున్నారు? ఇందులో నేను అజయ్కి భార్యగా నటించా. మావి లీడ్ రోల్స్. నాగశౌర్యది మా కొడుకు పాత్ర. నా పాత్ర గురించి దర్శకుడు చెప్పినప్పుడు, నా వయసుకి అంత పెద్ద కొడుకు అంటే కరెక్ట్ కాదన్నాను. చేయనని కూడా చెప్పేశాను. కానీ, ఈ చిత్రదర్శకుడు త్రికోటి మాత్రం మీరే చేయాలని పట్టుబట్టారు. నా రీ-ఎంట్రీ ఘనత నిర్మాత సాయి కొర్రపాటికి, త్రికోటికే ఇవ్వాలి. అంతకు ముందు తల్లి పాత్రలు వచ్చినా నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే, వాటికి కథలో అంత ప్రాధాన్యం లేదు. ఈ పాత్ర అలా కాదు. పైగా, ఈ పాత్ర కోసం నన్ను నేను మార్చుకోవాల్సిన అవసరం లేదు. సినిమాలో టీనేజ్లోనే పెళ్లవుతుంది కాబట్టి, నాకో పెద్ద కొడుకు ఉంటాడు. ఆ కారణంగా ఇప్పుడు నా వయసెంతో తెరపై అలానే కనిపించవచ్చు. మరి.. ‘బుడుగు’ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు కదా? ఇందులో నాది అతిథి పాత్ర. సైకాలజిస్ట్ గీతారెడ్డిగా కనిపిస్తాను. బాగున్న అతిథి పాత్రలు చేయడానికి నాకు అభ్యంతరం లేదు. మీరు తెలుగమ్మాయి కదా.. మరి వికీపీడియాలో మీ పేరు ‘రాజాత్తి’ అని ఉంది. అది తమిళ పేరు కదా..? మేం తెలుగువాళ్లమే కానీ, మా పూర్వీకులు ఎప్పుడో చెన్నయ్లో స్థిరపడిపోయారు. నేను పుట్టింది కూడా అక్కడే. ఇక్కడ అమ్ములు, బుజ్జీ.. అని ముద్దుగా పిలుస్తాం కదా.. అలా తమిళంలో ముద్దుగా నన్ను రాజాత్తి అని పిలుస్తారు. మరి.. ఇంద్రజ అనే పేరు ఎవరు పెట్టారు? ‘యమలీల’కన్నా ముందు నేను ‘జంతర్ మంతర్’ సినిమా అంగీకరించాను. అందులో నా పాత్ర పేరు ‘ఇంద్రజ’. ఆ చిత్రం ప్రారంభం నాడు ‘ఈ అమ్మాయి ఇంద్రజ అనే పాత్ర చేస్తోంది’ అని దర్శక, నిర్మాతలు అన్నారు. దాంతో శ్రీకాంత్ పక్కన ఇంద్రజ చేస్తోందని రాశారు పాత్రికేయులు. ఆ చిత్రదర్శకుడు భరత్.. ‘పేరు ఎలాగూ పబ్లిష్ అయ్యింది కదా.. ఆ పేరుతోనే కొనసాగితే బాగుంటుంది’ అన్నారు. దాంతో ఇంద్రజ పేరు ఫిక్స్ అయ్యింది. మీ పూర్వీకులది ఏ ఊరు? మీరు నవ్వుకున్నా సరే... నిజంగా నాకు తెలియదండి. ఎందుకంటే, మా ముత్తాతలకు ముందు తరంవాళ్లే తమిళనాడుకు షిఫ్ట్ అయిపోయారు. అందుకని మా పూర్వీకులది ఏ ఊరో తెలియదు. తంజావూరు సరుక్కయ్ అగ్రహారంలో మా ముత్తాతలు ఉండేవాళ్లు. త్యాగరాజస్వామిగారి వంశ పారంపర్యంలో మా ముత్తాతల కుటుంబాలకు మూలాలు ఉండేవట. ఓకే... ప్రస్తుతం మీ ఫ్యామిలీ లైఫ్ గురించి చెప్పండి? బేసిక్గా మాది అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చిన్నప్పుడు మా ఇంటి పనులు మేమే చేసుకునేవాళ్లం. నేను సినిమాల్లోకొచ్చాక ఆర్థికంగా ఇంకా ఎదిగినా.. ఆ మధ్యతరగతి అలవాట్లు మాత్రం అలానే ఉన్నాయి. ఓ మామూలు గృహిణి ఎలా ఉంటుందో ఇన్నేళ్లూ నా జీవితం అలానే సాగింది. ఇంటిని చక్కబెట్టడం, పాపను చూసుకోవడం.. హాయిగా అనిపించింది. మీకు పెళ్లయ్యిందని, తల్లి కూడా అయ్యారనీ చాలామందికి తెలియదు... రహస్య వివాహం ఏమైనా చేసుకున్నారా? చెన్నయ్లో ఉన్నవాళ్లందరికీ నా పెళ్లి గురించి తెలుసు. ఇక్కడవాళ్లెవర్నీ పెద్దగా పిలవలేదు కాబట్టి, తెలియదు. అంతేకానీ రహస్య వివాహం ఏమీ చేసుకోలేదు. ఇంతకూ మీది ప్రేమ వివాహమా?.. అవును. మావారి పేరు అబ్సర్. ఆయన మోడలింగ్ చేసేవారు. మంచి రచయిత, నటుడు. సినిమాలు చేయలేదు కానీ.. టీవీ సీరియల్స్లో నటిస్తుంటారు. మీ ఇద్దరికీ పరిచయం ఎలా ఏర్పడింది? ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైంది. ఆయన చాలా మంచి వ్యక్తి. తొలిచూపు ప్రేమ అని చెప్పలేను కానీ.. మా మధ్య స్నేహం పెరిగి, అది ప్రేమగా మారింది. ముందు ఎవరు ప్రపోజ్ చేశారు? మేం ఇద్దరం ఒకరికి ఒకరు చెప్పుకోకపోయినా, ఒకరంటే ఒకరికి బాగా ఇష్టం అని అర్థం చేసుకున్నాం. వన్ ఫైన్ డే ఇద్దరం కలిసి మాట్లాడుకుని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మీ మతాంతర వివాహానికి ఇంట్లోవాళ్లు అంగీకరించారా? అబ్జర్ వ్యక్తిత్వం మావాళ్లకి నచ్చింది. వాళ్లింట్లోవాళ్లకి నేను నచ్చాను. దాంతో మేం పెళ్లి చేసుకోవడానికి కష్టపడాల్సిన అవసరం రాలేదు. తల్లయిన తర్వాత శరీరాకృతిలో మార్పు రావడం సహజం. కానీ, మీరు మునుపటిలానే ఉన్నారే? అది నా అదృష్టం. ఇలా ఉండటం కోసం నేను ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. ఇంటి పనులు బాగా చేస్తాను. అదే నాకు మంచి వ్యాయామంలాంటిది. దానికి తోడు ఆరోగ్యంగా ఉండటం కోసం కొన్ని వ్యాయామాలు కూడా చేస్తుంటాను. నేను పూర్తి శాకాహారిని. నేనిలా ఉండటానికి అది కూడా హెల్ప్ అయ్యింది. పెళ్లి తర్వాత మీకు ఆహార నియమాలు మార్చుకోవాల్సిన అవసరం రాలేదా? లేదు. ఒకవేళ మా ఆయనకు మాంసాహారం తినాలపిస్తే.. మా అత్తగారింటికి వెళతారు. లేకపోతే ఏదైనా హోటల్లో తింటారు. ఇప్పటివరకు ఇంట్లో నాన్వెజ్ వండింది లేదు. రెండు భిన్న సంస్కృతులకు చెందిన ఇద్దరు కలిసి ఒకే జీవితం గడపడం సులువేనా? మానసిక పరిణతి ఉంటే సులువే. ఓ వ్యక్తి మీద మరో వ్యక్తికి ఇష్టం ఏర్పడటానికి రకరకాల కారణాలుంటాయి. ఆ వ్యక్తి మనసు నచ్చి ఉండొచ్చు. ప్రవర్తనను ఇష్టపడొచ్చు. ఈ వ్యక్తితో మన జీవితం బాగుంటుందనిపించవచ్చు. అబ్జర్తో నా జీవితం బ్రహ్మాండంగా ఉంటుందనిపించింది. నా గురించి కూడా తనకదే ఫీలింగ్. ఒకరి భావాలను మరొకరు గౌరవించుకునేంత పరిణతి, అవగాహన మాకు ఉంది. పెళ్లి తర్వాత మీరు సినిమాలు చేయాలనే విషయంపై మీవారేమైనా ఆంక్షలు పెట్టారా? అలాంటిదేం లేదు. వాస్తవానికి ఆయన ప్రోత్సాహం వల్లనే సినిమాలు చేయడం మొదలుపెట్టాను. ‘పెళ్లయినంత మాత్రాన ఇంట్లో కూర్చోవాలని లేదు. సినిమాలు చెయ్యి’ అని మావారు అనేవారు. కానీ, అవుట్డోర్ షూటింగ్స్ చేయాల్సి వస్తుందని నేనే ఇష్టపడలేదు. అయితే, సినిమాల్లో కొనసాగాలనుకున్న తర్వాత నేనూ, మావారూ ఒక డీల్ కుదుర్చుకున్నాం. ఆ నిబంధన ప్రకారం నేను షూటింగ్స్కి వెళ్లినప్పుడు, మావారు ఎక్కువసేపు పాపకు టైమ్ కేటాయిస్తారు. నేను ఇంటికెళ్లిన తర్వాత తన పనితో బిజీగా ఉంటారు. ఇప్పుడు మీ పాప వయసెంత? ఆరేళ్లు. ప్రస్తుతం తను ఒకటో తరగతి చదువుతోంది. ఎప్పుడో ఇరవయ్యేళ్ల క్రితం మీరు చేసిన ‘నీ జీనూ ప్యాంటు చూసి బుల్లమ్మో...’ పాట గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటుంటారు. ఆ పాట చేసినప్పుడు మీకెలా అనిపించింది? అప్పుడు నేను సినిమాలకు కొత్త. డెరైక్టర్ చెప్పింది చేసేదాన్ని. అలాగే ‘జీనూ ప్యాంటు..’ పాట చేశాను. కొరియోగ్రాఫర్ చెప్పింది చేసేసేదాన్ని. అంతే. ఆ తర్వాత ఆ పాటకు వచ్చిన పాపులార్టీ చూసి, ‘ఓహో.. చాలా మంచి సాంగ్ చేశాం’ అనుకున్నా. అప్పట్లో మీతో పాటు చేసిన కథానాయికల్లో మంచి స్థానానికి చేరుకున్నవాళ్లు చాలామంది ఉన్నారు. ఉదాహరణకు సౌందర్య. కానీ, మీరు అనుకున్నంత స్థాయికి చేరుకోలేకపోవడానికి కారణం? నేను సినిమాల్లోకొచ్చినప్పుడు నా వయసు జస్ట్ 14. సో.. సినిమాల ఎంపిక విషయంలో పరిణతి ఉండేది కాదు. సౌందర్యగారు నాకన్నా సీనియర్. మా ఇద్దరికీ మధ్య దాదాపు ఆరేడేళ్ల వయసు వ్యత్యాసం ఉంది. పైగా ‘నేను నంబర్ వన్ కావాలి. అందరూ నా సినిమాలే చూడాలి’ అని కోరుకునే వ్యక్తిని కాదు. విధిని నమ్ముతాను. మనం ఏం చేయాలో దాని తాలూకు స్క్రిప్ట్ని ఆ దేవుడు ముందే రాసేస్తాడు. ఆ ప్రకారమే జరుగుతుందని భావించే మనసత్త్వం నాది. అందుకే నేను దేనికీ పెద్దగా బాధపడిపోవడం, ఆనందపడిపోవడం అనేది ఉండదు. మొదట్నుంచీ మీది ఇదే తరహా మనస్తత్వమా? అవును. ఆ దేవుడి దయ వల్ల నాకు చిన్నప్పుడే ఈ భావన ఏర్పడింది. అందుకే నేను దేన్నీ ప్లాన్ చేసుకోలేదు. ఎలా జరిగితే అలా.. అంతే. ఒకసారి మనం ‘జీవితం’ గురించి మాట్లాడుకుందాం. మనం ఎవరైనాసరే చిన్నప్పుడు బాగా చదువుకోవాలనుకుంటాం. పెద్దయిన తర్వాత మంచి ఉద్యోగం చేయాలనుకుంటాం. ఇవన్నీ జరిగిన తర్వాత వచ్చే దశలో మన ఆలోచనలు పూర్తిగా మారిపోతాయి. ఎలాంటి రోగాల బారిన పడకుండా, ఆస్పత్రుల చుట్టూ తిరగకుండా, మంచంలో పడే అవకాశం రాకుండా, ప్రశాంతంగా నిద్రలోనే ఆ దేవుణ్ణి చేరుకోవాలని కోరుకుంటాం. సో.. జీవితం మొత్తం ఎంత పాకులాడినా చివరి కోరిక మాత్రం ఎవరికైనా ఇదే అయ్యుంటుంది. అందుకే.. దేనికీ పెద్దగా పాకులాడకూదు. మీకు దైవభక్తి ఎక్కువా? అవును. నేను ఆ షిరిడీ సాయినాథుని భక్తురాల్ని. ఆ దేవుడంటే ఎంత భక్తి అంటే.. నా డెలివరీ టైమ్లో ఆ కష్టం తెలియకుండా ఆ దేవుడు సహాయం చేశాడనేంత. ఆ షిరిడీ సాయిబాబా స్వయంగా నన్ను ఆ పుట్టపర్తి బాబాకి అప్పగించారేమో అని నా నమ్మకం. బాబాలో నేను తండ్రిని చూసుకుంటాను. పూజలు బాగా చేస్తారా? లేదు. గుడికి కూడా వెళ్లను. ఆ దేవుడు మనం చేసే పూజల వల్ల సంతోషపడిపోతాడంటే నమ్మను. దేవుడు నిజంగా ఎప్పుడు సంతోషపడతాడో తెలుసా? తన విగ్రహం ముందు ఓ గ్లాసుడు పాలు పెట్టి, ఆ తర్వాత దాంతో పాయసం చేసుకుని తిన్నప్పుడు కాదు. అదే పాలుని తిండికి లేక అల్లాడుతున్న పిల్లలకు ఇచ్చినప్పుడు. ఇతరులకు సహాయం చేస్తే ఆ దేవుడికి సేవ చేసినట్లే. ఓకే.. మీ పాప గురించి మాట్లాడుకుందాం... భవిష్యత్తులో తను హీరోయిన్గా చేస్తానంటే ఒప్పుకుంటారా? ఓ తల్లిగా నాకు ఓకే కాదు. ఎందుకంటే, ఇది శాశ్వతమైన వృత్తి కాదు. ఒక పర్మినెంట్ ఇన్కమ్ ఉండదు. వస్తే.. వస్తుంది. లేకపోతే లేదు. అందుకని, బాగా చదువుకుని తన కాళ్ల మీద తను నిలబడగలిగే ఉద్యోగం సంపాదించుకోవాలని నాకుంది. అప్పుడు, ఒకవేళ పేషన్ కోసమే సినిమాలు చేస్తానంటే సమ్మతిస్తాను. అంతేకానీ, సినిమాలే కెరీర్ అంటే నేను ఒప్పుకోకపోవచ్చేమో. కానీ, మన చేతుల్లో ఏముంది? ఏది రాసి పెట్టి ఉంటే అది జరుగుతుంది. - సంభాషణ: డి. జి. భవాని హీరోలు 50, 60 ఏళ్ల వయసులో ఉన్నా ఎంచక్కా హీరోలుగానే చేస్తారు. కానీ, హీరోయిన్లను మాత్రం 30 ఏళ్లు దాటితే అమ్మ, అక్క, వదిన పాత్రలకు పరిమితం చేసేస్తారు. అది మీకెలా అనిపిస్తుంది? నేను దీన్ని చాలా పాజిటివ్గా ఆలోచిస్తాను. మన భారతదేశంలో ఎలా ఉంటుందంటే.. పెళ్లి కాని ఆడవాళ్లను ఏ మగాడైనా తన లవర్గానో, భార్యగానో.. ఎలాగైనా ఊహించుకోవచ్చు. కానీ, పెళ్లయిన ఆడవాళ్ల గురించి అలా ఊహించడానికి ఇష్టపడరు. ముఖ్యంగా తల్లయిన ఆడవాళ్ల గురించి నీచమైన ఊహలు చేయరు. అందుకే, పెళ్లయిన ఆడవాళ్లు డ్యూయెట్లు పాడితే అంగీకరించరు. అది అర్థం చేసుకుని, అందుకు తగ్గట్టుగా మౌల్డ్ కావడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు పరిస్థితులు ఫర్వాలేదు. ఒకప్పుడు పెళ్లయిన తారలకు ‘ఓల్డ్ మదర్’ కారెక్టర్లు ఇచ్చేవారు. ఇప్పుడు ‘యంగ్ మదర్’ అనే కేటగిరీ ఉంది. అందుకే హ్యాపీ. అలాగే, పోలీసాఫీసర్, లాయర్.. ఇలాంటి పాత్రలు చేయాలని ఉంది. అమ్మ, అక్క, వదిన పాత్రలూ చేస్తా. కానీ, ఆ కథకు ఆ పాత్ర ప్రాణం పోసేట్లు ఉండాలి. అప్పుడే చేస్తా.