Jangaon
-
జిల్లా స్థాయిలో సాధారణ బదిలీలు షురూ..
జనగామ: జిల్లా స్థాయిలో సాధారణ బదిలీలు మొదలయ్యాయి. ఈనెల 5వ తేదీన ప్రారంభమైన ట్రాన్స్ఫర్ల ప్రక్రియ 20వ తేదీ వరకు కొనసాగనుంది. ఒకేచోట నాలుగేళ్ల పాటు పనిచేస్తున్న ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉండగా.. రెండేళ్ల సర్వీసు కాలంలో కొంతమంది ట్రాన్స్ఫర్కు ఆప్షన్ ఇచ్చుకున్నారు.బదిలీల సమయంలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉద్యోగులు నిర్దిష్ట స్థలాన్ని ఎంచుకు న్న సమయంలో జీఓలో పొందు పరిచిన నిబంధన ల మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది. భార్యాభర్తలు ఉద్యోగులుగా పని చేస్తున్న సమయంలో (స్పౌజ్) ఒకరిని మాత్రమే బదిలీ చేస్తారు. 70శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం, మానసిక దివ్యాంగులు, పిల్లలు కలిగి ఉన్న ఉద్యోగులకు ట్రాన్స్ఫర్ సమయంలో కొంత సడలింపు ఇచ్చారు.ఉద్యోగి లేదా ఆయన భార్య, పిల్లలు, వారిపై ఆధారపడిన తల్లిదండ్రులకు న్యూరోసర్జరీ, కిడ్నీమార్పిడి, కాలేయ మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ, బోన్ టీబీ సంబంధిత వైద్య పరీక్షల సమయంలో మెడికల్ గ్రౌండ్స్ కింద బదిలీల్లో ప్రాధాన్యత ఇస్తారు. వ్యక్తిగత లేదా వైద్య కారణాలపై బదిలీలకు సంబంధించి ఆ శాఖ ఉన్నతాధికారి ధ్రువీకరించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయి బదిలీల ప్రక్రియ కలెక్టర్ ఆధ్వర్యా న, అదనపు కలెక్టర్, డీఆర్డీఓ తదితర ఉన్నతాధికా రుల పర్యవేక్షణలో కొనసాగుతుంది.బదిలీలకు 256 మంది ఆప్షన్..జిల్లాలో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఓఎస్, నైట్ వాచ్మన్, ఎంఎన్ఓ, పంచాయతీ కార్యదర్శి, మెసెంజర్, రికార్డు అసిస్టెంట్, వాచ్మన్, ఫైర్మన్, థియేటర్ అసిస్టెంట్, వాటర్ మెన్, స్వీపర్ తదితరులు డిపార్ట్మెంట్ వారీగా 788 మంది ఉన్నారు.ఇందులో 256 మంది బదిలీ కోసం ఆప్షన్లు ఇవ్వగా.. అన్ని కేటగిరీల్లో 155 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఒకేచోట పనిచేస్తూ నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న(తప్పనిసరి) 233 మంది ఉద్యోగులు బదిలీలకు ఆప్షన్ ఇవ్వగా.. జీఓ నిబంధనల మేరకు రెండేళ్లు ఒకేచోట పనిచేస్తున్న 23 మంది సైతం ట్రాన్స్ఫర్లు కోరుకున్నారు.కలెక్టరేట్లో బదిలీ కేటాయింపులుజిల్లా స్థాయి సాధారణ బదిలీల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ నేతృత్వంలో కలెక్టరేట్ ఏఓ రవీందర్, జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీపీఓ అనిల్కుమార్, డీఈఓ రాము, డిప్యూటీ జెడ్పీ సీఈఓ సరిత, డీటీఓ నర్సింహారెడ్డి తదితరుల ఆధ్వర్యాన ఉదయం నుంచి సాయంత్రం వరకు బదిలీల ప్రక్రియ కొనసాగింది. గ్రేడ్ 1,2,3 పంచాయతీ కార్యదర్శుల బదిలీలు మినహా అన్ని శాఖలకు సంబంధించి పూర్తి కాగా.. ఈనెల 20వ తేదీ వరకు ఆర్డర్ కాపీలను అందించనున్నారు.ఇదిలా ఉండగా.. జిల్లా పంచాయతీ శాఖలో సీనియర్ పంచాయతీ, జూనియర్ కార్యదర్శులు 281 మంది ఉండగా.. 162 మంది బదిలీలకు అర్హత కలిగి ఉన్నారు. ఇందులో 95 మంది ఒకేచోట నాలుగేళ్లుగా పనిచేస్తున్నారు. జీఓ నిబంధనలను అనుసరించి 40శాతం మాత్రమే బదిలీలు చేయాలి.. దీంతో 74 మందికి అవకాశం రానుంది. ఇందులో 65 మంది సీనియర్లు, 9 మంది జూనియర్లు మరోచోటకు వెళ్లనున్నారు. వీరి బదిలీలను నేడు(మంగళవారం) చేపట్టనున్నారు. -
డ్రగ్స్ తీసుకున్నా.. విక్రయించినా శిక్షలు తప్పవు
స్టేషన్ఘన్పూర్: ఎవరైనా సరె డ్రగ్స్ తీసుకున్నా.. విక్రయించినా, నిల్వ ఉంచుకున్నా శిక్షలు తప్పవని స్టేషన్ఘన్పూర్ ఏసీపీ భీంశర్మ అన్నారు. మండలంలోని శివునిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం సీపీ ఆదేశాల మేరకు డ్రగ్స్ వలన కలిగే దుష్పరిమాణాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం యువత డ్రగ్స్కు అలవాటు పడ్డారని, ఇలా వాడుతూ దొరికితే జీవితంలో ప్రభుత్వ ఉద్యోగానికి పనికి రాకుండా అవుతారన్నారని, అందుకు డ్రగ్స్ వాడి జీవితాలను నాషనం చేసుకోవద్దని సూచించారు. సీఐ రాజు, ఎస్సైలు పాల్గొన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.రఘునాథపల్లి: విద్యార్థులు గంజాయి లాంటి మత్తు పరార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని జనగామ రూరల్ సీఐ శ్రీనివాస్యాదవ్ సూచించారు. సోమవారం మండలంలోని వెల్ది మోడల్ స్కూల్ విద్యార్థులకు గంజాయి, ఇతర మత్తు పదార్థాలతో కలిగే అనర్దాలపై ప్రిన్సిపాల్ వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.మత్తు పదార్థాలు సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలతో పాటు విలువైన జీవితం అందకారం కానుందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. ఎస్సై దూదిమెట్ల నరేశ్ ఉన్నారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్ధాం.పాలకుర్తి టౌన్: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు విద్యార్థులు, యువత భాగస్వాములు కావాలని పాలకుర్తి సీఐ గట్ల మహేందర్రెడ్డి అన్నారు. వరంగల్ సీపీ అదేశాల మేరకు మండలంలోని గూడూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
జనగాం: ఆర్టీసీ బస్సు బీభత్సం.. ముగ్గురి మృతి
సాక్షి, జనగాం: జనగాంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు.. ఓ మొబైల్ టిఫిన్ సెంటర్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. -
రాజకీయ నాయకుల గురించి పిల్లలకు ఎలాంటి మాటలు చెబుతున్నాడో చూడండి
-
పోలింగ్ లో రచ్చ రచ్చ..కాంగ్రెస్, బీఆర్ ఎస్ మధ్య ఫైట్
-
అభివృద్ధి శూన్యం అంటున్న జనగామ జనం
-
అప్పట్లో జనగామను చూసి ఏడ్చా: సీఎం కేసీఆర్
సాక్షి, జనగామ: ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు. ఆపద మొక్కుల మాదిరిగా కొందరు ఏదేదో చెబుతారు.వాళ్ళ మాటలు నమ్మితే మోసపోయి గోస పడుతాం. ప్రజాస్వామ్యంలో బలమైన ఆయుధం ఓటు అని.. అందుకే ఆలోచించి ఓటేయాలని జనగామ ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పిలుపు ఇచ్చారు. సోమవారం సాయంత్రం జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. ‘‘జనగామలో ఒకప్పుడు భయంకరమైన పరిస్థితులు ఉండేవి. గతంలో కరెంట్ కోతలు తప్ప ఏం ఉండేది కాదు. కరువుతో అల్లాడుతున్నామని చెబుతుంటే నాకు దుఃఖం ఆగలేదు. అప్పటి పరిస్థితి చూసి బచ్చన్నపేటలో ఏడ్చాను. తెలంగాణలో గులాబీ జెండా ఎగరగానే.. దేవాదులకు శంకుస్థాపన చేసి చంద్రబాబు మోసం చేశారు. మాయ మాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నాలు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడు నాలుగు నెలలు మథనం చేశాం. ఆర్థిక పరిస్థితిపై చర్చలు చేశాం. ఇప్పుడు తెలంగాణ ఎలా ఉంది?. కరెంట్ కష్టాలు లేవు. నీటి కొరత లేదు. పుట్లకొద్ది పంటలు పండుతున్నాయి. ఎక్కడ కరువు వచ్చినా.. జనగామలో మాత్రం రాదు. పాత వరంగల్ జిల్లాలో అత్యధికంగా వడ్లు పండించే ప్రాంతం జనగామనే. రాష్ట్రం ఏర్పడ్డాక.. భువనగిరి, జనగామలు గ్రోత్కారిడార్లు అయ్యాయి. దేవాదుల, కాళేశ్వరం నుంచి నీళ్లు రాబోతున్నాయి అని ప్రసంగించారు కేసీఆర్. భూమిపై హక్కులు రైతులకే ఉండాలి. రైతుల బాధలు నాకు తెలుసు. అందుకే భూములపై అధికారుల అధికారం తొలగించాం. మీ భూమి మీద అధికారం మీకే(రైతుల్ని ఉద్దేశించి..) ఇచ్చాం. నా ప్రాణం పోయినా సరే అది మారనివ్వను. ధరణిని తీసి కాంగ్రెస్ వాళ్లు బంగాళాఖాతలో కలిపేస్తారట. ధరణిని కాదు.. కాంగ్రెస్ వాళ్లనే బంగాళాఖాతంలో వేయాలి. కాంగ్రెస్కు ఓటేస్తే.. వీఆర్ఏలు వస్తారు. మళ్లీ ఆగం అవుతారు. వ్యవసాయానికి కాంగ్రెస్ వాళ్లు మూడు గంటల కరెంట్ ఇస్తారట. 24 కరెంట్ కొనసాగాలంటే.. కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి అని ప్రజలను కోరారాయన. ఎన్నికలు వచ్చినప్పుడు కనిపించేవారిని నమొద్దు. ఓటు మన తలరాత మారుస్తుంది.. ఆలోచించి ఓటు వేయండి. మంచి ఏదో, చెడు ఏదో గుర్తించి ఓటేయండి. వందకు వంద శాతం జనగామ అభివృద్ధి జరిగి తీరుతుంది. జనగామ లో ఏం జరగాలనుకున్నామో.. అవన్నీ జరుగుతాయి. ఎన్నికల తర్వాత మళ్ళీ వస్తా.. అన్ని పనులు చేస్తాం అని జనగామ సభకు హాజరైన ప్రజానికాన్ని ఉద్దేశించి కేసీఆర్ కోరారు. తన ప్రసంగానికి ముందు.. ముందు సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు కేసీఆర్. పొన్నాలతో పాటు పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే కాకముందే సమస్యలను ప్రస్తావించిన పల్లా రాజేశ్వర్రెడ్డిని అభినందించిన సీఎం కేసీఆర్.. ‘‘పల్లా రాజేశ్వర్ రెడ్డి హుషారుగా ఉన్నాడు అనుకున్నా... ఇంత హుషారు అనుకోలేదు. పల్లా కంటే ముత్తిరెడ్డే నయం.చిన్న చిన్న ఇబ్బందులతో ముత్తిరెడ్డి కి బదులు పల్లా ను ఎన్నికల బరిలో నిలిపాం. ఎన్నికల ముందే పల్లా చాటబారతం అంత లిస్టు ఇచ్చిండు అని కేసీఆర్ చమత్కరించారు. అయితే.. అవన్నీ నెరవేర్చదగ్గ హామీలేనన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. హామీలన్నీ నెరవేరుస్తామని, చేర్యాలను రెవెన్యూ డివిజన్గా చేస్తామని సీఎం కేసీఆర్ సభా వేదికగా ప్రకటించారు. -
జనగామ బీఆర్ఎస్ లో టికెట్ జగడానికి తెరపడినట్లేనా..?
-
పల్లా, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మధ్య కుదిరిన సయోధ్య..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని హీటెక్కించిన జనగామ జగడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చెక్ పెట్టారు. పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిల మధ్య సయోధ్య కుదిర్చారు. మినిస్టర్స్ క్వార్టర్స్లో జనగామ ప్రజాప్రతినిధులు, పల్లా రాజేశ్వర్రెడ్డి, ముత్తిరెడ్డి లతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డిని గెలిపించుకోవాలని కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఈ భేటీలో మరో ఇద్దరు టికెట్ ఆశావహులు మండల శ్రీరాములు మరో ఆశావాహి కిరణ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. అయితే, తెలంగాణ ఆర్టీసీ సంస్థ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినా.. జనగామలో బీఆర్ఎస్ తరపున బరిలో తానే ఉంటానంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. మరోవైపు, జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తారని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్న తరుణంలో పల్లాను గెలిపించుకోవాలంటూ.. ఈ రోజు జరిగిన భేటీలో కేటీఆరే స్వయంగా చెప్పారు. ఆగస్టు 21న 115 మంది అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో జనగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిని పెండింగ్లో పెట్టారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి టీఎస్ఆర్టీసీ చైర్మెన్ పదవిని బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టింది. పల్లాకు లైన్ క్లీయర్ చేసేందుకే ముత్తిరెడ్డికి ఆ పదవిని ఇచ్చినట్లు సమాచారం. చదవండి: ఎమ్మెల్సీకి లైన్ క్లియర్ అయినట్టేనా? ‘పల్లా’ కేనా..!? -
పల్లాపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
సాక్షి, జనగామ: జనగామ బీఆర్ఎస్ ఆధిపత్య పోరు మరింత రాజుకుంటోంది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తాజా వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు క్షమాపణ చెప్పాలని పల్లాను డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం.. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు, ఇన్ బ్యాలెన్స్ ఉండేందుకు. అందుకే ఆహ్వానించారే తప్ప కుక్కల్ని చేయడానికి కాదని విషయాన్ని గమనించాలి. పల్లా తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. తప్పు జరిగిందని క్షమాపణ చెప్పాలి అని ముత్తిరెడ్డి డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై పల్లా రాజేశ్వర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కుక్కలతో పోల్చారు. ‘ బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుక్కలు. అటువైపు ఉంటే మొరుగుతారనే బీఆర్ఎస్లో చేర్చుకొని దొడ్లో కట్టేశారు. అటువైపు ఉన్న కుక్కలను ఇటు తీసుకుని.. వారిని పిల్లిలాగా కేసీఆర్ మార్చేశారు. అలా కేసీఆర్ వారిని గీత దాటకుండా చేసేశారు’ అని వ్యాఖ్యానించారు పల్లా. ముత్తిరెడ్డి ఆగ్రహం.. పల్లా వ్యాఖ్యలపై ముత్తిరెడ్డి ఫైర్ అయ్యారు. ‘‘బలుపెక్కువై డబ్బు ఎక్కువ ఉన్నవారు అమాయక ప్రజల మీద డబ్బులు చల్లి అయోమయానికి గురి చేస్తున్నారు. అలా చేయడం సీఎం కేసీఆర్ సంకల్పానికి విరుద్ధం. అమ్ముడుపోయేవారు ఆగమై మట్లే కలిసిపోతారు. కేసీఆర్ నిర్ణయం శిరోధార్యం. కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే అందరం కలిసే ప్రయాణం చేస్తాం. ప్రజల అభిమానాన్ని కోరికను కేసీఆర్ తీరుస్తాడు. ముఖ్యమంత్రి పై నాకు పూర్తి విశ్వాసం ఉంది. 14ఏళ్లుగా మీ కష్టాలు మీ జ్ఞాపకాలు కేసీఆర్ దృష్టిలో ఉన్నాయి. కాబట్టి సీఎం కోరిక తీరుస్తాడు. సముచిత నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా. భారీ మెజార్టీతో గెలుస్తాం’’ అని ముత్తిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చైర్పర్సన్ ప్రసంగానికి అంతరాయం దివ్యాంగుల ఆసరా పెంపు కార్యక్రమంలో ఇవాళ ముత్తిరెడ్డి పల్లాపై మండిపడ్డారు. అయితే.. ఎమ్మెల్యే మాట్లాడిన తర్వాత జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ జమున మాట్లాడారు. ముత్తిరెడ్డి కూడా తన బాధను చెప్పుకున్నారని, ఎవరికీ టికెట్ ఇచ్చిన పని చేయాలని ప్రసంగించారు. ఆ సమయంలో కార్యకర్తలు చైర్పర్సన్ ప్రసంగానికి అడ్డుతలిగారు. ముత్తిరెడ్డి కి అనుకూలంగా నినాదాలు చేయడంతో ఆ కార్యక్రమం గందరగోళంగా మారింది. దీంతో ముత్తిరెడ్డి జోక్యం చేసుకునితన అనుచరుల్ని శాంతింపజేశారు. మరోవైపు జనగామ అభ్యర్థిని త్వరగా ఖరారు చేసి ఉత్కంఠకు తెరదించాలని ముత్తిరెడ్డి వర్గం బీఆర్ఎస్ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తోంది. -
జనగామ ఎవరికీ?.. పొన్నాలను వెంటాడుతున్నదేంటి?
ఆయన ఒకప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో చక్రం తిప్పారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. పీసీసీ చీఫ్గానూ పనిచేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆ నేతకు వచ్చే ఎన్నికల్లో సీటు బాధ మొదలైంది. తన ప్రత్యర్థి సీటు తన్నుకుపోతాడనే భయం మొదలైంది. తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు టికెట్ కష్టాలు మొదలయ్యాయి. జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్రెడ్డిని ఏఐసిసి ఇటీవలే నియమించింది. దాంతో జనగామ అసెంబ్లీ టికెట్ కూడా ఆయనే ఎగరేసుకుపోతారేమోననే అనుమానం పొన్నాలను వెంటాడుతోంది. గత ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో రాహుల్ గాంధీ అండతో టిక్కెట్ దక్కించుకున్న పొన్నాల లక్ష్మయ్య ఈసారి మాత్రం ముందుగానే అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో ఏఐసిసి పెద్దలను కలుసుకుంటూ తన గోడు వెళ్లబోసుకుంటున్నారు. మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన తనకే తెలియకుండా తన జిల్లా అయిన జనగామ డీసీసీ అధ్యక్షుడిగా తన వ్యతిరేకవర్గ నాయకుడిని నియమించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా కొమ్మూరి నియామకాన్ని రద్దు చేయించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్రెడ్డి రికమండేషన్తో జనగామ డీసీసీ అధ్యక్ష పదవిని కొమ్మూరి ప్రతాప్రెడ్డి దక్కించుకున్నారు. తనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతాప్రెడ్డికి ఏకంగా పీసీసీ చీఫ్తో పాటు కోమటిరెడ్డి మద్దతు ఇస్తుండడంతో పొన్నాల ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. 2014, 2018 ఎన్నికలలో పొన్నాల ఓటమి పాలు కావడం, వయసు 79 సంవత్సరాల వయస్సుతో వయో భారం పెరగడం ఆయనకు ప్రతికూల అంశాలుగా మారాయి. చదవండి: తెలంగాణలో కమ్మలకు, వెలమలకు చెడిందా? అయితే 2014 ఎన్నికల్లో 52వేల ఓట్లు, 2018 ఎన్నికల్లో 62 వేల ఓట్లు పొన్నాల తెచ్చుకోగలిగారు. అదే కొమ్మూరి ప్రతాప్రెడ్డి 2014లో బీజేపీ తరపున బరిలో దిగి దాదాపు 21 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఏజ్ ఫ్యాక్టర్తో పాటు పీసీసీ చీఫ్ ఆశీస్సులు కొమ్మూరికి కలిసి వస్తుండగా.. పొన్నాల మాత్రం అధిష్టానంపైనే భారం వేశారు. కొమ్మూరి ప్రతాపరెడ్డి నియామకం రద్దు చేయించడానినికి పట్టువదలని విక్రమార్కుడిలా పొన్నాల తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరి ఈ వృద్ధ నేత ప్రయత్నం ఫలిస్తుందా ? డీసీసీ పదవి రద్దు సంగతేమో గానీ, కనీసం జనగామ టికెట్ అయినా దక్కించుకుంటారా ? అంటూ జనగామ కాంగ్రెస్లో చర్చ నడుస్తోంది. -
జనగామ జిల్లాలోని బీఆర్ఎస్ లో సీట్ల లొల్లి
-
జనగామ ఎమ్మెల్యే టికెట్పై పోటాపోటీ సమావేశాలు
-
అసమ్మతి మీటింగ్కు ముత్తిరెడ్డి! షాకైన నేతలు
సాక్షి, హైదరాబాద్: జనగామ బీఆర్ఎస్ టికెట్ రేస్ పంచాయితీ హైదరాబాద్కి చేరింది. ప్రగతి భవన్కి కూతవేటు దూరంలో క్యాంప్ రాజకీయం ఆసక్తికరంగా సాగింది. ఎమ్మెల్సీ పల్లాను కలిసేందుకు బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్కు రాగా, వారు హైదరాబాద్ వెళ్లారనే సమాచారంతో హుటాహుటిన నగరానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి వచ్చారు. టూరిజం ప్లాజాలో ఆయన ప్రత్యక్షమవడంతో జనగామ బీఆర్ఎస్ నేతలు షాకయ్యారు. ముత్తిరెడ్డికి తెలియకుండానే పల్లా పిలిపించాడని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అధిష్టానం ఇలాంటి చర్యలను క్షమించదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు. ‘‘ఇక్కడకు వచ్చిన వారిలో ముఖ్య కార్యకర్తలు ఎవరూ లేరు. జడ్పీటీసీ, ఎంపీపీ, మండలాధ్యక్షులు నా వెంటే ఉన్నారు. కొంత మంది మా నియోజకవర్గ పార్టీ నేతలు హరిత ప్లాజాకు వచ్చారని తెలిసింది. ఎవరు వచ్చారో తెలుసుకుందామని వచ్చాను. ..తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి నడిచిన వ్యక్తిని నేను. గతంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి నాకు ఫోన్ చేసి ఇలాంటివి ప్రోత్సహించనని చెప్పారు. అసమ్మతి సంగతి అధిష్టానం చూసుకుంటుంది’’ అని ముత్తిరెడ్డి అన్నారు. చదవండి: టార్గెట్ కేసీఆర్.. రేవంత్ ఆరోపణలకు అర్థాలు లేవులే! -
ఇంటి ఓనర్ లైంగిక వేధింపులు వివాహిత ఆత్మహత్య
వర్ధన్నపేట: లైంగిక వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వర్ధన్నపేట ఎస్సై ప్రవీణ్కుమార్ కథనం ప్రకారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు గ్రామానికి చెందిన పస్తం శ్రీనుకు 2006 సంవత్సరంలో మంజుల (34)తో వివాహం జరిగింది. బతుకుదెరువు నిమిత్తం 10 సంవత్సరాల క్రితం ముంబై వెళ్లిన దంపతులు.. మూడు నెలల క్రితం ఇంటికి చేరుకున్నారు. ఈక్రమంలో మండలంలోని ఎలికెట్ట గ్రామం టిక్షతండాకు చెందిన జాటోత్ జితేందర్కు తమ ఇంట్లోని ఓ గదిని అద్దెకు ఇచ్చారు. ఈ నేపథ్యంలో జితేందర్ తరుచూ మంజులను లొంగదీసుకోవాలని యత్నించాడు. దీనిపై తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు జితేందర్కు కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినా ఆయనలో మార్పు రాకపోవడంతో మరోసారి పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఈ వేధింపులు తాళ లేక మంజుల 15 రోజుల క్రితం తన సోదరి శారద ఇంటికి వెళ్లింది. అక్కడ మంజులకు మాయమాటలు చెప్పిన జితేందర్.. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని తన గదికి తీసుకెళ్లాడు. అక్కడ లైంగిక దాడికి యత్నించడంతో మంజుల ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా వరంగల్ ఎంజీఎం తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. ఈ ఘటనలో లైంగిక వేధింపులు తట్టుకోలేక తన భార్య మంజుల ఆత్మహత్యకు పాల్పడిందని భర్త శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. -
సొంతంగా పోటీ చేసిన సర్పంచ్గా కూడా గెలవలేడు: తుల్జా భవాని
-
మా నాన్న మంచోడు కాదు.. ముత్తిరెడ్డికి కూతురు షాక్
సాక్షి, హైదరాబాద్: జనగాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కూతురు మరోసారి షాకిచ్చింది. తన తండ్రి మంచోడు కాదంటూ, ముత్తిరెడ్డిలాంటి అవినీతిపరుడిని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారో తెలియడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆయన కూతురు తుల్జా భవాని రెడ్డి. ఎమ్మెల్యే యాదగిరి రెడ్డిని ప్రశ్నించాల్సింది, ఓడించాల్సింది ప్రజలేనని ఆమె అన్నారు. ప్రజల ఆస్తిని తాను తిరిగి ప్రజలకే ఇచ్చేశానని తెలిపారు. కబ్జా చేశానని ఒక ఎమ్మెల్యే బహిరంగంగా చెప్పినా.. ప్రభుత్వం ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి అవినీతిపరులకు పార్టీ టికెట్ ఇవ్వకూడదని, సొంతంగా పోటీ చేసినా సర్పంచ్గా కూడా తన తండ్రి గెలవడని వ్యాఖ్యానించారు. కేవలం కేసీఆర్ పేరు చెప్పుకొని మళ్లీ ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు. సాక్షితో ఆమె మరికొన్ని విషయాలు పంచుకున్నారు.. అవి తన మాటల్లోనే సంబంధిత వార్త: చేర్యాల ప్రజలు మా నాన్నను క్షమించండి: భవానీ రెడ్డి 1) ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కూతురు అంటే ఇష్టం లేదా? చిన్నప్పటి నుంచి ఇంతేనా? ఇటీవల కాలంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వర్సెస్ ఆయన కూతురు తుల్జా భవాని రెడ్డిగా మారింది.. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు.. ఇదంతా ఎందుకు అంటే తుల్జా భవాని రెడ్డి ఒకటే చెప్తున్నారు మహిళ అంటే ఆయనకు చిన్న చూపు ఆయన గురించి ఒక మహిళ ఎదురు తిరిగి మాట్లాడితే ఆయన సహించలేరని అంటున్నారు.. చిన్నప్పటి నుంచి కూడా వారి కుటుంబంలో ఆమె అమ్మానాన్న ఆమె సోదరుడు అంతా ఒక్కటి అయితే తుల్జా భవాని రెడ్డి మాత్రం ఒక్కటిగా ఉండేదని చెప్తున్నారు.. ఆమె పుట్టడమే ఆయనకు ఇష్టం లేనట్లుగా సమాధానం ఇచ్చారు. 2 )ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఆయన కూతురికి మధ్య విభేదాలు ఏంటి? సిద్ధిపేట జిల్లా చేర్యాలలో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రభుత్వ భూమి నీ ఎమ్మెల్యే కబ్జా చేసి తన పేరున రాశారని పేర్కొన్నారు .2020 డిసెంబర్లో ఈ కబ్జా గురించి విషయం బయటకువచ్చినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఇంట్లోనే తేల్చుకునేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు కానీ వినకపోవడంతో బయటకు వచ్చి అక్కడ స్థానికంగా అందరి ముందు ఆమె తండ్రిని నిలదీసింది. ఇది వరకే ఎమ్మెల్యేపై భూకబ్జా ఆరోపణలు ఉన్నాయని.. చెరువు భూమి అంటే ఎమ్మెల్యేకి చాలా ఇష్టం అని అందుకే అక్కడ కబ్జా లు చెరువుల పక్కన స్థలాలను కబ్జా చేస్తుంటారని చెప్పుకొచ్చారు. జనగాం జిల్లాలో ఎవరిని అడిగినా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అవినీతి గురించి చెబుతారని ఒకసారి ఏకంగా కలెక్టర్ ప్రెస్ మీట్ పెట్టారంటే అర్థం చేసుకోవాలని అన్నారు.. 3) ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు? కబ్జా చేసినట్లు ఎమ్మెల్యే బహిరంగంగా ఒప్పుకున్నట్లు ఒక క్లిప్పింగ్ వచ్చిందని ఆమె అన్నారు..అన్ని ఒప్పుకున్న తర్వాత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇలాంటీ అవినీతి ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్ ఇవ్వకూడదనీ అన్నారు. ఒక కూతురు అయిన బయటకు మా నాన్న కబ్జాలు చేస్తున్నాడని చెప్పినా ఇప్పటి వరకు ఆయనపై చర్యలు లేవని బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎటువంటి ఫోన్లు రాలేదని అన్నారు 4) రాజకీయ ప్రవేశం? రాజకీయ ప్రవేశం పై అసక్తి లేదనీ అన్నారు తుల్జా భవానీ. న్యాయం వైపు పోరాడితే ప్రజల కోసం చూస్తే రాజకీయాల్లోకి వస్తున్నారని ఆలోచన కరెక్ట్ కాదు అన్నారు. తనకు ఏ పార్టీ కూడా అండ దండ లేదని, తను ఒకతే ఫైట్ చేస్తున్నట్లు తెలిపారు. ఏవైతే కబ్జా ఉన్నాయో ఆ స్థలాలని తీసుకొని ప్రజలకు ఇచ్చేస్తున్నట్లు తెలిపారు అంతే తప్ప రాజకీయాల్లోకి ఎవరు పిలిచినా వెళ్ళేది లేదని కరాఖండిగా చెప్పారు. 5) ఇలాంటి అవినీతిపరులను ఎందుకు ప్రజలు ఎన్నుకుంటున్నారు ? ఒక ప్రజా ప్రతినిధిని ఎన్నుకుంటున్న సమయంలో లీడర్ ఎలా ఉండాలి అని ప్రజల ఆలోచించాలని అన్నారు. ఇలాంటి అవినీతిపరులకు ఓట్లు వేస్తే ప్రజలకు నష్టమే తప్ప లాభం ఉండదని తెలిపారు.. ప్రజలు అవినీతిని ప్రశ్నించాలే తప్ప గెలిపించద్దనీ అన్నారు.. సీఎం కేసీఆర్ను చూసి ఓట్లు వేసి గెలిపించారు ప్రజలు.. ఒక్కసారి రిజైన్ చేసి సర్పంచ్గా పోటీ చేసి గెలిచి చూపించమని ఆయన కూతురు సవాల్ విసిరారు. త్యాగాలను చేసి తెలంగాణ తెచ్చుకుంది ఇలాంటి అవినీతిపరుల చేతిలో ప్రజాస్వామ్యాన్ని పెట్టేందుకు కాదని సమాధానం ఇచ్చారు. 6) ఎమ్మెల్యే కబ్జా చేసిన బాధితులు ఇంకెవరైనా ఉన్నారా? ఇప్పుడిప్పుడే చాలా మంది బాధితులు ఫోన్ లు చేస్తున్నట్లు తెలిపారు.. వారి పేర్లను ఇప్పుడు నేను బయట పెట్టాలి అనుకోవడం లేదని అన్నారు. తన పేరుపై ఎన్నో ఫోర్జరీలు చేశారని కూడా తెలిపారు 7) అల్లుడు అంటే ఎమ్మెల్యే ముత్తీ రెడ్డి కి ఇష్టం లేదా అందుకే ఇదంతా జరుగుతుందా? తుల్జ భవానీ రెడ్డి తమది లవ్ కం అరేంజ్డ్ వివాహంగా పేర్కొన్నారు... పెళ్ళి చేసే సమయం లో సంతోషంగానే వివాహం చేశారని ఆమె అన్నారు..ఆ వివాహా నికి సీఎం కేసీఆర్ వచ్చినట్లుగా కూడా తెలిపారు.. ఇప్పుడు తను పిల్లలతో , భర్త తో ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు.. తన భర్త ఏ విధంగా కూడా ఆమె తండ్రిపైకి తిరగబడేలా ట్రాప్ చేయలేదనీ చెప్పారు.. 8) ఎన్నికలకి ముందే వేల కోట్ల ఆస్థులు.. 70 ఏళ్ల వయసు... ఇంకా ఎందుకు కబ్జాలు? ఎన్నికలకు ముందే వేల కోట్లు సంపాదించారని అన్నారు.. ప్రస్తుతం అయనకి 70 ఏళ్ల వయసు. ఇప్పటికీ ఇంకా కొన్ని రెంట్స్ కూడా కోటిన్నరకు పైగా వస్తున్నాయని అన్నారు. ఇవన్నీ కాకుండా చెరువుల పక్కన ఆయనకి సాయంత్రం వేళ కూర్చొని ఎంజాయ్ చేయడం ఇష్టంతో కబ్జాలు చేస్తున్నారని అన్నారు. 9) కూతురు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆస్తినీ ఎందుకు తీసుకోలేదు? రూపాయి అస్థి కూడా తీసుకోకుండా భర్తనీ పెళ్ళి చేసుకుని ఇంట్లో నుంచి బయటికీ సంతోషంగా వచ్చినట్లు ఆమె వ్యక్తం చేశారు. మామూలుగా నలుగు పెట్టే సమయం లో ఆడపిల్లలు ఏడుస్తారు కానీ తనకి ఒక కంటి చుక్క కూడా రాలేదని అన్నారు. తన భర్త కట్నం తీసుకోలేదని తనకి పెట్టిన కొన్నిటింని కూడ డబ్బుల రూపంలో తిరిగి ఇచ్చినట్లు తెలిపారు. 10 ) ఎమ్మెల్యే కబ్జా పై ఒప్పుకున్న తర్వాత కూడా కేసులు ఎందుకు? తన పై ఎమ్మెల్యే ఐదు కేసులు పెట్టించరాని తుల్జా భవనీ అన్నారు.. బహిరంగంగా కబ్జా చేశాను అని ఒప్పుకున్న తర్వాత కూడా పోలీస్లు మాకు ఫోన్ లు చేసి వేధిస్తున్నారని మనస్థాపం చెందారు. -సుస్మిత, సాక్షి టీవీ చదవండి: Video: మానవత్వం చాటుకున్న కేటీఆర్.. -
భట్టికే చెమట్లు పట్టించారు.. కాంగ్రెస్ నుంచి గెంటేసుకున్న పొన్నాల, కొమ్మూరి
ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కీలక మంత్రిగా హవా నడిపారు. పార్టీకి అధికారం పోయింది. పదవులు చేజారిపోయాయి. ఇప్పుడు టిక్కెట్ తెచ్చుకోవడమే ఆ మాజీ పీసీసీ చీఫ్కు కష్టమంటున్నారు. గత ఎన్నికల్లో తనకు ప్రచారం చేసిన నేతే ఇప్పుడు ఆయనకు అడ్డుపడుతున్నాడు. మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి నేనేంటే నేనే అంటూ ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర జనగామలో పోరు యాత్రగా మారింది. రెండు వర్గాలు ఒకరిని మరొకరు కుమ్మేసుకున్నారు. తోసుకున్నారు. తిట్టుకున్నారు. పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. పాదయాత్రలో లొల్లి షురూ.. భట్టి విక్రమార్కకే చెమట్లు పట్టించారు పొన్నాల, కొమ్మూరి. ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు ఆధిపత్య పోరు ప్రదర్శించారు. ఇద్దరు నేతల మధ్య కొనసాగుతున్న అంతర్గత విభేదాలతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. గత ఎన్నికల్లో పొన్నాల ఓటమితో ఈసారి కొమ్మూరి టిక్కెట్పై ఆశలు పెంచుకున్నారు. దీంతో ఇద్దరి మధ్యా వార్ మొదలైంది. చాన్నాళ్ళుగా సైలెంట్ ఉన్న వ్యవహారం భట్టి పాదయాత్ర సందర్భంగా రోడ్డున పడింది. ఈ తరుణంలో పొన్నాల అనుచరుడైన డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మాసనపల్లి లింగాజీ కొమ్మూరిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి కొమ్మూరికి కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధంలేదని చెప్పారు. అదే సమయంలో కొమ్మూరి అనుచరులు పొన్నాలనే పార్టీ నుంచి తొలగించినట్లు ప్రకటించారు. ఓడిన తర్వాత నియోజకవర్గాన్ని, పార్టీని పట్టించుకోకుండా అధికార పార్టీకి కోవర్ట్ గా మారి జనగామలో హస్తం పార్టీని అస్తవ్యస్తం చేస్తున్నాడని హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. పోటా పోటీ ఫిర్యాదులతోపాటు భట్టి పాదయాత్రలో తమ సత్తా చాటేందుకు యత్నించారు. భట్టి కూడా ఈ న్యూసెన్స్ ఏంటని ఇరువర్గాలను తీవ్రంగా మందలించారు. (హైదరాబాద్లో మళ్లీ ఉగ్ర కదలికలు.. 16 మంది అరెస్ట్) సైడయిపోయిన కొమ్మూరి కొమ్మూరి వస్తే పాదయాత్రకు సహకరించబోనని పొన్నాల స్పష్టం చేయడంతో.. ఒకదశలో భట్టి రెండు చేతులు జోడించి ముందుకు వెళ్ళమని కొమ్మూరికి విజ్ఞప్తి చేశారు. దీంతో కొమ్మూరి పాదయాత్ర నుంచి నిష్క్రమించారు. నర్మెట్టలో కార్నర్ మీటింగ్ పెట్టేందుకు పొన్నాల ఏర్పాటు చేయగా కొమ్మూరి వర్గీయులు నిరసన వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చేసేది లేక భట్టి కార్నర్ మీటింగ్ ను క్యాన్సల్ చేసుకుని ముందుకు సాగారు. దీంతో పొన్నాల అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కొమ్మూరి అనుచరులను సభా వేదిక వద్దకు ఎలా అనుమతిచ్చారంటూ పోలీసులపై ఫైర్ అయ్యారు. కొమ్మూరి మాత్రం పార్టీపై ఉన్న అభిమానంతో భట్టి పాదయాత్ర సక్సెస్ కావాలని పొన్నాల సైకోయిజం వల్లనే పాదయాత్ర కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలో మూడు రోజులపాటు భట్టి పాదయాత్ర సాగగా ఫస్ట్ డే మాత్రమే భట్టితో కొమ్మూరి కనిపించారు. పొన్నాల మాత్రం ఆది నుంచి అంతం వరకు అన్నీ తానై భట్టిని నడిపించారు. ఉల్టా పల్టా గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పొన్నాల నియోజకవర్గానికి దూరం కాగా.. కొమ్మూరి మాత్రం అక్కడ పార్టీ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రజలతో మమేకమ్యారు. పార్టీలో రేవంత్రెడ్డి వర్గంగా పేరు తెచ్చుకున్నారు. కొమ్మూరికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్న పొన్నాల.. భట్టి విక్రమార్క పాదయాత్రను తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. ఒకప్పుడు తన చేతితో అభ్యర్థులకు టిక్కెట్ ఇచ్చిన పొన్నాల ఇప్పుడు తనకు టిక్కెట్ వస్తుందో రాదో అన్న దీనస్థితికి దిగజారిపోయారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. (కూతురు ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.. ఏమన్నారంటే!) -
రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ
ఢిల్లీ: భువనగిరి పార్లమెంట్ స్థానం పరిధిలోని భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్ల అభివృద్ధి ఎంతో అవసరం ఉందని, భువనగిరి స్టేషన్ తెలంగాణలోని ప్రముఖంగా రాకపోకలు సాగిస్తున్న రైల్వే స్టేషన్ అని. ఇందుకు సంబంధించి ఆధునీకరణ పనులు చేపట్టాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో గురువారం భేటీ అయిన వెంకట్రెడ్డి.. పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్ల అభివృద్ధి ఎంతో అవసరం యాదాద్రిలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. యాదగిరిగుట్ట తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. ప్రతి రోజు వేల మంది భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. అలాగే, భువనగిరి రైల్వే స్టేషన్ నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు నిత్యం హైదరాబాద్ కు రాకపోకలు సాగిస్తుంటారు. జనగామ తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాగా ఏర్పడింది. ఇక్కడి నుంచి కూడా హైదరాబాద్కు రోజూ అనేక మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్థులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్లను ఆధునికీకరించాల్సిన అవసరం ఉంది. ఈ రెండు స్టేషన్లపై దృష్టి సారించాలి. రాయగిరి వరకు ఎంఎంటీఎస్ పనుల పొడిగింపుపై వినతి ఎంఎంటీఎస్ ను ఘట్ కేసర్ నుంచి రాయగిరి వరకు పొడిగించాల్సిన అవసరం చాలా ఉంది. ఎంఎటీఎస్ రెండోదశకు 2/3 వంతున పనులు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకుని ఏళ్లు గడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఆలస్యం కారణంగా ఇది కార్యరూపం దాల్చడం లేదు. కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి భాగస్వామ్యం లేకుండా వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభ్యర్థనపై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు.. కేంద్రమే మొత్తం ఖర్చు భరించి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనులు ప్రారంభించి పూర్తి చేసేలా చూస్తామని హామీ ఇచ్చారని,. భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్లను కూడా ఆధునికీకరస్తామని చెప్పారన్నారు. -
జనగామ ఎస్సై దంపతుల మృతి.. ఆత్మహత్యకు ముందు జరిగిందిదే!
సాక్షి, ఉమ్మడి వరంగల్: జనగామలో ఎస్సై శ్రీనివాస్ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తొలుత భార్య స్వరూప ఉరివేసుకొని చనిపోగా.. గంటల వ్యవధిలోనే ఎస్సై శ్రీనివాస్ కూడా తన సర్వీస్ రివాల్వర్లో కాల్చుకున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఇద్దరి ప్రాణాలు బలితీసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఒకేసారి దూరమవ్వడంతో పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తల్లిదండ్రుల మరణంపై కొడుకు రవితేజ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై విచారణ జరిపి, పోస్టుమార్టం అనంతరం అమ్మనాన్నల మృతదేహాలను అప్పగించాలని కోరారు. కొడుకు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆత్మహత్య చేసుకున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఎస్సై దంపతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దంపతులు ఆత్మహత్యపై పూర్తిస్థాయిలో విచారణ అనంతరం పూర్తి విషయాలు వెల్లడిస్తామని తెలిపారు. జనగామ ఎస్ఐ దంపతుల ఆత్మహత్యపై కొడుకు ఫిర్యాదు కాపీ అసలేం జరిగిందంటే ఎస్సై కాసర్ల శ్రీనివాస్ గత ఎనిమిదేళ్లుగా జనగామ పట్టణంలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు రవితేజకు ఇటీవలె వివాహమవ్వగా భార్యతో కలిసి హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ బేగంపేట్లో ఉంటున్నారు. ఎస్సై దంపతులిద్దరే జనగామలో నివాసముంటున్నారు. బుధవారం రాత్రి శ్రీనివాస్, స్వరూప మధ్య కుటుంబ, ఆర్థిక సంబంధిత విషయాలపై గొడవ జరిగింది. గురువారం తెల్లవారుజామున పాలు పోసే వ్యక్తి వచ్చి డోర్ కొట్టగా ఎవరూ తలుపు తీయలేదు. దీంతో ఇంటి పక్కన నివాసముండే వ్యక్తిని పిలిచి ఇద్దరు కలిసి ఇంటి వెనకున్న డోర్ దగ్గరకు వెళ్లగా బయట ఉన్న బాత్రూమ్లో వెంటిలేటర్ ఇనుపరాడ్కు స్వరూప తన చీరతో ఉరివేసుకొని ఉండటం చూశారు. వెంటనే వెనుక డోర్ ద్వారా ఇంట్లోకి వెళ్లి శ్రీనివాస్ను నిద్రలేపారు.. ఎస్సై బాత్రూమ్కి వెళ్లి చూసేసరికి భార్య విగతజీవిగా కనిపించింది. విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చి ఎస్సై శ్రీనివాస్ను పరామర్శించారు. అనంతరం ఎస్సై నివాసానికి ఏసీపీ దేవేందర్రెడ్డి, పట్టణ ఇన్ఛార్జ్ సీఐ నాగబాబు చేరుకుని పరిశీలించారు.భార్య మృతికి గల కారణాలను ఎస్సై శ్రీనివాస్ను ఉన్నతాధికారులు అడిగి తెలుసుకున్నారు. భార్య ఆత్మహత్య చేసుకోవడాన్ని తట్టుకోలేక మానసిక వేదనకు గురైన శ్రీనివాస్.. ఉదయం 10 గంటల సమయంలో వాష్రూమ్కు వెళ్తున్నానని చెప్పి వెళ్లి తుపాకీతో కాల్చుకున్నారు. ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినపడటంతో అప్పటికే ఇంట్లో ఉన్న ఏసీపీ, సీఐ బాత్రూమ్కి వెళ్లి చూడగా.. తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని రక్తపు మడుగులో శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయారు. గంటల వ్యవధిలో ఎస్సై దంపతులు మృతిచెందడంతో ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఎస్సై తుపాకీని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. -
జనగామ: ఎస్సై శ్రీనివాస్ దంపతుల ఆత్మహత్య , భార్య శవాన్ని చూస్తూ ఏడుస్తూ కాసేపటికే..
-
జనగామ: ఎస్సై శ్రీనివాస్ దంపతుల ఆత్మహత్య
సాక్షి, జనగామ: జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. జనగామ ఎస్సై శ్రీనివాస్ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీనివాస్ భార్య స్వరూప(45) ఈ ఉదయం ఉరి వేసుకుని చనిపోయారు. అది చూసి శ్రీనివాస్ కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే.. భార్య చనిపోయిందన్న మనస్థాపంతో కాసేపటికే శ్రీనివాస్ సైతం సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యలకు కారణమని తెలుస్తోంది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
జనగామ రూరల్: డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ సత్వరం వైద్యసేవలు అందించాలని కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య అన్నారు. శనివారం అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి వైద్యాధి కారులతో కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంసీహెచ్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పీహెచ్సీలు, సబ్ సెంటర్లలో వైద్యలు అందుబాటులో ఉండాలని, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నార్మల్ డెలివరీలను ప్రోత్సహించడంతో పాటు ఆధునిక వైద్య సేవల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. ఇప్పటికే వైద్యరంగంలో మెరుగైన సేవలందిస్తున్న జనగామ జిల్లా.. వివిధ పారామీటర్లలో ముందువరుసన ఉందని, డయాగ్నోస్టిక్ ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రజలు వైద్యం కోసం ప్రైవేటుకు వెళ్లకుండా ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, వైద్యులు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ స్థాయిలో డెలివరీల వివరాలు నమోదు చేయాలని, గర్భవతులకు ఐసీడీఎస్ ద్వారా ఇచ్చే న్యూట్రిషన్ కిట్టును అందరికీ అందించాలని చెప్పారు. సమీక్ష సమావేశంలో సూపరింటెండెంట్ సుగుణాకర్రాజు, డాక్టర్ సుఽధీర్కుమార్, అశోక్కుమార్, రవీందర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రుణాలు వెంటనే మంజూరు చేయాలి జనగామ రూరల్: ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం లబ్ధిదారులకు బ్యాంక్ రుణాలు వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్ శివలింగయ్య అన్నారు. శనివారం తన చాంబర్లో నిర్వహించిన టీఎస్ ఐ–పాస్ సమావేశంలో ఆయన మాట్లాడు తూ.. జిల్లాలో 12 యూనిట్లకు 21 దరఖాస్తులు రాగా 19 ఆమోదం పొందాయని, ఒకటి తిరస్కరించగా.. మరొకటి పురోగతిలో ఉందని పేర్కొన్నారు. సుమారు రూ.20 కోట్లతో 105 మంది లబ్ధిదారుల కు ఉపాధి అవకాశాలు అందుతాయని చెప్పారు. టి ప్రైడ్ పథకం ద్వారా ఎస్సీలకు 5, ఎస్టీలకు 18 వాహనాలు మంజూరు చేసినట్లు తెలిపారు. పీఎం ఎంప్లాయిమెంట్ జనరేషన్ స్కీం కింద 75 యూనిట్లకు 29 ఆమోదం పొందాయని, మిగతావి మార్చిలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఇండస్ట్రీస్ జనర ల్ మేనేజర్ రమేష్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీధర్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాదవ్, ఆర్టీ శ్రీనివాస్రావు, ఎస్సీ కార్పొరేషన్ ఏడీ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య -
కేసీఆర్ ఒక్క హామీ నెరవేర్చలేదు
స్టేషన్ఘన్పూర్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ను గద్దెనెక్కిన తర్వాత సీఎం కేసీఆర్ నెరవేర్చలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ‘ప్రజాగోస–బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా శనివారం డివిజన్ కేంద్రం శివాజీచౌక్ వద్ద తాళ్లపెల్లి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చాడా.. కేసీఆర్ కుటుంబంలో ఐదుగురికి ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. ఘన్పూర్లో మెగా లెదర్పార్కు, టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తే ఎందరికో ఉపాధి కలిగేదని పేర్కొన్నారు. ఇంటింటికీ భగీరథ నీరన్నాడు.. అడపా దడపా వచ్చేదీ మురికినీరే.. గ్రామాల్లో బెల్ట్షాపులు ఫుల్లుగా ఉన్నాయికానీ.. తాగునీరు అందడం లేదని విమర్శించారు. 18 ఏళ్ల వయస్సుపై వారికే ‘కంటివెలుగు’ నిర్వహించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీ దేశంలో మూడు కోట్ల మందికి ఇళ్లు అందించారు.. అందులో తెలంగాణకు 2.40 లక్షల ఇండ్లు ఇస్తే.. సీఎం అవినీతితో ఎవ్వరికీ ఇండ్లు అందించడం లేదన్నారు. గ్రామాల్లో ఇళ్లు, రోడ్లు, సాగునీరు, విద్యుత్, డ్రెయినేజీ తదితర సమస్యల్ని పరిష్కరించేందుకు కేసీఆర్ దగ్గర డబ్బులు ఉండవుకానీ.. లిక్కర్, పత్తాలు, డ్రగ్స్, భూమాఫియా, దొంగ, లంగ, లఫంగి పనులకు మాత్రం ఉంటాయని ఎద్దేవా చేశారు. దళితబంధు బీఆర్ఎస్ నేతలకు కమీషన్ల బంధుగా మారిందని, వారి అనుచరులు, బంధువులకే అందిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో బతుకులు బాగుపడాలంటే పేదల రాజ్యం రావాలని, బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువస్తే పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య, పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం, పక్కా ఇళ్లు అందిస్తామని, ఫసల్బీమాతో రైతులను ఆదుకుంటా మని బండి సంజయ్ హామీ ఇచ్చారు. అనంతరం జనగామకు చెందిన మాలతిరెడ్డితో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు బీజేపీలో చేరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ గుండె విజయరామారావు, జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి, ఇన్చార్జ్ పాపారావు, నాయకులు మాదాసు వెంకటేష్, బొజ్జపల్లి సుభాష్, కేవీఎల్ఎన్.రెడ్డి, ఉడుగుల రమేష్, వేముల అశోక్, విద్యాసాగర్రెడ్డి, ఐలోని అంజిరెడ్డి, ముక్కెర తిరుపతిరెడ్డి, బొక్క ప్రభాకర్, పవన్కుమార్, గట్టు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆయన కుటుంబంలోనే ఐదుగురికి ఉద్యోగాలు పేదల రాజ్యంతో బతుకులు మారతాయి ‘ప్రజాగోస–బీజేపీ భరోసా’లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ -
పరిశీలించి పరిష్కరిస్తాం..
ప్రశ్న: కుక్కలు, కోతులతో ఇబ్బంది పడుతున్నాం. పిల్లలను బయటకు పంపితే తోడు వెళ్లాల్సి వస్తోంది. కోతులు ఇళ్లలోకి దూరుతున్నాయి. బెదిరించినా వెంబడిస్తున్నాయి. అర్ధరాత్రి కుక్కలు అరుస్తుంటే నిద్ర పట్టడం లేదు. ● అశోక్, రైస్ మిల్లర్, గీతానగర్, కడారు ప్రవీణ్, ఎండీ.దస్తగిరి, మేకల సమ్మయ్య, చందు, రాములు, శ్రీనివాస్, రమేష్, సురేష్, కవిత, కూరపాటి శ్రీనివాస్, సంతోష్కుమార్, మహేష్, వెంకటరమణారెడ్డి, ఎండీ రఫిక్, సుచరిత, లక్ష్మీ– 1, 4, 7, 8, 11, 12, 14, 17, 26, 27 వార్డులు, వీర్స్కాలనీ, శ్రీ విల్లాస్, అంబేడ్కర్నగర్, వాసవీ కాలనీ, శ్రీహర్షనగర్ కమిషనర్ : 15 రోజుల్లో సమస్య పరిష్కరిస్తాం. ప్రశ్న: డ్రెయినేజీ నీరు ఇంటిముందే ఆగుతోంది. పందులు తిరుగుతున్నాయి. దోమలు పెరిగాయి. అవోపా బిల్డింగ్ ఏరియాలో సీసీరోడ్డు తవ్వి పూడ్చలేదు. ప్రమాదాలు జరుగుతున్నాయి. 17వ వార్డులో సీసీరోడ్లపై గుంతలు పడుతున్నాయి. 23వ వార్డులో కోతులు కరెంటు తీగలపై సర్కస్ ఫీట్లు చేస్తున్నాయి. హనుమకొండ రోడ్డు దేవీథియేటర్ ఆవరణ అపార్టు మెంటులో అద్దెకు ఉంటున్న వారు రోడ్డుపైనే చెత్త వేస్తున్నారు. ● పవన్కుమార్, క్రాంతి, అబ్బాస్, రేకల చంద్రమోహన్ గౌడ్, జాయ మంజుల, కనకరాజు, సయ్యద్ యాకూబ్, ఎ.నర్సింహులు, కృష్ణమూర్తి, స్వరూప, సయ్యద్ జాహంగీర్– 5, 13, 17, 19, 21, 23 వార్డులు బీరప్ప టెంపుల్, ఇందిరమ్మకాలనీ, ప్రగతినగర్, కుర్మవాడ, శ్రీహర్షనగ్ కాలనీ కమిషనర్ :అన్ని సమస్యలను పరిశీలిస్తాంజనగామ: పట్టణ ప్రజలు చెప్పే ప్రతి సమస్యను ఓపికగా వింటూ.. సమాధానం చెబుతూ.. ఇంకా ఏమైనా ఉన్నాయా అంటూ కాలనీ ల్లో నెలకొన్న ఇబ్బందులను తెలుసుకు నే ప్రయత్నం చేశారు మున్సిపల్ కమిషనర్ రజిత. కుక్కలు, కోతుల బెడద, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు తదితర సమస్యలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఫోన్ఇన్ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. ఉదయం 10.40 నుంచి 12.10 గంటల వరకు జరిగిన ఫోన్ఇన్లో కమిషనర్ 50 మందితో మాట్లాడగా.. మరో 265 కాల్స్ వచ్చాయి. కుక్కలు, కోతుల బెడద నియంత్రణకు చంపక్ హిల్స్ డంపింగ్ యార్డు వద్ద జంతు జనన నియంత్రణ సెంటర్ ప్రారంభిస్తున్నామని, 15 రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపిస్తామని కమిషనర్ చెప్పారు. అలాగే డ్రెయినేజీల నిర్వహణ, వీధిదీపాలు, తాగునీటి శుద్ధీకరణ, పారిశుద్ధ్య కార్మి కుల పని తీరు, కుళాయి కనెక్షన్లకు తవ్విన సీసీరోడ్డు మరమ్మతులు, శ్మశాన వాటికలు తదితరాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని పరిశీలించి ఒక్కొక్కటిగా పరిష్కారమయ్యేలా చూస్తామని అన్నారు. లకావత్ లాల్మా, 2వ వార్డు : రూ.లక్ష చెల్లించి ఇంటి అనుమతులు తీసుకున్నాం. డ్రెయినేజీ లేదు. ఇంటి ముందు మురికి నీరు ఆగితే పంచాయితీ అవుతోంది. కమిషనర్ : ఇంజనీరింగ్ అధికారులను పంపిస్తాం రవీందర్, 7వ వార్డు : డిగ్రీ కళాశాల ఏరియాలో 30 కుటుంబాలకు నల్లా కనెక్షన్ లేదు. వాటర్ పైపులైన్ వేయలేదు. కనెక్షన్కు అనుమతి తీసుకున్నా పట్టించుకోవడం లేదు. కమిషనర్ : తాగునీరు వచ్చేలా చేస్తాం రాజేష్, 6వ వార్డు, ఎండీ.సయ్యద్, హెడ్పోస్టాఫీసు ఏరియా : పోస్టాఫీసు ఆవరణలో దుమ్ము భరించ లేకపోతున్నాం. కొత్తగా నిర్మాణం చేస్తున్న రేడియాలజీ హబ్ భవనంతో డ్రెయినేజీలో చెత్త పేనుకుపోయి మురికి నీరు ఆగి కంపుకొడుతోంది. లక్ష్మణ్, వ్యాపారి : ఆర్టీసీ చౌరస్తా హనుమకొండ రోడ్డువైపు డ్రెయిన్లు నిండి దుర్వాసన వస్తున్నది. కేమిడి చంద్రశేఖర్, 15వ వార్డు అడ్వకేట్ : మురికి కాల్వలను రెగ్యులర్గా క్లీన్ చేయడంలేదు. ఒకేచోట మురికినీరు ఆగిపోతున్నది. కమిషనర్ : శుభ్రం చేయిస్తాం. సిరీష, బీరప్పగుడి ఏరియా : పాత ఇనుప సామాను వ్యాపారం చేసే వారు అన్నీ రోడ్డుపైనే వేస్తుండడంతో పందులు, కుక్కలు ఇక్కడే ఉంటున్నాయి. పిల్ల్లలను ట్యూషన్కు తీసుకువెళ్లే సమయంలో మీదకు వస్తున్నాయి. కమిషనర్ : భయపడకండి, సమస్య పరిష్కరిస్తాం మహ్మమద్ ఆసిఫ్, గిర్నిగడ్డ: ఆర్నెళ్ల నుంచి మోరీలు క్లీన్ చేయడం లేదు. నల్లా కనెక్షన్ కోసం సీసీరోడ్డు తవ్వి ట్యాప్ బిగించకుండా పోయారు. ఇంటి ఎదురుగా కుక్కలు పెంచుకుంటున్నారు. చిన్నారులను బెదిరిస్తున్నాయి. కమిషనర్ :సమస్యలకు పరిష్కారం చూపిస్తాం శ్రీధర్, 14వ వార్డు: హైమాస్ట్ లైట్ వెలుతురు రావడం లేదు. కాలనీలో రాత్రి చీకటిగా ఉంటోంది. ఆర్డీఓ కార్యాలయం వరకు పైపులైన్ కోసం తవ్వడంతో గర్భిణులు ఆస్పత్రికి వెళ్లే సమయంలో ఇబ్బందిగా ఉంది. అంకం రవీందర్, జనగామ : ప్రభుత్వ ఆస్పత్రి వద్ద హైమాస్ట్ లేక ఇబ్బందిగా ఉంది. కమిషనర్ :విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తాం. కొత్తపల్లి అభినాష్, 5వ వార్డు: కాలనీలో డ్రెయినేజీ లేదు. ఇందిరమ్మ ఇళ్లు సగం వరకు నిర్మించి వదిలేయడంతో అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. కమిషనర్ : ఇళ్ల విషయం రెవెన్యూ అధికారులకు చెబుతాం. కొత్త డ్రెయినేజీ కౌన్సిల్కు సూచిస్తాం. అంకిత, ఆస్పత్రి నిర్వాహకురాలు : హైదరాబాద్ రోడ్డు హౌసింగ్బోర్డు కాలనీ ఏరియా వేద ఆయుర్వే ద ఆస్పత్రి దారిలో వీధిదీపాలు, నూతన డ్రెయినే జీ, మిషన్ భగీరథ తాగునీటి సౌకర్యం కల్పించాలి. కమిషనర్ : స్ట్రీట్ లైట్లు వేసేందుకు పరిశీలిస్తాం. పట్టణానికి దూరంగా ఉంది కాబట్టి కొద్ది సమయం పడుతుంది. అప్పటి వరకు మురికి నీరు ఇంకడానికి గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. ఇల్లెందుల ప్రవీణ్, 9వ వార్డు: గిర్నిగడ్డ ప్రాంతంలోని మాంసం విక్రయదారులు వేస్టేజీని శ్మశాన వాటిక ప్రాంతంలో వేస్తున్నారు. అందులో 40 కుక్కలు తిరుగుతూ ప్రజలను భయపెడుతున్నాయి. కమిషనర్ :నియంత్రణ చర్యలు తీసుకుంటాం. సత్యవర్ధన్రెడ్డి, 4వ వార్డు : ఫుట్పాత్లపై చిరు వ్యాపారాలు నిర్వహిస్తుండడంతో వాహనాలను రోడ్డుపైనే పెట్టాల్సి వస్తున్న ది. దీంతో జరిమానా వేస్తున్నారు. కమిషనర్ : ఫుట్పాత్ వ్యాపారంపై తనిఖీలు చేస్తాం నాయిని సంతోష్, 5వ వార్డు, బాణాపురం : 15ఏళ్ల నుంచి శ్మశాన వాటిక లేదు. రంగప్ప చెరువు మత్తడి వద్ద అంతిమ సంస్కారం చేసేది. ఇప్పుడు వద్దంటున్నారు. నెహ్రూపార్కు వైకుంఠ ధామానికి తీసుకువెళ్తున్నాం. బాణాపురంలో శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలి. కమిషనర్ : సమయం పడుతుంది. తప్పకుండా ఏర్పాటు చేయిస్తాం సురేందర్రెడ్డి, 25వ వార్డు : నెహ్రూపార్కు నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు రోడ్డుపై దిష్టితీసిన నిమ్మకా యలు, గుమ్మడి కాయలు, మిర్చి, పసుపు, కుంకు మ వేస్తున్నారు. ఇబ్బందిగా ఉంది. కమిషనర్ : ప్రత్యేక డ్రైవ్ చేపడతాం కాసుల శ్రీనివాస్, శ్రీనగర్కాలనీ 22వ వార్డు : డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా ఉంది. దోమల నివారణ చర్యలు లేవు. చెత్త సేకరణకు మూడు రోజులకోసారి వస్తున్నారు. కుళాయిలకోసం తీసిన గుంతలు పూడ్చలేదు. కమిషనర్ :సమస్య పరిష్కరించేలా చూస్తాం. జహానా, అంబేడ్కర్నగర్ : ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మా ఇళ్లు ఉంది. వర్షాకాలంలో వరద నీరు ఇంటిని ముంచెత్తుతోంది. డ్రెయినేజీ చిన్నగా ఉండడంతో నీరు బయటకు వస్తున్నది. కమిషనర్ : పరిశీలిస్తాం శ్రీనివాస్, 4వ వార్డు, జ్యోతినగర్, సరిత, 3వ వార్డు : తాగునీరు పచ్చగా వస్తోంది. అదికూడా అరగంటకు ఒక బిందె నిండే పరిస్థితి లేదు. కోటిరత్నం ఆస్పత్రి వెనక పందుల సంచారం పెరిగింది. యజమానిని నిలదీసినా పట్టించుకోవడం లేదు. కమిషనర్ :తగిన చర్యలు తీసుకుంటాం మిద్దెపాక స్టాలిన్, 13వ వార్డు అంబేడ్కర్ సంఘం డివిజన్ ప్రెసిడెంట్ : నెహ్రూపార్కు ఏరియాలో ఫుట్పాత్ వ్యాపారం కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కోతుల బెడద నివారణకు తీసుకు వచ్చిన రెండు కొండెంగలు కనిపించడంలేదు. కమిషనర్ : ఫుట్పాత్ వ్యాపారంపై దృష్టి పెట్టాం బిర్రు రామలింగం, 12వ వార్డు : వీవర్స్కాలనీలోని అండర్ బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేసి, వినియోగంలోకి తేవాలి. కమిషనర్ : కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్తాం. ‘సాక్షి’ ఫోన్ఇన్లో మున్సిపల్ కమిషనర్ రజిత కుక్కల సమస్యకు 15 రోజుల్లో పరిష్కారం కోతుల నివారణకు చర్యలు డ్రెయినేజీ, పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక ఫోకస్ ప్రజలు చెప్పిన విషయాలను నోట్ చేసుకున్నాం