Lavanya Tripati
-
Lavanya Tripathi Konidela Photos: మెగా కోడలి లేటెస్ట్ పిక్స్ చూశారా? (ఫోటోలు)
-
విశాఖకు రానున్న లావణ్య త్రిపాఠి.. అందరికీ ఆహ్వానం అంటూ ప్రకటన
జాతీయ పరిశుభ్రత దినోత్సవ వేడుకలో భాగంగా ఈ నెల 28న విశాఖలో బీచ్ క్లీనింగ్ డ్రైవ్ చేపట్టనున్నారు 'మిస్ పర్ఫెక్ట్' టీమ్. ఈ మెగా క్లీనింగ్ డ్రైవ్నకు హీరోయిన్ లావణ్య త్రిపాఠి హాజరుకానున్నారు. వైఎంసీఏ బీచ్ వద్ద స్థానికులతో కలసి పరిశుభ్రం చేయనున్నారు. పరిశుభ్రత పట్ల నిబద్దత కలిగిన మహిళ పాత్రలో లావణ్య త్రిపాఠి 'మిస్ పర్ఫెక్ట్' అనే వెబ్ సిరీస్లో నటించారు. డిస్నీ హాట్ స్టార్లో ఫిబ్రవరి 2న ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ప్రమోషన్స్లో భాగంగా లావణ్య త్రిపాఠి జనవరి 28న ఉదయం 6గంటలకు విశాఖలోని వైఎంసీఏ బీచ్ వద్దకు రానుంది. ఈ ప్రోగ్రామ్లో పాల్గొనాలని అనుకునే వారందరూ కూడా ఆ సమయంలో అక్కడికి రావచ్చని మేకర్స్ ప్రకటించారు. 'మిస్ పర్ఫెక్ట్' వెబ్ సిరీస్లో లావణ్య త్రిపాఠి పోషించిన పాత్ర అందరినీ మెప్పిస్తుంది. ఈ సిరీస్లో పరిశుభ్రతకు మారుపేరుగా లావణ్య జీవితం ఉంటుంది. అంతే కాకుండా ఎంతో ఉల్లాసంగా ఉన్న ఆమె జీవితం ఊహించని మలుపు ఎలా తిరుగుతుంది అనేదే ఈ సిరీస్. ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేసే హాస్యభరితమైన పిల్లి- ఎలుక గేమ్లా ఉంటుంది. క్లీన్నెస్ డ్రైవ్ ఈవెంట్ జాతీయ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా లావణ్య విశాఖకు రానుంది. ఈ వెబ్ సిరీస్ను ,అందరినీ ఆకట్టుకుంటుందని డిస్నీ+ హాట్స్టార్ పేర్కొంది. అన్నపూర్ణ స్టూడియోస్ సహకారంతో, తెరకెక్కిన ఈ 'మిస్ పర్ఫెక్ట్' ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇందులో లవ్ స్టోరీతో పాటు మంచి కామెడీ కూడా ఉంటుంది. నవ్వులతో నిండిన ప్రపంచంలోకి మనోహరమైన ప్రయాణాన్ని అందిస్తుంది. పరిశుభ్రతకు అంబాసిడర్గా, లావణ్య త్రిపాఠి కనిపిస్తోంది. పర్యావరణ నిర్వహణ గురించి అందరిలో స్ఫూర్తిని నింపేందుకు ఆమె వైజాక్ రానుంది. దీంతో 28న విశాఖలో జరగనున్న బీచ్ క్లీన్ డ్రైవ్ కార్యక్రమంలో ఆమె పాల్గొననుంది. లావణ్యతో పాటు అభిజిత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాడు. -
అరవింద డిజైన్ స్టూడియోను ప్రారంభించిన లావణ్య త్రిపాఠి (ఫొటోలు)
-
చావు కబురు చల్లగా: అక్కడ డిజాస్టర్.. ఇక్కడ బ్లాక్బస్టర్
కరోనా కారణంగా ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ఫాం హావా నడుస్తోంది. ఇంట్లో కూర్చోనే ఎంచక్కా కొత్త సినిమాలన్ని చూసేయేచ్చు. అయితే బిగ్స్రీన్పై భారీ విజయం సాధించిన సినిమాలు ఓటీటీలో నిరాశపరుస్తుంటే.. డిజాస్టర్గా నిలిచిన సినిమాలు మాత్రం సూపర్ హిట్గా నిలుస్తున్నాయి. గత నెల మార్చి 2న విడుదలైన కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ మూవీ బిగ్స్రీన్పై అంతగా ఆకట్టుకోలేనప్పటికి.. నెట్ఫ్లిక్స్లో మాత్రం దుమ్మురేపుతోంది.ఓటీటీలో విడుదలైన కొద్ది రోజుల్లోనే మిలియన్ల వ్యూ కౌంట్ అందుకోని దక్షిణ భారత చిత్రాల రికార్డును బద్దలు కొట్టింది. తాజాగా హీరో కార్తికేయ, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠిలు హీరోహీరోయిన్లు వచ్చిన ‘చావు కబురు చల్లగా’ చిత్రం కూడా వైల్డ్ డాగ్ తరహాలో ఓటీటీలో దూసుకుపోతోంది. బాక్సాఫీసు వద్ద డిజాస్టర్గా నిలిచిన ఈ చిత్రం ఇటీవల ఆహా యాప్లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీని కాస్తా ఎడిట్ చేసి రిలీజ్ చేశారు. విడుదలైన 72 గంటల్లోనే అత్యధిక వేగంగా 100 మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్ అందుకున్నట్లు తాజాగా ఆహా స్పెషల్ పోస్టర్ను విడుదల చేసింది. దీంతో బిగ్స్రీన్పై నిరాశపరిచిన ఈ మూవీ.. స్మాల్స్క్రీన్పై బాక్సాఫీసు రేంజ్ హిట్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. థీయేటర్లో చూసిన వారు సైతం ఆహాలో ఈ మూవీని చూసేందుకు ఆసక్తిని చూపడం విశేషం. అంతేగాక ఈ మూవీని అద్భుతంగా రీఎడిట్ చేసి అందించారంటు పాజిటివ్ కామెంటు కూడా వస్తున్నాయి. కాగా కౌశిక్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమా విడుదలైన రోజు కొంత పాజిటివ్ టాక్ రాగా.. రెండవ రోజు నుంచి నెగిటివ్ టాక్ను తెచ్చుకుంది. అలాగే కోవిడ్ పరిస్థితులు కూడా ఈ సినిమాను దెబ్బ కొట్టాయి. మొత్తానికి ‘చావు కబురు చల్లగా’ బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని ఇచ్చింది. గీత ఆర్ట్స్ సంయుక్త బ్యానర్ జీఏ2(GA2) నుంచి వచ్చిన ఈ సినిమా భారీగా నష్టాలని మిగిల్చింది. 13.5 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్తో మార్కెట్లోకి వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా కేవలం 3.32 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. దాదాపు 10 కోట్ల వరకు నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. చదవండి: ఓటీటీకి మహర్దశ: కొత్తగా రిలీజయ్యే సినిమాలివే! అక్కడ ఓడినా ఇక్కడ రికార్డులు తిరగరాస్తున్న వైల్డ్ డాగ్ -
ఈ సినిమా చేయడం నా అదృష్టం
సందీప్ కిషన్, లావణ్యా త్రిపాఠీ జంటగా డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద ్, అభిషేక్ అగర్వాల్, సందీప్కిషన్ , దయా పన్నెం నిర్మించిన ‘ఏ1 ఎక్స్ప్రెస్’ నేడు రిలీజవుతోంది. సందీప్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దేశభక్తితో కూడిన స్పోర్ట్స్ సినిమాలను ఇండియన్స్ అందరూ చూస్తారు. అలాంటి ఓ కాన్సెప్ట్తో రూపొందిన చిత్రం ఇది. వరంగల్లో ఉండే రాకేష్ అనే వ్యక్తి కొంతమందికి హాకీ ట్రైనింగ్ ఇస్తున్నాడు. కానీ సరైన సౌకర్యాలు లేవు. వారికి కొంత ఆర్థిక సహాయం అందించడంతో పాటు సినిమా లాభాల్లో కొంత పిల్లల చదువు కోసం వినియోగిస్తాం’’ అన్నారు. ‘‘కథపై నమ్మకంతో మంచి ప్రయత్నం చేశాం’’ అన్నారు వివేక్ కూచిభొట్ల. -
సక్సెస్ అయితేనే మాట్లాడతారు: సందీప్ కిషన్
‘‘ఏ1 ఎక్స్ప్రెస్’ సినిమా తర్వాత హాకీ క్రీడను ఎక్కువమంది ఇష్టపడతారా? అంటే అది నేను చెప్పలేను. ‘చెక్ దే’ సినిమా తర్వాత హాకీ గురించి, ‘ఒక్కడు’ సినిమా తర్వాత కబడ్డీ గురించి, ‘సై’ సినిమా సమయంలో రగ్బీ గురించి చెప్పుకున్నారు. కానీ ‘ఏ1 ఎక్స్ప్రెస్’ సినిమా ద్వారా కొందరిలోనైనా ఓ ఆలోచన కలుగుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సందీప్ కిషన్ . డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్, లావణ్యా త్రిపాఠీ జంటగా రూపొందిన చిత్రం ‘ఏ1 ఎక్స్ప్రెస్’. టీవీ విశ్వప్రసాద్, దయా వన్నెం, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. సందీప్ కిషన్ చెప్పిన విశేషాలు... ► నా కెరీర్లో 25వ చిత్రం ఇది. కొత్త దర్శకులతోనే ఎక్కువ సినిమాలు చేశాను. కొత్త దర్శకుడు జీవన్ తో ఇలాంటి స్పోర్ట్స్ ఫిల్మ్ చేయడం రిస్క్ అనిపించలేదు. సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నాం. ► స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీ అంటే ఎక్కువ కష్టపడాలి. ఈ సినిమా కోసం ఆరు నెలలు శిక్షణ తీసుకున్నాను. హాకీ ప్లేయర్స్ బాడీ లాంగ్వేజ్, స్టైలిష్ లుక్స్ కోసం మ్యాచ్లు చూశాను. ► ఏ రంగంలోనైనా ప్రతిభకు, కష్టానికి ఒక్కోసారి విలువ, గుర్తింపు ఉండవు. సక్సెస్ అయితేనే మాట్లాడతారు. కానీ మన వంతుగా మనం వంద శాతం కష్టపడాలి. ప్రొడక్షన్స్ అనేది క్రియేటివ్ జాబ్. ప్రస్తుతం నా ప్రొడక్షన్ లో ‘వివాహ భోజనంబు’ సినిమా చేస్తున్నాం. ‘రౌడీ బేబీ’, మహేశ్ కోనేరు నిర్మాణంలో ఒక సినిమా, ఏకే ఎంటర్టైన్మెంట్స్లో మరో సినిమాలో పాత్రపోషణ చేస్తున్నాను. -
ఆ పాత్రలు చేసీ చేసీ బోర్ కొట్టింది
‘‘ఈ మధ్య కాలంలో నేనెక్కువ సినిమాలు కమిట్ కాలేదు. దానికి ముఖ్య కారణం ఆ పాత్రలన్నీ నేను గతంలో చేసినట్టుగా అనిపించడమే. రెగ్యులర్ పాత్రలు చేసీ చేసీ బోర్ కొట్టింది. ఏదైనా చాలెంజింగ్గా చేయాలనుకుంటున్న సమయంలో ‘ఏ1 ఎక్స్ప్రెస్’ నా వద్దకు వచ్చింది’’ అని లావణ్యా త్రిపాఠి అన్నారు. సందీప్ కిషన్, లావణ్యా త్రిపాఠి జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఏ1 ఎక్స్ప్రెస్’. డెన్నీస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం నిర్మించారు. ఈ సినిమా మార్చి 5న విడుదల కానున్న సందర్భంగా లావణ్యా త్రిపాఠి చెప్పిన విశేషాలు. – ఈ సినిమా పాయింట్ను ఒకసారి సందీప్ కిషన్ నాతో పంచుకున్నారు. చాలా ఎగ్జయిటింగ్గా అనిపించింది. ఇందులో నేను, సందీప్ ఇద్దరం హాకీ క్రీడాకారులుగా కనిపిస్తాం. తమిళ సినిమాకు ఇది రీమేక్ అయినా తెలుగు నేటివిటీకు తగ్గట్టు మార్పులు చేశారు. ఈ సినిమాలో నేను చేసిన పాత్ర నా నిజజీవితానికి దగ్గరగా అనిపించింది. పాత్రలోకి సులభంగా ఒదిగిపోయాను. హాకీ క్రీడాకారుల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో గమనించాను. శిక్షణ తీసుకున్నాను. పాత హకీ మ్యాచ్లు చూశాను. ► ఓ డైలాగ్ చెప్పి, ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెళ్లిపోయే పాత్రలు బోర్ కొట్టేశాయి. ఓ పాత్ర కోసం మానసికంగా, శారీరకంగా కష్టపడాలి అనిపించింది. అందుకే హాకీ బ్యాట్ తీసుకుని మైదానంలోకి అడుగుపెట్టాను. చెమటలు పట్టేలా శ్రమించా. ఈ పాత్ర నాకు చాలా సంతప్తినిచ్చింది. ∙హాకీ ప్లేయర్ పాత్ర కోసం ప్రత్యేకమైన కసరత్తులు ఏం చేయలేదు. ఫిట్నెస్ మీద ఎప్పుడూ దృష్టిపెడతాను. ఈ పాత్రకు తగ్గట్టు కొన్ని వర్కౌట్స్ చేశా. స్కూల్లో బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్ ఎక్కువగా ఆడేదాన్ని. స్కూల్లో హాకీ ఉండేది కాదు. కానీ ఈ సినిమా చేశాక స్కూల్స్లో హాకీని కూడా భాగం చేస్తే బావుంటుందనిపించింది. రాజకీయాల వల్ల ఎంత ప్రతిభ ఉన్న క్రీడాకారులైనా కొన్నిసార్లు నష్టపోతుంటారు అనే పాయింట్ని ఈ సినిమాలో చెప్పాం. ► సందీప్తో గతంలో ‘మాయవన్ ’ అనే సినిమా చేశా. తను మంచి కోస్టార్. షూటింగ్ చేస్తున్నప్పుడే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం కలిగింది. ► ఇంకొన్నేళ్ల పాటు సినిమాలే చేయాలనుకుంటున్నాను. ఓటీటీలో అప్పుడే చేయాలనుకోవడం లేదు. విలన్ గా యాక్ట్ చేయాలనుంది. అప్పుడే మన సామర్థ్యం తెలుస్తుంది. కొన్ని స్క్రిప్ట్లు విన్నాను. వాటి వివరాలు త్వరలోనే ప్రకటిస్తాను. -
కదిలే కాలాన్ని అడిగా...
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, లావణ్యా త్రిపాఠి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ సినిమాతో కౌశిక్ పెగళ్లపాటి దర్శకునిగా పరిచయమవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్పై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ‘కదిలే కాలాన్ని అడిగా..’ అంటూ సాగే రెండో పాటని ఈ నెల 23న విడుదల చేస్తున్నట్లు కార్తికేయ, లావణ్య ఉన్న ఓ పోస్టర్తో ప్రకటించారు. కౌశిక్ పెగళ్లపాటి మాట్లాడుతూ– ‘‘చావు కబురు చల్లగా’ చిత్రం టైటిల్, కార్తికేయ ‘బస్తి బాలరాజు’ ఫస్ట్ లుక్, క్యారెక్టర్ వీడియో, లావణ్య ఫస్ట్ లుక్, టీజర్ గ్లింప్స్, మైనేమ్ ఈజ్ రాజు.. అనే పాటకు అనూహ్య స్పందన లభించింది. మార్చి 19న ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజాయ్, కెమెరా: కరమ్ చావ్లా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: రాఘవ కరుటూరి, శరత్ చంద్ర నాయుడు. -
ఆకట్టుకుంటున్న ‘చావు కబురు చల్లగా’ టీజర్
‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ, ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠిలు జంటగా దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి రూపొందిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ చిత్రంలో కౌశిక్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్లుక్, టైటిల్కు ప్రేక్షకుల నుంచి అనుకొని రీతిలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజా టీజర్ విడుదల చేసింది. ‘మీ ఆస్పత్రి సిస్టర్’ అంటగా అని సాగే డైలాగ్తో ఈ టీజర్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ లావణ్య త్రిపాఠి వెంట పడుతూ తనని ఏడుపిస్తున్న కొన్ని సీన్లతో ఉన్న ఈ టీజర్తో దర్శకుడు యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కాగా అల్లు ఆరవింద్ గీతా ఆర్ట్స్-2 బ్యానర్లో బన్ని వాసు నిర్మిస్తున్న ‘చావు కబురు చల్లగా’ మూవీ వేసవిలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. -
‘అందాల రాక్షసి’ బర్త్డే.. చీర కట్టులో..
సాక్షి, హైదరాబాద్: ‘అందాల రాక్షసి’.. బ్యూటీ లావణ్య త్రిపాఠి నేడు 30వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. డిసెంబర్ 15 ఆమె బర్త్డే సందర్భంగా హీరో అల్లు శీరిష్తో పాటు ప్రముఖ నటీనటులు ఆమెకు బర్త్డే విషెష్ తెలుపుతున్నారు. అంతేగాక అభిమానుల నుంచి కూడా లావణ్యకు సోషల్ మీడియాలో బర్త్డే విషెస్ వెల్లువెత్తున్నాయి. కాగా అందాల రాక్షసితో టాలీవుడ్ వెండితెరపై మెరిసిన లావణ్య త్రిపాఠి ఆ తర్వాత స్టార్హీరోయిన్గా ఎదిగారు. Happy birthday Lavanya! Keep making faces and dont become normal. Have a great year ahead. All the best for A1 Express & CKC! @Itslavanya pic.twitter.com/YT1cjGsOdq — Allu Sirish (@AlluSirish) December 15, 2020 హీరో నాని, దర్శకుడు మారుతి కాంబినేషన్లో వచ్చిన ‘భలే భలే మాగాడివోయ్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘మన్మధుడు’ నాగార్జున అక్కినేని సరసన ‘సోగ్గాడే చిన్నినాయన’లో నటించి టాలీవుడ్లో అగ్రనటిగా రాణిస్తున్నారు. ఇక ఈ రోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా లావణ్య చీర కట్టులో మెరిసిపోతున్న కొన్ని హాట్ ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) -
మన యుద్ధం మనమే చేయాలి..
‘‘ఆడవాళ్లందర్లోనూ అన్యాయాన్ని ఎదిరించగల దుర్గాదేవి అవతారముంది. అది తెలుసుకుని, ఆ శక్తిని బయటకు తీస్తేనే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఎదుర్కోగలం’’ అంటున్నారు రాశీ ఖన్నా, లావణ్యా త్రిపాఠి, అదా శర్మా, మెహరీన్, నభా నటేశ్. సమాజంలో స్త్రీ నెగ్గుకురావాలంటే దుర్గాదేవిలా మారాల్సి ఉంటుందా? ఆడవాళ్లకు పలు సమస్యలు ఉంటాయి. అవకాశం వస్తే మీరు పూర్తిగా నిర్మూలించాలనుకునే సమస్య ఏంటి? చెడును ఎదుర్కోవడానికి మీరు దుర్గాదేవిలా మారిన సందర్భాలేమైనా? దసరా పండగ సెలబ్రేషన్ గురించి? వంటి ప్రశ్నలకు రాశీ, అదా, లావణ్య, మెహరీన్, నభా చెప్పిన అభిప్రాయాలు దసరా ప్రత్యేకం. హద్దు దాటితే సహించను – మెహరీన్ ► తన క్యారెక్టర్ని తక్కువ చేసినా, తన ఆత్మస్థైర్యాన్ని తగ్గించేలా ఉన్నా, అనవసరమైన నిందలకు గురైనా తప్పకుండా దుర్గాదేవిలా మారాల్సిందే. ఏం జరిగినా సరే ఒకరి క్యారెక్టర్ను తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు. ఆడవాళ్లను అగౌరవపర్చకూడదు. ► అసమానతను నిర్మూలించాలనుకుంటున్నాను. ఆడవాళ్లను బలహీనమైనవాళ్లలా చూస్తారెందుకో అర్థం కాదు. శారీరకంగా మగవాళ్ల అంత బలంగా ఆడవాళ్లు ఉండకపోవచ్చు. కానీ మానసికంగా ఆడవాళ్లు ఎంత బలవంతులో అందరికీ తెలుసు. శారీరకంగానూ మాకు వీలైనంతగా చేస్తూనే ఉంటాం. ఎంతో సమర్థవంతంగా ఇంటి పనిని, ప్రొఫెషనల్ పనిని బ్యాలెన్స్ చేయగలం. మల్టీటాస్క్ చేయగలం. స్త్రీ, పురుషులందరూ సమానమే అనే భావన పెంపొందించాలి అందరిలో. ► నేను చాలా సైలెంట్గా ఉంటాను. ఓపిక ఎక్కువ. నా పనేదో నేను చూసుకునే మనస్తత్వం. కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. ఆ లిమిట్ వరకూ నేను కామ్గా ఉంటాను. అన్యాయంగా ప్రవర్తించినా, అగౌరవపరిచినా అస్సలు సహించలేను. ఆ పరిస్థితిని చక్కబెట్టేందుకు నిలబడతాను. ► పండగ వస్తుందంటే నాకు భలే సంతోషమేస్తుంది. స్నేహితులు, బంధువులను కలవచ్చు. ప్రస్తుతం అందరం ఎప్పుడూ చూడని పరిస్థితుల్లో ఉన్నాం. ఎక్కువమందితో కలిసి పండగలు జరుపుకునే పరిస్థితిలో లేము. ఇలాంటి సమయాల్లో ఒకరికోసం ఒకరు నిలబడదాం. మన కళ్లు కూడా ఆయుధమే – అదా శర్మ ► ప్రతీ ఒక్కరిలోనూ దుర్గాదేవి ఉంటుంది. కానీ కొందరు తెలుసుకోగలుగుతారు. కొందరికి తెలియదు.. అంతే. మన లోపల శక్తి దాగి ఉంటుంది. సమయం, సందర్భం వచ్చినప్పుడు అదే బయటకు వస్తుంది. రావాలి కూడా. ► ఆడవాళ్లే ఆడవాళ్లకు శత్రువులు కావడం చూస్తుంటాం. ఒకరిని ఒకరు తక్కువ చేయడం తీసేయాలనుకుంటున్నాను. ఒక స్త్రీ మరో స్త్రీ కోసం నిలబడాలి. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ కలసి పైకి ఎదగాలి. ► చాలాసార్లు మారాను. కర్రను కూడా ఆయుధంగా చేసుకున్న సందర్భాలున్నాయి. కొన్నిసార్లు కళ్లను కూడా ఆయుధాలుగా మార్చుకోవచ్చు. ► దసరా పండగకి ఇంట్లోనే ఉంటున్నాను. ఇంటి ముందు రంగోలీ వేస్తాను. ఇంటిని పూలతో అలంకరిస్తాను. ఇష్టమైన వంటకాలు చేసుకుని తింటాము. అందుకే తొమ్మిది అవతారాలు – నభా నటేశ్ ► ప్రతి ఒక్కరికి తనలో ఉన్న ప్లస్, మైనస్ కచ్చితంగా తెలియాలి. వాళ్ల బలమేంటో తెలుసుకుని బలహీనతలను తొలగించుకోవటం కోసం ఫైట్ చెయ్యాలి. దుర్గాదేవి ప్రపంచంలోని అందరికీ సమానమే, అందరికీ అమ్మే. దుర్గాదేవి అంటే ప్రపంచానికే శక్తి. ఆమె తెచ్చిన విజయంతోనే ప్రపంచానికి వెలుగొచ్చింది. అందుకే ప్రతి ఒక్కరూ.. ముఖ్యంగా ఆడవాళ్లు ఏం చేయాలనుకుంటున్నారో, ఏం సాధించాలనుకుంటున్నారో తెలుసుకుని దానికోసం జీవితంలో కష్టపడాలి. దుర్గాదేవి చేసింది అదే. నాకు కావాల్సిందేంటో నాకు కచ్చితంగా తెలుసు, దానికోసం నేను అమ్మవారిలా ఫైట్ చేస్తాను. అదే నా బలం ఆనుకుంటాను. ► అమ్మవారు ఈ తొమ్మిది రోజుల్లో తొమ్మిది రూపాల్లో తను సాధించాలనుకున్నది సాధించింది. అందుకే ఈ తొమ్మిది రోజులూ అమ్మవారిని తొమ్మిది రకాలుగా తయారుచేసి ఎంతో భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో ఉంచి పూజ చేస్తారు. నేను పుట్టి పెరిగింది శృంగేరిలో. దేశంలోని శారదా శక్తి పీఠాల్లో అది కూడా ఒకటి. నవరాత్రి సమయంలో గుళ్లో అమ్మవారిని రోజుకో రూపంలో ప్రత్యేకంగా అలంకరిస్తారు. నేను ప్రతిరోజూ గుడికి వెళ్లి ఆ అలంకారాలను చూసి భక్తితో మొక్కుతాను. ఆ అమ్మవారి అలంకారాలు ఎంత అందంగా ఉంటాయో మాటల్లో చెప్పలేను. చిన్నప్పుడు అలా గుడికి వెళ్లి ఆడుకుంటూ సెలబ్రేషన్స్లో పిల్లలందరం పాల్గొనేవాళ్లం. ఇప్పుడు అవన్నీ గుర్తుకు వస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇప్పటికీ పండగలంటే నాకు చాలా శ్రద్ధ. వీలు కుదిరినంతవరకూ పూజలు చేస్తుంటాను. మన యుద్ధం మనమే చేయాలి – రాశీ ఖన్నా ► మనందరిలోనూ దుర్గాదేవి అవతారం ఉంటుంది. ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితుల్ని చూస్తుంటే ఒక్కోసారి ఆ అవతారాన్ని బయటకు తీస్తేనే బతకగలం అనిపిస్తుంది. ఎప్పుడూ అమాయకంగా కూర్చోలేం కదా. కలియుగంలో మన యుద్ధం మనమే చేయాలి. ► మానభంగం, లింగ వివక్ష అనేది సమాజంలో లేకుండా చేయాలన్నది నా కోరిక. మన ఇష్టమొచ్చినప్పుడు, ఇష్టమొచ్చిన బట్టలు వేసుకొని బయటకు వెళ్లడానికి ఎందుకు భయపడాలి? అబ్బాయిలకు చిన్నప్పటి నుంచే అమ్మాయిల్ని ఎలా గౌరవించాలో నేర్పుదాం. రేప్ కేసుల్లో దోషుల మీద ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలి. ఇప్పటికీ సమానత్వం కోసం పోరాడుతూనే ఉన్నాం. లింగ బేధాలు లేకుండా సమాన అవకాశాలు ఇవ్వగలగాలి? ► నా కోసం నేను నిలబడాల్సిన పరిస్థితులు కొన్ని వచ్చాయి. నిలబడ్డాను. మా ఇంట్లో నాకు చిన్నప్పటినుంచీ ‘నీకు కావాల్సిన దానికోసం నువ్వు ఫైట్ చేయ్’ అని చెబుతూ వచ్చారు. ఏదైనా ఇష్యూ వస్తే నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడటానికే ఇష్టపడతాను. ముసుగులో మాట్లాడటానికి ఇష్టపడను. నాకోసం నేను నిలబడాల్సి వస్తే కచ్చితంగా ధైర్యంగా నిలబడతాను. ► చిన్నప్పటి నుంచి ఫ్యామిలీతోనే జరుపుకునేదాన్ని. కానీ సినిమాల్లోకి వచ్చాక పండగలకు ఇంట్లో ఉండటం తక్కువైంది. షూటింగ్స్ హడావిడిలో ఉంటాం. చిన్నప్పుడు అమ్మానాన్నలతో కలసి రామ్లీలా చూడటానికి మా ఇంటి (ఢిల్లీ) దగ్గర ఉన్న గ్రౌండ్కి వెళ్లేదాన్ని. మాది చాలా పెద్ద కుటుంబం. పండగ వస్తే చాలు అందరం కలిసే వాళ్లం. పని వల్ల హైదరబాద్లోనే ఉండిపోతే ఇవన్నీ గుర్తొస్తుంటాయి. అదే నా సూపర్ పవర్ – లావణ్యా త్రిపాఠి ► ఈ భూమ్మీద పుట్టిన ప్రతి స్త్రీలో దుర్గా మాత ఉంటుంది. అందుకే ప్రతి స్త్రీలో శక్తి దాగుందని నేను నమ్ముతాను. మగపిల్లలు సూపర్హీరోస్ అయినట్లే అమ్మాయిలు అవసరమొచ్చినప్పుడు ధైర్యంగా ఉండగలరు. అలాగే తమ గొంతును ప్రపంచానికి గట్టిగా వినిపించగలరు. తన అనుకున్నవారి కోసం నిలబడి ఫైట్ చేయగలరు. మనం చేయాల్సిందల్లా ఆడపిల్లలపై నమ్మకాన్ని ఉంచటం అంతే. నేను వ్యక్తిగతంగా దుర్గామాతను నమ్ముతాను, నన్ను నేను దుర్గగా అనుకుంటాను. దుర్గ అంటే కోపం, భయం, ప్రేమ మాత్రమే కాదు ఆలోచనాపరమైన శక్తిని ఇస్తుంది. ప్రతి ఒక్కరి గురించి ఆమె ఆలోచిస్తుందని నాకు అనిపిస్తుంది. ► మనకొచ్చే ప్రతి సమస్యకు కోపం పరిష్కారం కాదు. స్త్రీ అనే కాదు ప్రతి ఒక్కరూ యాంగర్ మేనేజ్మెంట్ చేయాలి. నేను చాలా కామ్గా, కూల్గా ఉంటాను. ఎంత కష్టమైన పరిస్థితులు వచ్చినా కూడా నెమ్మదిగా ఉంటాను. పరిష్కరించుకుంటాను కూడా. అదే నా సూపర్పవర్. నా కోపాన్ని ఎప్పుడూ నేను కంట్రోల్లో పెట్టుకుంటాను. ► మా ఇంట్లో చిన్నపిల్లలకు పండగ విశేషాలు చెప్పడం నా అలవాటు. నేను నా మేనకోడలికి కొంచెం క్రియేటివ్గా స్కెచ్తో బొమ్మలేసి, రాక్షస సంహారం ఎందుకు జరిగింది? దసరా పండగ ఎందుకు చేసుకుంటాం? అనే విషయాలు చెప్పాను. రాక్షసునిపై సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి చేసుకుంటాం అని చెప్పాను. అలా చెప్తేనే కదా మన సంస్కృతి సంప్రదాయాలు వృద్ధి చెందుతాయి. -
బాలరాజు.. ‘మల్లిక’ వచ్చేసింది
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ యువ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ సినిమాలో కార్తికేయ ‘బస్తీ బాలరాజు’ పాత్రలో కనపించనున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను శనివారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. హీరోయిన్గా నటిస్తున్న లావణ్య త్రిపాఠి సంబంధించిన పాత్రను పరిచయం చేసింది. లావణ్య ఇందులో ‘ మల్లిక’ పాత్రలో కనిపించనున్నారు. ఫప్ట్ లుక్ పోస్టర్ను లావణ్య తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘చావు కబురు చల్లగా’ మూవీలో ఇదే నా ఫస్ట్ లుక్’ అంటూ కాప్షన్ జత చేశారు. నీలం రంగు చుడీదార్ ధరించి ఉన్న ఈ కొత్త లుక్లో లావణ్య నెటిజన్లను ఆకట్టుకున్నారు. ఇప్పటికే కార్తికేయ ‘బస్తీ బాలరాజు’ ఫస్ట్ లుక్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు అల్లు అరవింద్ బ్యానర్ గీతా ఆర్ట్స్పై బన్నీ వాసు నిర్మాతగా వ్యహరిస్తున్నారు. నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్నారు. This character is ❤️ https://t.co/YMv5bj1PEk — LAVANYA (@Itslavanya) October 24, 2020 -
‘చావు కబురు చల్లగా’ ఫస్ట్ లుక్కు విశేష స్పందన
టాలీవుడ్ యువ నటుడు కార్తికేయ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ రోజుతో అతడు 29వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. దీంతో అటు సినీ ప్రముఖుల నుంచి, ఇటు అభిమానుల నుంచి కార్తికేయకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వరుణ్ తేజ్, మంచు లక్ష్మీ, అనుప్ రూబెన్స్, ప్రియదర్శి, గీతా అర్ట్స్, బ్రహ్మజీ, లావణ్య త్రిపాఠి వంటి నటులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ రోజు కార్తికేయ తన పుట్టిన రోజుతో పాటు మరో శుభవార్తను అభిమానులకు అందించారు. (ఎన్ఐఏ ఆఫీసర్) కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ సినిమా నుంచి నేడు ఫస్ట్ గ్లిమ్స్ను విడుదల చేశారు. హీరో కార్తికేయ పోషించిన ‘బస్తీ బాలరాజు’ ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఈ వీడియోలో కార్తికేయ గెటప్, యాస, డైలాగ్ డెలవరి బాగుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది. అలాగే దీనిని చూస్తుంటే కార్తికేయ గత చిత్రాలకు ఈ సినిమా పూర్తి భిన్నంగా వుండబోతుందని అర్థమవుతోంది. (మరోసారి ప్లాస్మా దానం చేసిన కీరవాణి) ఈ సినిమాను అల్లు అరవింద్ బ్యానర్ గీతా ఆర్ట్స్పై బన్నీ వాసు నిర్మాతగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్నారు. నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ నెల 21న కార్తికేయ బర్త్డే సందర్బంగా సోషల్ మీడియా వేదికగా గీతా ఆర్ట్స్ వారు కార్తికేయ ని ఏం వరం కావాలో కోరుకోమని సెప్టెంబర్ 17న అన్నారు. దానికి కార్తికేయ నాకు టీజర్ విడుదల చేయమని అడిగాడు. దీంతో వెంటనే దర్శకుడు సర్ప్రైజ్ అంటూ ఎనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు 11.47 నిమిషాలకి విడుదల చేసిన ఈ విడియో చూసిన నెటిజన్లు నిజంగా సర్ప్రైజ్ అయ్యారు. -
చావు కబురు చల్లగా
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించనున్న చిత్రం ‘చావుకబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సమర్పణలో జిఏ2 పతాకంపై ‘బన్ని’ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం ప్రారంభమైంది. మొదటి సన్నివేశానికి హీరో అల్లు అర్జున్ కుమారుడు అల్లు ఆయాన్ కెమెరా స్విచ్చాన్ చేయగా, అల్లు అరవింద్ మనమరాలు బేబి అన్విత క్లాప్ ఇచ్చింది. ఈ సన్నివేశానికి అల్లు అరవింద్ దర్శకత్వం వహించారు. ‘‘ఈ చిత్రంలో కార్తికేయ బస్తి బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ నెల 19న రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఆమని, శ్రీకాంత్ అయ్యంగర్, మహేష్, భద్రం తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: సునీల్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాఘవ కరుటూరి. -
స్ట్రైకింగ్కి సిద్ధం
హాకీ స్టిక్ పట్టుకొని గ్రౌండ్లో సిద్ధంగా ఉన్నారు లావణ్యా రావ్. బాల్ రావడం ఆలస్యం నేరుగా గోల్ కొట్టాలని వెయిట్ చేస్తున్నారు. తన గేమ్ని చూడటానికి కొంచెం టైమ్ ఉంది. సందీప్ కిషన్, లావణ్యా త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఏ1 ఎక్స్ప్రెస్’. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం నిర్మిస్తున్నారు. హాకీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సందీప్, లావణ్య హాకీ క్రీడా కారులుగా కనిపిస్తారు. ఆదివారం లావణ్య త్రిపాఠి పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాలో తన లుక్ను రిలీజ్ చేశారు. ‘‘లావణ్య రావ్ అనే హాకీ ప్లేయర్ పాత్ర చేయడం చాలా సంతోషంగా, ఎగ్జయి టింగ్గా ఉంది. ఈ పాత్ర నా కెరీర్లో స్పెషల్గా ఉండబోతోంది’’ అన్నారు లావణ్య. ఈ చిత్రానికి సంగీతం: హిప్ హాప్ తమిళ, సహ–నిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
ఈ విజయానికి మూడు ప్రధాన కారణాలు
‘‘మా సినిమాకు హెల్ప్ చేయడానికి దేవుడిలా వచ్చిన చిరంజీవిగారు, ప్రేక్షకుల మౌత్ టాక్, మీడియా సపోర్ట్... మా ‘అర్జున్ సురవరం’ చిత్రం విజయం సాధించడానికి ఈ మూడు ప్రధాన కారణాలు’’ అని అన్నారు నిఖిల్. టి. సంతోష్ దర్శకత్వంలో నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా బి.మధు సమర్పణలో రాజ్ కుమార్ ఆకెళ్ల నిర్మించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. నవంబరు 29న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో నిఖిల్ మాట్లాడుతూ–‘‘మా సినిమాను నమ్మి, ప్రమోట్ చేసిన నిర్మాతలకు ధన్యవాదాలు. నటనలోనే కాదు.. ప్రమోషన్స్లోనూ కోపరేట్ చేసిన లావణ్యాత్రిపాఠికి ధన్యవాదాలు’’ అని అన్నారు. ‘‘ఎంతో కష్టపడ్డాం. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఫైనల్గా విజయం సాధించాం. సంతోషంగా ఉంది. ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు సంతోష్. ‘‘మోసం విశ్వవ్యాప్తమైనప్పుడు నిజం చెప్పడం విప్లవాత్మకమైన చర్య అని జార్జ్ ఆర్వెల్ చెప్పిన కొటేషన్ ఈ సినిమాకు స్ఫూర్తి’’ అన్నారు రాజ్కుమార్. ఇంతటి ఘనవిజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు లావణ్యా త్రిపాఠి. ‘‘అనుక్షణం సినిమా గురించి ఆలోచించే వ్యక్తి నిఖిల్. తనను చూసి చాలా నేర్చుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద విజయం సాధించడం హ్యాపీ’’ అన్నారు నటుడు రాజ్ తరుణ్. నిర్మాతలు ‘ఠాగూర్’ మధు, సుధాకర్ రెడ్డి, ఏషియన్ సునీల్, అభిషేక్ అగర్వాల్ నటీనటులు సత్య, కేదార్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
మా ప్రేమ పుట్టింది ముంబైలో
‘‘నేను మోడలింగ్ నుంచి వచ్చాను. అందుకే ప్రతి సినిమాలో స్టయిలిష్గా కనిపిస్తాను. అది నా నటనలోనూ కనిపించేలా చూసుకోవడం నా బాధ్యత’’ అన్నారు నటుడు తరుణ్ రాజ్ అరోరా. నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టి.సంతోష్ తెరకెక్కించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. ‘ఠాగూర్’ మధు సమర్పణలో రాజ్కుమార్ ఆకెళ్ల నిర్మించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాలో విలన్గా నటించిన తరుణ్ రాజ్ అరోరా మాట్లాడుతూ – ‘‘అస్సామ్లో పుట్టాను. చెన్నైలో చదువుకున్నాను. బెంగళూర్లో మోడలింగ్ చేశా. సౌత్తో నాకు మంచి అనుబంధం ఉంది. హిందీలో ఎక్కువ సినిమాలు చేసినా నన్ను సౌత్ యాక్టర్గా గుర్తిస్తున్నారు. ‘అర్జున్ సురవరం’ ఒరిజినల్ చిత్రం ‘కణిదన్’లో నేనే నటించాను. తెలుగు వెర్షన్లో సెంటిమెంట్ యాడ్ చేశారు. చూసినవాళ్లందరూ సినిమా బావుంది అంటున్నారు. భావం, భావోద్వేగాలు ఎక్కడైనా ఒక్కటే. నటనకి భాషతో సంబంధం లేదు. ప్రస్తుతం హిందీలో ‘లక్ష్మీ బాంబ్, మలయాళంలో ‘మామాంగం’, తమిళంలో ‘దగాల్తీ’ సినిమాలు చేస్తున్నాను. నా భార్య అంజలా జవేరి నేను చేసిన సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తుంది. మేమిద్దరం ముంబైలో ప్రేమలో పడ్డాం. ముందు నేనే తనకి ప్రపోజ్ చేశాను. కావాలనే పిల్లలు వద్దనుకున్నాం. మేం ఒకరినొకరం పిల్లలుగా చూసుకుంటాం’’ అన్నారు. -
డైరెక్టర్ కాకుంటే రిపోర్టర్ అయ్యేవాణ్ణి
‘‘ఇతర ఇండస్ట్రీ ప్రేక్షకులతో పోల్చినప్పుడు తెలుగు ప్రేక్షకులు భావోద్వేగభరిత అంశాలను ఇష్టపడతారు. మంచి సినిమాలను బాగా ప్రోత్సహిస్తారు. కంటెంట్ ఉన్న సినిమాలకు మంచి కలెక్షన్స్ వస్తాయి. కన్నడ ఇండస్ట్రీలో నాకు అవకాశం వచ్చినప్పటికీ నేను వదలుకున్నాను. తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం’’ అని టి. సంతోష్ అన్నారు. నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టి. సంతోష్ దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు సమర్పణలో రాజ్కుమార్ ఆకెళ్ల నిర్మించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. గత శుక్రవారం (నవంబరు 29) విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా టి. సంతోష్ చెప్పిన విశేషాలు... ► ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘సెవెన్త్ సెన్స్, తుపాకీ’ సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేశాను. ఆ తర్వాత ‘కణిదన్’ సినిమాకి దర్శకత్వం వహించాను. ఈ సినిమాను చూసి మురుగదాస్గారు మెచ్చుకున్నారు.. తెలుగు రీమేక్ అవకాశం వస్తే వదులుకోవద్దన్నారు. ► ‘కణిదన్’ సినిమా చూసిన నిఖిల్..నిర్మాత థానుగారి ద్వారా నన్ను సంప్రదించారు. ► నిఖిల్ అంకితభావం ఉన్న నటుడు. ఈ పాత్ర కోసం బరువు పెరిగారు. తెలుగు స్క్రిప్ట్పై వర్క్ చేశాం కాబట్టే అవుట్పుట్ బాగా వచ్చిందనిపిస్తోంది. తమిళ వెర్షన్ కన్నా, తెలుగు వెర్షన్లోనే ఎక్కువ ఎమోషన్స్ను జోడిస్తే వర్కౌట్ అయ్యింది.. టీమ్ అందరూ సహకరించారు. ఈ సినిమా విడుదల ఆలస్యం కావడం బాధించింది. ► నేను డైరెక్టర్ని కాకపోయి ఉంటే రిపోర్ట్ని అయ్యి ఉండేవాణ్ణి. అందుకే జర్నలిజం నేపథ్యంలో ‘కణిదన్’లాంటి కథ రాసుకున్నాను. భవిష్యత్లో సీక్వెల్ గురించి ఆలోచిస్తా. నా తర్వాతి చిత్రం గురించి త్వరలో వెల్లడిస్తా. -
ఇది సినిమా కాదు.. ఒక అనుభవం
‘‘ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లో ‘అర్జున్ సురవరం’ హాట్ టాపిక్ అయింది. ఈ సినిమా చేస్తున్నప్పుడు నేను, మా డైరెక్టర్ సంతోష్ వాదించుకునేవాళ్లం. ఈ సక్సెస్ తనదే. ఈ విజయం నా ముఖంలో నవ్వు తెచ్చింది’’ అని నిఖిల్ అన్నారు. టి. సంతోష్ దర్శకత్వంలో నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. ‘ఠాగూర్’ మధు సమర్పణలో రాజ్కుమార్ ఆకెళ్ల నిర్మించారు. తమిళ చిత్రం ‘కణిదన్’కి తెలుగు రీమేక్గా ఈ సినిమా రూపొందింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా సక్సెస్ మీట్ను శనివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా తొలి రోజు 4.1 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. ‘అర్జున్ సురవరం’ సినిమా కాదు.. ఒక అనుభవం. మీడియా పవర్ చూపించే సినిమా. ఈ సినిమా వల్ల మా టీమ్ అందరం గౌరవం పొందుతున్నాం. సినిమా కొన్న బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. అల్లు అరవింద్గారు పర్సనల్గా అభినందించారు. చిరంజీవిగారికి స్పెషల్ థ్యాంక్స్. రిలీజ్లు వాయిదా పడి హిట్ కొట్టిన సినిమాలు తక్కువ. మేం హిట్ సాధించాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా చేయడానికి మా టీమ్ అందరం చాలా కష్టపడ్డాం. ఇంతమంచి సక్సెస్ అందించిన ఆడియన్స్కి థ్యాంక్స్. మా సినిమాను చూసి అభినందించిన చిరంజీవిగారికి ధన్యవాదాలు’’ అన్నారు రాజ్కుమార్ ఆకెళ్ల. ‘‘నేను రాసిన ప్రతీ సీన్ను తన నటనతో అద్భుతంగా ఎలివేట్ చేశాడు నిఖిల్. ‘ఠాగూర్’ మధు, రాజ్కుమార్గారికి థ్యాంక్స్’’ అన్నారు టి. సంతోష్. ‘‘పరీక్షలు రాసి చాలా రోజులు ఎదురు చూశాం. ఫైనల్గా ప్రేక్షకులు పాస్ అన్నారు. చాలా సంతోషం’’ అన్నారు నాగినీడు. ‘‘అనుకున్నదానికంటే ప్రేక్షకులు ఎక్కువ రెస్పాన్స్ అందించారు. దర్శకుడు చాలా కష్టపడ్డారు’’ అన్నారు లావణ్యా త్రిపాఠి. -
నిద్ర లేని రాత్రులు గడిపాను
‘‘నేను ఇప్పటివరకూ 17 సినిమాల్లో నటించా. సినిమా విడుదల విషయంలో ఎప్పుడూ ఇబ్బందులు రాలేదు. ‘కార్తికేయ, స్వామిరారా’ సినిమాల విడుదలకు కాస్త ఆలస్యం అయింది.. అంతే. ‘అర్జున్ సురవరం’ సినిమా ఈ ఏడాది మే 1న విడుదల కావాల్సింది. కానీ, కొందరివల్ల విడుదల కాలేదు. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా? లేదా? అనే భయం వేసింది. ఇంటికెళ్లి ఏడ్చాను.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను’’ అన్నారు నిఖిల్. టి. సంతోష్ దర్శకత్వంలో నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా తెరకెక్కిన చిత్రం ‘అర్జున్ సురవరం’. ‘ఠాగూర్’ మధు సమర్పణలో రాజ్కుమార్ ఆకెళ్ల నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిఖిల్ చెప్పిన విశేషాలు. ► మా సినిమా బిజినెస్ బాగా జరిగింది. కానీ, నిర్మాతలకు, థియేటర్స్ ఓనర్స్కి మధ్య ఉండేవారు మా సినిమాని వాడేసుకున్నారు. ఈ విషయంలో నేను, నిర్మాతలు ఏమీ చేయలేకపోయాం. సమస్యలన్నీ పరిష్కరించేందుకు సమయం పట్టింది. అందుకే నేను కూడా నా పారితోషికంలో 50 శాతం మాత్రమే తీసుకున్నా. ఈ సినిమాకి లాభాలొస్తే నిర్మాతలే నాకు ఇస్తారు. ► ‘అర్జున్ సురవరం’లో నిజాయతీ కలిగిన అర్జున్ అనే జర్నలిస్ట్ పాత్ర చేశా. నేను, లావణ్య, ‘వెన్నెల’ కిషోర్, సత్య ఓ యంగ్ టీమ్. అనుకోకుండా ఓ సమస్యలో ఇరుక్కునే మేం దాన్ని ఎలా పరిష్కరించామన్నదే ఈ చిత్రకథ. సమాజానికి సందేశంతో పాటు క్రైమ్ థ్రిల్లర్గా ఈ సినిమా ఉంటుంది. కొందరి చర్యల వల్ల గ్రాడ్యుయేట్స్, వారిపై ఆధారపడ్డ తల్లిదండ్రులు ఎలా ఇబ్బందులు పడుతున్నారనే విషయాలు చెప్పాం. ఈ చిత్రం తమిళ సినిమాకి రీమేక్ అయినా కొన్ని మార్పులు చేశాం. ► ముందు మా చిత్రానికి ‘ముద్ర’ అని టైటిల్ అనుకున్నాం. అదే టైటిల్తో వేరే సినిమా విడుదలవుతోందని తెలిసి, మార్చాం. ఈ చిత్రంలో నా పేరు అర్జున్. సురవరం ప్రతాపరెడ్డిగారు ప్రముఖ జర్నలిస్ట్. ఆయన స్ఫూర్తితో సురవరం అనే పేరు తీసుకుని ‘అర్జున్ సురవరం’ అని పెట్టాం. ఈ టైటిల్కి జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. దర్శకుడు టి. సంతోష్ ఓ రాక్షసుడు. కొన్ని సీన్స్ని 30 నుంచి 40 టేక్లు కూడా చేశారు. అందుకే కొంచెం బడ్జెట్ కూడా ఎక్కువ అయింది. వాళ్ల నాన్నగారు జర్నలిస్టు. అందుకే ఆయనకు జర్నలిజంపై మంచి అవగాహన ఉంది. ► నేను నాలుగో తరగతి చదువుతున్నప్పుడు హరిహర కళాభవన్లో స్కూల్ చిల్డ్రన్ కల్చరల్ ప్రోగ్రామ్కి చిరంజీవిగారు వచ్చారు. అప్పటికే చాలా సమయం కావడంతో నా ప్రదర్శన చూడకుండానే ఆయన వెళ్లిపోయారు. ఆయన నా డ్యాన్సులు చూసి ఉంటే నన్ను సినిమాల్లోకి తీసుకెళతారేమో అనుకునేవాణ్ణి (నవ్వుతూ). ► రోజుకు పది నుంచి పదిహేను కథలు వింటున్నాను. అలాగని ప్రతి సినిమా చేసుకుంటూ వెళ్లలేను కదా? ‘హ్యాపీడేస్’ సినిమా చేసే ముందే మా అమ్మగారు ‘కుటుంబమంతా కలిసి చూసేలా నీ సినిమాలు ఉండాలి.. లేదంటే ఇంటి నుంచి బయటికి వెళ్లిపో’ అన్నారు. అందుకే అలాంటి మంచి కథలు ఎంచుకుంటున్నాను. ► ‘కార్తికేయ 2’ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెం బరులో ప్రారంభమవుతుంది. వీఐ ఆనంద్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఓ సినిమా చేయబోతున్నా. ‘శ్వాస’ సినిమా ఆగిపోవడానికి కారణం డైరెక్షన్ టీమే. నాకు చెప్పిన కథ ఒకటి.. తీస్తోంది మరొకటి. అందుకే చేయకూడదనుకున్నా. అయితే ఆ సినిమాకి ఇచ్చిన అడ్వాన్స్ని నిర్మాతలు వెనక్కి తీసుకోకపోవడంతో వారితో ‘హనుమాన్’ అనే సినిమా చేసేందుకు ఒప్పుకున్నా. -
‘అర్జున్ సురవరం’గా రాబోతోన్న నిఖిల్!
టైటిల్పై జరిగిన పోరులో హీరో నిఖిల్ కాస్త వెనక్కితగ్గి.. తన తదుపరి చిత్రం పేరును మార్చేశాడు. నిర్మాత నట్టికుమార్.. హీరో నిఖిల్పై అసహనం వ్యక్తం చేయడం.. ఇద్దరి మధ్య ఈ గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో.. ‘ముద్ర’ టైటిల్ను వదులుకొన్నాడు. తాజాగా తన చిత్రానికి సంబంధించిన కొత్త టైటిల్ను, ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఈ మూవీలో జర్నలిస్ట్గా నటిస్తున్న నిఖిల్ పాత్ర పేరు అర్జున్ సురవరం కావడంతో.. దీన్నే టైటిల్గా ఫిక్స్ చేశారు. సోషల్ మీడియాలో టైటిల్ను సూచించమని తన అభిమానులను కోరగా.. కొంతమంది ఈ టైటిల్ను కూడా సూచించారు. మొత్తానికి ముద్ర నుంచి తప్పించుకున్న నిఖిల్ ‘అర్జున్ సురవరం’ గా రాబోతున్నాడు. టీఎన్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళ హిట్ మూవీ కణితన్కు రీమేక్గా ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. మార్చిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. #ArjunSuravaram#FreshPoster is here Coming to Theatres this March 29th. Plz Do spread the Word 😀🙏 pic.twitter.com/hsUwx5QvJx — Nikhil Siddhartha (@actor_Nikhil) February 4, 2019 -
నిఖిల్ మూవీ టైటిల్ మారనుందా?
నిఖిల్ తాజాగా నటిస్తున్న సినిమా టైటిల్పై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిర్మాత నట్టి కుమార్, హీరో నిఖిల్ మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో.. ఈ సినిమా టైటిల్ మారనుందని తెలుస్తోంది. జగపతి బాబు హీరోగా ముద్ర అనే సినిమా కూడా రిలీజ్ కావడం.. ఈ సినిమాపై సోషల్ మీడియాలో నిఖిల్ను తన అభిమానులు ప్రశ్నించడం.. ఆ సమయంలో నిఖిల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ వ్యాఖ్యలపై నిర్మాత నట్టికుమార్ సీరియస్ అవ్వడంతో తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో వెనక్కి తగ్గిన చిత్రబృందం నిఖిల్ నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ను మార్చబోతున్నట్లు సమాచారం. కొత్త టైటిల్, ఫస్ట్లుక్ను రేపు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. తమిళంలో హిట్ అయిన కణితన్కు రీమేకే ఈ చిత్రం. ఈ మూవీలో లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తుంది. మార్చిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్రయత్నిస్తోంది. -
ఆ అదృష్టం కలిసివస్తుందని ఆశిస్తున్న హీరో!
స్వామిరారా.. కార్తీకేయ.. ఎక్కడికి పోతావు చిన్నవాడ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్తో సినిమాలు చేస్తూ.. సక్సెస్ సాధించాడు యంగ్ హీరో నిఖిల్. రీసెంట్గా కన్నడ రీమేక్ కిరాక్ పార్టీతో వచ్చి ప్రేక్షకులను నిరాశపరిచాడు. అయితే తాజాగా ‘ముద్ర’ తమిళ రీమేక్ (కనితన్)తో మరోసారి ప్రేక్షకులను పలకరించేందకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం షూటింగ్, డబ్బింగ్ పనులతో బిజీగా ఉన్న నిఖిల్.. ఈ చిత్రం గురించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో నిఖిల్కు జోడిగా లావణ్య త్రిపాఠి నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో వెన్నెల కిషోర్ కూడా ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ‘వీరిద్దరు కలిసి చేసిన భలేభలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా బ్లాక్ బస్టర్హిట్స్ అయ్యాయి. మళ్లీ ‘ముద్ర’లో కూడా వీరిద్దరు నటిస్తున్నారు. అదే అదృష్టం మళ్లీ కలిసివస్తుందని ఆశిస్తున్నా’ అంటూ నిఖిల్ ట్వీట్ చేశాడు. Todays shoot #Mudra with these two... their last two combos Bhale Bhale nd Soggade Rocked, hope the luck repeats for #Mudra... Note-9 S pen Remote snap 🤗😝😃 @Itslavanya @vennelakishore pic.twitter.com/CYTSzskWyQ — Nikhil Siddhartha (@actor_Nikhil) November 29, 2018 -
డబ్బింగ్ షురూ
జనరల్గా ఆస్ట్రోనాట్ అంటే రాకెట్ లాంచింగ్ స్టేషన్లో బిజీ బిజీగా ఉంటారు. కానీ టాలీవుడ్ ఆస్ట్రోనాట్ వరుణ్ తేజ్ చెన్నై, హైదరాబాద్లోని స్కూల్స్కి వెళ్లొచ్చారు మరి.. స్టూడెంట్స్కు రాకెట్ గురించి ఏమైనా పాఠాలు చెప్పారా? లేక చిన్ననాటి జ్ఞాపకాలను వెతుక్కుంటూ వెళ్లారా? అనే విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎమ్పిహెచ్’. లావాణ్యా త్రిపాఠి, అదితీరావ్ హైదరీ కథానాయికలుగా నటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు డబ్బింగ్ చెబుతున్నారు వరుణ్ తేజ్. ‘‘ఫస్ట్ లుక్కు మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు ప్రశాంత్ విహారి స్వరకర్త. క్రిష్ సమర్పణలో సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 21న రిలీజ్ కానుంది. -
రిపోర్ట్లో ఏముంది?
జర్నలిస్ట్ అర్జున్ ఇన్వెస్టిగేషన్ క్లైమాక్స్కు చేరుకుంది. ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లోని విషయాలను వెండితెరపై తెలుసుకోవచ్చు. నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టి.ఎన్. సంతోష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ముద్ర’. బి. మధు సమర్పణలో కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 28న విడుదల కానుంది. జర్నలిస్ట్ సురవరం అర్జున్ పాత్రలో నిఖిల్ నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ‘‘మా సినిమా ఫస్ట్ లుక్కు మంచి స్పందన లభిస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా జర్నలిజం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. సమాజంలో మీడియా పాత్రను గుర్తు చేసే సన్నివేశాలు ఉన్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘వెన్నెల’ కిశోర్, పోసాని కృష్ణమురళి, నాగినీడు, ప్రగతి, సత్య, తరుణ్ అరోరా, రాజా రవీంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. -
అంతరిక్షం కొత్త లుక్
వరుణ్ తేజ్ హీరోగా ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అంతరిక్షం 9000 కేఎమ్పిహెచ్’. అదితీరావ్ హైదరీ, లావణ్యా త్రిపాఠి కథానాయికలు. ఇందులో వరుణ్తేజ్, అదితీరావ్ వ్యోమగాములుగా కనిపిస్తారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా కొత్త లుక్ను రిలీజ్ చేశారు చిత్రబృందం. ‘‘ఇటీవలే రిలీజ్ చేసిన ఫస్ట్లుక్, టీజర్లకు మంచి స్పందన లభిస్తోంది. సినిమాను డిసెంబర్ 21న విడుదల చేయాలను కుంటున్నాం’’ అని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్ నటించిన ఈ సినిమాకు ప్రశాంత్ విహారి స్వరకర్త. దర్శకుడు క్రిష్ సమర్పణలో సాయిబాబు, రాజీవ్రెడ్డి నిర్మించారు. -
నిఖిల్ వెనుకడుగు వేయకతప్పలేదు!
‘కేశవ’, ‘కిరాక్ పార్టీ’ సినిమాలతో కాస్త వెనుకపడ్డాడు యంగ్ హీరో నిఖిల్. డిఫరెంట్ కాన్సెప్ట్తో సినిమాలు తీసి విజయాలు సాధించిన ఈ హీరో గత రెండు సినిమాలతో ప్రేక్షకులకు నిరాశనే మిగిల్చాడు. తాజాగా ఓ తమిళ రీమేక్తో మళ్లీ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యాడు. తమిళ్లో ఘన విజయం సాధించిన కణిథన్ సినిమాను తెలుగులో ‘ముద్ర’ పేరుతో నిఖిల్ రీమేక్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 8న రిలీజ్ చేయాలని భావించారు. కానీ నవంబర్ నెలలో పెద్ద సినిమాలు థియేటర్లపై దాడి చేయనున్నాయి. విజయ్ ‘సర్కార్’, ఆమిర్ ఖాన్ ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ దీపావళి కానుకగాకే విడుదల కానుండగా.. రజనీకాంత్ 2.ఓ నవంబర్ చివరి వారంలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిఖిల్ తన ‘ముద్ర’ను డిసెంబర్లో వేయబోతున్నాడని సమాచారం. ఈ మూవీలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్నారు. -
అంతరిక్షంలో ఏం జరిగింది?
‘ఫిదా, తొలిప్రేమ’ వంటి హిట్ చిత్రాల తర్వాత వరుణ్ తేజ్ నటించిన చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్’. లావణ్యా త్రిపాఠి, అదితీరావు హైదరీ కథానాయికలు. తొలి చిత్రం ‘ఘాజీ’తో జాతీయ అవార్డు అందుకున్న సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్రెడ్డి నిర్మించిన ఈ సినిమా టీజర్ని దసరా సందర్భంగా విడుదల చేశారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ వ్యోమగామిగా కనిపించనున్నారు. ఈ టీజర్లోని సన్నివేశాలు సినిమాపై ఉత్కంఠ పెంచేస్తున్నాయి. అంతరిక్షంలో ఏం జరిగిందన్నది తెలియాలంటే ఈ సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయాలనుకుంటున్నారు. -
‘అంతరిక్షం’లో పిల్లలతో మెగాహీరో
ఫిదా, తొలిప్రేమ సినిమాలతో హిట్లు కొట్టాడు మెగాహీరో వరుణ్ తేజ్. తన మొదటి సినిమాతోనే విభిన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి. తన మొదటి సినిమాను సబ్ మెరైన్ కాన్సెప్ట్తో తెరకెక్కించిన సంకల్ప్ రెడ్డి.. వరుణ్ తేజ్తో కలసి స్పేస్ కాన్సెప్ట్తో ‘అంతరిక్షం’ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. వరుణ్ ఫస్ట్లుక్, టైటిల్ ప్రకటించినప్పటినుంచీ ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో వరుణ్కు జోడిగా లావణ్య త్రిపాఠి, అదితీ రావు హైదరీ నటిస్తున్నారు. శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రషూటింగ్కు సంబంధించిన ఫోటోను చిత్రయూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డిలు నిర్మిస్తున్న ఈ మూవీకి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందిస్తున్నారు. వి.ఎస్. జ్ఞానశేఖర్ ఛాయా గ్రాహకుడు. ఈ డిసెంబర్ 21న సినిమాను విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. Our @IAmVarunTej & @Itslavanya on the sets of #Antariksham9000Kmph #అంతరిక్షం9000kmph#AntarikshamOnDec21st pic.twitter.com/dU9Pnq6Fts — First Frame Entertainments (@FirstFrame_Ent) September 24, 2018 -
మునిగి తేలుతూ...
సాధారణంగా అంతరిక్షంలో తేలడం సహజం. కానీ వరుణ్ తేజ్ మాత్రం తేలడం బదులు మునిగిపోతున్నారు. కారణం ప్రేమ. ప్రస్తుతం అంతరిక్షంలో డ్యూయెట్స్ పాడుకుంటున్నారట వరుణ్. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అంతరిక్షం 9000 కేయంపిహెచ్’. అదితీరావ్ హైదరీ, లావణ్యా త్రిపాఠి కథానాయికలు. జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్లో ఉంది. ఈ షెడ్యూల్లో ఓ పాటను, కొన్ని సీన్స్ను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు సంకల్ప్. ఇందులో మూడు పాటలుంటాయని సమాచారం. అందులో ఒక పాటను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. వారం రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్తో సినిమా కంప్లీట్ అవుతుందని సమాచారం. దాంతో సినిమాకు గుమ్మడికాయ కొట్టేయనున్నారు. షూటింగ్తో పాటుగా ఎడిటింగ్ పనులు కూడా జరుగుతున్నాయట. ఇందులో వరుణ్తేజ్, అదితీరావ్ హైదరీలు వ్యోమగామిగా కనిపిస్తారన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 21న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి, కెమెరా: జ్ఞానశేఖర్ వీయస్. -
వైరల్గా సమంత ‘కర్మ థీమ్’ చాలెంజ్
ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలెంజ్ల ట్రెండ్ నడుస్తోంది. మొన్నటి వరకు ఫిట్నెస్, కికీ తదితర చాలెంజ్లతో నిండిపోయిన సోషల్ మీడియాకు.. క్రేజీ నటి సమంత సరికొత్త చాలెంజ్ను పరిచయం చేశారు. తన అప్కమింగ్ మూవీ ‘యూటర్న్’ ప్రమోషన్లో భాగంగా.. సంగీత దర్శకుడు అనిరుధ్ రూపొందించిన కర్మ థీమ్లో డ్యాన్స్తో అదరగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేసిన సమంత #యూటర్న్డాన్స్చాలెంజ్ పేరిట సవాల్ విసిరారు. సమంతపై ఆప్యాయత, అనురాగాలు కురిపించే ఆమె మరిది అఖిల్ అక్కినేని మొదటగా ఈ చాలెంజ్ను స్వీకరించారు. ఆ తర్వాత హీరోయిన్ లావణ్య త్రిపాఠి, నవీన్ చంద్రతో పాటుగా సమంత అభిమానులందరూ ఈ చాలెంజ్ను స్వీకరించడంతో.. యూటర్న్కర్మథీమ్ చాలెంజ్ ఇప్పుడు వైరల్గా మారింది. కాగా సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ‘యూటర్న్’ ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్తోనే అంచనాలను పెంచేసిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ భూమిక కీలక పాత్ర పోషిస్తుండగా.. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్లు ఇతర పాత్రల్లో కన్పించనున్నారు. In love with this song. The karma theme from #UTURN . couldn't stop grooving .This one is for you @Samanthaprabhu2 .A fan of Jessy .All the best #uturn team i challenge… https://t.co/Xmqd9RTbuW — Naveen Chandra (@Naveenc212) September 8, 2018 The more i hear the more i love this song! This is for you sweetheart @Samanthaprabhu2 Tried my best and was kinda intimidated by all the amazing performances you are reposting 😝🙈… https://t.co/aOXRUouzw7 — LAVANYA (@Itslavanya) September 7, 2018 -
నిఖిల్ ‘ముద్ర’ వస్తోంది
‘కిరాక్ పార్టీ’ మూవీ తరువాత నిఖిల్ హీరోగా వస్తోన్న చిత్రం ‘ముద్ర’. తమిళంలో హిట్ అయిన కణిథన్ మూవీకి రీమేక్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రను పోషిస్తున్నారు. ఆ మధ్య విడుదలైన వర్కింగ్ స్టిల్స్కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని నవంబర్ 8న రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత ప్రకటించారు. ఈ సినిమాలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. టీఎన్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఠాగుర్ మధు నిర్మిస్తున్నారు. -
ప్రేమ విహారాలు
ఇద్దరు భామలతో స్పేస్లో ప్రేమ విహారం చేస్తున్నారట వరుణ్ తేజ్. మరి ఆ ఇద్దరిలో ఎవరితో ప్రేమలో పడతారో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా అంతరిక్ష్యం నేపథ్యంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అదితీ రావ్ హైదరీ, లావణ్యా త్రిపాఠి కథానాయికలుగా కనిపించనున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వై. రాజీవ్ రెడ్డి, సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. గురువారం మొదలైన కొత్త షెడ్యూల్ ఈ నెల 14 వరకూ జరగనుంది. ప్రత్యేకంగా వేసిన స్పేస్ సెట్లో ఈ షూటింగ్ చేస్తున్నారు. ఇందులో వరుణ్, అదితీ, లావణ్య ముగ్గురూ పాల్గొంటున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 21న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి. -
రిపోర్టర్ యాక్షన్
నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టి.ఎన్. సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ముద్ర’. అవురా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, మూవీ డైనమిక్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్పై కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యాక్షన్ ఎంటరై్టనర్గా రూపొందుతోన్న చిత్రమిది. ఇప్పటికే 50శాతం షూటింగ్ పూర్తయింది. తాజా షెడ్యూల్లో నిఖిల్, లావణ్యా త్రిపాఠిలపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. సినిమాలో కొన్ని సీన్స్ వాస్తవానికి దగ్గరగా ఉండటంతో ఒరిజినల్ లొకేషన్స్లో షూటింగ్ జరుపుతున్నాం. ఇందులో నిఖిల్ రిపోర్టర్గా కనిపించనున్నారు. ప్రస్తుతం ఓ టీవీ స్టూడియోలో షూటింగ్ జరుగుతోంది. నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘ముద్ర’ ఫస్ట్ లుక్కి మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. ‘వెన్నెల’ కిశోర్, పోసాని కృష్ణమురళి, నాగినీడు, ప్రగతి, సత్య, తరుణ్ అరోరా, రాజా రవీంద్ర ముఖ్య పాత్రలు చేస్తున్న ఈ సినిమాకి కెమెరా: సూర్య, సంగీతం: సామ్ సి.ఎస్. -
అంతరిక్ష ప్రయాణానికి డేట్ ఫిక్స్
వరుణ్ తేజ్ అంతరిక్ష ప్రయాణం పూర్తి చేసి తనకు అప్పగించిన మిషన్ రిజల్ట్ తెలుసుకునే రోజును ఫిక్స్ చేసుకున్నారు. డిసెంబర్ 21న వరుణ్, సంకల్ప్ రెడ్డి తమ స్పేస్ జర్నీలోకి ఆడియన్స్ను తీసుకువెళ్లనున్నారు. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఓ స్పేస్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ తెలుగు స్పేస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సాయిబాబు, వై. రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. లావణ్యా త్రిపాఠి, అదితీ రావ్ హైదరీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 21న రిలీజ్ చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. ‘‘తొలి తెలుగు స్పేస్ ఫిల్మ్గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేశాం. ఈ రెండు షెడ్యూల్స్లో హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ నేతృత్వంలో డూప్ లేకుండా వరుణ్ తేజ్ కొన్ని ఫైట్స్ చేశారు. త్వరలో టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి, డిసెంబర్ 21న సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు ‘అంతరిక్షం’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి. -
స్క్రీన్ టెస్ట్
1. ఇప్పుడు మహేశ్బాబు హీరోగా నటిస్తున్న ఓ సినిమాకు నిర్మాతలు సి.అశ్వనీదత్, ‘దిల్’ రాజు. ఈ చిత్రానికి దర్శకుడెవరో తెలుసా? ఎ) సుకుమార్ బి) వంశీ పైడిపల్లి సి) త్రివిక్రమ్ డి) బోయపాటి శ్రీను 2. భారతదేశం గర్వించదగ్గ నిర్మాతల్లో ఏయం రత్నం ఒకరు. ఆయన ఏ హీరోయిన్కు మేకప్మేన్గా పని చేశారో తెలుసా? ఎ) విజయశాంతి బి) రాధిక సి) రాధ డి) శ్రీదేవి 3. ‘అందాల రాక్షసి’ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన ఈ నటుడు ఇప్పుడు కెప్టెన్ కుర్చీలో కూర్చుని ‘చి.ల.సౌ’ అనే సినిమా ద్వారా దర్శకునిగా మారారు. ఎవరతను? ఎ) నవీన్ చంద్ర బి) హను రాఘవపూడి సి) రాహుల్ రవీంద్రన్ డి) అరుణ్ అదిత్ 4. తమిళ దర్శకుడు బాలా దర్శకత్వంలో ‘నాచ్చియార్’ అనే చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఝాన్సీ’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఝాన్సీ పాత్రలో నటించిన నటి ఎవరో కనుక్కోండి? ఎ) త్రిష బి) జ్యోతిక సి) శ్రియ డి) అంజలి 5. ‘మృగం’ అనే డబ్బింగ్ చిత్రంలో నటించిన నటుడు ఇప్పుడు తెలుగులో మంచి ప్రామిసింగ్ ఆర్టిస్ట్. ఎవరు? ఎ) ఆర్య బి) భరత్ సి) శ్యామ్ డి) ఆది పినిశెట్టి 6. జయం, నిజం, వర్షం చిత్రాల విలన్గా నటించారీయన. ఈ హీరో నటించిన 25వ చిత్రం ఇటీవల విడుదలైంది. ఎవరా నటుడు? ఎ) నితిన్ బి) గోపీచంద్ సి) రామ్ డి) తరుణ్ 7. ‘బిVŠ బాస్’ మొదటి సీజన్ విజేత శివబాలాజీ. ఆయన తన మొదటి సినిమాలో ఏ హీరోతో కలిసి పనిచేశారో తెలుసా? ఎ) అల్లు అర్జున్ బి) నవదీప్ సి) ‘అల్లరి’ నరేశ్ డి) రవితేజ 8. నితిన్ హీరోగా నటిస్తున్న ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంలో హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) రాశీ ఖన్నా బి) ప్రణీత సి) లావణ్యా త్రిపాఠి డి) నివేథా థామస్ 9 తమిళంలోనూ, తెలుగులోనూ ఈ ఆర్టిస్ట్ని ‘ఇతను మావాడంటే మావాడు’ అని ఓన్ చేసుకున్నారు. ఆ నటుడెవరో? ఎ) ఎన్టీఆర్ బి) ఏయన్నార్ సి) యస్వీఆర్ డి) కాంతారావు 10. ‘వెన్నెల్లో ఆడపిల్ల’ నవలను రచించింది యండమూరి. ఆ నవల ఆధారంగా తీసిన చిత్రంలో హీరో ఎవరో గుర్తుందా? ఎ) శ్రీకాంత్ బి) తరుణ్ సి) జేడీ చక్రవర్తి డి) వడ్డే నవీన్ 11. ‘సీతారాముల కల్యాణం చూతము రారండి’ అనే పాట ‘సీతారామ కల్యాణం’ చిత్రంలోనిది. ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించింది ఎవరో తెలుసా? ఎ) ఘంటసాల బి) కె.వి.మహదేవన్ సి) గాలి పెంచల నరసింహారావు డి) సాలూరి రాజేశ్వరరావు 12. ‘ఛత్రపతి’ చిత్రంలో ‘గుండుసూది గుండుసూది’ అనే పాటకు స్వరాలు సమకూర్చి, గొంతు కలిపింది యం.యం.కీరవాణి. ఆయనతో పాటు గొంతు కలిపిన లేడీ సింగర్ ఎవరో ఓ సారి గుర్తుపడదామా? ఎ) గీతామాధురి బి) శ్రావణ భార్గవి సి) సునీత డి) ప్రణవి 13. దర్శకుడు సుకుమార్ లెక్చరర్ అని చాలామందికి తెలుసు. ఆయన ఏ సబ్జెక్ట్ టీచ్ చేసేవారో తెలుసా? ఎ) మ్యాథ్స్ బి) సోషల్ సి) తెలుగు డి) ఇంగ్లీష్ 14. రీసెంట్గా తనకు క్యాన్సర్ వ్యాధి వచ్చిందని సోషల్ మీడియా ద్వారా తెలియచేసిన నటి ఎవరు? ఎ) మనీషా కోయిరాల బి) సోనాలీ బింద్రే సి) గౌతమి డి) మమతా మోహన్దాస్ 15. నాగచైతన్య నటిస్తున్న ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంలో అల్లుడు నాగచైతన్య అయితే అత్తగా నటిస్తున్న నటి ఎవరో తెలుసా? ఎ) భూమిక బి) నదియా సి) వాణీ విశ్వనాథ్ డి) రమ్యకృష్ణ 16. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల తన చిన్న కుమారునికి నామకరణం చేశారు. ఆ నందమూరి చిన్నారికి ఏ పేరు పెట్టారో తెలుసా? ఎ) అభయ్ రామ్ బి) భార్గవ రామ్ సి) శౌర్య రామ్ డి) తారక్ రామ్ 17. ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రంలో ఓ హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ ‘శ్రద్ధాకపూర్’ నటిస్తున్నారు. మరో బాలీవుడ్ నటి కూడా నటిస్తున్నారు. ఎవరామె? ఎ) ఎవెలిన్ శర్మ బి) అనుష్కా శర్మ సి) ఆలియా భట్ డి) దీపికా పదుకోన్ 18. ‘మిణుగురులు’ చిత్రానికి దర్శకత్వం వహించి, పలు అవార్డులు అందుకున్న దర్శకుడు అయోధ్య కుమార్. ఆయన దర్శకత్వంలో ఇప్పుడు ‘24 కిసెస్’ అనే చిత్రం రానుంది. ఆ చిత్రంలో నటిస్తున్న హాట్ బ్యూటీ ఎవరో తెలుసా? ఎ) కృతీ కర్భందా బి) హెబ్బా పటేల్ సి) రష్మికా మండన్నా డి) నందితా రాజ్ 19. ఈ ఫోటోలోని ప్రముఖ హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) షావుకారు జానకి బి) అంజలీదేవి సి) భానుమతి డి) బి. సరోజాదేవి 20. ఈ కింది ఫోటోలో ముద్దుగా బొద్దుగా ఉన్న ఇప్పటి టాప్ బాలీవుడ్ హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) ఆలియా భట్ బి) సన్నీ లీయోన్ సి) పరిణీతీ చోప్రా డి) సోనాక్షీ సిన్హా మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) ఎ 3) సి 4) బి 5) డి 6) బి 7) ఎ 8) ఎ 9) సి 10) ఎ 11) సి 12) సి 13) ఎ 14) బి 15) డి 16) బి 17) ఎ 18) బి 19) సి 20) ఎ నిర్వహణ: శివ మల్లాల -
మెగాహీరో సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!
ఫిదా, తొలిప్రేమ సినిమాలతో దూసుకుపోతున్నారు మెగాహీరో వరుణ్ తేజ్. ఈ హిట్లతో స్పీడు పెంచేసి వరుసగా సినిమాలు చేసేస్తున్నారు ఈ మెగాహీరో. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఎఫ్2, ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్ష నేపథ్యంలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని డిసెంబర్ 21న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఘాజీ సినిమాను సబ్ మెరైన్ కాన్సెప్ట్తో తెరకెక్కించిన సంకల్ప్, తన రెండో సినిమాను అంతరిక్ష నేపథ్యంలో అత్యద్భుతంగా, హాలివుడ్ టెక్నిషియన్స్తో విజువల్ వండర్గా రూపొందనున్న ఈ సినిమాలో అదితి రావు, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
స్క్రీన్ టెస్ట్
1. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్లో లవ్లీగా కనిపించిన ఈ బ్యూటీ తెలుగులో అరంగేట్రం చేసి, ఎంతోమంది అగ్ర హీరోల సరసన నటించారు. ఎవరామె? ఎ) తమన్నా బి) క్యాథరిన్ సి) ఇలియానా డి) లావణ్య త్రిపాఠి 2. భారతీయ చలనచిత్ర రంగం గర్వించదగ్గ దర్శకుడు కె. విశ్వనాథ్. ఆయన దర్శకుడవ్వక ముందు ఏ శాఖలో పనిచేశారో తెలుసా? ఎ) ఆడియోగ్రఫీ బి) ఎడిటింగ్ సి) కెమెరా డిపార్ట్మెంట్ డి) ఆర్ట్ డిపార్ట్మెంట్ 3. ‘షేక్ మోజెస్ మూర్తి’ పేరు భలే తమాషాగా ఉంది కదూ. 1972లో విడుదలైన ‘మల్లె పందిరి’ సినిమాలో ఈ పేరుతో ఉన్న క్యారెక్టర్ను పోషించిన గాయకుడెవరో తెలుసా? ఎ) ఎస్పీ బాలు బి) రామకృష్ణ సి) ఘంటసాల డి) ఇళయరాజా 4. కథానాయిక సాయిపల్లవి ప్రస్తుతం తెలుగులో ఏ నటుని సరసన నటిస్తున్నారు? ఎ) రామ్ బి) శర్వానంద్ సి) నాని డి) సందీప్ కిషన్ 5. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఓ సినిమాలో హీరో ‘అల్లరి నరేశ్’ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో నరేశ్ ఏ హీరోతో కలిసి నటిస్తున్నారో తెలుసా? ఎ) రామ్ చరణ్ బి) అల్లు అర్జున్ సి) మహేశ్ బాబు డి) వెంకటేశ్ 6. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అరంగేట్రం చేసిన ‘అల్లుడు శీను’ చిత్రదర్శకుడెవరో గుర్తు తెచ్చుకోండి? ఎ) వీవీ వినాయక్ బి) శ్రీను వైట్ల సి) బోయపాటి శ్రీను డి) శ్రీవాసు 7. 1998లో మోహన్బాబు నటించిన ‘రాయుడు’ చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన నటì ఎవరో తెలుసా? 2001లోనే ఆమె చనిపోయారు? ఎ) దివ్యభారతి బి) ప్రత్యూష సి) సౌందర్య డి) భార్గవి 8. ‘మన్మథుడు’ సినిమాలో నాగార్జున సరసన నటించిన హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) శ్రియ శరన్ బి) త్రిష సి) సోనాలి బింద్రే డి) రవీనా టాండన్ 9. ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే.. చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే’... అనే పాటతో Ðð లుగులోకి వచ్చిన హాట్ గర్ల్ ఎవరో తెలుసా? ఎ) హంసా నందిని బి) ర మ్యశ్రీ సి) అభినయశ్రీ డి) ముమైత్ ఖాన్ 10. ‘గులాబి’ చిత్రదర్శకుడు కృష్ణవంశీ. ఆ చిత్రనిర్మాత ఎవరో కనుక్కోండి చూద్దాం? ఎ) కృష్ణవంశీ బి) జేడీ చక్రవర్తి సి) రామ్గోపాల్ వర్మ డి) సురేశ్ బాబు 11. శ్రీదేవి చెల్లెలిగా హీరోయిన్ మహేశ్వరి అందరికీ పరిచయమే. ఆమెను సౌతిండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడెవరో తెలుసా? ఎ) భారతీరాజా బి) కోడి రామకృష్ణ సి) బాలచందర్ డి) కె. రాఘవేంద్రరావు 12. రజనీకాంత్ నటించిన ‘కొచ్చాడియాన్’ చిత్రంలో ఆయన సరసన నటించిన బాలీవుడ్ భామ ఎవరో కనుక్కోండి? ఎ) ఐశ్వర్యారాయ్ బి) సోనాక్షి సిన్హా సి) దీపికా పదుకోన్ డి) అమీ జాక్సన్ 13. ‘‘క్యారెక్టర్ వదిలేయటం అంటే ప్రాణాలు వదిలేయటమే, చావు రాక ముందు చచ్చిపోవటమే’’... అనే డైలాగ్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలోనిది. రచయితెవరో తెలుసా? ఎ) వంశీ పైడిపల్లి బి) వక్కంతం వంశీ సి) అబ్బూరి రవి డి) కోన వెంకట్ 14 ‘దారి చూడు దుమ్ము చూడు మామా.. దున్నపోతుల భేరే చూడు’ అనే పాటను పాడిందెవరో తెలుసా? ఎ) అనుదీప్ బి) హేమచంద్ర సి) హిప్ హాప్ తమిళ డి) పెంచల్ దాస్ 15. చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్, అక్కినేని మనవరాలు సుప్రియ ఇద్దరికీ మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఆ చిత్ర దర్శకుడెవరు? ఎ) ముత్యాల సుబ్బయ్య బి) ఈదర వీర వెంకట సత్యనారాయణ సి) ఎ. కోదండ రామిరెడ్డి డి) యస్.జె. సూర్య 16. ‘100 పర్సెంట్ లవ్’ సినిమాలో ‘ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్’ అనే పాటను హమ్ చేసింది సింగర్ కాదు. ఆమె ఓ నటి. ఎవరామె? ఎ) కలర్స్ స్వాతి బి) రాశీ ఖన్నా సి) తమన్నా భాటియా డి) అనుపమా పరమేశ్వరన్ 17. తెలుగు అగ్ర హీరోల్లో ఓ హీరో ఇప్పుడు సౌదీలో షూటింగ్ జరుపుకుంటున్నారు. నెలకుపైగా అక్కడే షూటింగ్లో ఉన్న ఆ హీరో ఎవరు? ఎ) ప్రభాస్ బి) ఎన్టీఆర్ సి) రామ్ డి) వరుణ్తేజ్ 18. ‘జంబలకడి పంబ’ అనే సినిమా 1993లో విడుదలై సంచలన విజయం సాధించింది. అప్పటి సినిమాలో హీరో నరేశ్, ఇప్పుడు అదే పేరుతో తయారైన ఈ సినిమాలో హీరో ఎవరో తెలుసా? ఎ) ‘వెన్నెల’ కిశోర్ బి) ‘షకలక’ శంకర్ సి) ధన్రాజ్ డి) శ్రీనివాసరెడ్డి 19. ఈ కింది ఫొటోలోని బాలీవుడ్ హీరో ఎవరో చెప్పండి? ఎ) సల్మాన్ఖాన్ బి) షారుక్ ఖాన్ సి) ఆమిర్ ఖాన్ డి) సైఫ్అలీ ఖాన్ 20. ఈ ఫొటోలో మేకప్ చేసుకుంటున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి? ఎ) విజయశాంతి బి) భానుప్రియ సి) సుహాసిని డి) జయప్రద మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (సి) 2) (ఎ) 3) (ఎ) 4) (బి) 5) (సి) 6) (ఎ) 7) (బి) 8) (సి) 9) (డి) 10) (సి) 11) (ఎ) 12) (సి) 13) (బి) 14) (డి) 15) (బి) 16) (ఎ) 17) (ఎ) 18) (డి) 19) ఎ 20) బి నిర్వహణ: శివ మల్లాల -
ఇద్దరమ్మాయిలతో...
అంతరిక్షంలో ఆకర్షణ చాలా తక్కువ ఉంటుంది. ఆస్ట్రోనాట్ల మీద అంతగా పని చేయదు. కానీ, ఈ ఆస్ట్రోనాట్ మీద మాత్రం ఆకర్షణ బలంగా పని చేస్తోంది. అయితే.. అది అంతరిక్షంలో పవర్ కాదు.. అందమైన హీరోయిన్స్ పవర్. మరి ఈ ఆస్ట్రోనాట్ ఎవరి ఆకర్షణకు గురయ్యాడు? అన్న విషయం తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో వరుణ్ తేజ్ హీరోగా అంతరిక్షం నేపథ్యంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. వరుణ్ ఆస్ట్రోనాట్గా కనిపించనున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఆల్రెడీ ఒక హీరోయిన్గా అదితీరావ్ హైదరీని ఫిక్స్ చేశారు. ఇప్పుడు మరో హీరోయిన్గా లావణ్యా త్రిపాఠిని తీçసుకున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై బిబో శ్రీనివాస్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ఈ నెల చివరి వారం నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది. -
మెగా హీరోతో మరోసారి..!
‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొన్న ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ‘ఫిదా, తొలిప్రేమ’ చిత్రాలతో ఘన విజయాలు సొంతం చేసుకొని ఫుల్ ఫామ్ లో ఉన్న వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే. బిబో శ్రీనివాస్ సమర్పణలో జాగర్లమూడి సాయిబాబా, రాజీవ్ రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రానికి ‘ఘాజీ’ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకుడు. స్పేస్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రంలో వరుణ్ సరసన కథానాయికగా ఇప్పటికే అదితిరావు హైదరీని ఎంపిక చేయగా.. ఇప్పుడు మరో కథానాయికగా లావణ్య త్రిపాఠిని ఫైనల్ చేసారు. మిస్టర్ సినిమాలో కలిసి నటించిన ఈ జోడి ఇప్పుడు మరో సారి తెరమీద సందడి చేసేందుకు రెడీ అవుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ స్పేస్ డ్రామా కోసం వరుణ్ తేజ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరుకు మొదలవ్వనుంది. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. -
స్క్రీన్ టెస్ట్
► అక్కినేని నాగార్జున సరసన తొలిసారి హీరోయిన్గా నటించిన నటి ఎవరు? ఎ) అమలా అక్కినేని బి) గౌతమి సి) సుహాసిని డి) శోభన ► శ్రీకాంత్, స్నేహ జంటగా నటించిన ‘రాధాగోపాళం’ చిత్రానికి బాపు దర్శకుడు. ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరో? ఎవరా హీరో? ఎ) నాని బి) విజయ్కృష్ణ సి) నరేశ్ డి) విజయ్ దేవరకొండ ► చిరంజీవితో 20 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన దర్శకుడెవరో తెలుసా? ఎ) ఎ. కోదండరామిరెడ్డి బి) బి. గోపాల్ సి) దాసరి నారాయణరావు డి) కె. రాఘవేంద్రరావు ► ‘ప్రేమనగర్’ అనే చిత్రం ద్వారా తన సురేశ్ ప్రొడక్షన్ సంస్థ నిలబడిందని నిర్మాత డి.రామానాయుడు ఎన్నోసార్లు చెప్పారు. ఆ చిత్రదర్శకుడెవరో కనుక్కోండి? (చిన్న క్లూ– ఆ చిత్రదర్శకుని కుమారుడు కూడా ప్రముఖ దర్శకుడే) ఎ) బోయిన సుబ్బారావు బి) కె. విశ్వనాథ్ సి) కె.యస్. ప్రకాశరావు డి) వి.మధుసూదన్రావు ► ‘విన్నర్’ సినిమాకి యాంకర్ సుమ ఓ పాట పాడింది. ఆమె పాడిన పాటలో ఓ యాంకర్ నటించారు. ఎవరా యాంకర్? ఎ) రేష్మి గౌతమ్ బి) అనసూయ సి) ఝాన్సీ డి) శిల్పా చక్రవర్తి ► ప్రభాస్ నటించిన ‘మిర్చి’ సినిమాలో ‘మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రోడే’ అనే పాటలో నటించిన తార ఎవరో తెలుసా? ఎ) అనుష్క బి) రిచా గంగోపాధ్యాయ సి) హంసా నందిని డి) ముమైత్ఖాన్ ► చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అందులో ఒక ప్రముఖ హీరోయిన్ చిరంజీవితో మొదటిసారిగా నటిస్తున్నారు. ఎవరామె? ఎ) రమ్యకృష్ణ బి) మీనా సి) నయనతార డి) టబు ► హీరో నాని ‘కృష్ణార్జున యుద్ధం’అనే చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రంతో కలిపి ఇప్పటివరకు నాని ఎన్ని చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారో గుర్తు తెచ్చుకోండి? ఎ) 3 బి) 2 సి) 4 డి) 1 ► యోగా గురువు ‘భరత్ ఠాగుర్’ తెలుగులో ఎన్నో మంచి సినిమాల్లో నటించిన హీరోయిన్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ హీరోయిన్ పేరేంటో చెప్పేయండి? ఎ) సంగీత బి) సిమ్రాన్ సి) స్నేహ డి) భూమిక ► దర్శకుడు మణిరత్నం 1983వ సంవత్సరంలో మొదటిసారిగా దర్శకునిగా అరంగేట్రం చేశారు. ఆయన ఏ భాషలో తన మొదటి సినిమాను తెరకెక్కించారో తెలుసా? ఎ) కన్నడ బి) మలయాళం సి) తమిళ్ డి) తెలుగు ► ‘ఊపిరి’ సినిమాలో నాగార్జున పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన ఈ హీరోయిన్, అజయ్ దేవ్గన్తో ‘హిమ్మత్వాలా’లో కూడా నటించింది? ఎ) రాశీ ఖన్నా బి) లావణ్య త్రిపాఠి సి) తమన్నా భాటియా డి) శ్రియ శరన్ ► హీరో నాగచైతన్య ట్విట్టర్ ఐడీ ఏంటో కనుక్కోండి? ఎ) ఐయామ్ చే బి) అక్కినేని చైతన్య సి) చే అండర్స్కోర్ అక్కినేని డి) దిస్ ఈజ్ చే ► శ్రీ విష్ణు నటించిన ‘నీదీ నాదీ ఒకే కథ’ చిత్రంతో ఓ దర్శకుడు నటుడయ్యారు, ఆయన పేరేంటో తెలుసా? ఎ) దేవి ప్రసాద్ బి) పరశురామ్ సి) కోన వెంకట్ డి) తరుణ్ భాస్కర్ ► సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం పేరు ‘మహానటి’. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో నటించిన నటి పేరేంటి? ఎ) సమంత బి) కీర్తీ సురేష్ సి) నిత్యామీనన్ డి) అనుష్క ► దర్శకుడు శ్రీను వైట్ల భార్య కూడా సినీ రంగంలోని ఓ విభాగంలో పని చేస్తున్నారు. అమె పని చేస్తున్న విభాగం పేరేంటి? ఎ) ఫ్యాషన్ డిజైనర్ బి) ఆర్ట్ డిపార్ట్మెంట్ సి) ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ డి) ఎడిటింగ్ ► ‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది..’ అనే పాట రచయిత ఎవరు? ఎ) వరికుప్పల యాదగిరి బి) మాస్టర్జీ సి) కేదారేశ్వర్ డి) సిరివెన్నెల సీతారామశాస్త్రి ► ‘లైఫ్లో ఎపుడైనా ఏమైనా జరగొచ్చు, అది జరిగినప్పుడు దాన్ని మనం ఫేస్ చెయ్యటానికి సిద్ధంగా ఉన్నామా.. లేదా అన్నదే ముఖ్యం’.. ఈ డైలాగ్ చెప్పింది హీరో నాగచైతన్య. ఇది ఏ సినిమాలోని డైలాగో చెప్పుకోండి? ఎ) యుద్ధం శరణం బి) బెజవాడ సి) ఆటోనగర్ సూర్య డి) సాహసం శ్వాసగా సాగిపో ► అనుష్క నటించిన ‘భాగమతి’ సినిమాలోని బంగళా సెట్కి మంచి పేరొచ్చింది. ఆ బంగళాను డిజైన్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ ఎవరు? ఎ) ఆనంద్ సాయి బి) రవీందర్ రెడ్డి సి) అశోక్ కుమార్ డి) బ్రహ్మ కడలి ► కార్తీక్, ముచ్చర్ల అరుణ నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిదో కనుక్కోండి? ఎ) నాలుగు స్తంభాలాట బి) రెండు రెళ్ల ఆరు సి) సీతాకోక చిలుక డి) స్వరకల్పన ► ఈ క్రింది ఫోటోలోని నటుడెవరో గుర్తు పట్టండి? ఎ) రామ్ బి) శర్వానంద్ సి) నాగశౌర్య డి) ప్రభాస్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) డి 2) ఎ 3) ఎ 4) సి 5) బి 6) సి 7) సి 8) ఎ 9) డి 10) ఎ 11) సి 12) సి 13) ఎ 14) బి 15) ఎ 16) డి 17) డి 18) బి 19) సి 20) ఎ -
‘ఇంటిలిజెంట్’ మూవీ రివ్యూ
తారాగణం : సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి, షియాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, రాహుల్ దేవ్, బ్రహ్మానందం తదితరులు జానర్ : యాక్షన్, కామెడీ నిర్మాత : సి. కళ్యాణ్ సంగీతం : ఎస్. తమన్ దర్శకుడు : వి.వి. వినాయక్ మెగా అల్లుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే సుప్రీం హీరోగా ఎదిగాడు సాయి ధరమ్ తేజ్. గత కొంతకాలంగా సరైన హిట్లేక సతమతమవుతున్న తరుణంలో మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో చేసిన సినిమా ఇంటిలిజెంట్. మెగాస్టార్ కమ్బ్యాక్ మూవీతో హిట్ కొట్టిన వినాయక్, ఫుల్ ఎనర్జీ ఉన్న సాయిధరమ్ కలిసి చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఓ లుక్కేద్దాం... కథ నందకిషోర్ (నాజర్) ఓ సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని. తనకు వచ్చిన లాభాలతో ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటాడు. ఎంతో మంది పేద పిల్లలను, అనాథలను చేర దీసి ఆదరిస్తూ ఉంటాడు. ప్రతిభ ఉన్న చిన్నారులను చదివిస్తుంటాడు. అలా తేజ (సాయిధరమ్ తేజ్)ను చదివిస్తాడు. ఆ కృతజ్ఞతతో నాజర్ వద్దే పనిచేస్తూ ఉంటాడు. తన సాఫ్ట్వేర్ కంపెనీ వల్ల మిగతా ఏ కంపెనీలు మనుగడను సాధించలేకపోతాయి. అలా ఓ కంపెనీ యజమానులు మాఫియా డాన్ విక్కీభాయ్ (రాహుల్ దేవ్)ను ఆశ్రయిస్తారు. విక్కీభాయ్ తమ్ముడు దేవ్గిల్ రంగంలోకి దిగి నాజర్ను బెదిరిస్తాడు. కానీ నాజర్ వాటికి తలొంచడు. ఇదంతా తేజ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. ఆ మరునాడే నాజర్ ఆత్మహత్య చేసుకుంటాడు. కానీ తేజ ఇదంతా నమ్మడు. దేవ్గిల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ తేజ ఏం చేస్తాడు? అసలు నాజర్ది ఆత్మహత్యనా? హత్యనా? అసలు ఏం జరిగింది? తేజ ధర్మభాయ్గా ఎందుకు మారాడు? ధర్మభాయ్ ఏం చేశాడన్నదే మిగతా కథ. నటీనటులు సాయిధరమ్ తేజ్ డ్యాన్సులు, ఫైట్స్తో మెగా అభిమానులను అలరించాడు. లావణ్య త్రిపాఠి తన అందంతో ప్రేక్షకులను ముగ్దుల్ని చేసింది. బ్రహ్మానందం కనిపించే రెండు మూడు సీన్లలో నవ్వులు పండించాడు. నాజర్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఆశిష్ విద్యార్థి, షియాజీ షిండే తమకు అలవాటైన పోలీస్ పాత్రలో మెప్పించారు. సప్తగిరి, పృథ్వీ, బ్రహ్మానందం, రఘుబాబు, పోసాని కృష్ణమురళీ కామెడీని బాగానే పండించారు. విశ్లేషణ భారీ యాక్షన్ సీన్స్ , కామెడీతో తనదైన శైలిలోనే వినాయక్ ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కించాడు. కథలో కొత్తదనం లేదు. ఆకుల శివ అందించిన మాటలు కూడా ప్రేక్షకులు గుర్తుంచుకునే స్థాయిలో లేవు. నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి. సాంగ్స్ లొకేషన్స్ బాగున్నాయి. చమక్ చమక్.. సాంగ్ తీసిన విధానం ఆకట్టుకుంది. వినడానికే కాదు చూడడానికి కూడా బాగుంది. తమన్ సంగీతానికి మార్కులు పడ్డాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్లస్ పాయింట్. ఎస్వీ విశ్వేశ్వర్ ఛాయాగ్రహణంతో మెప్పించాడు. ఆయన కెమెరా పనితనం స్క్రీన్ను అందంగా కనపడేలా చేసింది. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. కొరియోగ్రఫీలో కొత్తదనం కనిపించింది. ప్లస్ పాయింట్స్ పాటలు, ఫైట్స్ కామెడీ చమక్ చమక్ సాంగ్ మైనస్ పాయింట్స్ కథలో కొత్తదనం లోపించడం ముగింపు: ‘ఇంటిలిజెంట్’ అభిమానులు ఆశించినంత ఇంటిలిజెంట్గా లేదు. - బండ కళ్యాణ్, ఇంటర్నెట్ డెస్క్ -
చలో మస్కట్
బై బై హైదరాబాద్... చలో మస్కట్ అంటూ సాయిధరమ్ తేజ్ ఫ్లైట్ ఎక్కేశారు. న్యూ ఇయర్ని మస్కట్లో జరుపుకుంటారని ఊహిస్తున్నారా? అదేం కాదు. షూటింగ్ కోసం వెళ్లారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, లావణ్యా త్రిపాఠి జంటగా సి. కల్యాణ్ ఓ చిత్రం నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. హైదరాబాద్లో ఓ షెడ్యూల్ ముగించుకుని, మస్కట్ ప్రయాణమైంది ఈ బృందం. ‘‘ఈ నెల 18 నుంచి 28 వరకూ మస్కట్లో రెండు పాటలు చిత్రీకరించబోతున్నాం. ఓ పాటకు జానీ మాస్టర్, మరో పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తారు. మస్కట్లో సాంగ్స్ షూట్ పూర్తి చేసి, ఇండియా రాగానే క్లైమాక్స్ మొదలుపెడతాం. ఫిబ్రవరి 9న సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కథ–మాటలు: శివ ఆకుల, సినిమాటోగ్రఫీ: ఎస్వీ విశ్వేశ్వర్, సంగీతం: థమ¯Œ , ఎడిటింగ్: గౌతంరాజు, సహనిర్మాతలు: సి.వి. రావు, నాగరాజ పత్సా. -
అందరూ కనెక్ట్ అవుతున్నారు
‘‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమా అందరికీ బాగా కనెక్ట్ అయ్యింది. చాలా మంది సీన్స్ గురించి మాట్లాడుతుంటే ఆనందంగా ఉంది. లవ్ ప్రపోజల్ సీన్ రాయడానికి నాలుగు రోజులు పట్టింది’’ అని దర్శకుడు కిశోర్ తిరుమల అన్నారు. రామ్, అనుపమా పరమేశ్వరన్, లావణ్యా త్రిపాఠి హీరో హీరోయిన్లుగా ‘స్రవంతి’ రవికిశోర్, పీఆర్ సినిమాస్ సమర్పణలో కృష్ణ చైతన్య నిర్మించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో థాంక్స్ మీట్ నిర్వహించారు. కిశోర్ తిరుమల మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులు మా సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఎమోషనల్ డైలాగ్స్కు మంచి స్పందన వస్తోంది. అందర్నీ నవ్విస్తూ అక్కడక్కడా ఏడిపించాను. రామ్ పాత్ర అందరికీ ఎమోషనల్గా కనెక్ట్ అవుతోంది. అనుపమ, లావణ్య పాత్రలు కూడా బాగా కనెక్ట్ అయ్యాయి’’ అన్నారు. ‘‘మా సినిమా యువతకు దగ్గరవుతుందనుకున్నాం. అయితే యూత్తో పాటు కుటుంబ ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయ్యింది. అన్ని వర్గాలు ఆదరిస్తుండటం సంతోషంగా ఉంది. మా పాత్రలు గుర్తుండిపోతాయి. నిర్మాతలు కూడా హ్యాపీగా ఉన్నారు’’ అన్నారు రామ్. ‘‘మరికొన్ని కొత్త కాన్సెప్ట్ సినిమాలు రావడానికి మా సినిమా దారి చూపినట్లయింది. ఎమోషనల్ సీన్స్లో నేను, డైరెక్టర్ ఏడ్చిన సందర్భాలున్నాయి’’ అని నటుడు శ్రీవిష్ణు అన్నారు. ‘స్రవంతి’ రవికిశోర్, కృష్ణచైతన్య, అనుపమా పరమేశ్వరన్, లావణ్యా త్రిపాఠి, శ్రీమణి, కిరిటీ, చంద్రబోస్, ప్రియదర్శి, ఎ.ఎస్.ప్రకాష్ పాల్గొన్నారు. -
‘ఉన్నది ఒకటే జిందగీ’ పాటల విడుదల
-
తప్పు నీదే
తప్పు నీదే... అని హీరోయిన్ లావణ్యా త్రిపాఠి సోషల్ మీడియాలో ఓ నెటిజన్పై మండిపడ్డారు. కూల్ బేబీ ఎందుకంత గరమ్ అయ్యారనడానికి ఓ కారణం ఉంది. లావణ్య ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఓ ఫొటోను అందరూ ప్రశంసిస్తుంటే, ఒక నెటిజన్ మాత్రం విమర్శించాడు. ‘‘చూడటానికి చాలా అందంగా ఉన్నారు. కానీ, మీరు ట్రెడిషినల్ క్యారెక్టర్స్కు మాత్రమే సూట్ అవుతారు’’ అని ఆ వ్యక్తి అన్నాడు. అయితే అతను ‘క్యారెక్టర్’ అనే వర్డ్ను తప్పుగా టైప్ చేశాడు. ‘‘నువ్వు టైప్ చేసిన క్యారెక్టర్ స్పెల్లింగ్లా నీ అభిప్రాయం కూడా తప్పే. నేను ఒక యాక్టర్ను. ఏ పాత్రనైనా చేయగలను. అనవసరంగా కేవలం ట్రెడిషనల్ క్యారెక్టర్స్ మాత్రమే చేయగలను అనే ముద్ర నా పై వేయడానికి ప్రయత్నించవద్దు’’ అని లావణ్య షూటుగా స్పందించారు. అమ్మడి ఆగ్రహం న్యాయమే కదా! -
సెన్సార్ పూర్తి చేసుకున్న 'ప్రాజెక్ట్ z'
సందీప్ కిషన్, లావణ్య త్రిపాటి, జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో సి.వి. కుమార్ దర్శకత్వంలో తమిళ్లో తెరకెక్కిన మాయావన్ చిత్రాన్ని ప్రాజెక్ట్ z గా ఎస్బికె ఫిలింస్ కార్పోరేషన్లో ఎస్.కె. బషీద్ సమర్పణలో నిర్మాత ఎస్.కె. కరీమున్నీసా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్ ప్రథమార్ధం లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కమర్షియల్ ఫార్మాట్ కు భిన్నంగా కొత్త తరహా కథలతో ఆకట్టుకుంటున్న సందీప్, తాజాగా నక్షత్రం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను నిరాశపరిచాడు. ప్రస్తుతం ప్రాజెక్ట్ zతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందీప్ కిషన్ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నాడు. -
లవ్ జర్నీలో మిస్టర్!
మాంచి హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు కదా ఈ ‘మిస్టర్’. వయసు కూడా ఎక్కువేం కాదు. జస్ట్ 27 ఏళ్లే. కానీ, ‘మనం ప్రేమను వెతుక్కుంటూ వెళితే... ప్రేమే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది’ అనే పెద్ద ఫిలాసఫీ స్టేట్మెంట్ ఇస్తాడు. దీనికి ఓ కారణం ఉంది. ఇతడికి ఇద్దరమ్మాయిలు పరిచయమవుతారు. ఓ అమ్మాయి విదేశాల్లో.. ఇంకో అమ్మాయి తెలుగు పల్లెలో! ఈ మిస్టర్ ఎవరి ప్రేమను వెతుక్కుంటూ వెళ్లాడు? ఎవరి ప్రేమ మనోడ్ని వెతుక్కుంటూ వచ్చిందనేది ఏప్రిల్ 14న తెలుస్తుంది. వరుణ్తేజ్ హీరోగా శ్రీనుౖ వెట్ల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మిస్తున్న సినిమా ‘మిస్టర్’. లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరోయిన్లు. ఏప్రిల్ 14న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘మంచి ఎమోషన్స్, హిలేరియస్ కామెడీ, మ్యూజిక్, బ్యూటిఫుల్ విజువల్స్కి స్కోప్ ఉన్న కథ. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. నేను ఏదైతే అనుకున్నానో... దాన్ని వంద శాతం రాజీ పడకుండా తీయగలిగాను. అందుకు కారణమైన నా నిర్మాతలు, చిత్రబృందానికి థ్యాంక్స్. నిన్ననే ఫస్ట్ హాఫ్ రీ–రికార్డింగ్తో చూశా. మిక్కి జె. మేయర్ అన్ బిలీవబుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. ఆరు అద్భుతమైన పాటలు అందించారు’’ అన్నారు. ఈ చిత్రానికి కథ: గోపీమోహన్, మాటలు: శ్రీధర్ సీపాన, కెమేరా: కేవీ గుహన్, సై్టలింగ్: రూపా వైట్ల. -
స్త్రీ హింసకు నిరసనగా...లావణ్య త్రిపాఠి
మాదాపూర్: మాదాపూర్ హెచ్ఐసీసీలో ఐసీఓజీ, ఎఫ్వోజీఎస్ఐ, ’ధీర’ ఆధ్వర్యంలో ‘స్టాఫ్ వయొలెన్స్ అగెనెస్ట్ ఉమెన్’ పేరిట శనివారం జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ తార లావణ్యత్రిపాఠి, డాక్టర్ శాంతకుమారి, లలితా కుమార మంగళం, త్రిపురాన వెంకటరత్నం, సీఎన్ పురంధరే తదితరులు పాల్గొన్నారు. -
మాయవన్గా సందీప్
రన్, ఒక్క అమ్మాయి తప్ప సినిమాలతో నిరాశపరిచిన సందీప్ కిషన్, మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తెలుగుతో పాటు పలు తమిళ చిత్రాల్లోనూ నటించిన ఈ యంగ్ హీరో మరోసారి తమిళ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న డిఫరెంట్ మూవీ మాయవన్లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, డానియల్ బాలాజీలు ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్లుక్ పోస్టర్ సినిమా మీద ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తుండగా.. ఆగస్టు 2న ఫస్ట్ టీజర్ను రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత సివి కుమార్ తొలిసారిగా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీస్ సంస్థతో కలిసి ఆయనే స్వయంగా నిర్మిస్తున్నారు. -
ఆగస్టు 5న శ్రీరస్తు శుభమస్తు
గౌరవం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో అల్లు శిరీష్. తొలి సినిమాతో నిరాశపరిచిన ఈ యంగ్ హీరో రెండో ప్రయత్నంగా చేసిన కొత్త జంట సినిమాతో పరవాలేదనిపించాడు. అయితే కమర్షియల్ హీరోగా నిలదొక్కుకునే స్టామినాను మాత్రం చూపించలేకపోయాడు. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న శిరీష్ ఇప్పుడు మరో సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ప్రజెంట్ టాలీవుడ్లో ఫ్యామిలీ డ్రామాలకు మంచి ఆదరణ లభిస్తుండటంతో అదే జానర్ లో లవ్ ఎంటర్టైనర్తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. తన సొంతం నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మాతగా తెరకెక్కుతున్న శ్రీరస్తు శుభమస్తు సినిమాలో నటిస్తున్నాడు శిరీష్. పూర్తి మేకోవర్తో న్యూ లుక్తో కనిపిస్తున్న శిరీష్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తోంది. సోలో లాంటి ఫ్యామిలీ డ్రామాలను అందించిన పరుశురామ్ ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్లకు మంచి స్పందన రావటంతో సినిమాకు కూడా హైప్ క్రియేట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను ఆగస్ట్ 5న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
బిజీ బిజీగా అందాల రాక్షసి
కెరీర్ స్టార్టింగ్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఇప్పుడు వరుస ఆఫర్లతో బిజీ అవుతున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటి, తొలి సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయినా, తన క్యూట్ లుక్స్తో ఆకట్టుకుంది. ఈ సినిమాలో లావణ్య నటనకు మంచి రెస్పాన్స్ వచ్చినా, తరువాత అవకాశాలు మాత్రం రాలేదు. కానీ సీనియర్ హీరో నాగార్జున సరసన నటించిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా లావణ్య ఫేట్ మార్చేసింది. సోగ్గాడే చిన్ని నాయనా ఘన విజయం సాదించటంతో లావణ్య త్రిపాఠికి వరుస అవకావాలు క్యూ కట్టాయి. యంగ్ హీరోలందరూ ఈ అమ్మడితో కలిసి నటించడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన శ్రీరస్తూ శుభమస్తూ సినిమా షూటింగ్ పూర్తి చేసిన లావణ్య, మరో మూడు సినిమాలకు ఓకె చెప్పేసింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు లావణ్య త్రిపాఠిని హీరోయిన్గా కన్ఫామ్ చేశారు. ఈ ఈ సినిమాతో పాటు సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ సినిమా, శర్వానంద్ హీరోగా బివియస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న కొత్త సినిమాల్లో కూడా లావణ్యనే హీరోయిన్గా నటిస్తోంది. ఇలా వరస సినిమాలతో బిజీ అవుతున్న లావణ్య త్వరలోనే టాప్ చైర్కు పోటి ఇవ్వడం కాయం అన్న టాక్ వినిపిస్తోంది. -
బాహుబలిలో అందాల రాక్షసి
రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి సినిమా విషయంలో రోజుకో వార్త సినీ అభిమానులను ఊరిస్తోంది. ఇప్పటికే తొలిభాగం ఘనవిజయం సాధించటంతో రెండో భాగంపై అంచనాలు మరింత భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న బాహుబలి 2కు మరిన్ని హంగులను సమకూర్చే పనిలో ఉన్నాడు జక్కన్న. తొలి భాగంలో భల్లాలదేవుడిగా రానాను, అతని కొడుకు పాత్రలో అడవి శేషును చూపించిన రాజమౌళి రానా భార్య పాత్రను మాత్రం చూపించలేదు. అయితే కథకు కీలకమైన పాత్రను రెండో భాగంలో చూపించనున్నాడట. ఇప్పటికే ఈ పాత్రకు తగ్గ నటికోసం వేట కూడా ప్రారంభించాడు రాజమౌళి. తొలుత ఈ క్యారెక్టర్ కోసం సీనియర్ హీరోయిన్ శ్రియను తీసుకోవాలని భావించినా, ఇప్పుడు మనసు మార్చుకున్నారట. ప్రస్తుతం ఈ పాత్రకు అందాలు రాక్షసి ఫేం లావణ్య త్రిపాఠిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట బాహుబలి యూనిట్. ఇటీవల భలే భలే మొగాడివోయ్ సినిమాతో మంచిఫాంలో కనిపిస్తున్న లావణ్యకు ఇది గోల్డెన్ ఛాన్సే అన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు రాజమౌళి టీం కన్ఫామ్ చేయకపోయినా, సాయి కొరపాటి... లావణ్యను తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. మరి రాజమౌళి ఎవరిని కన్ఫామ్ చేస్తాడో చూడాలి. -
రిలీజ్కు రెడీ అవుతున్న సోగ్గాడు
చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న కింగ్ నాగార్జున లేటెస్ట్ సినిమా 'సోగ్గాడు చిన్నినాయనా' ఫైనల్గా షూటింగ్ పూర్తి చేసుకుంది. కథా కథనాల్లో మార్పులతో రెండు మూడు సార్లు రీషూట్లకు వెళ్లిన ఈ సినిమా మైసూర్ జరిగిన భారీ షెడ్యూల్తో ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో నాగ్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు.. పల్లెటూరి వాతావరణంలో సాగే ఈ కథలో సొగ్గాడిగా, అమాయకుడిగా రెండు వేరు వేరు పాత్రల్లో కనిపిస్తున్నాడు నాగ్. కామెడీ ప్రధానంగా సాగే ఈ కథలో తన కొడుకుకు మాత్రమే కనిపించే ఆత్మగా అలరించనున్నాడు. నాగ్ సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తుండగా, యాంకర్ అనసూయ, హంసానందినిలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు ఉయ్యాల జంపాల ఫేం పి. రామ్మోహన్ కథ అందించగా, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. త్వరలోనే సినిమా ఆడియో రిలీజ్ చేసి మూవీ రిలీజ్ డేట్ను ప్రకటించడానికి చిత్రయూనిట్ రెడీ అవుతున్నారు. -
సోగ్గాడి ఎంట్రీ మరింత ఆలస్యం
'మనం' సినిమా తరువాత ఇంతవరకు వెండితెర మీద కనిపించని కింగ్ నాగార్జున తదుపరి సినిమా మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. ప్రస్తుతం నాగ్ రెండు సినిమాల షూటింగ్లలో పాల్గొంటున్నా, అభిమానులు ఆ సినిమాల కోసం కొత్త ఏడాది వరకు వెయిట్ చేయాల్సిందే అని తెలుస్తోంది. నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న 'సొగ్గాడే చిన్నినాయన' ఈ ఏడాది చివర్లో రిలీజ్ అవుతుందని భావించారు. అయితే ఈ సినిమాలో కొన్ని సీన్లను రీషూట్ చేయాల్సి రావటంతో సినిమా మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా, మొదలైన దగ్గర నుంచి ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా రషెస్ చూసిన రచయిత సాయి మాధవ్ బుర్రా కొన్ని సన్నివేశాలను తిరిగి చిత్రీకరించాలని సూచించడంతో రీషూట్ ఆలోచనలో ఉన్నారు యూనిట్. దీంతో ఈ డిసెంబర్ లోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా, ఇప్పుడు మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగార్జున తాత, మనవడిగా రెండు పాత్రల్లో కనిపిస్తున్నాడు. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నాగ్ ఆత్మ రూపంలో కూడా కనిపించనున్నాడట. నాగార్జున ఈ సినిమాతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ సినిమా ఊపిరి షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు. -
సరికొత్త రికార్డు దిశగా నాని
చాలా రోజుల తరువాత హిట్ ట్రాక్ ఎక్కిన నాని భారీ వసూళ్లతో దూసుకుపోతున్నాడు. యంగ్ హీరోలలో ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాని ఓ సరికొత్త రికార్డ్కు చేరువవుతున్నాడు. ఈ ఫీట్తో స్టార్ హీరోల లిస్ట్లో చేరడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇటీవల 'భలే భలే మగాడివోయ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్నాడు. 25 రోజుల్లో ఈ సినిమా 45 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి స్టార్ హీరోలకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్లో టాప్ స్టార్స్కు కూడా సాధ్యం కాని భారీ వసూళ్లతో దూసుకుపోతున్న భలే భలే మగాడివోయ్ మొత్తం గ్రాస్ కలెక్షన్స్ విషయంలోనూ సంచలనాలు నమోదు చేస్తోంది. ఇప్పటికీ చాలా థియేటర్స్లో హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతున్న ఈ సినిమా, త్వరలోనే 50 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ ఉందంటున్నారు ట్రేడ్ పండితులు. నాని, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన భలే భలే మగాడివోయ్ కేవలం 6 కోట్ల బడ్జెట్తో రూపొందింది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది బిగెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలవటంతో పాటు నానిని స్టార్ హీరోల సరసన నిలబెట్టింది. -
బన్నీని ఇంప్రెస్ చేసిన అందాలరాక్షసి
-
సంబర పడిపోతున్న లావణ్య
-
నాగ్ సరసన!
‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారట. అక్కినేని నాగార్జునకు జోడీగా నటించే అవకాశాన్ని ఈ ముద్దుగుమ్మ సొంతం చేసుకున్నారనేది విశ్వసనీయ సమాచారం. కల్యాణకృష్ణను దర్శకునిగా పరిచయం చేస్తూ నాగార్జున నటించనున్న చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయన’. నిర్మాత రామ్మోహన్ కథ అందించిన ఈ చిత్రం త్వరలో సెట్స్కు వెళ్లనుంది. నాగార్జున ఇందులో ద్విపాత్రాభినయం చేయనున్నారు. కథ రీత్యా ఇందులో ఇద్దరు కథానాయికలు. ఓ నాయికగా ఇప్పటికే రమ్యకృష్ణను ఖరారు చేశారు. చాలా కాలం తర్వాత నాగార్జున, రమ్యకృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఇక రెండో హీరోయిన్గా లావణ్య త్రిపాఠిని తీసుకున్నట్లు తెలిసింది. అందాల రాక్షసి, దూసుకెళ్తా చిత్రాలతో కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న లావణ్య, ‘మనం’ చిత్రంలో నాగచైతన్య స్నేహితురాలిగా ఓ గెస్ట్ క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు ఏకంగా నాగ్తోనే జతకట్టే ఛాన్స్ కొట్టేశారంటే.. నిజంగా లావ్యణ్య లక్కీనే.